Dhoni’s depiction as Lord Vishnu holding shoe sparks protest

మరో వివాదంలో ధోనీ

  టీం ఇండియా కెప్టెన్ ప్రస్తుత ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ వివాదంలో చిక్కుకున్నాడు. గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ అనే టైటిల్ తో 'బిజినెస్ టుడే' అనే మ్యాగజైన్ కవర్ పేజీ పై విష్ణుమూర్తి అవతారంలో కనిపించాడు. ఈ ఫోటోలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను చేతులతో పట్టుకుని కనిపించాడు. అయితే ఒక చేతిలో షూ కూడా పట్టుకుని కనిపించాడు. హిందువులు ఆరాధించే విష్ణుమూర్తిని ఇలా అవమానించడంపై, తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ధోనీపైన, బిజినెస్ మ్యాగజైన్ పైన కేసు నమోదు చేయాలని హిందూ మతసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. పంజాబ్ లోని బొహ్రీచౌక్ లో నిరసనకారులు భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

Mohan babu Politics

మోహన్ బాబు ఏ పార్టీలోకి?

      తెలుగు సినిమా ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''ఇవాళ ఒక్క సినిమా హిట్టయితే 'నేనే ముఖ్యమంత్రి' అనుకునే వాళ్లున్నారు. కానీ అది కొంతమందికే చెల్లింది. సినిమా వేరు. రాజకీయం వేరు. ప్రజలకు నిజంగా మేలు చేసేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు'' అని అన్నారు. 2014లో తాను రాజికియల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరతాననేది ఇప్పుడే చెప్పను. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. చేరేది పాత పార్టీయా, కొత్త పార్టీయా అనేది అప్పుడే చెబుతా. దైవసాక్షిగా చెబుతున్నాను. నేను ఏ పార్టీలో చేరితే దానికి ప్రచారం కోసం వెళ్తాను తప్ప మనసా, వాచా ఒక పదవి అలంకరించాలని లేదు. రాజకీయంగా నేను నెంబర్‌వన్ కావాలని కోరుకోవడం లేదని చెప్పారు.

mukesh ambhani

అంభానీ రక్షణపై మాట మార్చిన హోంశాఖ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటడ్ అధినేత ముకేష్ అంభానీకి ‘జెడ్’క్యాటగిరీ రక్షణ ఇవ్వనున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన హోంమంత్రిత్వ శాఖ, ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు, మీడియాలో ఈ విషయమై జరుగుతున్న చర్చలకు జడిసి మాట మార్చిందిప్పుడు.   హోంశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ “ఎవరయినా వ్యక్తులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని రుజువుచేసే సరయిన ఆధారాలతో మమ్మల్ని సంప్రదించినట్లయితే, మేము ఆ అభ్యర్ధనను నిఘా వర్గాలకు అందజేసి విచారణ చేయిస్తాము. ఒకవేళ, వారు దానిని దృవీకరిస్తే, మేము తగిన భద్రత కల్పించేందుకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కకట్టి సదరు వ్యక్తులకు తెలియపరుస్తాము. దానికి వారు అంగీకరించినట్లయితే మేము సుశిక్షితులయిన మా సి.ఆర్. పీ.యఫ్. సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేస్తాము. ముకేష్ అంభానీకి జెడ్ క్యాటగిరీ భద్రతా కల్పించడానికి నెలకు రూ.15లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాము,” అని మీడియాకు తెలిపారు. కానీ, వారు వేసిన అంచనా మొత్తం ప్రతీనెలా చెల్లించేందుకు ముకేష్ అంభాని సుముకత వ్యక్తం చేసారా లేదా? అనే విషయంపై సమాధానం దాటవేశారు. అంటే, ప్రభుత్వం బహుశః అంభానీకి ఉచిత సేవలు అందజేసే ఆలోచనలో ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.   సీపీఐ పార్లమెంటు సభ్యుడు ఏపీ. బర్ధన్ పార్లమెంటులో ప్రభుత్వాన్నితీవ్రంగా విమర్శిస్తూ “దేశ రాజధానిలో సైతం స్త్రీలకు, చిన్నారులకు రక్షణ కల్పించలేని సిగ్గులేని ఈ ప్రభుత్వం, కొట్లాదిపతి అయిన అంభానీకి మాత్రం ప్రత్యేకరక్షణ ఏర్పాట్లు చేసేందుకు తెగ ఆత్రుతపడుతోంది. ప్రభుత్వం కార్పోరేట్ పెద్దల సేవలో తరించాలని ఉవ్విళ్ళూరడం సిగ్గుచేటు. సామన్య ప్రజల భద్రతకు పైసా ఖర్చు పెట్టాలంటే వెనకాడే ప్రభుత్వం, స్వయంగా స్వంత భద్రతా ఏర్పాట్లు చేసుకోగల అంభానీకి, ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నుల నుండి సొమ్మును ధారాపోసి భద్రత కల్పించాలనుకోవడం, సామన్య ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి అది నడిపిస్తున్న ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో తెలియజేస్తోంది,” అని తీవ్రంగా విమర్శించారు.   కొసమెరుపు ఏమిటంటే, నిన్నహోంమంత్రి సుషీల్ కుమార్ షిండే లోక్ సభలో ప్రతిపక్షాల విమర్శలకు జవాబిస్తూ “ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేవలం ఒక్క డిల్లీలోనే అత్యాచారాలు జరగట్లేదు. యావత్ భారత దేశంలో జరుగుతున్నాయి,” అని నిర్లజ్జగా చెప్పడం విశేషం. ప్రతిపక్షాలు మళ్ళీ అయన మీద దుమ్మెత్తి పోస్తే గానీ,తానూ మాట్లాడిన మాటల్లో పొరపాటును ఆయన గ్రహించలేకపోయారు.

