bayyaram mines issue

బయ్యారంలో బయటపడిన కాంగ్రెస్ లుకలుకలు

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో తీసుకొంటున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతున్నట్లే వైజాగ్ స్టీల్ ప్లాంటుకు బయ్యారం గనుల కేటాయింపు కూడా ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. తొలుత ఈ అంశంపై ప్రతిపక్షాల నేతలు ఒకరినొకరు నిందించుకొంటూ కత్తులు దూసుకొంటుంటే, చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ, ఇందిరమ్మ (పగటి) కలలు కంటూ కులాసాగా తిరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు అందులోకి కాంగ్రెస్ నేతలు కూడా వేలు పెట్టడంతో సమస్య తిరిగి ఆయన మెడకే చుట్టుకొంది.   స్వంత పార్టీ వారే రెండు వర్గాలుగా చీలి, కొందరు అది జాతీయ సంపదని, మరికొందరు తెలంగాణ సంపదని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కొందరు, సాంకేతికంగా కుదరదని మరికొందరు రకరకాల వాదనలు చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. చిలిచిలికి గాలివానగా తయారయిన ఈ వివాదం ఇప్పటికే పార్టీలో సభ్యుల మద్య ఉన్నదూరాన్ని మరింత పెంచడమే కాకుండా, వారి మద్య ఉన్న తీవ్ర విబేధాలను బయట పెట్టింది. తద్వారా పార్టీలో ఎన్ని లుకలుకలున్నాయో ఒక్కసారిగా బయట పడింది.   మొదట ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం, తరువాత పెంచిన విద్యుత్ చార్జీలు, ఆ వెంటనే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులపై సీబీఐ ఆరోపణలు వంటి వరుస దెబ్బలతో సతమత మవుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందాలేదా అని తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల దృష్టి మళ్ళించే ప్రయత్నంలో తలకెత్తుకొన్న ఈ బయ్యారం అంశం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోయలేని భారంగా మారింది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు చేజేతులా తెచ్చుకొన్నపటికీ ఆయనలో మార్పు రాలేదని ఈ అంశం స్పష్టం చేస్తోంది. బహుశః ఆయన తన ‘దూకుడు’ పై మీడియాలో వస్తున్నరాజకీయ విశ్లేషణలను చూసుకొని, అది కొనసాగిస్తే మరింత సత్ఫలితాలు ఇస్తుందనే భ్రమలో మరింత దూకుడు ప్రదర్శించడం వలననే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చును. ఒక సమస్య నుండి మరొక సమస్యలోకి పయనించడమే తన పద్దతిగా మార్చుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పుడు బయ్యారం గనుల్లోకి నెట్టారు. ప్రతిపక్షాలతో ఒక ఆట ఆదేసుకొంటున్నాననే భ్రమలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా సెల్ఫ్ గోల్ చేసుకోవడం విచిత్రం.

TDP Spokes Person Revanth Reddy Challenges Sharmila

షర్మిల సవాల్ కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్

  వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ కార్యకర్త షర్మిల పాదయాత్రలో చంద్రబాబుపై చేసిన సవాల్ ను టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి స్వీకరించారు.  ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపించాలనే బయ్యారం గనులను వై.ఎస్. మంజూరు చేసినట్టు షర్మీల చెబుతున్నారని కానీ, కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ మర్నాడే ఒప్పందం కుదుర్చుకున్న విషయం షర్మిలకు తెలియదేమోనని, ఈ విషయాలను తాను అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం మందబలంతో తప్పించుకుందని, ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అనుమతి పొందిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ బంధువైన కొండలరావుకు నిజంగా 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉందా అని, కొండలరావు బ్రదర్ అనిల్ కుమార్ కు బినామీ అని, రక్షణ స్టీల్స్, బ్రదర్ అనిల్ డైరెక్టర్ గా ఉన్న మిరాకిల్ ఫార్ములేషణ్ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్ లోని డి-203, ఆదిత్య ఎలైట్, బిఎన్. మక్తా, సోమాజిగూడ అన్న చిరునామాలోనే ఉండడం ఇందుకు నిదర్శమని స్పష్టం చేశారు. మతపరమైన వ్యవహారాలూ కూడా ఈ చిరునామా నుంచే సాగించేవారని, షర్మిల ఇప్పటికైనా తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్ళిపోవాలని, షర్మిల పాదయాత్ర చేసినా, క్యాట్ వాక్ చేసినా మాకేమిటని, కొండలరావు మీ బినామీ కాకపొతే సిబీఐ తో విచారణను ఎందుకు కోరలేదని, షర్మిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ప్రభుత్వానికి విచారణ కోరుతూ లేఖ వ్రాయాలని సవాల్ విసిరారు.

