Govt raises fuel excise duty by Rs 3 per litre

పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 ఎక్సైజ్ సుంకం పెంపు!

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 మేరకు తగ్గించిన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .2 నుండి రూ .8, డీజిల్‌కు రూ .4 మేరకు పెంచారు. అటు పెట్రోల్‌పై రోడ్‌సెస్‌ను లీటరుకు రూ .1, డీజిల్‌కు రూ .10గా నిర్ణయించారు. మార్చి 11 న పెట్రోల్ ధరను రూ. 2.69 మేరకు తగ్గించగా.. డీజిల్ ధరలను రూ .2.33కు తగ్గించారు. మరోవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్ వణికిపోతున్న నేపథ్యంలో మార్కెట్ అంతటా పతనం అవుతోంది. అంతర్జాతీయ చమురు ధరలు కూడా 31 శాతానికి పడిపోయాయి. అయినా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించ‌డం దేశ ప్ర‌జ‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చినా నరేంద్ర మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా నిర్ణయంతో రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం వ‌స్తుంద‌ట‌.

tdp activist tweet goes viral

భజన కు పడిపోతే, నిమజ్జనమే నంటూ నాయుడుకి చురకలు!!

తెలుగుదేశం లో అసమ్మతి స్వరం తీవ్రత పెరిగింది. సోషల్ మీడియా లో సొంత పార్టీ వారే, నాయకత్వపు లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఒక వైపు నాయుడు వైఫల్యాలను ఎండా గడుతూనే, మరోవైపు వై.ఎస్.ఆర్.సి.పి దుర్మార్గ పాలన చేస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. " ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ దుస్థితికి వినాయక చవితి పండగకి అవినాభావ  సంబంధం ఉంది...భజన భజన భజనలో మునిగి ఎలాగైతే నిమజ్జనం జేస్తారో ఈరోజు అదే జరుగుతోంది...కనీసం ఇప్పుడు అయినా ధైర్యంగా ముందడుగు వేసే కార్యకర్తల పేర్లు పార్టీ ఆఫీసులో రాసి పెట్టుకుంటున్నారా ?? బరి తెగించే నాయకుల పేర్లు రాసి పెట్టుకుంటున్నారా?? పొర్లు దండాలు పెట్టె అధికారుల పేర్లు రాసిపెట్టుకుంటున్నారా?? ఇవేవీ లేకుండా ఆంధ్ర బీహార్ అయిందని మనం ఎంత గింజుకున్నా సోషల్ మీడియాలో ఎంత ఏడ్చినా ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా లాభం ఏంటో మనకె అర్ధమవ్వాలి," అంటూ ఒక తెలుగు దేశం గాఢాభిమాని పోస్ట్ పెట్టాడు...ఇది ఇప్పుడు తెలుగుదేశం హెడ్ క్వార్ట్రర్స్ లో పెద్ద చర్చ కు దారి తీసింది.  నాయకులు అందరూ పోతున్నారని పోయేవాళ్ళ మీద ఏడ్చే మనం లోకేష్ & చంద్రబాబు ఎన్ని నామినేషన్లకి హాజరయ్యారో మనమే ఆలోచించుకోవాలి...ఇవ్వాళ మనం చూసే అరాచకం అంతా కూడా నిజమైన అరాచకం కాదు..అదంతా పెయిడ్ ముఠాల అరాచకం..నాయకుల దృష్టిలో పడేదానికి, నాయకులకి కలెక్షన్ ఎజెంట్లుగా వుండే దానికి వాళ్ళు పడే ఆరాటం..దానికి ఉదాహరణ నిన్న మాచర్ల తురకా కిషోర్ లాంటి వాళ్ళ అతి..ఒకప్పుడు బాంబులు,కత్తులు  పట్టుకుని తిరిగినవాళ్ళు కూడా ఇలాంటివి చూసి నవ్వుకుంటున్నారు..ఇప్పుడు నడిచేది అంత "ఆర్ధిక ఫ్యాక్షన్"...అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పులి పదవి పోగానే పిల్లి, అంటూ వ్యాఖ్యానించిన ఆ నెటిజెనుడు , తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని కాస్త గట్టిగానే అప్రమత్తం చేశారు.

trolls on nagababu

ఏంటి సార్..మీరు మరీ బ్రహ్మానందం లాగా...

నాగబాబు కు దురద గుంటాకు పూసుకోవటమంటే మహా సరదా మల్లే ఉంది. పొద్దున్న పొద్దునే తన ట్విట్టర్ లో కరోనా వైరస్ మీద జోకుదామనుకుంటే, అది కాస్తా బూమరాంగ్ అయింది. " కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కరోన వైరస్ ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీద కి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్ళ కి కోపం ఎక్కువే సుమా.." అంటూ జబర్దస్త్ గా నాగబాబు చేసిన ట్వీట్ కి అసలే చిరు బ్రదర్స్ అంటే కోపం నషాలా కి అంటిన జనం వీర లెవెల్లో రిప్లై ఇచ్చారు.  "అక్కడ మన అభ్యర్థులపైన దాడులు జరుగుతున్నాయ్ సార్ కులమతాల గొడవలు వదిలేసి కొంచెం జనంలో తిరగండి", అంటూ తిరిగి నాగబాబు మీద సెటైర్ రువ్వాడో నెటిజెనుడు. అంటే, దీనర్ధం, చిరు బ్రదర్స్ ఎలాంటి బాదరా బందీ లేకుండా... ఉత్తినే ట్వీట్లు చేయటం కాదు, జన సేన అభ్యర్థుల మీద చాలా చోట్ల దాడుల జరుగుతున్నాయి కాబట్టి కాస్త వాళ్ళని పరామర్శించటానికైనా వెళ్ళండి, మైలేజ్ దక్కుతుందని ఆ నెటిజెనుడు సుద్దులు చెప్పాడు.  కాస్తంత పనికి వచ్చే విషయాల మీద ట్వీట్లు పెట్టమని ఇంకోహాయన, అలాగే, ఇవాళ జన సేన ఫార్మేషన్ డే కాబట్టి దాని మీద, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద జనాన్ని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేయండని మరొకాయన శ్రీమాన్ నాగబాబు గారికి సలహా ఇచ్చారు.