Court issues NBW against Sanjay Dutt; actor appears and gets bail

మరో కేసులో సంజయ్ దత్

  నూరానీ ప్రొడ్యూసర్ గా 'జాన్ కి బాజీ' చిత్రంలో నటించడానికి సంజయ్ దత్ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. సగం సినిమా పూర్తయిన తరువాత సినిమా షూటింగ్ లలో పాల్గొనకుండా, తను ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బులు అడిగితే తనను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయని నూరానీ తరపు న్యాయవాది నీరజ్ గుప్తా పిటీషన్లో పేర్కొన్నాడు. గత ఫిబ్రవరి 13న అంథేరీ మెట్రోపాలిటన్ కోర్టులో షకీల్ ఫిర్యాదు చేశాడు. కోర్టుకు హాజరుకావాలని రెండుసార్లు కోర్టు సమన్లు పంపినా సంజయ్ దత్ పట్టించుకోలేదు. దాంతో అంథేరీ మెట్రోపాలిటన్ కోర్టు సంజయ్ దత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అందుకున్న సంజయ్ దత్ సోమవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. కోర్టు సంజయ్ దత్ కు బెయిల్ మంజూరు చేసింది.

Justice JS Verma

నిర్భయ చట్ట రూపకర్త వర్మ మృతి

  నిర్భయ చట్ట రూపకర్త జస్టీస్ వర్మ సోమవారం రాత్రి 9.30 నిముషాలకు మృతి చెందినట్లు గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ వైద్యులు ధృవీకరించారు. శుక్రవారం ఆయన కడుపులో రక్తస్రావంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వర్మను హాస్పిటల్ కు తీసుకువచ్చారని, అప్పటికే ఆయన కాలేయం పూర్తిగా విఫలమైందని మేదాంత మెడిసిటీ వైద్యులు తెలిపారు. న్యూఢిల్లీ లోల నిర్భయపై జరిగిన లైంగిక దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం జస్టీస్ వర్మ నేతృత్వంలో తిసభ్య కమిటీని నియమించింది. ఈ ప్యానెల్ అత్యాచార నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి, కొన్ని సిఫారసులతో కేవలం 29 రోజుల్లో నివేదిక సమర్పించింది. అందులోని కొన్ని సూచనల ఆధారంగా రూపొందించిన నిర్భయ చట్టాన్ని పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. ఎన్డీటీవీ ఈ నెల 15న ఆయనకు ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో గౌరవించింది. జస్టీస్ వర్మ (80) జనవరి18వ తేదీ 1933 సంవత్సరంలో జన్మించారు. 1955 లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1973లో మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, 1986 జూన్ లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నియమితులయ్యారు.1989 సెప్టెంబర్ నుంచి 1989 మధ్య కాలంలో రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నియమితులైన ఆయన 1997 మార్చి 25 నుంచి 1998 జనవరి 18 దాకా సుప్రీం కోర్టు 27వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి  రిటైరయ్యారు. జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ గా కొంతకాలం సేవలు అందించారు. న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారటీ తొలి చైర్ పర్సన్ గా కూడా సేవలందించారు. జస్టీస్ వర్మ మృతిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

