రేవంత్ స్వగృహ ప్రవేశం త్వరలో టీడీపీలోకి ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనానికి తొలి అడుగు పడింది. సుదీర్ఘ విరామమ తర్వాత  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మం నుంచి పూరించిన సమర శంఖారావం రాష్ట్ర రాజకీయాలలో కలవరం సృష్టిస్తోంది. ముఖ్యంగా  రాజకీయ ప్రతికూల పరిస్థితిలో వేర్వేరు పార్టీలలో చేరిన తెలుగు తమ్ముళ్ళు తిరిగి సొంత గూటికి రావాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు  రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తోంది. నిజానికి  తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా ‘అవుటై’ పోలేదు. నాయకులు అటూ ఇటూ వెళ్ళినా పార్టీ క్యాడర్ , ప్రజలు, మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాల ప్రజలు, మరోమారు టీడీపీకి జై కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఖమ్మం సభ సక్సెస్ అదే విషయాన్ని స్పష్టం చేస్తోందని, పరిశీలకులే కాదు. టీడీపీ ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తున్నారు. భారాస మంత్రుల కలవరం గమనిస్తే  చంద్రబాబు పిలుపు ప్రభావం ఏ రేంజ్ లో వుందో అర్థమవుతుందని అంటున్నారు.   ఈ నేపధ్యంలో మరో దారి లేక  తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరిన మాజీ టీడీపీ నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి  కొంచెం ఆలస్యంగానే అయినా  టీడీపీని వదిలి వెళ్ళిన నాయకులు చాలా మంది నాయకులు అద్దె కొంపలో ఇమడ లేక తంటాలు పడుతున్నారు. ఒక విధంగా ఉక్కపోతకు గురవుతున్నారు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మినట్లు అవమానం ఫీల్ అవుతున్నారు. అందుకే    మోత్కుపల్లి నరసింహులు, నాగం జనార్ధన రెడ్డి వంటి మాజీ టీడీపీ సీనియర్ నాయకులు ఎక్కడా స్థిరంగా ఉండలేక పోతున్నారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ  పార్టీలోకి దూకి ప్రజల్లోనూ చులకనవుతున్నారు. ఇలాంటి నాయకులంతా ఇప్పుడు స్వగృహ ప్రవేశానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే, గతంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితునిగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఆయన అనుచరులు కూడా తిరిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం అటు గాంధీ భవన్, ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వినిపిస్తోంది. నిజానికి    రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టింది మొదలు  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చాలా చాలా  ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రజల్లో నాయకుడిగా నిలబడడమే కాకుండా  పార్టీ ఆదిస్థానం వద్ద కూడా మార్కులు కొట్టేశారు. అయితే, పార్టీలో సీనియర్లు అనుకునే పెద్దలు మాత్రం  రేవంత్ ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ సీనియర్ నాయకులే కారణమయ్యారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపొతే  రేవంత్ రెడ్డికి ఉద్వాసన పలక వచ్చనే వ్యూహంతో సీనియర్లు కాంగ్రెస్ అభ్యర్ధిని విజయవంతంగా ఓడించారు.   మరో వంక తాజాగా రేవంత్ రెడ్డి వర్గీయులను వలస వాదులంటూ చులక చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలలో తమకేదో అన్యాయం, అవమానం జరిగిందని  సీనియర్ నాయకులు బజారున పడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువున చీలిపోయే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. ఒక విధంగా చూస్తే  పీసీసీ అధ్యక్షుడికే  గాంధీ భవన్ లో ఉక్క పోసే పరిస్థితి ఏర్పడిందని అంటునారు. ఈ నేపథ్యంలో  రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన మాజీ టీడీపీ నాయకుల అడుగులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు పడుతున్నాయనే మాట రెండు వైపులా నుంచి బలంగా వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ సీనియర్లకు తలంటినట్లు తెలుస్తోంది. అయితే  తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేని విధంగా చిందరవందరగా సాగుతున్న నేపధ్యంలో చివరకు ఏమి జరుగుతుంది అనేది  వేచి చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

టీడీపీ రీఎంట్రీతో తెలంగాణలో మారుతున్న ముఖచిత్రం

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత, రాష్ట్ర రాజకీయాలలో ‘గుణాత్మక’ మార్పులు చోటు చేసుకున్నాయి.  ఉద్యమ పార్టీగా పుట్టిన  తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పైగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సారధ్యం వహిచింది. కానీ, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉద్యమ స్పూర్తిని తెరాస పక్కన పెట్టింది. ఉద్యమ వాసనలను వదిలేసి, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి  తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్  అనే విధంగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో చాలా వరకు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్షం,ప్రజాపక్షం అనేది లేకుండా చేశారు. ఓవంక ఉద్యమ నాయకులను ఒకరి వెంట ఒకరిని బయటకు పంపారు.. మరోవంక ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేశారు. సామ ధాన భేద దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రా పార్టీ ముద్ర  వేసి టీడీపీని నిర్వీర్యం చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.  అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లవుతాయనే నానుడి మరో మారు నిజమైంది. ఎనిమిదేళ్ళలో తెరాస రూపు రేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తెలంగాణ అస్తిత్వ పునాదులపై ఉద్యమ పార్టీగా పుట్టి కుటుంబ పార్టీగా మారిన తెరాస సహజంగానే ఉద్యమ స్పూర్తికి  ప్రజలకు  దూరమైంది. ఉప ఎన్నికల ఓటమితో మొదలైన తిరోగమనం  తెరాస నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేసింది. కుటుంబ పాలనా ముద్రను మురికి మరకను తుడిచేసుకునేందుకు అవతారం మార్చింది. అదే క్రమంలో జాతీయ పార్టీగా అవతరించే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి (భారాస) గా పేరు మార్చుకుంది. అదలా ఉంటే, తెరాస పేరు భారాసగా మారిన  నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాలలో మరో మారు, రాజకీయ పునరేకీకరణ ప్రక్రియ మొదలైంది.ఇంతవరకు సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సాగించిన రాజకీయాలకు తెర పడింది. ఈ నేపధ్యంలో  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలిసిన  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమయం చూసి ఖమ్మం నుంచి తెలంగాణ శంఖారావం పూరించారు. ఇంత కాలం తాతకు దగ్గులు నేర్పుతున్నామనే భ్రమల్లో ఉన్న కేసేఆర్ అండ్ కో చంద్రబాబు శంఖారావంతో ఒక్క సారిగా ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని  ప్రాతీయ  ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందిన తెరాస పేరును భారాసగా మార్చుకుని దేశంలో జెండా ఎగరేస్తానంటూనే  తెలంగాణలోకి మాత్రం తెలుగుదేశం పార్టీ రాకుడదాని అంటున్నారు. అయితే, ప్రజలు మాత్రం పోటీ పడి మరీ టీడీపీకు పునః స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ రీఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పునరేకీకరణ,రాష్ట్ర రాజకీయ  ముఖచిత్రంలో అనూహ్య మార్పులు తప్పవని అంటున్నారు.

యూటీలుగా హైదరాబాద్, విశాఖ? తెలుగు రాష్ట్రాలను కేంద్రం ఏం చేయాలనుకుంటోంది?

