minister perni nani fires on doctor

సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు!

నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టరేనా ? రాజకీయ నాయకుడా, అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. " సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు," అని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పేర్ని నాని, డాక్టర్ ఆరోపణ చేసిన ఆసుపత్రిలోనే 20పీపీఈలు ఉన్నాయని చెప్పారు. " అసలు ఆ ఆసుపత్రి కరోనా ఆసుపత్రి కాదు.ఏపీలో 7 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోజుకు 1175 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. 24,000 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.ఎన్‌-95 మాస్క్‌లు,పీపీఈ కిట్స్‌ సమృద్ధిగా ఉన్నాయి," అని చెప్పిన మంత్రి ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు.

Ten areas in Guntur declared as red zones

గుంటూరు లో 10 కరోనా రెడ్ జోన్లు: జిల్లా కలెక్టర్

యువకులు వాహనాలతో రోడ్ల మీదకు వస్తే, పేరెంట్స్ మీద కేసులు: అర్బన్ ఎస్ పీ రామకృష్ణ  గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయని, జిల్లాలో ఇప్పటివరకు 41 కేసులు నమోదు, కాగా వీటిలో 27 కేసులు గుంటూరులోనే నమోదయ్యాయని చెప్పారు.  మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్, ఆనందపేట, బుచ్చయ్యతోట, నల్లచెరువు, సంగడిగుంట,  శ్రీనివాసరావుతోట, ఆటోనగర్, ఎల్బీ నగర్, కొరిటపాడు ప్రాంతాలను రెడ్ జోన్లగా గుర్తించాం,రెడ్ జోన్లలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.   దిల్లీ వెళ్లివచ్చినవారిని కలిసినవారు, కోవిద్- 19 లక్షణాలున్నవారు పరీక్షలకు ముందుకు రావాలని,  ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్కులు మూసివేయాలని కోరారు.  ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమానితులు వస్తే నోటిఫై చేయాలని సూచించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు, నిత్యావసర దుకాణాలు, మందుల కోసం మాత్రమే రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  గుంటూరు నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నామని,  ఇకపై గుంటూరుకు మూడే రహదారులు  ఉంటాయని, నిత్యవసరాల కొనుగోళ్ల  సమయాన్ని ఉదయం 6 నుంచి 9 వరకు కుదించామని జిల్లా కలెక్టర్ వివరించారు.  అర్బన్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ,  రోడ్డు మీద యువకులు వాహనంతో వస్తే తల్లిదండ్రులపై కేసులు  నమోదు చేస్తామని హెచ్చరించారు. రెడ్ జోన్లలో రాకపోకలపై పూర్తిగా నిషేధం విధింపు ఉన్నట్టు ప్రకటించారు.

donations to ap cm relief fund

ఆంధ్ర సి.ఎం సహాయనిధికి 122.53 కోట్ల రూపాయల కరోనా విరాళం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (కోవిడ్-19) కి ఏప్రిల్ 7 వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు రూ. 122 కోట్ల 53 లక్షల 46 వేల 985 లు జమ అయినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ, అలాగే  కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ మెంబర్ కూడా అయిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల పైబడి ఏడుగురు దాతలు సాయం అందించారన్నారు.  వారిలో రామోజీ ఫౌండేషన్( చైర్మన్ సీహెచ్. రామోజీరావు), భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ( పీవీ కృష్ణా రెడ్డి), దివీస్ లేబోరెటరీస్ లిమిటెడ్, ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లు ఉన్నాయన్నారన్నారు. 104 మంది దాతలు లక్ష రూపాయలకు పైగా విరాళాలు అందించారని ఆయన తెలిపారు.  కరోనా ఆర్థిక సాయంలో భాగస్వాములు కావాలసిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంధ్రప్రదేశ్ పేరున తమ చెక్కులను పంపాలని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకునేవారు SBI ACCOUNT NO - 38588079208, IFSC CODE - SBIN0018884, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి మరియు ANDHRA BANK ACCOUNT NO : 110310100029039, IFSC CODE – ANDB003079, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి ఖాతాలలో జమచేయాలన్నారు. వెబ్ సైట్ ద్వారా విరాళాలు అందించాలనుకునే వారు apcmrf.ap.gov.in కు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించాలని ఆయన కోరారు.  విరాళాలు చెక్కుల రూపంలో మరియు ఆన్ లైన్ లో అందించే దాతలు తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈ –మెయిల్ అడ్రస్ తో పాటు ఎందు నిమిత్తం విరాళం అందిస్తున్నారో తెలియజేస్తూ, చెక్కులు ఇతర ఆన్ లైన్ వివరాలను, ప్రత్యేక అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి,ఈ-మెయిల్: splofficer-cm@ap.gov.in కి అందజేయగలరని ఆయన  తెలియజేశారు. వెబ్ సైట్ ద్వారా విరాళాలు ఇచ్చిన దాతలు - ముఖ్యమంత్రి లేఖ, రసీదు,100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు పత్రాన్ని అదే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు.