KCR and his family members have been collecting money for themselves

కెసిఆర్ పై టిడిపి తిట్ల దండకం

  టిడిపి అధ్యక్షుడు కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆదివారం కెసిఆర్ ఖండించిన విషయం విధితమే. కెసిఆర్ తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి నాయకులు తిట్ల పురాణం అందుకున్నారు. కెసిఆర్ గల్ఫ్ బ్రోకర్, పొలిటికల్ లోఫర్, ఫామ్ హౌస్ లో గ్లాసులు ఎత్తడం కాదు, పార్లమెంట్ లో గొంతు ఎత్తడం కాదని టిడిపి అధికార ప్రతినిధి నర్సిరెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు. నీది తాగుబోతుల పార్టీ, వసూళ్ళ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ, తాగి ఊగే పార్టీ, తాగకుండా ఉండలేని పార్టీ, తెగ తాగి ఫామ్ హౌస్ లో పడుకునే పార్టీ అని టిడిపి ఎమ్మెల్యే నర్సారెడ్డి కెసిఆర్ పై ధ్వజమెత్తారు. టిడిపిది పాలు, కూరగాయలు అమ్ముకునే పార్టీ అని కెసిఆర్ వ్యాఖ్యానించారని అది నిజం అనుకున్నా తమది స్కాములు, బ్లాక్ మెయిళ్ళు, దోపిడీ వ్యవహారాల పార్టీ కాదని, నిర్యానీ, బీర్ల పార్టీ కాదని, అల్లుడి విద్యాసంస్థలను, కూతురు సినిమా పరిశ్రమను, కొడుకు పరిశ్రమలను ప్రజలను పిండి చేస్తుంటే కెసిఆర్ ప్రాజెక్టులను కొల్లగొడుతూ నాలుగుచేతులా సంపాదిస్తున్నాడని, బయ్యారంపై పార్లమెంటులో బయ్యారం గనులపై చర్చ జరిగితే కెసిఆర్ ఆ ఛాయలకే పోలేదని, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కు బయ్యారం భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ చంద్రబాబు బయ్యారం వెళితే ఉద్యమం ముసుగులో చంద్రబాబును అడ్డుకొనే ప్రయత్నం చేశారని తీవ్రంగా ఆరోపించారు. మరొక నాయకుడు తెలంగాణా టిడిపి ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ కెసిఆర్ డి చందాల దందా అని, తెలంగాణా సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నాడని, తమ దగ్గర ఆధారాలున్నాయని, కెసిఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.