తెలుగు రాష్ట్రాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుందా? ఇరు రాష్ట్రాలకూ రెవెన్యూ లేకుండా చేసి తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఆ గడువు తీరిపోగానే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం యోచిస్తున్నదన్న సమాచారంతో పాటు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక రెవెన్యూ వచ్చే విశాఖ నగరాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందని తెలుస్తోంది.  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా ఆ రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి కొట్టి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయేలా చేసి ఆధిపత్యాన్ని చెలాయించాలన్నదే కేంద్రం వ్యూహంగా చెబుతున్నారు.  తొలుత  తెలంగాణ రాజధాని. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.  ప్రస్తుతానికి అయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని. 2024 జూన్ వరకూ హైదరాబాద్ హోదా అదే.  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీని కోసం గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పటి కేంద్ర సర్కార్ అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 వరకు ఇది వర్తిస్తుంది.  ఉభయ తెలుగు రాష్ట్రాలకూ రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్న  నేపథ్యంలోనే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.     గతంలో అంటే ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యతిరేకించారు.   దరిమిలా   హైదరాబాద్ ను  పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాలఉమ్మడి రాజధానిగా  ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతున్నాయి. ఆ తరువాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నా.. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వినియోగించుకోవాలన్న ఆలోచన చేయలేదు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఏపీ హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే.  అయితే  హైదరాబాద్ విషయంలో కేంద్రం ఆలోచన వేరుగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళంలో పడేయటం లక్ష్యంగా  కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అన్న అంశం మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.  ఇప్పటికే తెలంగాణకు అప్పుల విషయంలో అవరోధాలు సృష్టిస్తున్న కేంద్రం.. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మెలిక పెట్టే అవకాశాలు లేకపోలేదు.  హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వచ్చినా హస్తినను ఉదాహరణగా చూపి వ్యతిరేక గళాలు లేవకుండా నిరోధించొచ్చని కేంద్రం భావిస్తోంది. ఇక ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గతంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు.. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు ఓకే అన్నారు. ఇప్పుడు కేంద్రం దానినే సాకుగా చూపి ఈ ప్రతిపాదనతో వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయంటున్నారు.   ఇక విశాఖ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ చాలా చాలా కోల్పోయింది. హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయింది. భద్రాచలం రామాలయాన్ని కోల్పోయింది. ఆదాయాన్ని కోల్పోయింది. ఉపాధి అవకాశాలను కోల్పోయింది. విద్యాసంస్థలను కోల్పోయింది. పరిశ్రమలను కోల్పోయింది ఒకటేమిటి.. ఎన్నో ఎన్నెన్నో కోల్పోయింది. ముఖ్యంగా రెవెన్యూ లోటుతో భవిష్యత్ ఎలాగా అన్న భయాన్ని, ఆందోళన మాత్రమే విభజన కారణంగా ఏపీకి దక్కింది. ఇన్నీ కోల్పోయినా ఆంధ్రులు మన విశాఖ ఉందిగా అనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన విశాఖ సుందర నగరమే కాదు, పర్యాటక, వాణిజ్య పరంగా ప్రత్యేకత సంతరించుకున్న నగరం కూడా. ఈ నగరం ఒక టూరిస్ట్ స్పాట్. ఉపాది, విద్యావకాశాలకు కేంద్రం. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, దేశ, విదేశీ టూరిస్టులు కూడా వేల సంఖ్యలో సందర్శించే నగరం విశాఖ. సాగర తీరం, ఉద్యానవనాలు, కొండలు, నైట్ లైఫ్, ఫుడ్ డెస్టినేషన్స్ ఇలా ఇక్కడ పర్యాటకులకు అవసరమైనవన్నీ ఒకే చోట కుప్పపోసినట్లు ఉన్న నగరం. ఇక పారిశ్రామికంగా విశాఖ ఏపీకి బంగారు గుడ్లు పెట్టే బాతు అని చెప్పాలి. అటువంటి విశాఖ నగరం గత మూడున్నరేళ్లుగా ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది. పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. కోర్టులు, పర్యావరణ వేత్తలు, ఎన్జీటీ వంటి ట్రైబ్యునళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా విశాఖ ఘనతను మసకబార్చే పనిలో ముందుకు సాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో ఉన్న విశాఖ విభజన అనంతరం ఏపీకి మిగిలిన ఏకైక  ప్రధాన ఆదాయ వనరు.  , విశాఖలో కేంద్ర సంస్థలు నేవీ, డిఫెన్స్, పోర్టులు ఉన్నాయి. కేంద్ర ఉద్యోగులు ఎక్కువ మంది  రిటైర్మెంట్ తర్వాత కూడా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఇప్పుడా పరిస్థితి వేగంగా కనుమరుగైపోతోంది.  భూ కబ్జాలు, పారిశ్రామిక వేత్తలకు వేధింపులు.. ఇలా విశాఖ తన ప్రశాంతతను కోల్పోతోంది. విశాఖ రాజధాని అని వైసీపీ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచీ ఇక్కడ పొలిటికల్ రౌడీ ఇజం పెరిగిపోయింది. సామాన్య జనమే కాదు.. పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడ నుంచి బిచాణా ఎత్తేయడమే మేలా అన్న మీమాంశలో పడ్డారు. ఇక ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న ఉక్కు ప్రైవేటు పరం చేస్తున్నా జగన్ సర్కార్ లో ఉలుకు, పలుకూ లేదు. విశాఖ జోన్ కు మంగళం పాడేసినా చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు.  జగన్ సర్కార్ అశక్తతని, నిష్క్రియా పరత్వాన్నీ ఆసరాగా తీసుకుని విశాఖను కూడా ఏపీకి దక్కకుండా చేయడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. నిన్న మొన్నటి దాకా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అంటూ వచ్చిన కేంద్రం కన్ను ఇప్పుడు విశాఖపై పడింది. విశాఖను కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చి చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలకు కేంద్రంలోని మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ మేరకు హస్తిన స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చి విశాఖను పరిశీలించి వెళ్లినట్లు చెబుతున్నారు. ఏపీకి ఉన్న ఏకైక ప్రధాన వనరు విశాఖ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న కేంద్రం యోచన వెనుక ఆ నగర ప్రాశస్థ్యాన్ని, ఘనతను, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ తీరే కారణమని అంటున్నారు.  ఇప్పటికే జగన్ నిర్వాకం వల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  రాజధాని  నగరానికి  ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో  ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన మాట తప్పారు. మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి  అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంతే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విభజిత రాష్ట్రానికి హైదరాబాద్ స్థాయిలో ఆదాయ వనరుగా ఎదుగుతుందని అంతా భావించిన అమరావతి పురోగతి నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న ఏపీ హైకోర్టు విస్పష్ట తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ తీరు మారలేదు. కోర్టు తీర్పుతో అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు   ప్రకటించినా తమ విధానం మూడు రాజధానులే అంటూ వస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి అభివృద్దికి ముందుకు అడుగులు వేయలేదు. అలా బంగారు గనిలా మారుతుందనుకున్న అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి విశాఖ నగరాన్ని కూడా రాష్ట్రానికి దక్కకుండా చేస్తోంది. మొత్తం మీద విభజనకు ముందు ఏదోలా రాష్ట్రం సాధించుకుంటే చాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ యూటీగా అభ్యంతరం లేదని చెప్పడాన్ని సాకుగా చూపి హైదరాబాద్ ను, అనుభవ రాహిత్యం, పాలనా వైఫల్యాలతో జగన్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన విశాఖ ప్రాభవాన్ని, ప్రాశస్థ్యాన్నీ దిగజారుస్తుండగాన్ని నెపంగా చూపి విశాఖపట్నాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

