కెసిఆర్ పై టిడిపి తిట్ల దండకం
టిడిపి అధ్యక్షుడు కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆదివారం కెసిఆర్ ఖండించిన విషయం విధితమే. కెసిఆర్ తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి నాయకులు తిట్ల పురాణం అందుకున్నారు. కెసిఆర్ గల్ఫ్ బ్రోకర్, పొలిటికల్ లోఫర్, ఫామ్ హౌస్ లో గ్లాసులు ఎత్తడం కాదు, పార్లమెంట్ లో గొంతు ఎత్తడం కాదని టిడిపి అధికార ప్రతినిధి నర్సిరెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు. నీది తాగుబోతుల పార్టీ, వసూళ్ళ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ, తాగి ఊగే పార్టీ, తాగకుండా ఉండలేని పార్టీ, తెగ తాగి ఫామ్ హౌస్ లో పడుకునే పార్టీ అని టిడిపి ఎమ్మెల్యే నర్సారెడ్డి కెసిఆర్ పై ధ్వజమెత్తారు. టిడిపిది పాలు, కూరగాయలు అమ్ముకునే పార్టీ అని కెసిఆర్ వ్యాఖ్యానించారని అది నిజం అనుకున్నా తమది స్కాములు, బ్లాక్ మెయిళ్ళు, దోపిడీ వ్యవహారాల పార్టీ కాదని, నిర్యానీ, బీర్ల పార్టీ కాదని, అల్లుడి విద్యాసంస్థలను, కూతురు సినిమా పరిశ్రమను, కొడుకు పరిశ్రమలను ప్రజలను పిండి చేస్తుంటే కెసిఆర్ ప్రాజెక్టులను కొల్లగొడుతూ నాలుగుచేతులా సంపాదిస్తున్నాడని, బయ్యారంపై పార్లమెంటులో బయ్యారం గనులపై చర్చ జరిగితే కెసిఆర్ ఆ ఛాయలకే పోలేదని, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కు బయ్యారం భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ చంద్రబాబు బయ్యారం వెళితే ఉద్యమం ముసుగులో చంద్రబాబును అడ్డుకొనే ప్రయత్నం చేశారని తీవ్రంగా ఆరోపించారు. మరొక నాయకుడు తెలంగాణా టిడిపి ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ కెసిఆర్ డి చందాల దందా అని, తెలంగాణా సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నాడని, తమ దగ్గర ఆధారాలున్నాయని, కెసిఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.