ysr congress

నెల్లూరు వైకాపాలో ముసలం

  ఫ్లెక్సీ బ్యానర్లతో ఎదుట పార్టీలో చిచ్చుపెట్టి చంకలు కొట్టుకొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ కన్వీనర్ పదవులను భర్తీ చేసేప్రయత్నంలో ఇప్పుడు స్వంత పార్టీలోనే చిచ్చు రగులుతోంది. ఒక జిల్లాలో మొదలయిన ఈ చిచ్చు మరో జిల్లాకు దావానంలా వ్యాపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీలో మంటలు రగులుకొన్నాయి.   జిల్లాలో పార్టీకి బలమయిన పునాది వేసిన యం.పీ.మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభీష్టానికి వ్యతిరేఖంగా కాకాని గోవర్దన్‌రెడ్డిని జిల్లా కన్వీనర్ నియమించడంతో మొదలయిన ఈ యుద్ధం చివరకు కాకాని రాజీనామా వరకు చేరింది. రాబోయే ఎన్నికలలో జిల్లాలో పార్టీని గెలిపించుకోవాలంటే తన బంధువు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి, నెల్లూరు అర్బన్ నియోజకవర్గానికి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన తన అనుచరుడు మురళికి పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డి గట్టిగా కోరుతున్నారు.   అయితే, కాకాని పార్టీ అధిష్టానంతో మాట్లాడి నెల్లూరు రూరల్‌కు పార్టీ అభ్యర్ధిగా కాటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, నెల్లూరు అర్బన్‌కు బీసిసామాజిక వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌యాదవ్‌లకి పార్టీ అభ్యర్దులుగా ఖరారు చేయించినట్లు వార్తలు రావడంతో మేకపాటి భగ్గుమన్నారు.   ఈ సమస్యకు మూల కారణమయిన కాకానినే పదవిలోంచి తప్పించడం మంచిదని భావించిన మేకపాటి తన అనుచరుల ద్వారా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, కన్వీనర్ గా మురళిని నియమించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, రెడ్లప్రాబల్యం అధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ కన్వీనర్ గా అదే వర్గానికి చెందిన తాను ఉండటమే పార్టీకి మేలని కాకాని గోవర్ధన్‌రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించగలిగిన్నపటికీ, అలకబూనిన ఎంపి మేకపాటిని శాంతపరిచేoదుకు, కాకానిని జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పించి, ఆయన సూచించిన మరళినే పార్టీ కన్వినర్‌గా ఎంపికచేయాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలియడంతో, వెంటనే కాకాని కూడా మేకపాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డికి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకూ లేఖలు వ్రాసారు.   మేకపాటి జిల్లాలో పార్టీ పదవులను, జిల్లాలో పలునియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికలలో పార్టీ టిక్కెట్లు ఇప్పటి నుండే అమ్ముకొని ఆశావహులనుండి డబ్బులు భారీగా డబ్బు దండుకొంటున్నారని ఆరోపిస్తూ లేఖలు వ్రాయడమే కాకుండా, తనను అప్రదిష్టపాలు చేస్తునందున కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ వ్రాశారు.   ఇక, తమకు అనుకూలంగా పార్టీ నిర్ణయం ప్రకటించకపోతే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో తెలియ జేసేందుకు, మేకపాటి సోదరుడు-ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో సహా కలిసి వెళ్లి, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి సభలకు హాజరయ్యారు. జగన్ మోహన్ రెడ్డి ని ఉరి తీయాలని, వైయస్సార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు వెలివేయాలన్నమంత్రి ఆనం సభకే వారు వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. అయితే, తమ ఉద్దేశ్యం కేవలం పార్టీకి హెచ్చరికలు జారీ చేయడమే కనుక, సభలోమంత్రి అనం వైఎస్ పేరును ప్రస్తావించలేదన్నసాకుతో వారు సభనుంచి అర్ధంతరంగా బయటకొచ్చేసారు. దీనితో కంగు తిన్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమిచేయాలో, ఎవరిని వదులుకోవాలోతెలియక జైల్లో తలపట్టుకొని కూర్చొన్నారు.

 ys sharmila padayatra tdp

జగన్ సినిమా అట్టర్ ఫ్లాప్

        ప్రజాప్రస్థానం పేరిట వైసీపీ నేత షర్మిల చేపట్టిన పాదయాత్రపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ఫెయిల్యూర్ స్టోరీ అని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ అన్నారు. కడప సీటు ఇవ్వలేదని అలకయాత్ర చేస్తున్నారని విమర్శించారు. పీఆర్‌పీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని, జగన్ సినిమా రిలీజ్ కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పెట్టాల్సింది ఎన్టీఆర్, మహేష్‌బాబూ ఫోటోలు కాదని దుర్యోదనుడు, దుశ్శాషనుడు, రావణాసురుడు, సూర్పనఖ ఫోటోలు పెట్టుకోవాలని రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర పరుగు పందెంగా మారిందని మరోనేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. పాదయాత్రలో షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. స్థాయి మరిచి చంద్రబాబును విమర్శించినందుకే కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర తిరస్కరణకు గురైందన్నారు. పులిచింతల, బందరు పోర్టు నిర్మాణంలో భారీగా ముడుపులు తీసుకున్నారన్నారు. రక్షణ స్టీల్స్ షర్మిల బినామీ సంస్థ అని దేవినేని ఉమా ఆరోపించారు.