Centre To Bear Polavaram Project Land Acquisition And Rehabilitation Expenses

పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచ‌ర‌ణ‌ ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు పంపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్‌ కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,545 కోట్లు. 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై ఇప్పటికే 16 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం. మిగతా 32 వేల కోట్లనూ భరించనున్న కేంద్ర ప్రభుత్వం. భూసేకరణ, పునరావాస వ్యయ భరింపు ఎట్టకేలకు స్పష్టత. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఉన్న 2200 కోట్లు. ఆడిటింగ్ పూర్తవ్వగానే కేంద్రం నంచి విడుదల కానున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

election commission took action against mla kethireddy pedda reddy

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఎన్నికల కమిషన్ చర్య

తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు ఈ చ‌ర్య తీసుకుంటున్న‌ట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8 వతేదీన స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు రావడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఈ సంఘటన పై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీ లోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7వ తెది నుండి అమల్లోకి వచ్చినందున, ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయ్యడం తీవ్రంగా పరిగణించడ మైనదని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పెద్దారెడ్డి వర్గీయులు అడ్డుకున్నార‌ని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి లు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

Janasena Formation Day Celebrations In Rajahmundry

ఆరేళ్లు ఒకటే కాయ అదీ జ‌న‌సేన లెక్క‌!

ఎన్టీఆర్ 9 నెల‌ల్లో రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చి వేశారు. అన్న‌ చిరంజీవి 8 నెల‌ల్లో 18 సీట్లైనా ఖాతాలో వేసుకున్నారు. నాకు తిక్క వుంది కానీ దానికి ఒక లెక్క‌వుందంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టి ఆరేళ్ళైనా ఒక్క‌టంటే ఒక్క సీటు గెలిపించుకున్నారు. తాను రెండు చోట్ల ఓడిపోయారు. అప్ప‌ట్లో బీజేపీ - టీడీపీతో పొత్తు పెట్టుకొని టిడిపిని గెలిపించారు. 2019 ఎన్నిక‌ల్లో సీపీఎం, బీఎస్పీతో క‌లిసి పోటీ చేశారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో తుస్సు మ‌న్నారు. తాజాగా బిజెపితో క‌లిసి స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూప‌డానికి పంచ్ డైలాగ్‌లు చెబుతున్నారు. స్థానిక స‌మ‌రంలోనైనా ప‌రువు కాపాడుకోవ‌డానికి రాజ‌మండ్రి వేదిక‌గా జ‌రిగే స‌మీక్ష‌లో ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేయ‌నున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మార్చి 14 నేటికి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఐతే... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాల్ని సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఇవాళ ఏం చేసినా, ప్రతీ లెక్కా ఈసీకి నివేదించాల్సిందే. అందువల్ల వేడుకల్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి వేడుకలకు రాజమహేంద్రవరం (రాజమండ్రి) వేదిక అయింది. జననేత శ‌నివారం ఉదయం విమానంలో మధురపూడి చేరుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరంకు వెళ్ళారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఆరేళ్లలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద ‘మన నది - మన నుడి’ కార్యక్రమంలో భాగంగా గోదావరికి హారతి ఇచ్చి రచ్చబండ నిర్వహించున్నారు. ఆవిర్భావ సమావేశం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని షెల్టాన్‌ హోటల్‌లో జరుగుతోంది. పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆరేళ్లలో చేసిన పోరాటాలు, సాధించిన ప్రగతి, ఇబ్బందులు తదితర విషయాలను సమీక్షించి భవిష్యత్‌ కార్యాక్రమాన్ని రూపొందించ‌నున్నారు. ఆదివారంనాడు వివిధ వర్గాల మేధావులతో తెలుగభాష పరిరక్షణ కోసం షెల్టాన్‌లో సమీక్షిస్తారు. ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేయడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఒక ఉద్యమంగా భాషా పరిరక్షణ కోసం ఉపక్రమించ‌నున్నారు. పిల్లలతో నదీ పరిరక్ష ణ గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడతారు. ఇది ఓ రచ్చబండ కార్యక్రమంలా నిర్వహించనున్నారు. 15న కవులు, సాహితీవేత్తలతో సమావేశ మై, తెలుగుభాష పరిరక్షణ గురించి చర్చిస్తారు. సాహితీవేత్తల అభిప్రాయాలతో కొన్నినిర్ణయాలు తీసుకుని, తెలుగుభాషా పరిరక్షణ కార్యక్రమాలు చేపడతారు. వైసీపీపై పోరాటానికి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆరంభంగా చేసుకోవాలని జనసేన భావించింది. ఐతే... 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్ల... బహిరంగ సభలు చేపట్టేందుకు చాలా షరతులు తప్పవు. ఏదైనా సభ నిర్వహించినా... దానికి అయ్యే ఖర్చులు... అభ్యర్థుల ఖర్చుల లిస్టులో చేరతాయి. అందుకే జనసేన పార్టీ బహిరంగ సభ బదులు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. 2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీని లాంచ్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీతో కలసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది. అయితే, టీడీపీ, బీజేపీ పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయలేదు. అయితే, 2014 - 19 మధ్య రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి ఎన్నిక‌ల బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తాజాగా విజన్ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్ చేశాయి. జ‌న‌సేన భ‌విష్య‌త్ గురించి ఈ స‌మావేశంలో 2024లో అధికారంలో రావ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కూడా చ‌ర్చిస్తున్నారు.