నీ హక్కులు నీవే రక్షించుకో

 గడప దాటి అడుగు బయట పెట్టింది మొదలు, మనం మోస పోతూనే ఉన్నాం. మనకు అడుగడుగునా మోసాలు ఎదురవుతూనే ఉంటాయి. మనం కొనే... కాస్ట్లీ వస్తువులే కాదు, ఉప్పు, పప్పు మొదలు ప్రతి కొనిగోలులో మోసం ఎదురవుతుంది. ధర విషయంగానో, నాణ్యత పరంగానో, తూకం కొలతల విషయంలోనో, కల్తీల విషయంగానో మరో విధంగానో మనం మోస పోతూనే ఉన్నాం. ఒక్క వస్తువుల కొనుగోలు విషయంలోనే కాదు, వైద్య, బీమా సేవలు మొదలు ప్రభుత్వ సేవల వరకు,  సేవల విషయంలోనూ, అనేక విధాల మనం మోస పోతున్నాం. మోసాలకు గురవుతున్నాము. మార్కెట్ మోసాల కారణంగా వినియోగ దారులు కేవలం ఆర్థికంగానే కాదు, ఆరోగ్య పరంగానూ నష్టపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలే  కోల్పోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కల్తీ మందులు, కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ పానీయాలు ప్రాణాలు తీసిన సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇక  మద్యం కల్తీ గురించి అయితే చెప్పనే అక్కర లేదు. ఇక కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు, విత్తనాలు,పురుగుల మందులు, ఎరువుల బ్లాక్ మార్కెట్, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అలాగే, బీమా సంస్థలు కూడా మోసాలకు పాల్పడుతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా, మార్కెట్ మోసాలు మహమ్మారిని మించిన విషాదాలను సృష్టించాయి.సృష్టిస్తున్నాయి.  ఈ మోసాలని కట్టడి చేసేందుకు, వినియోగ దారుల హక్కులను రక్షించేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమాలు నడిచాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం మార్చి 15 తేదీన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినం, జాతీయ స్థాయిలో డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపు కుంటున్నాం.   వినియోగదారులకు హక్కులున్నాయి. ఆ హక్కులను పరిరక్షించే చట్టాలున్నాయి. నిజానికి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకి జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్  వంటి వ్యవస్థలున్నాయి. మోసాలకు పాల్పడిన వ్యాపార, వాణిజ్య,ఉత్పాదక సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని సందర్భాలలో కాకున్నా, కొన్ని సందర్భాలో అయినా కఠినంగా శిక్షిస్తున్నాయి. అయినా, మార్కెట్ శక్తుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు, ఇంకా ఇతర కారణాలున్నా,వినియోగదారులకు తమకున్న హక్కులు, చట్టాల గురించి  అవగాహన లేక పోవడం ఒక ప్రధాన కారణం. అందుకే, వినియోగాడులకు తమకున్న హక్కుల గురించి అవగాహన కల్పించేందుకే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కుల దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతోంది. అంతర్జాతీయ, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వేర్వేరు తేదీలో జరుగుపుకుంటున్నా లక్ష్యం మాత్రం ఒక్కటే. వినియోగదారులకు హక్కులు, బాధ్యతలను గుర్తు చేయడం, ఉద్యమాన్ని ఐక్యంగా మరింత ముందుకు తీసుకు వెళ్ళడం ఇవే వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రధాన లక్ష్యాలు. మన దేశంలో 1986 డిసెంబర్ 24న, వినియోగదారుల హక్కుల చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ రోజు నుంచి వినియోగదారుల హక్కుల చట్టం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం, అదే రోజున దేశ వ్యాప్తంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయిత, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక  థీమ్  తీసుకుని డిసెంబర్ 24 న, జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. దేశంలో అవినీతి, అక్రమ వ్యాపారాలను అరికట్టేదుకు, ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న సంస్కరణల నేపధ్యంలో, దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో, ఈ సంవత్సరం, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’  అంశాన్ని ప్రధాన థీమ్ గా  తీసుకుని, ఈ డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాం. నిజానికి, సుస్థిర స్వచ్ఛ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణ కారణంగా   ఆర్థిక వ్యవస్థలో,వ్యాపార కార్యకలాపాలలో,వ్యాపార,సేవా కార్యకలాపాల స్వరూప, స్వభావాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగానూ ‘ఆన్లైన్’ కార్యకలాపాలకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో ‘ఆన్లైన్’ మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులకు అనుగుణంగా  కేంద్ర ప్రభుత్వం, 1986 నుంచి అములులో ఉన్న నియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని, డిజిటల్ యుగానికి తగిన విధంగా సవరించింది. గతంలో, 1991, 1993లోనూ చట్ట సవరణలు జరిగినా, 2020 జూలై 20 నుంచి అమలులోకి వచ్చిన, 2019 వినియోగదారుల చట్టం, వినియోగదారుల హక్కుల పరిధిని విస్తృత పరిచింది. ఒక విధంగా నూతన చట్టం డిజిటల్ చట్టం..పాత మోసాలకు పగ్గాలు బిగిస్తూనే, డిజిటల్ మోసాలకు కళ్ళెం బిగించేందుకు ఉద్దేశించిన చట్టంగా పేర్కొనవచ్చును.    అందుకే, 2019 వినియోగదారుల హక్కుల చట్టాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’ అంశాన్ని ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల హక్కుల రక్షణ దినోత్సవం, థీమ్’గా తీసుకోవడం జరిగింది. నిజానికి  కేంద్ర కన్స్యూమర్ అఫైర్స్ డిపార్టుమెంట్ కొవిడ్  కాలంలోనూ 2019 చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూనే వుంది. అందులో భాగంగానే, గత సంవత్సరం 2021లో, వర్చువల్ గా నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, ‘వినియోగాదరుడా .. తెలుసుకో నీ హక్కులు అన్న థీమ్  తీసుకుని ప్రచారం కల్పించడం జరిగింది. కొత్తగా 1986 హక్కుల చట్టానికి తెచ్చిన సవరణలలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏర్పాటు ప్రధామైనది. అలాగే,   కాంట్రాక్టుల్లో అక్రమాలను అరికట్టేందుకు పొంచుపరిచిన నిబంధనన అసంబద్ధ నిబంధనలకు అడ్డు కట్టవేస్తుంది.కొత్త చతంలో   నినియోగాదరుల ఫోరంను వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గా మార్చారు. అలాగే. ఇంతకు  ముందు చట్టం పరిధిలో లేని, ఆన్లైన్ ప్రకటనల మోసాలను చట్టం పరిధిలోకి తీసుకు వచ్చారు. వినియోగదారులను పక్కదారి పట్టించే ఆన్లైన్ ప్రకటనలపైన 2019 చట్టం కొరడా ఝుళిపించింది. అంతే కాదు, సవరణ చట్టం, పక్కదారి పట్టించే వాణిజ్య ప్రకటనలకు చక్కని నిర్వచనం కూడా ఇచ్చింది. వస్తు సేవల తప్పుడు వర్ణన, ఒక ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి తప్పుడు హామీ, తప్పుడు గ్యారెంటీ ఇవ్వడం. వస్తు సేవల మౌలిక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి గోప్యంగా ఉంచడం, ఇలా, వినియోగదారుని తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు చట్ట పరిధిలో శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు. వాణిజ్య ప్రకటనల మోసాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ( సిసిపిఎ) చర్యలు తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్‌, టెలీషాపింగ్‌, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్‌ వివాదాలు సిసిపిఎ పరిధిలోకి వస్తాయి. అందులో భాగంగా, వాణిజ్య ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు, రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష విదేంచే అధికారం సిసిపిఎకు ఉంటుంది.  నిజానికి, గతంలో గానీ ప్రస్తుతంలో గానీ, వినియోగదారుల హక్కుల రక్షణకు చట్టాలు లేక పోవడం కంటే, ఉన్న చట్టాల గురించి వినియోగదారులకుసరైన అవగాహన లేక పోవడం వల్లనే వినియోగదారులు మరింతగా దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా చట్టాలు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతలు గురించి  తెలియక పోవడం, తెలిసినా చిన్న మొత్తాల కోసం, సమయం ‘వృధా’ చేసుకోవడం ఎందుకని, ఎవరికి వారు, చట్టం తలుపులు తట్టక పోవడం వలన, మార్కెట్ శక్తులు వినియోగదారులను తేలిగ్గా చీట్ చేస్తున్నాయని  వినియోగదారుల హక్కుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.  ఉదాహరణకు, డి మార్ట్ క్యారీ బ్యాగుల కేసునే తీసుకుంటే, డి మార్ట్   ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్‌) ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌- సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించింది.అయితే, ఒక్క డి మార్ట్ అనే కాదు, ప్రతి షాపింగ్ మాల్. క్యారీ బ్యాగ్ కు ఛార్జ్’చేస్తూనే ఉన్నాయి. ఎవరికివారు ముష్టి మూడు రూపాయలే కదా అని ఉపేక్షించడం వల్లనే, షాపింగ్ మాల్స్ కోట్లలో దోపిడీకి పాల్పడుతున్నాయని వినియోగ దారుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.  అందుకే, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో మొదటి అడుగు, వినియోగదారులదే కావాలని, వినియోగదారులు కళ్ళు తెరిస్తేనే హక్కుల రక్షణ సాధ్యమవుతుందని అంటున్నారు. నీహక్కులకు నేవే రక్ష ..నీ హక్కులు నీవే రక్షించుకో అంటున్నారు.