 kcr botsa satyanarayana

బొత్సని టార్గెట్ చేసిన కేసీఆర్

        గత కొన్నిరోజులుగా టిడిపిని టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిపై పడ్డాడు. బొత్సవి తిక్కమాటలని తేల్చాడు. బయ్యారంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తలతిక్క మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. బయ్యారం గనులపై మే నెలలో మహా ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. బయ్యారం గనుల్లో నాణ్యత లేదని బొత్స అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బయ్యారంపై విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ పై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న సీఎం కిరణ్‌ పార్టీకి ఒక్క ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుకు ఒక్క సీటు రాకుండా చేయాలని ప్రజలకు కేసీఆర్‌ సూచించారు. మొత్తానికి బయ్యారం విషయంలో కూడా సీట్ల విషయంలోనే మాట్లాడటం కేసీఆర్ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోంది!

mohan babu

మంచువారి సపోర్ట్ వైకాపాకా లేక టిడిపికా?

  చిరంజీవితో మోహన్ బాబుకి ఉన్న వైరం పాముకి ముంగీసకి ఉన్న ఆజన్మ వైరంవంటిది. దానికి ముఖ్య కారణం తెలుగు సినిమా రంగంలో వారిద్దరి మద్య భూమ్యాకాశమంత ఉన్న తేడానే! ఇద్దరూ స్వయంకృషితో పైకి వచ్చినప్పటికీ మోహన్ బాబు ‘కలెక్షన్ కింగ్’ అనిపించుకోగలిగారు కానీ, ‘మెగా స్టార్’ అనో లేక ‘లిజండ్’ అనో అనిపించుకోలేకపోయారు. ముక్యంగా చిరంజీవిని ‘లిజెండ్’ అని అందరు మెచ్చుకొన్నపుడు, వారిద్దరూ ఒకే వేదిక మీద ఉన్నపుడే మోహన్ బాబు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా అభ్యంతరం చెప్పిన ఘనుడు. నిజం చెప్పాలంటే అప్పటి నుండే ఆయనలో ఆత్మన్యూనత కూడా మొదలయిందని చెప్పవచ్చును.   సాధారణంగా అటువంటి సమస్యతో బాధపడేవారు అందరి కంటే ఎక్కువగా వారే తమ శత్రువుని పదేపదే తలచుకొంటూ, ఏదో రకంగా వారి ప్రస్తావన తెస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిందించడం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటం చేస్తుంటారు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు.   మళ్ళీ రాజకీయాలలోకి వస్తానంటున్నమోహన్ బాబు “ఒక్క సినిమా హిట్టయిపోగానే నేనే ముఖ్యమంత్రిననుకొనే వాళ్లున్నారు,’ అని అన్న మాటలు చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమా ‘టాగూర్’ గురించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆయన రాష్ట్రంలో అవినీతిని అవలీలగా రూపుమాపినట్లు చూపించినపుడు దానికి ప్రజలనుండి బ్రహ్మాండమయిన స్పందన వచ్చింది. అదే ఊపులో ఆయన ప్రజారాజ్యం స్థాపించడం, తనకున్న విపరీతమయిన జనాధరణతో అవలీలగా ముఖ్యమంత్రి అయిపోదామనే ఆయన ఆశపడటం, కానీ పార్టీని సరిగ్గా నియంత్రించుకోలేక ఎన్నికలలో చతికిలబడి అభాసు పాలవడం, తదనంతరం జరిగిన పరిణామాలను గమనించిన మోహన్ బాబు రాజకీయాలలోకి రావాలనే తన బలమయిన కోరికను బలవంతంగా అణచివేసుకొన్నపటికీ ఆశలు వదులుకాలేదని ఆయన తాజా ప్రకటన తెలియజేస్తోంది.   “పార్టీ పెట్టే దైర్యం, దానిని అమ్ముకొనే తెలివి తేటలు నాకు లేవని” మోహన్ బాబు వ్యంగంగా పలకడం ఎవరిని ఉద్దేశించి అన్నావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవిని మనస్పూర్తిగా ద్వేషించే కొద్దిమందిలో మోహన్ బాబు కూడా ఒకరు. గనుక, చిరంజీవి కేంద్రమంత్రిగా వెలుగుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనలో మరింత ఆత్మన్యూనత పెరుగుతుందే తప్ప తరగదు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.   కొంత కాలం క్రితం ఆయన చంచల్ గూడా జైలుకి వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి రావడంతో, అందరూ ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహిస్తున్నారు. కానీ, నేడు కాకపోతే రేపయినాఆ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసే కలుస్తుందని, లేదా అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున మోహన్ బాబు ఆ పార్టీలో చేరే అవకాశాలు లేవని భావించవచ్చును. ఒకవేళ ఆ పార్టీలో జేరినా ఆ పార్టీ తిరిగి తనను చిరంజీవి ముందే నిలబెట్టే అవకాశం ఉంది గనుక ఆయన ఆ పార్టీలో చేరకపోవచ్చును. పైగా నిష్కర్షగా మాట్లాడే ఆయన ఆ పార్టీలోఎంతో కాలం ఇమడలేరు. అందువల్ల, ఆయన తెలుగు దేశం పార్టీలో జేరే అవకాశాలే ఎక్కువున్నాయి.   నందమూరి వంశంతో తనకున్న సత్సబందాలు, అభిమానం అందుకు ఒక కారణమయితే తన ప్రియ శత్రువు చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కొని ఆయనను మనసారా ఎండగట్టాలంటే అందుకు అనువయిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీయే గనుక, ఆయన ఆ పార్టీలోకే తిరిగి ప్రవేశించవచ్చును.   అయితే, తనకి పదవులు, అధికారం మీద ఎంత మాత్రం ఆసక్తి లేదని కేవలం పార్టీ ప్రచారంలో పాల్గొనడంపైనే ఆసక్తి ఉందని ఆయన చెప్పడం వెనుక ఉన్న బలమయిన కారణం కనీసం జీవితంలో ఒక్కసారయినా మనసారా తన ప్రియ శత్రువుని చీల్చిచెండాడగలిగితే ఆయన అహం శాంతించవచ్చును. అందుకే ఆయన ఇప్పుడు రాజకీయాలలో ప్రవేశించడం, ప్రచారంలో పాల్గొనడం గురించి మాట్లాడుతున్నారిప్పుడు. ఆయనలో ఆ అహం శాంతించితే ఎన్నికల అనతరం మళ్ళీ రాజకీయాలకి దూరం వెళ్లిపోవచ్చును.