IRCTC stops booking of 3 private trains till 30th April

నెలాఖరు దాకా ప్రయివేట్ రైలు సర్వీసుల నిలిపివేత

కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడిగింపుపై సంప్రదింపులు సాగుతున్న క్రమంలో ఈనెల 30 వరకూ తాను నిర్వహిస్తున్న మూడు ప్రైవేట్‌ రైళ్ల సర్వీసులను నిలిపివేయాలని భారత రైల్వేల అనుబంధ ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ రైళ్లో టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణీకులందరికీ పూర్తి సొమ్మును రిఫండ్‌ చేస్తామని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అంతకుముందు ఐఆర్‌సీటీసీ 21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసే ఏప్రిల్‌ 14 వరకూ బుకింగ్స్‌ను సస్పెండ్‌ చేసింది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్‌ రైళ్లను, కాశీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. కాశీ మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ వారణాసి-ఇండోర్‌ రూట్‌లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్‌ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్‌ రైళ్లను ఏప్రిల్‌ 15-30 వరకూ ఐఆర్‌సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

TDP MLA Nimmala Rama Naidu Cycle Yatra Blocked By Police

పాలకొల్లు ఎం.ఎల్.ఏ రామానాయుడి సైకిల్ కు బ్రేకులేసిన పోలీసులు!

పాలకొల్లు నుండి ఏలూరు వరకు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సైకిల్ పై ఒంటరిగా వెళ్తున్న పాలకొల్లు శాసన సభ్యుడు  నిమ్మల రామానాయుడు ను పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే లు గుంపులుగా వెళ్లి ప్రారంభోత్సవలు చేసినా కళ్లప్పగించి చూసిన పోలీసులు,సైకిల్ పై వెళ్తున్న ఎం ల్ ఏ ని అడ్డుకోవటం బాధాకరమని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కలెక్టర్, ఎస్ పీ లు ఫోన్ లిఫ్ట్ చేయని కారణంగానే, ఒంటరిగా తన నియోజకవర్గానికి బయల్దేరానని రామానాయుడు చెపుతున్నా, పోలీసులు ఆయన్ను ముందుకు వెళ్ళడానికి అనుమతించలేదు.

cm kcr press meet on lockdown

ఆదాయమైన వదులుకుంటా, జనం ప్రాణాలు నాకు ముఖ్యం

* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.

Corona Virus necklace popular in Russia

మెడలో ఆభరణంగా మారిన కరోనా వైరస్‌

కరోనా వైరస్ జ‌నాన్ని భ‌య‌పెడుతుంటే రష్యాలోని ఓ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని ఆభరణంగా మార్చేసి గుండెల‌కు హ‌త్తుకునేలా చేసింది. ఆమె చేసిన ఆభరణానికి ఎంత ఆదరణ బాగానే లభిస్తుంది. రష్యాకి చెందిన డాక్టర్‌ వొరొబెవ్‌.. ఓ 'మెడికల్‌ జ్యువెలరీ 'నగల వ్యాపారి. మెడికల్‌ జ్యువెలరీ అంటే.. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్‌ జ్యువెలరీని ధరిస్తున్నారు. ఇటీవల చైనాలో పుట్టిన కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసిన వైద్య శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దాని రూపాన్ని కనిపెట్టారు. గుండ్రంగా ఉండే ఈ వైరస్‌ చుట్టు కొమ్ములు ఉండి.. చివరన కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. ఈ వైరస్‌ ఆకారం ఎలా ఉంటుందో ప్రకటించగానే డాక్టర్‌ వొరొబెవ్‌ వైరస్‌ ఆకృతితో వెండి పెండెంట్స్‌ తయారు చేసి 13 డాలర్లకు ఒక పెండెంట్‌ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. వైద్య సిబ్బంది మంచి కోసమే తాను వీటిని రూపొందిస్తున్నట్లు వొరొబెవ్‌ చెబుతున్నారు. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్‌ నిలుస్తుందని వొరొబెవ్‌ అంటున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్న చాలా మంది.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు ఈ పెండెంట్‌ను కానుకగా ఇస్తున్నారని ఆమె తెలిపారు.