రేవంత్ సైకిలెక్కేస్తారా?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మళ్లీ సెకిలెక్కేయనున్నారా? తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం చేయడానికి తన శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారా? ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయా? అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ సమయంలో కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు వ  పరిణామాలు కారణం. ఒకటి  ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట నిర్వహించిన సభలో  పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా తిరిగి రావొచ్చునంటూ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. రెండోది తెలంగాణ కాంగ్రెస్ లో    సీనియర్లు.. జూనియర్ల రచ్చ.  కాంగ్రెస్ లో ఈ రచ్చకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డే. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీని వీడి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే దాకా.. అడపాదడపా అసమ్మతి గళం విప్పినా ఓపికగా వేచి చూశారనే చెప్పాలి. అయితే మునుగోడు ఫలితం తరువాత సీనియర్ల అసమ్మతి గళం పెరిగింది. పీసీసీ కమిటీల నియామకంతో అది పతాక స్థాయికి చేరింది.   దీంతో ట్రబుల్ షూటర్ గా దిగ్విజయ్ సింగ్.. హుటాహుటిన హైదరాబాద్ రావడం.. ఆయనకు అంతే వేగంగా.. రేవంత్‌పై సీనియర్లు ఫిర్యాదులు చేయడం చకా చక జరిగిపోయాయి.    ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి లాంటి వారు పీసీసీ కమిటీల్లో  తమ పదవులకు రాజీనామా చేసేశారు. అంతకు ముందే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ కు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ  మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా కాషాయం గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు. నిజమే రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడన్న సంగతి విదితమే. అయితే ఓటుకు నోటు కేసు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తెలంగాణలో   తెలుగుదేశం క్రీయాశీలంగా లేదన్న భావనతో కాంగ్రెస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు రేవంత్ అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి ఆయన అనుమతి తీసుకున్నారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది. సరే మొత్తం మీద సైకిల్ దిగి ‘చేయి’ అందుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో రెడ్ కార్పెట్ వెల్ కమ్ లభించింది. ఇలా పార్టీలో చేరారో లేదో అలా టీపీసీసీ పగ్గాలు అందుకున్నారు.   కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతుకుముందు.. రేవంత్ రెడ్డి స్వయంగా అమరావతికి వెళ్లి... నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారన్న విషయం విదితమే. అలాగే రేవంత్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు బలంగా మారారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తరువాతే అప్పటి దాకా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.   అయితే కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చెల్లు చీటీ రాసే విషయంలో మాత్రం రేవంత్ సక్సెస్ కాలేకపోయారు.  పైపెచ్చు సీనియర్లు తన పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించడంతో రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెరాస భారాసగా రూపాంతరం చెందిన తరువాత ఆ పార్టీ ఇక సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఉపయోగించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిరోధించే అవకాశాలు లేవు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు ఖమ్మం సభ నభూతో అన్న చందంగా సక్సెస్ అయ్యింది.  ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మళ్లీ సైకిలెక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భేటీ... ఆంతర్యమేమిటి?.. సంకేతాలేమిటి?

బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఇద్దరూ రాజకీయ, సినీ  రంగాలలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న వారే. బాలకృష్ణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే కాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఇరువురూ రాజకీయ, సినీ రంగాలలో బిజీగా ఉన్నవారే. బాలకృష్ణ సినిమాలూ, ఆన్ స్టాపబుల్ అనేషో, రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలు, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటువంటి వీరిరువురూ భేటీ అయ్యారంటే.. అది సంచలనమే. సర్వత్రా ఆసక్తి కలిగించే విషయమే. అదే జరిగింది. బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకు పవన్ కల్యాణ్ వచ్చారు. బాలకృష్ణతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  బాలకృష్ణ ఓ పక్క అన్ స్టాపబుల్ షోతో, సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో రాబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో, పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ కలవడం అనేది చాలా రేర్.   అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వస్తారని వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది. అయితే  అందులో నిజమెంతో తెలియదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్యలు భేటీ అయ్యారు. వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. వీరి భేటీ వెనుక కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది.  వీరసింహారెడ్డి షూట్ లో పవన్ కళ్యాణ్ బాలయ్యని, చిత్ర యూనిట్ ని కలిసి కాసేపు మాట్లాడారు.   ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాలోని సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో పవన్ వెళ్లారు. బాలయ్య, పవన్ ల భేటీ కి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  మామూలుగా సినిమా సెట్ లో వీరు భేటీ అవ్వడమే ఇంత సెన్సేషన్ సృష్టించిందంటే.. నిజంగానే బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో  పవన్ కల్యాణ్ కనిపిస్తే మరెంత సెన్సేషన్ అవుతుందోనన్న చర్చ అటు రాజకీయ వర్గాలు, ఇటు సినిమా వర్గాలలోనూ జోరందుకుంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనవ్వను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకారణాలపై చర్చకు తెరలేపిన సంగతి విదితమే. ఇప్పుడు బాలయ్య తో పవన్ బేటీ ఏపీ రాజకీయాలలో రానున్న మార్పులకు సంకేతమా అన్న చర్చ జోరందుకుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్, బాలకృష్ణలు సినీ హీరోలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత కాగా, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే. అంతే కాకుండా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి స్వయానా వియ్యంకుడు. ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మామ, మేనమామ కూడా. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, బాలకృష్ణల భేటీ రాజకీయాలలో కొత్త సమీకరణాల చర్చను తెరపైకి తీసుకు వచ్చింది. 

బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆధిక్యం

బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మీర్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఆరంభంలోనే ఒవర్ నైట్ బ్యాట్స్ మెన్ రాహుల్, శుభ్ మన్ గిల్ ల వికెట్లు కోల్పోయింది.  ఆ తరువాత స్వల్ప వ్యవధిలోనే పుజారా (24), కోహ్లీ (24) కూడా పెవిలియన్ బాట పట్టడంతో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా పీకలోతు కష్టాల్లో పడింది. అయితే రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొని టీమ్ ఇండియాను ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇరువురూ హాఫ్ సెంచరీలు సాధించారు. ముఖ్యంగా రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో మోదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పంత్ ఔటౌన తరువాత  టీమ్ ఇండియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. శ్రేయస్ అయ్యర్ 84 పరుగులు చేసి ఔటయ్యారు. మిగిలిన వారంతా ఇలా వెళ్లి అలా వచ్చేశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 314 పరుగుల వద్ద ముగిసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగుల ఆధిక్యత సాధించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్,  మెహందీ హసన్ మిరాజ్ లు చెరో నాలుగు వికెట్లూ పడగొట్టారు. 

మిలిటరీ ట్రక్కు లోయలో పడి 16 మంది దుర్మరణం

ఉత్తర సిక్కింలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన బెంగాల్ లోని ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. చైనా సరిహద్దులోని జెమా ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్నవాహనం లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో వాహనంలో 20 మంది ఉన్నారు.  సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డిగ్గీ రాజా వచ్చిన పని పూర్తయ్యిందా?