nepal pashupatinath temple

పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి అటే వెళ్లిపోండి...

నేపాల్ లో పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి భారత దేశానికి చేరుకోవాలనే విదేశీయులకు ప్రస్తుతానికి నో ఎంట్రీ. దేశంలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులు ఉండగా వాటిలో 19 చెక్‌పోస్టులు శనివారం అర్ధరాత్రి వరకు పనిచేయనున్నాయి. అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు మూతపడనున్నాయి.  అలాగే, నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ఆదేశించింది.   సాధారణం గా నేపాల్, భూటాన్ లలో హిందూ, బౌద్ధ ఆలయాలు, ఆరామాలను దర్శించుకుని అటు నుంచి భారత్ కు రావటం విదేశీ పర్యాటకులకు అలవాటు. అయితే, కరోనా దెబ్బకు ప్రస్తుతం వారి ఎంట్రీ మీద తాత్కాలిక నిషేధం విధించింది భారత హోమ్ మంత్రిత్వ శాఖ.

ap dgp gowtham sawang counter to nara lokesh

లోకేష్ ను గురజాల వెళ్లి చెక్ చేసుకోమన్న పోలీస్ పెద్దాయన!

ఎవరో బయలుకు వెళ్లొస్తే, ఊరిపెద్ద చేతులు శుభ్రం చేసుకున్న చందాన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలకు పోలీస్ పెద్దాయన చివరకు వివరణ ఇచ్చుకుంటూ కూర్చోవలసి వస్తోంది. అసలే హైకోర్టు పిలిచి, ఆరు గంటలు నుంచో పెట్టిందని అవమానంతో ఉడికి పోతున్న గౌతమ్ సవాంగ్ కు, టీ డీ పి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంటి లో నలుసు లా తయారయ్యారు.  శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, లోకేష్ కు ఏమైనా  అనుమానాలు ఉంటె ఓ మారు గురజాల సబ్  జైలు కు వెళ్లి చెక్ చేసుకోవచ్చునని  ఆంధ్ర ప్రదేశ్ డి జి పి డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి సూచించారు..స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ వారు ఫిర్యాదు ఇచ్చినా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. మాచర్ల ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణలపైనా సవాంగ్ స్పందించారు. మాచర్ల ఘటన తర్వాత లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకుడికి స్టేషన్ బెయిలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే ఒకసారి స్టేషన్ బెయిలు అని, మరోసారి పారిపోయాడని అంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.  లోకేశ్ విమర్శలపై స్పందించిన డీజీపీ.. మాచర్ల ఘటనలో ముగ్గురు నిందితులు జైల్లోనే ఉన్నారని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో తాము ఎవరికీ అనుకూలంగా వ్యవహరించబోమన్నారు. సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేయలేదని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు గురజాల సబ్‌జైలులో ఉన్నట్టు తెలిపారు. మాచర్ల ఘటనపై తమను విమర్శించేవారు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను తమ వాహనాల్లో ఎక్కించుకుని భద్రత కల్పించిన విషయాన్ని గుర్తించాలని డీజీపీ కోరారు. వాస్తవానికి లోకేష్ ట్వీట్ చేస్తూ.. " వ్యవస్థల్ని బ్రష్టు పట్టించడంలో @ysjagan గారు నెంబర్ 1. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు పెట్టిస్తున్నారు," అని ప్రస్తావించడం ద్వారా సోషల్ మీడియా ద్వారా మైండ్ గేమ్ మొదలెట్టారు.  సోషల్ మీడియా లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తని 14 రోజులు రిమాండ్ కి పంపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైకాపా నాయకుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చాం అని ఒకసారి తూచ్ అతను పారిపోయాడు అని మరోసారి చెబుతారా, అంటూ కూడా లోకేష్ నిలదీశాడు. పొలిసు వ్యవస్థని ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, అంటూ లోకేష్ వాపోయారు.

tamil nadu newly opened hotel offers chicken biryani for 1 rupee

తమిళనాడు ట్రెండ్ సెట్ చేస్తే, చికెన్ అలాగే ఖాళీ అయిపోతుంది మరి!

పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మన్నాడు మజ్జిగ కరువు... అయితే, ఇపుడు ఆ కరువు మాట పక్కన బెట్టి చికెన్ కోసం ఆ హోటల్ మీదకు ఉరికెత్తుకొచ్చారు ఊరి జనం. అది గుంటూరు లో జరిగిన లేటెస్ట్ వింత. ఏ వింతలకైనా తమిళనాడు ట్రెండ్ సెట్ చేస్తే, మిగిలిన జనాలు అది ఫాలో చేస్తారు గా.. ఓ సారి అక్కడ ఏమి జరిగిందో మీరే చదవండి.  తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా భయాన్ని పక్కనపెట్టేసి అందినంత చికెన్ బిర్యానీ లాగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఇక్కడ కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్టు బోర్డులు పెట్టారు. అంతే.. జనాలు విరగబడిపోయారు. బిర్యానీని దక్కించుకునేందుకు బారులుతీరారు. వారిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది. కరోనా భయంతో బిర్యానీ అమ్ముడుపోతుందో, లేదోనని తొలుత భయపడ్డామని, అయితే, వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడం తమకు సంతోషాన్నిచ్చిందని హోటల్ యజమాని పేర్కొన్నారు.

money distribution in ap local elections

లోక‌ల్‌వార్‌లో డ‌బ్బే కీల‌కం! డ‌బ్బుఖ‌ర్చుపెట్టే స‌త్తా చూసే అభ్య‌ర్థి ఎంపిక‌చేశార‌ట‌!

మీ దగ్గర క్యాష్ ఎంతుంది? ఎంతున్నా. వారు చెప్పినంత ఉండాలి. అదికూడా ముందుగానే చూపించాలి. అప్పుడుగాని ఆ అభ్యర్ధి ఎన్నిక‌ల రేసులో ఉండరు. ఇదేంటని అనుమానం వ్యక్తం చేయకండి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ ఇదే. పోటీ చేయాలంటే ఈ స్ధాయిలోనే ప్రాథమిక స్క్రీనింగ్ జ‌రిగిందని కొందరు అభ్యర్ధులు వాపోతున్నారు. రాజకీయాల్లో డబ్బుల తర్వాతే ఏదైనా. సొమ్ములుంటే కొండమీద కోతైనా ఇట్టే వ‌చ్చేస్తోంది. స్థానిక సంస్ధలలో పోటీ చేయాలనుకుంటున్న వారికి ఆయా నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆశీస్సులు ఆశీర్వచనాల‌తో పాటు విట‌మిన్ ఎం. షో చేయాల్సిందేన‌ట‌. ఏపీలో రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో వ్యూహాల్లో నిమ‌గ్న‌మైయ్యారు. గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. పదేళ్ల తర్వాత పోటీ స్ధానిక ఎన్నికలు రావడంతో బరిలో నిలిచేందుకు ద్వితీయశ్రేణి నాయకులు ఆసక్తి గా ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. దీంతో జాబితాను ఫైన‌ల్ చేయ‌డానికి ఇంఛార్జుల‌కు స‌ర్క‌స్ ఫీట్లు త‌ప్ప‌లేద‌ట‌. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే విజయవాడ కార్పోరేషన్లో కాలు పెట్టేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగరంలో మూడు నియోజకవర్గాలలో అభ్యర్దుల ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్దులను ఫైన‌ల్ చేశారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాస్తాంత గట్టిపోటీ ఉన్నా అభ్యర్దుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆచీతూచీ అడుగులు వెస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి ఒత్తిడులు ఉన్నా సాధ్యమైనంత వరకు గెలిచేవారికే ప్రేయార్టీ ఇచ్చార‌ట‌. తూర్పు నియోజకవర్గంలో టిడీపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఇంచార్జిగా ఉన్న దేవినేని అవినాష్ అభ్యర్దుల ఎంపికపై తీవ్రస్ధాయిలో కసరత్తు చేశారు. అభ్యర్ధితో పాటుగా క్యాష్ కూడా చూస్తున్నారు... కార్పోరేటర్ గా పోటీ చేయాలంటే 50 లక్షలు ఉండాల్సిందే. రిజర్వుడు నియోజకవర్గంలో అయితే 25 నుంచి 30 లక్షలట‌. ఆ మొత్తాన్ని తమ వ్యక్తులకు చూపించాలని, ఎన్నికల టైంలో మావారు చెప్పినట్లే చేయాలని కూడా హుకుం జారీచేస్తున్నారు. ఇది ఒక్క దేవినేని దొడ్డిలోనే కాదు. దాదాపు నాయకులంతా ఇదే ధోరణి అనుసరించారు. అయితే అవినాష్ అనుభవం తక్కువ కావడంతో సీక్రెట్ కాస్తా ఓపెన్ అయ్యింది. విజయవాడ కార్పోరేషన్ లో పరిస్ధితే కాదు... రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో పరిస్ధితి దాదాపు ఇలానే ఉంది. కౌన్సిలర్ అయితే 15 నుంచి 20 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. జెడ్పీటీసీగా బరిలో నిలబడే అభ్యర్దికి 50 లక్షల వరకు రెడీ చేసుకోవాల్సిన పరిస్ధితి. ఎంపిటీసి, సర్పంచ్ లకు 10 లక్షల వరకు అవసరం ఉంటుందనే ఇండికేషన్స్ ఆయా పార్టీల నేతలు ఇచ్చారు. ముఖ్య‌మంత్రి మద్యం, నగదు పంపిణీకి చెక్ పెట్టాలని పంచాయతీ చట్టంలోనే మార్పులు తీసుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందిని ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టే తాహతు లేని నేత‌లు మండిప‌డుతున్నారు.

Greatness of Indian Culture

మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటేనా?