Doctor Sudhakar Rao Fires On AP Govt On Shortage Of N95 Masks

ఒక్క మాస్కు ఇచ్చి 15 రోజులు వాడ‌మంటారా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్దీ... మాస్కులకు సైతం డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాదు హెల్త్ వర్కర్లకు కూడా మాస్కులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారు ఫిర్యాదులు కూడా పెరిగాయి. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు లేక‌పోవ‌డం ఆందోళన కలిగిస్తోంది. తమకు సరైన పీపీఈ కిట్లు, మాస్కులు వంటి సదుపాయాలు లేవని కొంత మంది డాక్ట‌ర్లు ఉద్యోగాలు వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. తాజాగా, విశాఖపట్నంలో వైద్యుడు సుధాకర్‌ రావ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని నర్సిపట్నం ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో అనెథ్సెటిస్ట్‌గా పనిచేస్తోన్న తమకు మాస్కులు అందడం లేవని చెప్పారు. కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో నాకు ఒకే ఒక్క మాస్కు ఇచ్చారు.. దాన్ని 15 రోజుల పాటు ఉపయోగించుకోవాలని చెప్పారు. వారు అసలు ఏమనుకుంటున్నారు? కరోనా పాజిటివ్‌ కేసులు ఇక్కడకు రావని అనుకుంటున్నారా? దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

corona hospital in gachibowli

15లోగా గచ్చిబౌలి క‌రోనా ఆసుపత్రి సిద్ధం!

తెలంగాణాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 15లోగా ప్ర‌త్యేక క‌రోనా ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు అవుతోంది. స్పోర్ట్స్‌ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు శ‌ర‌వేగంతో కొన‌ సాగుతున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను పరిశీలించారు. 15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో దాదాపు 1500 పడకలు అందుబాటులోకి రానున్నాయి. పనులు వేగవంతం చేసి ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు పూర్తి చేయ‌నున్నారు. రోజుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది.

illegal liquor seized in ap

అధికార‌పార్టీ నేత‌ల నీడ‌లో పారుతున్న సారా!

లాక్ డౌన్ దెబ్బ‌తో మద్యం దుకాణాలు మూసేసి ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మద్యం భారీగా రోడ్డు మీద పట్టుబడుతోంది. ఇప్పటికే పలుచోట్ల మద్యం తరలిస్తున్న వారు పట్టుబడగా తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో కూడా మద్యం తరలిస్తూ కొందరు పోలీసులకు చిక్కారు. అయితే ఆ తరలిస్తు‍న్న వారిలో అధికార పార్టీకి చెందిన వారే వున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మద్యం దుకాణాలన్నీ పూర్తిగా మూసేశారు. మద్యం విక్రయాలు - తరలించడం పూర్తిగా నిషేధం. అయితే ఇవేవీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన నేత‌లు మ‌ద్యం త‌ర‌లిస్తున్నారు. గిద్దలూరు మండలం గడికోటలో కొందరు పెద్ద ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల్లో ఏకగ్రీవం గా ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైన పిడుగు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అతడు తన కారులో మద్యం తరలిస్తుండగా ఒంగోలు ఎక్సైజ్ - ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ - సీఐ తిరుపతయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. 24 కేసుల మద్యం స్వాధీనం చేసుకుని అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మద్యం తరలింపులో మాజీ ఎంపీపీ, ఓ వైద్యుడు కూడా వున్నాడు. ఆ వైద్యుడు గతంలో మద్యం వ్యాపారం చేశాడని - పెద్ద ఎత్తున మద్యం వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడ‌ట‌. గతంలో నంద్యాల నుంచి కల్తీ మద్యం తెచ్చి విక్రయించిన చరిత్ర అతడికి ఉందట‌. ప్రస్తుతం పోలీసుల‌కు పట్టుబడిన వారు అధికార పార్టీకి చెందిన వారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా వదిలేస్తారా అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

bcg about lockdown in india

బోస్టన్ అంచ‌నా ప్ర‌కారం సెప్టెంబ‌ర్ వ‌ర‌కు క‌రోనా సెగ‌!