డిగ్గీ రాజా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు బయటకు దారి చూపారా? పార్టీ శ్రేణుల్లో జరుగుతున్నచర్చను బట్టి ఔననే అన్నారు. గత మెంతో ఘన కీర్తి గలవారమని విర్రవీగుతూ ఇప్పడు పార్టీకి గుదిబండగా మారుతామంటూ చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఒకింత  కఠినంగానే సీనియర్లకు చెప్పేశారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.   రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించడానికి అధిష్ఠానం దూతగా వచ్చిన దిగ్విజయ్.. పార్టీ నేతలతో విడివిడిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎటువంటి మొహమాటాలకూ తావులేకుండా పార్టీలో సీనియర్లు, జూనియర్లూ అన్నతేడాలేవీ ఉండవని కుండ బద్దలు కొట్టేశారు. ఎవరు పార్టీ కోసం.. పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తారో వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తమ గత ఘనతల భుజకీర్తులతో పని చేయకుండా అందలాలు అందుకుందామనుకునే వారికి స్థానం లేదని చెప్పకనే చెప్పేశారు. ఒక రకంగా తమ సీనియారిటీకి తగిన గుర్తింపు లేకుండా పోయిందని మధన పడుతూ అసమ్మతి రాగాలు ఆలపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ ఒక రకంగా మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డికి కట్టబెట్టినప్పటి నుంచీ ఆయనకు సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురౌతూనే వస్తోంది. తొలి రోజులలో అందరినీ కలుపుకు పోవడానికి తన వంతు ప్రయత్నాలు చేసిన రేవంత్ తర్వాత తర్వాత తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పరుచుకుని తన పని తాను చేసుకుంటూ పోవడం ప్రారంభించారు. సీనియర్లను, వారి విమర్శలను, వారి ధిక్కారాన్ని, అసంతృప్తిని, అసమ్మతిని పెద్దగా ఖాతరు చేయడం మానేశారు. దీంతో మరింత గా  రగిలిపోతున్న సీనియర్లకు   తాజా పీసీసీ కమిటీల నియామకం.. తమ అసమ్మతిని బహిరంగం చేయడానికి ఒక అస్త్రంగా దొరికింది. తమకు గుర్తింపు లేకుండా పోయిందంటూ సీనియర్లు రేవంత్ పై విమర్శల దాడి పెంచడంతో రేవంత్ వర్గీయులు కూడా ప్రతి విమర్శలు చేయడమే కాకుండా పీసీసీ కమిటీలలో తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడినట్లైంది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభ నివారణ కోసం ట్రబుల్ షూటర్ గా అధిష్ఠానం ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రావడంతోనే పనిలోకి దిగిపోయిన ఆయన సీనియర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న కాన్సెప్ట్ లేదనీ, అందరూ సమానమేననీ కుండ బద్దలు కొట్టేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా పని చేసిన డిగ్గి రాజాకు రాష్ట్ర కాంగ్రెస్ నేతల అందరి వ్యవహారాలు పూర్తిగా తెలుసు. గతంలో ఆయనతో విభేదించిన వారిలో పలువురు ఇప్పుడు సీనియర్లుగా అసమ్మతి రాగం ఆలపిస్తున్న వారిలో ఉన్నారు. అందుకే డిగ్గీ రాజా రాష్ట్ర పార్టీలో సంక్షోభ నివారకుడిగా వస్తున్నారనగానే వారిలో చాలా మంది బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.   సంక్షోభ నివారణకు ప్రయత్నాలు అంటూ ఆయన సీనియర్లకు పార్టీ హైకమాండ్ కు అన్నీ తెలుసునని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే వారికే పదవులూ, గుర్తింపు అని తేల్చేశారు. ఒక విధంగా  ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితే కొనసాగుతుందని  చెప్పకనే చెప్పేసి బంతిని సీనియర్ల కోర్టులో వేశారు. ఇక తేల్చుకోవలసింది సీనియర్లే అని తన చేతులు దులిపేసుకున్నారు.   దిగ్విజయ్ సింగ్ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితోనూ ముఖాముఖి సమావేవం అయ్యారు. వాళ్లు చెప్పినదంతా విన్నారు. చివరకు తన మాట ఏమిటో చెప్పేసి ఇక నిర్ణయించుకోవలసింది మీరే అన్నారు. దీంతో సీనియర్ల భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

రౌండప్ 2022 ఈ ఏడాది ఏం జరిగింది?

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. జనవరి 1   2022 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో  కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.   జనవరి 4   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్  ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల  విలువైన 22  అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో  ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త  పరిచారు.  జనవరి 5  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా  ప్రధాన మంత్రి పంజాబ్  పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  జనవరి 15 సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా  నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ   ట్వీట్‌ చేశారు. జనవరి 20  బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు.  జనవరి 23  నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి.  దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.  జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా  రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు. జనవరి 31  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి  జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు.  ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్  లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు.  అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.   ఫిబ్రవరి 6:   ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక  నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు  నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు  పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు.  వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. మార్చి తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి,  ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ  తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.  మార్చి 10  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.   యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది.  పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు.  మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ  పదవీ కాలం  ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది. ఏప్రిల్ ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్,  హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో  చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని  తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది. ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్  డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో  పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ  కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు.  తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి  జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు.  ఏప్రిల్ 11  తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు  సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని  సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.   ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు.  ఏప్రిల్ 14  ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన  ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు.  ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు. ఏప్రిల్ 24  ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో  పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు.  ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు. మే నెల వివరాలు రేపు 

కరోనా వేళ.. వివాదంలో హెల్త్ డైరెక్టర్

ప్రభుత్వ అధికారులకు కులం ఉంటుంది. మతం ఉంటుంది. వద్దనుకుంటే అది వేరే విషయం. కానీ, వద్దనుకున్నా,  ప్రతి ఉద్యోగి, అధికారి కులం, మతంకు సంబందించిన వివరాలన్నీ ప్రభుత్వ రికార్డులలో భద్రంగా ఉంటాయి. అయితే  అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో కుల, మత విశ్వాసాల ప్రస్తావన చేయడం, కుల, మత వివక్ష చూపడం గానీ చేస్తీ అది  నేరం అవుతుంది. మత ప్రచారం చేయడం మరింత పెద్ద నేరం, అపరాధం అవుతుంది.  అందుకే తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. అంతేకాదు, క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తీ గత విశ్వాసం కావచ్చును. కానీ  ఆయన ఒక ప్రభుత్వ అధికారి, ఆవిషయం మరిచి పోయి చేసిన వ్యాఖ్య సహజంగానే దుమారం రేపుతోంది.    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజానికి ఆయన ఒక్క కరోనా గురించి మాత్రమే మాట్లాడి వదిలేయలేదు. ప్రపంచానికి, అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమని మరో వివాదస్పద వ్యాఖ్య చేసారు. అలాగే, ప్రపంచం  అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమన్నారు. అలాగే, క్రైస్తవ మత ప్రచారానికి కూడా ఆయన పిలుపు నిచ్చారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని..దాని కోసం అందరూ క్రైస్తవ మతాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. నిజమే, శ్రీనివాస రావు తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అది కూడా వ్యక్తిగత హోదాలో హాజరైన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పోస్టులో ఉన్న ఆయన, తమ విధుల్లో భాగమైన కరోనా మహమ్మారిని  ఏసు ప్రభువు దయతోనే నిరోధించామని చెప్పడం  విమర్శలకు దారి తీసింది. నిజానికి శ్రీనివాసరావు మత విశ్వాసాల గురించి పెద్దగా తెలియక పోయినా ఆయనకి రాజకీయ ఆశలు, ఆకాంక్షల గురించి మాత్రం వేరే చెప్పనక్కర లేదు. గతంలోనూ ఆయన పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసేఅర్ కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా వార్తల్లోకి ఎక్కారు. అదొక వివాదం అయితే ఇప్పడు మరో వివాదానికి ఆయన తెర తీశారు. రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. సోషల్ మీడియాలో అయితే  శ్రీనివాస రావును చెరిగి పారేస్తున్నారు.  అంతేకాదు  తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు, వెంకన్న దేవుని పేరు (శ్రీనివాస రావు) పెట్టుకుని క్రైస్తవం పుచ్చుకున్న ఆయనపై, ఇంతకూ ముందు ఏమో కానీ, ఇప్పుడైతే  అవినీతి ఆరోపణలు కుడా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  శ్రీనవాసరావు పెద్ద అవినీతి పరుడు అని విమర్శించారు..ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడారట. మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో ..  అన్నారు. ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా అని ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్ లో కూడా  శ్రీనివాస్ రావు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారని బండి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.   అదొకటి అలా ఉంటే, తెలంగాణలో ని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం జరిపించే పలకలపై, క్రిస్మస్ ట్రీ బొమ్మలు వెలిశాయనే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే ప్రముఖ సినిమా నటులు,సెలబ్రిటీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రిస్మస్ వేడుకలుజరుపు కోవడం, సోషల్  మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం కూడా సమాజంలో మాట విద్వేషాలకు కారణం అవుతోందా ఆనం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కారు స్పీడ్ కు సైకిల్ బ్రేకేసినట్లేనా?