అవునంటోంది భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం. మ‌న పూర్వీకులు అప్ప‌ట్లో చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటే. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చెబితే చాదస్తం అన్నారు. ఇంగ్లీష్‌లో చెబితే మ‌న వాళ్ల‌కు బాగానే అర్థం అయింది. అదే మ‌న భార‌తీయ భారతీయత ఔన్నత్యం. అప్ప‌ట్లో పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా మైల పాటించ‌డం ఆచారంగా వుండేది. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం. అయితే చ‌దువు ఎక్కువైయ్యే స‌రికి దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. అయితే క‌రోనా దెబ్బ‌కు అస‌లు విష‌యం బోధ‌ప‌డుతోంది. ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలో అంటే ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి (అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేస్తారు. అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చేస్తారు. దీనినే పురిటి శుద్ధి అంటారు. అలాగే మరణం కారణముగా ఏర్పడే మైలతో మృత‌దేహం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితముగా గుమిగూడుతుంటాయ్. వాతావరణములో మార్పుల కారణముగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశములో గుమిగూడతాయో చెప్పలేము. ఆ సమయములో ఆ ఇంటి పేరువారు, వారి కులం వారు అక్కడికి వచ్చి ఉంటారు. సూక్ష్మజీవులు జీవనప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం. పెండ్లి అయిన ఆడబడుచులను ఇత్యాది వారిని 4వ రోజున శుద్ధి స్నానం చేయమంది. కారణం వారు సాధారణముగా వారి వారి కుటుంబాల‌కు వెళ్ళిపోతారు. శవ దహనం తరువాత. అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్లిపోయేరు కాబట్టి 3 రోజులు మైలగా పరిగణిస్తారు. అదే విధముగా శవం ఉన్న సమయములో చుట్టుపక్కల వంట వంటి కార్యక్రమాలు నిషేధించి ఆ ప్రాంతము నుంచి శవం తొలగించిన తరువాత అక్కడి నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ విధానాన్ని భారతీయ సనాతన ధర్మం మైల అన్నది. దీనినే ఇప్పటి శాస్త్రవిజ్ఞానం (సైన్స్) ఇమ్మ్యూనిటి అనే పేరుతో సూక్ష్మజీవ ప్రభావ రోగులను ఐసోలేషన్ ప్రాంతాలలో పెట్టి ఆరోగ్యవంతులకు దూరముగా పెడుతున్నారు. అది విష‌యం.

Political Heat in kurnool district YSRCP

వైఎస్సార్సిపిలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు

వైఎస్సార్సిపి లో ఎస్సి నాయకులు థర్డ్ గ్రేడ్ నాయకులుగా మిగిలిపోవాల్సిందేనా...? వైఎస్సార్సిపి కి గుడ్ బై చెప్పే ఆలోచనలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజీకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం... 151 సీట్లు గెలిచి 10 నెలలు కాకముందే వైకాపా ఎస్సి నాయకుల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడుతుంది.స్థానిక ఎన్నికల నేసథ్యంలో పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.ఏకంగా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.రెడ్డి నాయకుల ఆధిపత్య పోరులో ఎస్సి నాయకులు నలిగిపోతున్నారు.కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుంది.ఆర్ధర్ ని నమ్ముకున్న నాయకులు,కార్యకర్తలను అధిష్ఠానం నీచంగా చూడటం,కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయాలనే వదులుకోవాలి అనే ఆలోచనకి వచ్చారు.రెడ్డి నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాళ్ళ కింద 10 నెలల నుండి నలిగిపోతూ కక్క లేక,మింగ లేక నలిగిపోయారు ఆర్డర్,ఆయన అనుచరులు.కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా తన వర్గానికి న్యాయం జరుగుతుంది అని భావించి మరోసారి అవమానపడ్డారు.తన వర్గానికి న్యాయం జరగలేదు కనీసం భీ-ఫార్మ్ ఇచ్చే అధికారం కూడా ఎమ్మెల్యేకి లేదు అని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హుక్కుమ్ జారీ చేసారు.ఎమ్మెల్యే పక్కనే ఉన్నా భీ-ఫార్మ్ లు మాత్రం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చి ఆర్ధర్ ని ఘోరంగా అవమానించి పంపారు.ఇంత కాలం నియోజికవర్గంలో పేరుకి మాత్రమే ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ కార్యక్రమాల అమలు ఇలా ఏ కార్యక్రమంలో కూడా ప్రోటోకాల్ ఉండదు.అన్ని బైరెడ్డి ప్రారంభిస్తారు.   కనీసం కొన్ని కార్యక్రమాలకు సమాచారం కూడా ఇవ్వరు.ఇప్పుడు కనీసం 10 శాతం సీట్లు కూడా తన వర్గానికి ఇప్పుంచుకోలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయారు ఎమ్మెల్యే ఆర్డర్.దింతో ఇంతకాలం జగనన్న ఉన్నారు,అయన వింటారు అని నమ్మకం పెట్టుకున్న ఆర్ధర్ కి స్థానిక ఎన్నికల నేపథ్యంలో అసలు విషయం తెలిసింది.జరిగే ప్రతి చర్య అధిష్టానం కి తెలిసే జరుగుతుంది అని గ్రహించిన ఆర్ధర్ ఇక రాజీకీయాలకు,ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు.దీనికి ప్రధాన కారణం నమ్ముకున్న కార్యకర్తలకు కనీస న్యాయం కూడా చేయలేకపోవడం వారి ముందు ఆర్ధర్ మొహం చెల్లకపోవడం వలన ఫైనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Roja Vs Peddireddy