byereddy rajashekar reddu

త్వరలో మరో ప్రాంతీయవాద పార్టీ

  తెరాస సృష్టించిన ప్రాంతీయ విబేదాలతో సాంకేతికంగా ఇంకా రాష్ట్రం చీలకపోయిన ప్రజలు మాత్రం ఎప్పుడో చీలిపోయారు. తెరాస చేస్తున్న ఉద్యమాల ప్రభావం కేవలం తెలంగాణ జిల్లాల మీదనే కాక యావత్ రాష్ట్రoపై, రాష్ట్రంలో అన్ని రంగాలపై పడటంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమయింది. ఉద్యమాలు చేస్తున్న నాయకులకి, వాటిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి పెద్దగా తేడా చేయకపోయినా, ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న నిరుపేదలు కూడా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తోంది. రాష్ట్రంలో నేడు నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకి ఈ ఉద్యమం మొదటి కారణం కాగా, ప్రభుత్వ అసమర్థత, అవినీతి రెండో కారణంగా చెప్పవచ్చును.   ఇటువంటి నేపద్యంలో, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలoటూ ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ని స్థాపించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ పై రాయలసీమ జిల్లా యాత్రలు చేస్తూ తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరిoఛి వారిని క్రమంగా ఉద్యమం దారి పట్టిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తమ ప్రాంతానికి న్యాయం చేయలేదని, చివరికి కర్నూలు నగరం రాజధాని అయ్యే అవకాశాన్ని కూడా తమవారే పాడుచేసారని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక ప్రత్యేక రాష్ట్రo ఏర్పడటం ఒకటే మార్గం అని ఆయన అన్నారు. అందుకోసం త్వరలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తన పార్టీ పేరు, సభ్యుల పేర్లు తదితర వివరాలు ప్రకటిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

harikrishna

గన్నవరం నుండి పోటీకి హరికృష్ణ ఆసక్తి

  ఫ్లెక్సీ బ్యానర్లతోనందమూరి సోదరుల మద్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన చిచ్చుఇంకా నివురు గప్పిన నిప్పులా రగులుతోనే ఉందని మీడియాలో కొత్తగా షికారు చేస్తున్నపుకార్లు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికలలో హరికృష్ణ గన్నవరం నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తని హరికృష్ణ కానీ జూ.యన్టీఆర్ గానీ దృవీకరించలేదు, ఖండించలేదు. ఒకవేళ నిజంగా ఆయన గన్నవరం నుండే పోటీ చేయదలిస్తే ముందుగా సిట్టింగ్ యంయల్యే దాసరి బలవర్ధాన్ రావు, అక్కడి నుండి పోటీ చేయాలనుకొంటున్న వల్లభనేని వంశీకి ఇబ్బందులు మొదలయినట్లే. అప్పుడు హరికృష్ణను కాదనలేని తెదేపా, అదే నియోజకవర్గం నుండి పోటీచేయాలని పట్టుదలతో ఉన్నవారిద్దరికీ నచ్చజెప్పడం, వారిని మరో నియోజక వర్గానికి పంపి అక్కడి వారితో మళ్ళీ శిగపట్లు పట్టడం అనివార్యం అవుతుంది. బహుశః ఈ ఆలోచనతోనే హరికృష్ణ గన్నవరం ఎంచుకొన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే, ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ మొదలు పెట్టిన మరో మైండ్ గేమ్ అయ్యున్దవచ్చును. ఏది ఏమయినప్పటికీ, మళ్ళీ హరికృష్ణ మరో మారు మీడియా ముందుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోక తప్పనిసరి పరిస్థితి సృష్టించింది.

Inter First Year exams

ఇంటర్ ఫస్టియర్ లో కృష్ణా ఫస్ట్

        ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. జనరల్ విభాగంలో 54.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 74 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ చివరి స్థానం సాధించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో మంత్రి కె.పార్థసారథి ఆదివారం విడుదల చేశారు. ఫస్టియర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,91,337 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 4,86,658 మంది ఉత్తీర్ణులయ్యారు.   గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 0.85% పెరిగింది. ఇక, ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికల హవా కొనసాగింది. బాలికల్లో 59.46%, బాలురలో 50.22% ఉత్తీర్ణులయ్యారు. కళాశాలల వారీగా మార్కుల రిజిస్టర్లను రెండు రోజుల్లో సంబంధిత ఆర్ఐవోలకు పంపుతారు. మార్కుల మెమోలను ఆయా ప్రిన్సిపాళ్లు ఈనెల 26న తీసుకుని, సాధ్యమైనంత త్వరలో విద్యార్థులకు ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ కోరారు. మార్కుల మెమోల్లో తేడాలుంటే మే 22లోగా ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలి. ఫస్టియర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి హాజరయ్యే విద్యార్థులు మే 3వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు పేపర్‌కు రూ.100 చొప్పున, జవాబు పత్రాల జిరాక్స్ కాపీలకు పేపర్‌కు రూ.600 ఫీజుగా చెల్లించి, మే 4లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Mathematician