అయిపోయింది.. అంతా అయిపోయింది.. కారు పార్టీ దెబ్బకు సైకిల్ పార్టీ డీలా పడిపోయింది.. కేడర్ ఉన్నా.. లీడర్ లేక డల్ అయిపోయింది.. ఇది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి. కానీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం వేదికగా నిర్వహించిన శంకారావం సభ... సక్సెస్ కాదు... సూపర్ సక్సెస్ అయింది. దీంతో పసుపు పార్టీ నేతల్లోనే కాదు.. పార్టీ కేడర్‌లో సైతం నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ సభకు ప్రజలు.. స్వచ్ఛందంగా తరలిరావడం చూసి.. నిన్న మొన్నటి వరకు.. బెల్ బ్రేక్ లేదు.. సైకిల్ ఎక్కడా లేదు అంటూ పసుపు పార్టీపై అవాక్కులు చవాక్కులు పేలిన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతల నోళ్లకు ఈ సభ విజయవంతం కావడం ద్వారా తాళం పడింది.     2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపోందారు. 2019 ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు  విజయం సాధించారు. వారిలో చాలా మంది సైకిల్ దిగి.. కారు పార్టీలోకి జంప్ కొట్టి.. కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి పదవులు అందుకొని.. కేసీఆర్ కోటరిలో అత్యంత నమ్మకస్తులుగా మారిపోయారు. దీంతో  తెలుగుదేశం పార్టీలో లీడర్   లేకపోవడంతో.. సైకిల్..కిల్ అపోయిందంటూ ఓ చర్చ అయితే తెలంగాణలో అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో వీర విహారం చేసింది. కానీ పార్టీ  కేడర్ మాత్రం స్థిర చిత్తంతో స్థిరంగా సైకిల్ పార్టీనే అంటిపెట్టుకొని ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. తెలుగుదేశం కేడర్ మాత్రం అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దీంతో టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మాజీ టీడీపీ నేతలు సైతం అతి సునాయాసంగా గెలవగలుగుతున్నారనే ప్రచారం   కారు పార్టీలో నేటికి షికారు అయితే చేస్తోంది.  మరోవైపు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమంటూ ... టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. తాజాగా ఆ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చేశారు. దీంతో ఆ పార్టీకి ఆత్మగా ఉన్న తెలంగాణ స్థానంలో భారత్ రావడంతో.. ప్రజలు సైతం ఆ పార్టీపైనే కాదు.. కేసీఆర్ పాలనపైన కూడా.. తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు.  అయితే ఎన్నికల ప్రచార సమయంలో తప్పించి.. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీపై కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ సైతం విమర్శలు  చేసింది లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ తర్వాత.. ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయాలనుకొంటున్న గులాబీ బాస్ కుమార్తె  కల్వకుంట్ల కవిత  తెలంగాణలో టీడీపీ రాజకీయాలు సాగవంటూ విమర్శించారు.  ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా.. చంద్రడు ఒకడే ఉన్నట్లుగా  తెలంగాణలో కేసీఆర్ మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.  ఇంకోవైపు.. చంద్రబాబు సభపై కేసీఆర్ బంధువు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు   శాసన సభా పక్ష కార్యాలయంలో సహచర మంత్రులతో కలసి మీడియా సమావేశం పెట్టి మరీ  విమర్శించారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైందని ఆరోపించారు. అంతేకాదు.. ఖమ్మం వేదికపై నుంచి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.      అదీకాక తెలంగాణలో సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సభలు, సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు సైతం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో త్వరలో  సభ ఉంటుందని తెలుస్తోంది. అలాగే టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో సైతం ఈ సభలు నిర్వహించడం..  అదేవిధంగా టీడీపీలో రాజకీయ జీవితం ఆరంభించిన... ఆ తర్వాత పార్టీలు మారినా... ఫేట్ మారని నేతలను గుర్తించి వారిని సైతం తిరిగి సైకిల్ ఎక్కించుకొని.. సైకిల్ పార్టీని మళ్లీ సూపర్‌గా సవారీ చేయించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి సైకిల్ పార్టీని బలోపేతం చేసి... అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేలా.. పార్టీని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు.

బీహార్ లో కల్తీ మద్యంపై రాజకీయం!

దేశం మొత్తం రాజకీయాలను మద్యం డామినేట్ చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరై పోతుంటే.. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రం మరో కారణంతో మద్యం రాజకీయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది.  బీహార్ లో కల్తీ మద్యం మృతుల విషయంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్య నిషేధం యథేచ్ఛగా ఏరులై పారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు  నితీష్ కుమార్ చాలా దీటుగా, ఘాటుగా సమాధాన మిచ్చారు. బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉందనీ, ఆ విషయాన్ని ప్రస్తుతిండం మాని కల్తీ మద్యంపై తనను విమర్శించడమేమిటని నిలదీస్తున్నారు. మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ తో పాటు దేశంలో మద్య నిషేధం అమలులో లేని రాష్ట్రాలలోనూ కల్తీ మద్యం పై విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేస్తున్నారు.  బీహార్ శరన్ జిల్లాలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తును ప్రశ్నించిన నితీష్, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) కి దమ్ముంటే ఇతర రాష్ట్రాలలోనూ కల్తీ మద్యం మృతుల ఘటనలపై దర్యాప్తు చేపట్టాలని సవాల్ చేశారు. కల్తీ మద్యం కాటుకు మరణిస్తున్న సంఘటనలు ఒక్క బీహార్ లోనే కాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ జరుగుతున్నాయని నితీష్ అంటున్నారు.  బీహార్ లో ఏడేళ్ల కిందటే ( ఇంకా సరిగ్గా చెప్పాలంటే 2016) నుంచీ మద్యం తయారీ, విక్రయాలు, వినియోగం అన్నిటిపైనా సంపూర్ణ నిషుధం అమలులో ఉంది.    ఆల్కహాల్ సేవనంతో మరణాలు దేశంలోని ఏ ప్రాంతంలో జరగటం లేదు? గతంలో ఇలాంటివి జరగ లేదా? విషపూరితమైన కల్తీ మద్యం తాగి ఎంతమంది మరణించ లేదు? మరి అలాంటప్పుడు మానవ హక్కుల కమిషన్ కేవలం బిహార్ లోనే ఎందుకు దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపుతోంది? ఎన్ హెచ్ ఆర్సీ వెనుక ఉన్నది బీజేపీయేనా? అంటూ   నితీష్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన  బాధ్యత ఎన్ హెచ్ ఆర్సీపై ఉంది. అలాగే బీహార్ లో కల్తీ మద్యం మరణాలను భూతద్దంలో చూపి విమర్శలు గుప్పించే బీజేపీకి ఇతర రాష్ట్రాల్లో జరిగే ఇలాంటి మద్యం మరణాలు కనిపించవా అన్నప్రశ్నలూ తలెత్తుతున్నాయి.  అయితే నితీష్   ప్రశ్నలపై బీజేపీ స్పందించడంలేదు. అయితే మద్యం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్న డిమాండ్ ను మాత్రం బీజేపీ బలంగా చేస్తోంది.  మొత్తం మీద  82 మంది ఉసురు తీసిన బిహార్ కల్తీ మద్యం వ్యవహారంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రశక్తే లేదని బీహార్ సీఎం చేసిన ప్రకటన మాత్రం విపక్షాలకు ఆయుధంగా మారింది.  నిజానికి మద్య నిషేధం బిహార్, గుజరాత్ లో అమల్లో ఉందన్న మాటే కానీ ఎక్కడా  నిషేధం  ఆనవాలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2015లో మద్య నిషేధం బిల్లు బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఈ బిల్లు కుమద్దతు ఇచ్చింది.    ఇప్పుడు అదే బీజేపీ ఇదే విషయంపై నితీష్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. అప్పట్లో  ప్రధాని మోడి కూడా నితీష్ ను ఒకప్పుడు ప్రశంసించి, మద్య నిషేధంతో నితీష్ చాలా సాహసోపేతమైన అడుగులు వేస్తున్నారని” మోడీ అభినందించారు. ఇక మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో సైతం  కల్తీ మద్యం కారణంగా 42 మంది ప్రాణాలు  కోల్పోయిన  సంగతిని బీజేపీ ఇప్పుడు కన్వీనియెంట్ గా మరచిపోయింది.   బిహార్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్య నిషేధం బిల్లు పాసైనా ఒక్క ఆర్జేడీ మాత్రం ఈ చట్టం అమలుపై సందేహాలు వెలిబుచ్చింది. అంతకు ముందు లాలూ సీఎంగా ఉన్నప్పుడు మద్యంపై ఏకంగా పన్నునే ఎత్తేశారు! మద్య నిషేధాన్ని నితీష్ ప్రకటించగానే ..  డ్రై స్టేట్ లో రెవిన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇలా డ్రై స్టేట్ అయితే కొత్త పెట్టుబడులు రావని విమర్శలు గుప్పించిన వారంతా. అప్పటికే మద్య నిషేధం అమలులో ఉన్న మ  గుజరాత్ కు పెట్టుబడుల వరద ఎలా వస్తోందని మాత్రం ప్రశ్నించలేదు. అలాగే 2016లో నితీష్ బీహార్ లో మద్య నిషేధం విధించినప్పుడు మోడీ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు ఒప్పన్నది ఇప్పుడు తప్పు అంటున్నారు. అలాగే మోడీ  పెద్దనోట్లు రద్దు చేయడాన్ని అప్పట్లో నితీష్ సమర్ధించారు. ఇప్పుడు అది పెద్ద కుంభకోణం అని విమర్శిస్తున్నారు.  రాజకీయం అంతే. మొత్తం మీద దేశం అంతటా మద్యం రాజకీయమే నడుస్తోంది. ఇందుకు ఏ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. 