భార‌త్‌లో జూన్‌ 4వ వారం నుంచి సెప్టెంబర్‌ 2వ వారం మధ్య లాక్‌డౌన్‌ ఎత్తివేసుకోవచ్చని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. ఈ రిపోర్ట్ ప్ర‌కారం జూన్‌ 3వ వారంలో కరోనా భారత్‌లో పీక్‌స్టేజ్‌కు వెళ్తుంద‌నేది వారి అంచాన. కాబట్టి అప్పటి వరకు లాక్‌డౌన్ కొన‌సాగించాల‌ని బోస్ట‌న్ గ్రూప్ సూచించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో కరోనా నియంత్రణకు ఎలా వ్య‌వ‌హ‌రించారు? యాక్టివ్ కేసులు ఎన్ని, లాక్‌డౌన్ ఎంత కాలం అమ‌లుచేశారు? ప‌తాక‌స్థాయిలో ఎప్పుడు చేరుకున్నారు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. భార‌త్‌లో మార్చి 25 వరకు నమోదైన కేసుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు రోజురోజుకూ మారిపో తున్న నేపథ్యంలో తమ నివేదికను వైద్యం, భద్రతలకు సంబంధించిన సలహా సూచనలుగా పరిగణించరాదని, ప్రత్యామ్నాయాలుగానూ చూడరాదని స్ప‌ష్టంగా తెలిపింది. భారత్‌లో కరోనా కేసులు జూన్‌ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా కట్టింది. నివేదికలో సూచించిన గ్రాఫ్‌ ప్రకారం జూన్‌ మూడో వారం నాటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతాయి. లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ.. ఇందుకోసం తాము చైనాలోని హుబే, వూహాన్‌ ప్రాం తాల్లో ఏ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తి వేశారన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందు బాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. దీంతో పాటు వైరస్‌ బారిన పడ్డ వారిని సమర్థంగా ఐసోలేషన్‌లో ఉంచగల సామ ర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ లో జూన్‌ ఆఖరు నుంచి సెప్టెంబర్‌ రెండో వారం మధ్యలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా కట్టింది. భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుంటే లాక్‌డౌన్‌ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది. లాక్‌డౌన్‌ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్‌ కరోనా అనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగింది. వైరస్‌ గొలుసును అడ్డుకోగలుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనాసాగుతోంది.

Farmers Fires on CRDA Officers

లాక్‌డౌన్ సమయంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ!

సీఆర్డీఏ అధికారులకు మైండ్ దొబ్బిన‌ట్లుంది. అస‌లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో క‌నీస సృహ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రైతులు ఛీ కొట్టారు.  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ  గ్రామంలో R5 జోన్  పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులకు రైతుల నుంచి చేదు అనుభ‌వం ఎదురైంది. అధికారుల‌ను రైతులు, జేఏసీ నేతలు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు నిల‌దీశారు.  నిజంగా డ్యూటీలో భాగంగా వ‌స్తే లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో తోక ముడిచిన సీఆర్డీఏ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

bandi sanjay kumar slams telangana govt

డాక్టర్లు ఉద్యోగాన్ని వొదులుకునే దుస్థితి!

తెలంగాణ ప్రభుత్వం సరైన సౌకర్యాలు అందించక పోవడంతో ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు ఉద్యోగాన్ని వొదులుకునే దుస్థితికి రావడం దురదృష్టకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మరితో యుద్ధం చేస్తుంది. ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సేవలు అజరామరం.. దేశం మొత్తం డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారిపై దయ, కరుణ చూపకుండా వ్యవహరిస్తోందని ఆయ‌న ఆరోపించారు.  అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్న వారికి కనీసం కిట్స్ అందించలేని దుస్థితిలో ఉండటం చాలా విచారకరం అన్నారు. ఇలా డాక్టర్లకు కిట్స్ అందించకుండా తత్సరం చేస్తే ప్రభుత్వానికి అప్రత్తిష్ఠ పాలు అవుతుంది అని బండి సంజయ్ అన్నారు.  ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ, సౌకర్యాలు అంధించి వారికి మనో ధైర్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ పంపిణిలో అలసత్వం వహించడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాధికాన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలాషన్ తో పాటు అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  కొందరు అధికారులు WHO పేరుతో కిట్స్ అందరికి అందించడం సాధ్యం కదానడం విడ్డురం అన్నారు. నిబంధనల పేరుతో వైద్యులకు కనీస సౌకర్యాలు అంధించకపోవడం దురదృష్టకరం అన్నారు. డాక్టర్లకు సరైన సౌకర్యాలు వెంటనే అందించాలని కోరారు.  రాష్ట్రంలో సేవలు అందిస్తున్న డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మానందరిపై ఉన్నదని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

పది రోజుల క్రితమే ప్ర‌ధాని బోరిస్ తో బెడ్ ను పంచుకుంద‌ట‌!