రోజా రెడ్డి వెర్సెస్ పెద్ది రెడ్డి

చిత్తూరు జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధం రోజా రెడ్డి కి చెక్ పెడుతున్న పెద్ది రెడ్డి మంత్రి పదవి పై కన్నేసిన రోజా రోజా మంత్రి అయితే సుధీర్ఘ కాలం కాపాడుకున్న పెద్దరికం పోతుంది అనే భయంలో పెద్ది రెడ్డి గాలి వానలా మొదలైన రోజా రెడ్డి ,పెద్ది రెడ్డి ప్రచ్చన్న యుద్ధం తుఫాను గా మారుతుంది.జిల్లా లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.జగనన్న గెలిస్తే చెల్లమ్మకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా.కానీ చెల్లెమ్మకు మంత్రి పదవి దక్కకుండా పెద్ది రెడ్డి చాకచక్యంగా చక్రం తిప్పారు.చెల్లెమ్మ అలిగి కొన్ని రోజులు బయటకు రావడం కూడా మానేసి జబర్దస్త్ కి పరిమితం అయ్యారు.ఏపిఐఐసి పదవి తీసుకోవడం ఇష్టం లేకపోయినా సన్నిహితుల సలహాతో పదవి స్వీకారం చేసినా ఆ పదవి పట్ల ఆమె ఎప్పుడు శ్రద్ద చూపడం లేదు.ఒక పక్క కోరుకున్న పదవి దక్కలేదు అని ఆవేదన మరో పక్క నియోజికవర్గంలో అంతర్గత పోరు ఆమెకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.నియోజికవర్గంలో ఒక చోటా నాయకుడి జన్మదిన వేడుకులకు హాజరవ్వొద్దని ఎమ్మెల్యే రోజా కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే జిల్లాలో పెద్ది రెడ్డి ప్రాభవం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఆఖరికి సొంత నియోజికవర్గంలో పర్యటించడానికి లేదంటూ పెద్ది రెడ్డి వర్గం ఆమె కాన్వాయ్ కి అడ్డుపడే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి,జబర్దస్త్ కష్టాలు రోజాను వెంటాడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.     ఈ సమయంలో మండలి రద్దు రోజాలో కొత్త ఆశలు రేకెత్తించాయి.రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వడం,రేసులో రోజా పేరు మీడియా లో రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకొని మంత్రి పీఠం దక్కించుకోవాలని రోజా రెడ్డి ఆలోచన.మరి పెద్ది రెడ్డి ఊరికే చూస్తూ కూర్చుంటారా?జిల్లాలో మరో పవర్ సెంటర్ అనే ఆలోచనే రాకూడదు ఆయనకి.వెంటనే రంగంలోకి దిగి నగరి లో తన వర్గానికే మెజారిటీ సీట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు.ఈ లోపు లేడీ సెంటిమెంట్ వాడి రోజా కార్చిన కన్నీటికి అధిష్టానం కాస్త తగ్గి కొంత భాగం సీట్లు ఆమె వర్గానికి వచ్చేలా చేసారు.ఇప్పుడు పెద్ది రెడ్డి వర్గం దీనికి విరుగుడు వేసింది.ఈ నియోజికవర్గంలోకి రోజా హవా జీరో చెయ్యాలని తద్వారా ఆమె మంత్రి పదవి ఆశల పై నీళ్లు చల్లాలని పెద్ది రెడ్డి ఫిక్స్ అయ్యారు.అందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైలెంట్ గా ఓట్లు గుద్ది రోజా ని జీరో చెయ్యాలని ఆర్డర్ వేసారు పెద్దిరెడ్డి.ఇప్పుడు ఎం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో రోజా పెద్ది రెడ్డి ని ఎదుర్కునే శక్తి లేక ఢీలా పడ్డారు.

TDP Chief Chandrababu Naidu

చంద్రబాబుకు ‘అది’ కూడా మిగలదా?

40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, మూడు సార్లు ముఖ్యమంత్రిగా, అనేక దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసాను.. అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడికి ప్రస్తుతం ప్రజలిచ్చిన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది అధికార పక్షం. అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా త్వరలోనే అది జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా పోతే ఇప్పుడు ఆయనకు ఉన్న కొన్ని సౌకర్యాలు తీసేస్తారు. ఇది 40 ఏళ్ళుగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు తీరని అవమానంగా మిగలుతుంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో కేవలం 23 స్థానాలలో గెలిచింది. గెలిచిన నాటి నుంచి ఈ తొమ్మిది నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాంలు పార్టీ వదలి జగన్ పంచన చేరారు.   శాసనసభ్యత్వాలు మాత్రం వారు అంటిపెట్టుకునే ఉన్నారు. వాస్తవంగా తమ పార్టీలో చేరాలంటే ఎదుటి పక్షం వారు పదవులకు రాజీనామా చేసి రావాలని అలాగైతేనే పార్టీలో చేర్చుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. గత అసెంబ్లీలో తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో కలుపుకున్నాడని, అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ పార్టీని దేవుడు కేవలం 23 మంది మాత్రమే గెలిచేలా చేశాడని చెప్పిన జగన్ ఆ తర్వాత తనకు పెట్టుకున్నాను అని చెప్పిన నిబంధనను సడలించుకున్నారు. దేవుడే రాసాడన్న స్క్రిప్టుకు కొద్దిపాటి మార్పులు చేసి ముగ్గురిని అనధికారికంగా తన పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా దేవుడి స్క్రిప్టును పూర్తిగా మార్చేసేందుకు జగన్ నిశ్చయించుకున్నట్టు స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరేందుకు వేచి ఉన్న కనీసం 10 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పేస్తే చాలని.. ఆయన భావిస్తున్నారు.     ఇందులో భాగంగానే ముందుగా కరణం బలరాంను చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడ్డు చెప్పడం సరి కాదని జగన్ తాజాగా నిర్ణయించారు. తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు గోడ దూకిన తర్వాత వారిని వైసిపిలో విలీనం చేసేసుకోవాలనే పథకాన్ని అమలు చేస్తున్నారు. అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని వైసిపిలో విలీనం చేస్తారు. ఇప్పటికే శాసన మండలి రద్దు చేసి తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టిన జగన్ ఇప్పుడు అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నారు. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వచ్చేసిన తర్వాత ఇక తెలుగుదేశం పని ఖతం అయినట్లే అనే పరిస్థితి రాగానే ఎమ్మెల్యేలకు గేట్లు ఎత్తుతారు. ఆ చివరి స్ర్టోక్ తో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. చంద్రబాబును రాష్ట్రంలో జీరో గా మిగల్చాలనేది అదికార పక్షం వ్యూహం.