తెలంగాణలో బీజేపీకి , ఏపీలో తెలుగుదేశంకు లైన్ క్లియరేనా?

తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకుడే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. ఇవే మాటలు ఇంత కాలంగా విపినిస్తూ వచ్చిన మాటలు.  వాటిని అందరూ నమ్ముతూ వచ్చారు కూడా.. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేడు. దీంతో రెండో శ్రేణి నాయకత్వం ఊసే లేకుండా పోయింది. అయితే.. కార్యకర్తలు, అభిమానులకు మాత్రం కొదవే లేదు. అయినా వారిని పట్టించుకునే నాథుడే తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో లేకుండా పోయారు. అయితే చంద్రబాబు ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను తట్టి లేపారు. సరైనా దిశా నిర్దేశం ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ తిరుగులేని శక్తిగా నిలబడుతుందని, పడి లేచిన తరంగంలా ఉవ్వెత్తున లేస్తుందని చంద్రబాబు సభ ద్వారా  నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. ఖమ్మంలో తెలుగుదేశం శంఖారావం సభ సక్సెస్ తో  అందరి దృష్టీ ఒక్క సారిగా టీడీపీపై పడింది. ఎనిమిదిన్నరేళ్ల తరువాత తెలంగాణలో చంద్రబాబు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. వెయ్యి కార్లతో చంద్రబాబు ర్యాలీ వెళ్తుంటే తెలంగాణ మొత్తం చూసింది. తెలంగాణ ప్రజలు అభిమానంతో తరలి రావడం చూసి  రాష్ట్రంలో చంద్రబాబుకు ఇంకా ఈ రేంజ్‌లో ఆదరణ ఉందా అని రాజకీయ పార్టీలు అచ్చెరువోంది చూశాయి.   తెలంగాణలో అధికారం కోసం శాయశక్తులా కృషి చేస్తున్న బీజేపీకి  చంద్రబాబు సభ సక్సెస్ తో రాష్ట్రంలో అధికారంలోకి  రావడానికి ఓ దారి కనిపించింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత, కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారస్థాయికి చేరిన తరువాత తెలంగాణలో బీజేపీ బలపడిందనడంలో సందేహం లేదు. అయితే ఆ పెరిగిన బలం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సరిపోదేమో అన్న అనుమానం బీజేపీ అగ్రనాయకత్వంలో ఉంది. పట్టణ ప్రాంతాలలో పరిస్థితి బాగున్నా.. తెలంగాణ గ్రామీణంలో మాత్రం బీజేపీకి ఇంకా పట్టు చిక్కలేదు. అందుకే తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే పొత్తులు కావాలి. కానీ తెలంగాణలో పొత్తుకు సరైన పార్టీ ఏదని ఇంత కాలంగా  బీజేపీ అన్వేషిస్తోంది. వైఎస్సార్టీపీ, బీఎస్పీ లు ఉన్నా.. అవి బీజేపీకి బలం అయ్యే అవకాశాల కంటే బీజేపీయే వాటిని బలం అవుతుందనిపించే పరిస్థితులు ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం బలం ఏమిటన్నది, ఎంతన్నది.. శంఖారావం సభ ద్వారా ప్రదర్శించారు.  ఇంత కాలంగా తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు విషయంలో బీజేపీ ముందు వెనుకలాడుతూ వస్తోంది. తెలంగాణలో ఉనికి, మనుగడే లేని   టీడీపీతో పొత్తెందుకన్న భావనా ఆ పార్టీ  అగ్రనాయకత్వంలో వ్యక్తమైంది.  తాజాగా ఖమ్మం టీడీపీ  శంఖారావం సభ రాష్ట్రంలో తెలుగుదేశం బలాన్ని చాటింది. దీంతో ఇప్పుడు బీజేపీ మిగిలిన అన్ని ఆప్షన్లనూ పక్కన పెట్టేసి తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తే.. తమకు రాష్ట్రంలో అధికార సోపానాన్ని అందుకోవడానికి రాచబాట అవుతుందన్న నిర్ణయానికి వచ్చేసింది.  ఖమ్మం శంఖారావం సభ వెనుక చంద్రబాబు వ్యూహం కూడా ఇదే. తెలంగాణలో తెలుగుదేశం సత్తా చాటితే బీజేపీ తన దరికి వస్తుందన్నది ఆయన ఎత్తుగడగా భావించవచ్చు. ఎందుకంటే.. ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే.. ఆ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కూటమి (ఔను ఆ రెండు పార్టీలూ మిత్రపక్షాలు) అండ అవసరం. తెలంగాణలో బీజేపీకి తన అండ ఎంత అవసరమన్నది  తెలియజేస్తే తప్ప బీజేపీ ఏపీలో తనకు అండగా నిలిచేందుకు ముందుకు రాదు. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో తెలుగుదేశం బలాన్ని చాటారు.   చంద్రబాబు ఖమ్మం సభపై కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందించాయి కానీ బీజేపీ మౌనంతోనే..  తెలుగుదేశంతో పొత్తువిషయంపై బీజేపీలో చర్చ జరుగుతోందని అవగతమౌతోంది. గోడ చేర్పులాగా బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకీ బీజేపీ అసవరం ఉంది. ఖమ్మం శంఖారావం సభతో ఇరు పార్టీలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అక్కడ మీకు మేము.. ఇక్కడ మాకుమీరు అన్నఒప్పందానికి వస్తాయా? ఇరు పార్టీలకు ఈ ఒప్పందం లాభదాయకమని భావిస్తున్నాయా అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి. ఏపీలో ఇప్పటికే జనసేన అధినేత వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పదేపదే చెబుతుండటంతో తన దారి ఏమిటి? తన వైఖరి ఏమిటన్నది చెప్పకనే చెప్పేశారు. ఇక ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం సత్తాచాటిన ఖమ్మం సభతో బీజేపీ కూడా జనసేనానికి వంత పాడి 2014 ఎన్నికల నాటి సమీకరణానికి సై అంటుందన్న అభిప్రాయమే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది.  

వలపు వల.. పెళ్లి ఎర.. 46లక్షలకు కుచ్చుటోపీ!