గణిత మేథావి శకుంతల మృతి

  సుప్రసిద్ధ మేథమెటీషియన్, కంప్యూటర్ కన్నా వేగంగా లెక్కలు చేసే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శకుంతల దేవి (83), ఎలాంటి ప్రశ్నలకైనా సెకన్లలో సమాధానమిచ్చే శకుంతల దేవి బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శకుంతలా దేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె గణిత శాస్త్రంలో పలు పరిశోధన గ్రంథాలు రాసారు. కళాశాల విద్యార్థుల కోసం పలుపుస్తకాలు రాశారు. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆమె గణితశాస్త పరిజ్ఞానాన్ని చూసి, ఆమె వేళ్ళపై లెక్కలు చెప్పే తీరును చూసి పలువురు గణిత, భౌతిక శాస్త్రవేత్తలు అబ్బుర పడి ఆమెకు అబిమానులుగా మారారు.

KCR lashes out at Naidu

మాది ఫామ్ హౌస్ పార్టీ అయితే నీది బొల్లి పార్టీనా?

  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టి.ఆర్.ఎస్. పార్టీ పై వ్యాఖ్యలు ఫామ్ హౌస్ పార్టీకి సూట్ కేస్ లు, బయ్యారంపై అప్పట్లో మౌనంగా ఉంది అందుకే ...'' అని వ్యాఖ్యానించడంతో టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ ఘాటుగా స్పందించారు. మా పార్టీ ఫామ్ హౌస్ పార్టీ అంటావా? అవును మాది ఫామ్ హౌస్ పార్టీ అయితే నీది పిల్లిగెడ్డం, బొల్లి పార్టీనా? పాలు, కూరగాయల హెరిటేజ్ పార్టీనా? అని టిడిపి కూలిపోతూ కుంటుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఆశలు లేవు, అందుకే నిరాశా నిస్పృహలకు లోనై పిచ్చి ప్రేలాపనలు పెలుతున్నారు. దిక్కుమాలిన సూట్ కేసుల పార్టీ మాది కాదు టిడిపిదే అని, సూట్ కేసుల మోత బాబుకే అలవాటు, మేం మేం అవిశ్వాసం పెట్టినప్పుడు నిసిగ్గుగా బట్టలిప్పి నగ్నంగా ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చింది మీరు కాదా చంద్రబాబూ, అప్పుడు ఎన్ని సూట్ కేసులు పుచ్చుకున్నావో తేల్చిచెప్పాలని బాబుపై కెసిఆర్ మండిపడ్డారు.    

Retired IAS officer Ramanachari joins TRS

తెరాసలోకి మాజీ ఏఐఏఎస్ అధికారి

  తెలంగాణా భవన్ లో ఆదివారం టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్, పొలిట్ బ్యూరో సభ్యులు ఏకే గోయల్, రామ్ లక్ష్మణ్, నాయిని నరసింహారెడ్డి, దాసోజు శ్రవణ్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్ రావ్ సమక్షంలో మాజీ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ రమణాచారి చేరికతో ఉద్యమానికి కొండంత బలం వచ్చిందని, విద్యార్థి దశలోనే తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నయాకుడు రమణాచారి అని, విద్యార్థిగా ఉంటూ ఉద్యమంలో పాల్గొని నెలన్నర పాటు జైల్లో ఉన్నారని, ఐఏఎస్ అధికారిగా అనేక కీలకమైన పదవులు చేపట్టిన రమణాచారికి హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా లేదని, పదవీ విరమణ చేసిన సమయంలో వచ్చిన డబ్బుతో ఇటీవలే ఒక ఫ్లాట్ కొనుక్కున్నారని, వీటన్నింటి బట్టి ఆయనలోని నిజాయితీ ఎలాంటిదో తెలుస్తుందని తెలిపారు. రమణాచారి వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారన్న విలేఖరుల ప్రశ్నను కెసిఆర్ దాటవేస్తూ ఆయన పార్టీ సేవలను అన్ని రకాలుగా ఉపయోగించుకుంటామని, ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టం అని తెలిపారు. అలాగే కెవి రమణాచారిని పొలిట్ బ్లూరోలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు: మంద జగన్నాధం