Telangana Govt hikes property tax

తెలంగాణాలో ఆస్తి పన్ను... కరెంటు ఛార్జీలూ పెంచుతార‌ట‌!

విద్యుత్‌ పంపిణీ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదంటున్నారు సి.ఎం. కేసీఆర్‌. ఇదే సమయంలో పేదలకు భారం లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతార‌ట‌. 24 గంటలు కోతలు కరెంటు ఇస్తున్నప్పుడు ఛార్జీల పెంపు తప్పదు. పన్నులు చెల్లించే స్తోమత ఉన్న వారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తాం అని చెబుతున్నారు సి.ఎం.సార్‌. లే అవుట్‌ల అనుమతులు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదు. ఇంటి కొలతలు ఆ యజమానులే అందిస్తారు. దీని ప్రకారమే పన్ను విధింపు ఉంటుంది. ఒకవేళ ఇందులో అక్రమాలు జరిగితే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ జరిమానా విధిస్తాం. రూ.లక్ష అక్రమం జరిగితే, రూ.25 లక్షల జరిమానా వేస్తాం. పంచాయతీలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తి పన్ను పెంపు తప్పదని తేల్చి చెప్పారు. ఆరు నూరైనా కొత్తగా తెచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ ఈ చట్టం తెచ్చినట్లు తెలిపారు. ఒకవేళ ఇందులో ఆలసత్వం ప్రదర్శిస్తే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2020-21 ఏడాదిలో 23 కోట్లకుపైగా మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. 45 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.     గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా తప్పకుండా నిధులు విడుదల చేస్తాం. రాష్ట్రంలో 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 20 వరకూ ఉన్నాయి. వీటిలోనూ ఐదేళ్లలో రూ.40 లక్షలు వస్తాయి. గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేకు చెందిన కామిడి నర్సింహారెడ్డి రూ.25 కోట్ల విరాళం ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచుల పదవులు పోతాయి. గెలిచిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలి’’ అని కేసీఆర్ హెచ్చరించారు.

భ్రష్టు పట్టిన వ్యవస్థలో కరోనా మార్పు తెస్తుందా?

కరోనా! నో షేక్ హాండ్! సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది! కరోనా సంగతి తెలీదు గానీ చేతులు శుభ్రంగా కడుక్కోండ్రా అంటే యూనిసెఫ్ చెప్పినా నవ్వి తీసి పారేసాం! ఇపుడు చేతులు సబ్బులరిగేలా సానిటైజర్లు ఐపోయేలా కడగడంతో మిగిలిన రోగాలు ఆమడ దూరానికి వెళ్లి పోయాయి! అల్లం వెల్లుల్లి శొంఠి మిరియాల గొప్పతనం తెలిసొచ్చింది! మన చారు చైనా వాళ్లు తాగుతున్నారు! పురుగుల మందు లాంటి కూల్ డ్రింకుల జోరు తగ్గింది! AC లు మానేయడంతో కరెంటు బిల్లు జేబుకు చిల్లు పడ్డం లేదు! రైళ్లలో బస్సుల్లో అనవసర ప్రయాణాలు తగ్గి పోవడంతో అవసరమైన వాల్లకి సీట్లు దొరుకుతున్నాయి! ఇంటి పట్టునే ఉండండం తో ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డం పెరిగింది బంధాలు బల పడుతున్నాయి! తాగే నీళ్ల నుండి వేసుకునే జోళ్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం! ఏమౌతుందిలే అన్న తెంపరితనం కనుమరుగైంది! అనవసర తిరుగుళ్లు లేవ్! దుబారా ఖర్చుల్లేవ్! హోళీ రోజు పసుపూ కుంకుమతో సున్నితంగా కానిచ్చారు! హమ్మో లేదంటే గ్రీజు ఆయిలూ కోడిగుడ్లూ నానా ఛండాల మయ్యేది! మ‌న‌మే కాదు ప్ర‌పంచం మొత్తంలో మార్పు క‌నిపిస్తోంది. రోమ్ లో చర్చిలు మూసేసారు, ఇరాన్ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు లేవు, ఆంక్షలు, ఇండియాలో దేవాలయాల్లోకి 28రోజుల నిబంధన కొందరికి పెట్టారు. దేవుని ప్రార్థనలకు కూడా అందరినీ ఒకచోట గుమికూడవద్దు అంటున్నారు.     కరోనా తరువాత... ముందు ప్రతీరోజు కుల, రాజకీయ, మత ద్వేషప్రచారం, తద్వారా వచ్చే ఆందోళననుంచి, గాభరానుంచి మీ మనసుకి ప్రశాంతత, ఆరోగ్యానికి స్వస్థత చేకూరుతుంది. ప్రార్ధనలతో అన్ని రోగాలు పోతాయనేవారు వూహన్ ఎందుకువెళ్లి ప్రజలను ఎందుకు కాపాడటంలేదు? అందరూ ఏకమై ముందు పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణ రక్షణ చేస్తే, కరోనా కన్నా భయంకరమైనవి మున్ముందు రాకుండా పర్యావరణము మిమ్మల్ని కాపాడుతుంది.