కేరీ సైమండ్స్‌తో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నారు. దీన్ని వీరిద్దరు ఇంతకుముందే ధ్రువీకరించారు. ఇక్క‌డ షాకింగ్ న్యూస్ ఏంటంటే కేరీ పది రోజుల కిందట జాన్సన్ తో బెడ్ ను పంచుకుంద‌ట‌. క్వారెంటైన్‌లో కూడా శృంగారంలో పాల్గొన్నార‌ట‌. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గర్ల్ ఫ్రెండ్ కేరీ సైమండ్స్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ టైంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ అయిన 32 ఏళ్ల కేరీ సైమండ్స్ కు సైతం కరోనా పాజిటివ్ వ‌చ్చింది. పది రోజుల కిందట తను జాన్సన్ తో బెడ్ ను పంచుకున్నట్టుగా ఆమె తెలిపింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో పాటు కరోనా కు గురికావ‌డంతో ఆమె మరింత ఆందోళన చెందుతుంది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఐసీయూకు తరలింపు!

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.  ఇది కేవలం ఆరోగ్యం విషమించకుండా, వైద్యుల సలహా అనుసరించి ముందు జాగ్రత్త కోసం తీసుకున్న చర్య అని 10-డౌనింగ్ స్ట్రీట్ (ప్రధానమంత్రి కార్యాలయం) తెలిపింది.  కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. ఆదివారం సాయంత్రం నుంచి మరింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యులు స్పెషల్ కేర్ తీసుకొని చికిత్స అందిస్తున్నారు. బోరిస్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా ప్రధాని ట్రంప్ స్పందించారు. బోరిస్‌కు మంచి వైద్యం అందించేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. తనకు, అమెరికాకు బోరిస్ మంచి స్నేహితుడని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌ మ్యాప్స్ లో ఉచిత‌ భోజనం, నైట్‌ షెల్టర్ల వివరాలు!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉచిత భోజన కేంద్రాలు, నైట్‌ షెల్టర్ల వివరాలను గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ సెర్చింజన్ల ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు గూగుల్‌ చేసింది. ఇప్పటికే 30 నగరాల్లో ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ట్రాఫిక్‌ విభాగాలు, ఎన్జీవోల సహకారంతో గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది. త్వరలో ఈ ఫీచర్‌ను హిందీ సహా, అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ చెబుతోంది. మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లో కూడా ఈ లింక్‌ను అనుసరించడం ద్వారా మ్యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ, వినియోగదారులు అన్ని సహాయ కేంద్రాలను బాగా చూడటానికి జూమ్ చేయవచ్చు. లొకేషన్ పిన్స్ నొక్కడం వల్ల రిలీఫ్ సెంటర్ పూర్తి చిరునామా తెరుచుకుంటుంది. మ్యాప్ Google తో నిర్మించబడినందున, నావిగేషన్ Google మ్యాప్స్‌లో కనిపిస్తుంది.

ఏపీ లో జూన్ 11 వరకూ స్కూల్స్ బంద్ తప్పేట్లు లేదు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా రోజురోజకూ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించడంలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెల 14 వరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 15 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేసినా లేదా సడలించినా పాఠశాలలు మాత్రం వేసవి సెలవుల వరకు మూత అనివార్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరటం ఖాయం. ఫలితంగా సామాజిక దూరానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆల్‌ పాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. విద్యా విషయక క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.  ఈ నెల 14 తరువాత ఈ విద్యా సంవత్సరంలో ఆదివారాలు పోనూ ఇంకా 7 పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజా పరిస్ధితుల్లో ఈ కొద్ది రోజులు స్కూళ్లు తెరిపించినా ఒనకూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు. ఒకేసారి వేసవి సెలవుల వరకు అంటే జూన్‌ 11వ తేదీ వరకు స్కూళ్లు మూత తప్పదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.