  నాగర్ కర్నూల్ కాంగ్రెస్ యంపీ మంద జగన్నాధం తమ పార్టీ తెలంగాణ ఇవ్వబోదని ఈ రోజు మీడియా ముందు కుండ బద్దలుకొట్టారు. తమ పార్టీలో తెలంగాణ అంశాన్ని చూస్తున్న ఒక పెద్ద మనిషి తెలంగాణ ఇవ్వడం సాద్యం కాదనట్లు తనతో చెప్పినట్లు ఆయన మీడియాకు తెలిపారు.   తమ పార్టీ తెలంగాణ ఇవ్వదని స్పష్టం అయిపోయింది గనుక, మరో పక్క ఈ మద్యనే తెరాస అధినేత కేసీఆర్ తో రహస్యoగా సమావేశం కూడా అయినందున, తెలంగాణకు హ్యాండిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆయనే హ్యాండిచ్చి గులాభీ కారేక్కబోతునట్లు ప్రకటిస్తారని అందరూ అనుకొంటే, ఆయన మాత్రం మరికొన్ని రోజులు కాంగ్రెస్ చేయిపట్టుకొనే ముందుకు సాగాలనుకొంటున్నట్లు ప్రకటించడం విశేషం. అంటే, ఆయన కూడా కేసీఆర్ పెట్టిన ఏప్రిల్ 27 డెడ్ లైన్ లోగా కారేక్కడం కుదరదని చెప్పేసినట్లే అనుకోవచ్చును.   ఆయన మీడియాతో మాట్లాడుతూ “మా అధిష్టానం తెలంగాణ ఇవ్వదని స్పష్టం చేసినట్లయితే అప్పుడు మా భావి కార్యాచరణ ప్రకటిస్తాము. అంతవరకు మరికొన్ని రోజులు ఎదురుచూడాలనుకొంటున్నాము. మా పార్టీ అధిష్టానం తెలంగాణ మాట్లాడేవారందరినీ అసమ్మతి వాదులుగా ముద్ర వేసి దూరం పెడుతోంది. కానీ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కావూరి సాంభశివరావు వంటి వారిని మాత్రం డిల్లీకి పిలిపించుకొని, వారి వ్యక్తిగత సమస్యలపై కూడా చర్చలు జరుపుతోంది. పదవికి రాజీనామా చేసిన ఆయన, చర్చల తరువాత తన రాజీనామా ఉపసంహరించుకోవడం కూడా చూసాము. పార్టీ అధిష్టానం ఆంద్ర నేతలతో ఒకలాగ, తెలంగాణ నేతలతో మరోలా వ్యవహరిస్తోంది. ఇందుకు పార్టీలో కొందరు వ్యక్తులు మాకు వ్యతిరేఖంగా రిపోర్ట్ చేయడమే కారణం అని భావిస్తున్నాను. ఏమయినప్పటికీ, మా పార్టీ రాబోయే ఎన్నికలలోగా తెలంగాణ ప్రకటించనట్లయితే తెలంగాణ లో పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. అటువంటప్పుడు మేము మా దారి చూసుకోక తప్పదు,” అని కుండ బద్దలు కొట్టేసారు మందా వారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని కేసీఆర్ కు కూడా చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ, ఆయన ఆ విషయం సరయిన సమయంలో బయటపెట్టి పూర్తి ప్రయోజనం పొందుదామని ఆలోచిస్తుంటే, మందావారు తొందరపడి ‘మా పార్టీ తెలంగాణ ఇవ్వదు’ అని ఆ దేవరహస్యం కాస్తా ముందే బయట పెట్టేసి, కేసీఆర్ కారుకి బ్రేకులు వేసారు. ఇప్పుడు ఆయనే ఇంత స్పష్టంగా ప్రకటించేసిన తరువాత, ఇక కేసీఆర్ తనకి డిల్లీ నుండి సంకేతాలు వస్తున్నాయని చెప్పుకోవడానికే అవకాశం లేకుండా పోయింది. క్యారమ్స్ బోర్డు మీద ముందే మన మందా వారు రెడ్ కాయిన్ వేసేసిన తరువాత కేసీఆర్ చిల్లర ఎంత గలగలలాడిస్తే మాత్రం ఏమి లాభం ఉంటుంది?   పైగా ఆయన‘మా పార్టీ తెలంగాణ ఇవ్వదు. అయినా కూడా మేము మా పార్టీని వీడము’ అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఒకటి రెండు డజన్లు, తెదేపా నుండి మరో రెండు మూడు డజన్ల మంది నేతలు తమ పార్టీలోకి చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారంటూ ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ కి పుండు మీద ఇంత కారం కూడా చల్లినట్లయింది. మరి రేపటి నుండి కేసీఆర్ మళ్ళీ తన పాత పల్లవి అందుకొని కాంగ్రెస్ నేతలందరూ సన్నాసులు, దద్ధమలు, దగుల్బాజీలు, తెలంగాణ ద్రోహులు అంటూ బూతులు లంకించుకొంటే ఆ బూతులు కూడా తమ ఉద్యమంలో వ్యుహాత్మకమేనని తెరాస సర్ది చెప్పుకోవచ్చునేమో కానీ, మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ విధంగా అర్ధం చేసుకొoటారోలేదో చూడాలి మరి.