క‌రెంట్ బిల్ దోపిడీ! చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్న విద్యుత్ శాఖ‌

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది. లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. AE, DE & SE levelలో వొస్తున్న అదేశాలనుసరంగా బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారు. ఈ మోసం ప్రతి నెల జరుగుతుంది. జ‌నం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నారు. ప్రజా సంఘాల నాయకులు దీనిపై ఆలోచించడం లేదు.

పక్కాగా జనగణన! దేశ‌వ్యాప్తంగా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు

భారతదేశ జనగణన 2021కు సంబంధించి జనగణన అధికారులకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) నవీకరణపై శిక్షణ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించటానికి జనాభా లెక్కలే కీలకమని, జనగణన 2021ని సమర్థంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. జనాభా లెక్కల ఆధారంగానే స్టాట్యుటరీ, నాన్‌ స్టాట్యుటరీ పనుల ప్రణాళికలు రూపొందిస్తారు. జనాభా వృద్ధి జనాభా లెక్కల ద్వారా తెలుస్తుందని, పట్టణం, గ్రామం, వార్డు స్థాయి వరకు సమాచారం సేకరించే అతిపెద్ద కార్యక్రమం.   జనాభా గణన 2021 మొదటి దశ ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరుగుతుంది. ఇళ్ల జాబితా సేకరణ సమయంలో ఎన్‌పీఆర్‌ డేటా బేస్‌ నవీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలను స్నేహపూర్వకంగా అడుగుతారు. ప్రజలు అందించిన వివరాలను నిర్ధరించడానికి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలను అడ‌గ‌రు. ఈ మేరకు భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయాయి.  

కర్నూలు కోల్డ్ వార్... 

స్థానిక సమరంలో తారాస్థాయికి చేరుకున్న ఇంటిపోరు  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,జగన్ బంధువు ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ఇన్ సైడ్ వార్  రాజీనామా అస్త్రంతో అధిష్టానం పై తిరుగుబాటు చేసే యోచనలో హఫీజ్ ఖాన్ హఫీజ్ కి చెక్ పెట్టి నియోజికవర్గం లో పట్టు సాధించాలి అని ఎస్వీ విశ్వప్రయత్నాలు  మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు తయారైంది కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరిస్థితి.ఒక పక్క ఎన్ఆర్సి,ఎన్పిఆర్,సిఏఏ ల పై జగన్ వైఖరితో మైనార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్న హఫీజ్ ఖాన్ ని కష్టాలు వెంటాడుతున్నాయి.ఎన్నికల ముందు కండువా కప్పించుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి నిద్రపట్టకుండా చేస్తున్నారు.పేరుకే ఎమ్మెల్యే నియోజికవర్గం లో ఏ పని జరగాలి అన్నా ఎస్వీ మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందే.మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యే కావడమే నేను చేసుకున్న శాపమా అని ఎమ్మెల్యే కొంతమంది అధికారుల దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.కనీసం ఒక పెన్షన్,రేషన్ కార్డు ఇప్పించుకోలేని పరిస్థితి హఫీజ్ ఖాన్ ది. నియోజకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలన్నా రెడ్డి గారు టిక్ పెట్టాల్సిందే.10 నెలలుగా నరక యాతన పడుతున్నా మీడియా ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చెయ్యడం తప్ప హఫీజ్ ఖాన్ చెయ్యగలిగింది ఏమి లేదు.మైనార్టీ నేతలు ,కార్యకర్తలు తప్ప మిగిలిన క్యాడర్ ఎమ్మెల్యే మొహం చూడాలి అంటేనే భయపడే పరిస్థితి.ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలు హఫీజ్ ఖాన్ కి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి.నేను గెలిస్తే మిమల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని కింది స్థాయి నేతలకు హామీలు ఇచ్చిన హఫీజ్ ఖాన్ కి షాక్ తగిలింది.తాను పంపిన లిస్ట్ లో 90 శాతం పేర్లు మారిపోయి అత్యధిక సీట్లు ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి దక్కడం ,బీ ఫార్మ్ లు కూడా ఆయనే ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ కి నియోజికవర్గం లో మొహం చెల్లడం లేదు.దింతో మైనార్టీ వర్గాల్లో భవిష్యత్తు పార్టీ నాయకుడు అనుకున్న హఫీజ్ ఖాన్ చాప్టర్ కి త్వరలోనే ఎండ్ కార్డు పడటం నియోజికవర్గం పగ్గాలు పూర్తి స్థాయిలో ఎస్వీ కి దక్కడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.