సామాజిక మాధ్యమం ద్వారా పరిచయస్తులను నమ్మి పోసపోవద్దంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. మోస పోయిన వారు రోజు  రోజుకూ పెరుగుతున్నా.. కొత్తగా మోసపోయే వాళ్లు మోస పోతూనే ఉన్నారు. చేతులు కాలాకా లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే వారు నిండా మునిగి దిక్కు తోచనిస్థితికి వెళుతున్నారు. అటువంటిదే మరో సంఘటన వెలుగులోనికి వచ్చింది. వలపు వల విసిరి పెళ్లి పేరు చెప్పి ఓ యువకుడిని 46 లక్షల రూపాయలకు ముంచేసిన కిలేడి ఉదంతమిది. చిత్తూరు జిల్లాకు చెందిన అపర్ణ అనే మహిళ ఫేస్ బుక్  ద్వారా పరిచయమైన హైదరాబాద్ కు చెందిన యువకుడికి పెళ్లి పేరుతో గాలం వేసింది. తాను మంచి ఆస్తి పరురాలినని అతడిని నమ్మించింది. ఆస్తి కోర్టు వివాదాల్లో ఉందనీ నమ్మబలికి విడతల వారీగా  అతగాడి నుంచి 46లక్షలరూపాయల వరకూ దండుకుంది. ఆ తరువాత ఫేస్ బుక్, ఫోన్ లలో టచ్ లోకి రావడం మానేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అపర్ణను అరెస్టు చేశారు.

ఒకే కానుపులో తొమ్మిది మంది పిల్లల జననం

కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణం. అత్యంత అరుదుగానై ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు ఒకే కానుపులో జన్మించిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఓ మహిళ ఏకంగా ఒకే కానుపులో తొమ్మిది మంది పిల్లలకు జన్మ నిచ్చింది. మొరాకోకు చెందిన సీసా అనే మహిళ మహిళ గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ఏడున్నర నెలలకు ఆమె ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఒక కానుపులో ఇద్దరు పిల్లలు జన్మించడం మామూలే. అరుదుగా ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకే కానుపులో ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనివ్వడం మాత్రం ఇదే మొదటి సారి అంటున్నారు. ఒకే కానుపులో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి సీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. సీసీకు జన్మించిన పిల్లలలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా సీసా ఒకే కానుపులో తొమ్మండుగురికి జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించిందనీ, ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కెక్కిందనీ పేర్కొంటూ గిన్నిస్ వరల్డ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. 

నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

 సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ  ఇక లేరు. గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్నా ఆయన శుక్రవారం (డిసెంబర్ 23)  ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  కృష్ణా జిల్లా కౌతవరం లో  జన్మించిన సత్యనారాయణ గుడివాడ లో గ్రాడ్యుయేషన్ చేశారు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వెండితెరపై తొలిసారిగా   సిపాయి కూతురు  సినిమాలో  నటించారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో హీరోగా, విలన్‌గా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతో సత్యనారాయణ నటించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలుశనివారం  నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల ప్రవేశించారు.  తెలుగు దేశం పార్టీలో చేరి   1996లో   మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత 1998లో  లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా    పోటీ చేసి. కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అటు రాజకీయాలలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ వివాద రహితుడిగా పేరొందారు.

డిగ్గీ ప్రవచనాలతో అసమ్మతి అగ్గి చల్లారేనా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం దూతగా మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ హైదరాబద్ వచ్చారు. గాంధి భవన్ లో గంటల తరబడి చర్చలు జరిపారు. విస్వసనీయ  సమాచారం మేరకు ఒక్కొక్కరిని పిలిచి  ఏమిటి విషయం, అని ప్రశ్నించారు. మీరేమిటి, మీరు చేస్తున్నదేమిటి? తెలంగాణలో భారాస ప్రభుత్వాన్ని, ఓడించడానికి మీ వద్ద ఉన్న వ్యూహం ఏమిటి? అంటూ, దిగ్విజయ సింగ్, ప్రతి ఒక్కరినీ పరిపరివిధాల ప్రశ్నించారు. అందరి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.  అలాగే, ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న విబేధాలు భగ్గుమనేందుకు కారణమైన  కమిటీలపై వ్యక్తమైన అసంతృప్తి పైనా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి ఆరా తీశారు. కొందరికి కొంత ఘాటుగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటి?  పార్టీని రక్షించాల్సిన మీరే.. సమస్యగా మారితే ఎలా? అంటూ కొందరు సీనియర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకున్నారు. అంతే కాదు పార్టీలో జూనియర్‌, సీనియర్‌ పంచాయితీ మంచిది కాదు. సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి.. మీడియా ముందు మాట్లాడటం సరికాదు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే .. హై కమాండ్‌ చూస్తూ ఊరుకోదు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి? పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.. మీరు ఏం చేశారు? అంతర్గత సమస్యపై మీ అభిప్రాయం .. పరిష్కారం కోసం మీ సలహా ఏంటి? అని దిగ్విజయ్‌ సింగ్‌ నేతలను ప్రశ్నించినట్టు  సమాచారం. సరే..లోపల జరిగిన సంగతులు ఎలా ఉన్నా గాంధీ భవన్ ప్రాంగణంలో మీడియా కెమెరాల సాక్షిగా జరిగిన సంఘటనలు గమనిస్తే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య సాగుతున్న, ‘వార్’  డిగ్గీ రాజా ధర్మ ప్రవచనాలతో ముగిసేలా లేదని మాత్రం అందరికీ అర్థమైందని, కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా మీడియా ముందుకొచ్చి మరీ ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవడం కాదు, రేవంత్ రెడ్డిని విలన్ లా  చిత్రించేందుకు ఓయూ విద్యార్థి నేతలు ఏమాత్రం వెనకాడలేదు. తగ్గేదే లే అంటూ దూసుకు పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతవరకు నాలుగు గోడల వరకే పరిమితం అయిన యుద్ధం ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. కొందరు కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారంటూ నాయకులపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇటీవల సీనియర్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్‌ పై ఓయూ విద్యార్థి నేతలు భౌతిక దాడికి ప్రయత్నించారు. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం గాంధీభవన్‌ నుంచి  బయటకు వస్తున్న అనిల్‌ పై ఓయు విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న మల్లు రవి, ఇతర సీనియర్‌ నేతలు విద్యార్థులను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఎంతోకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నామని.. అయినా, కమిటీల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్‌ కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు.  ఈ పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కేంద్ర బిందువుగా సాగుతున్న రచ్చకు, రేవంత్ రెడ్డి మాత్రమే సమాధానం ఇవ్వగలరని కొందరు సీనియర్ నాయకులు  అంటున్నారు. నిజంగా ఆయనకు  కాంగ్రెస్ పార్టీని రక్షించే యోచనే ఉంటే, ఆయన చేసిన తప్పులను ఒప్పుకుని, పదవి నుంచి తప్పుకుంటే హుందాగా ఉంటుందని అంటున్నారు. రేవంత్ సృష్టించిన సమస్యకు ఆయనే పరిష్కారం చూపాలని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని అనుకోలేమని, మరి కొందరు నాయకులు పేర్కొంటున్నారు. సో .. మొత్తంగా చూస్తే,కాంగ్రెస్ లో  పాత కొత్త నేతల మధ్య భగ్గుమంటున్న విబేధాలు ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేవనే పరిశీలకులు అంటున్నారు.

పెన్సిల్ పొట్టు గొంతులోకెళ్లి చిన్నారి మృతి

పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని పిల్లలు.. వారి అమాయకత్వంతో ఒక్కో సారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అందుకే చిన్నారులను ఎప్పుడూ తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పటి కప్పుడు వారు ఏం చేస్తున్నారు? అన్నది ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇళ్లల్లో ఆడుకునే టప్పుడు, చదువుకునేటప్పుడూ కూడా పిల్లలను గమనిస్తూనే ఉండాలి. ఆరేళ్ల పిల్ల హోం వర్క్ చేసుకుంటూ తెలియకుండానే చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఆ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతం పహాడీ వీర్ గ్రామానికి చెందిన నందకుమార్ కు ముగ్గురు పిల్లలు. అందరిలోకీ చిన్న పిల్ల ఆర్తిక (6) తన అన్న, అక్కతో కలిసి టెర్రస్ పై చదువుకుంటోంది. ఆ క్రమంలో తన పెన్నిల్ చెక్కుకుందామనుకుంది. షార్పనర్ ను నోట్లో పెట్టుకుని పెన్సిల్ చెక్కుకుంది. ఈ క్రమంలో పెన్సిల్ పొట్టు నోట్లోకి వెళ్లి గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరైంది. తల్లి దండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ పాప మరణించింది.