బ్రాహ్మణయ్య మృతికి చంద్రబాబు నాయుడు సంతాపం

        అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల టిడిపి ఎంపీలు హరికృష్ణ, సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు, సినీ నటుడు బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.   అంబటి బ్రాహ్మణయ్య హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తను కన్నుమూశారు. బ్రాహ్మణయ్య మృతదేహాన్ని హైదరాబాదు నుండి కృష్ణా జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఈ రోజు బ్రాహ్మణయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన విశాఖ నుండి విజయవాడకు బయలుదేరారు.   అంబటి బ్రాహ్మణయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో ఉన్నారు. అవనిగడ్డ సమితి అద్యక్షుడుగా మొదట ఎన్నికైన ఈయన, ఆ తర్వాత 1994లో బందరు నుంచి శాసనషభ్యుడిగా తొలిసారి గెలుపొందారు.1999 లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. తిరిగి 2009 లో అవనిగడ్డ నుంచి శాసనసభకు గెలిచారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం అద్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

          ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారధి ఫలితాల సీడీని విడుదల చేశారు. పలితాలను గ్రేడ్ మార్క్ లను అందరికి అందుబాటులో వుంచుతున్నట్లు తెలిపారు.   ఫలితాలు అందుబాటులో ఉండే కొన్ని వెబ్‌సైట్ అడ్రస్‌లు: www.andhrajyothy.com, http://results.cgg.gov.in, www.apit.ap.gov.in, www.vidyavision.com, www.manabadi.com, www.gnanadeep.com   ఫలితాలు తెలుసుకునే ఇతర మార్గాలు... ఈ-సేవ నుంచి ఏ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ద్వారానైనా 1100 కు డయల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ఏ ల్యాండ్‌లైన్/మొబైల్ ఫోన్ మరియు ఈ-సేవ/మీ సేవ/రాజీవ్ సిటిజన్ స ర్వీస్ సెంటర్ ద్వారానైనా 18004251110కు కాల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలోనూ తెలుసుకోవచ్చు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) ద్వారా: ఎస్‌టీడీ కోడ్ లేకుండా బీఎస్ఎస్ఎల్ ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 1255225కు డయల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు 550770కు, వోడాఫోన్ అయితే 56731కు, ఇతర సెల్ ఫోన్ల వినియోగదారులైతే 5664477కు కాల్ చేయాలి. ఎస్ఎంఎస్ ద్వారా: i. BSNL users INTER to 53345 or 53346, ii. All users IPEG1 to 5676750 for General results IPEV1 to 5676750 for Vocational results, iii. Vodafone users IPEG1 to 56730 for General results, IPEV1 to 56730 for Vocational results, iv. All users IPEG1 to 56969 for General results IPEV1 to 56969 for Vocational results., v. All users AP11 to 5888., vi. IFY to 54999, vii. All users APJI to 56767999