balakrishna

అన్నగారి శత్రువులు..బాలయ్య కు మిత్రులు!

  నందమూరి వంశానికి, వారి స్వగ్రామం నిమ్మకూరుకి ఉన్నప్రత్యేక అనుబంధం గురించి అందరికి తెలిసిన విషయమే. స్వగ్రామం అంటే ప్రాణాలు పెట్టే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తన ప్రతీ పధకాన్ని నిమ్మకూరు నుండే ప్రారంభం కావాలని కోరుకొనేవారు. సాధారణంగా అటువంటి గ్రామాలలో స్థానిక నేతల చేతుల్లో జరిగే శంకు స్థాపనల వంటి చిన్నచిన్న కార్యక్రమాలకు కూడా స్వగ్రామంపై అభిమానంతో ఆయనే స్వయంగావచ్చి తన స్వహస్తలతో చేసేందుకు ఇష్టపడేవారు.   నిమ్మకూరు అంటే అంత వెర్రి అభిమానం చూపే ఆయన, 1987 ఆగస్టులో నిమ్మకూరు పర్యటించనున్న తరుణంలో, కారణాలు ఏవయినప్పటికీ ఆయన తోడల్లుడు నందమూరి చంద్రం కుమారుడు వెంకటరత్నం,  పార్టీ జెండా దిమ్మెను స్వయంగా తన ట్రాక్టర్ తో కూలగొట్టడంతో, తీవ్ర కలత చెందిన యన్టీఆర్ ఇక మళ్ళీ తన జీవితంలోఆ గ్రామంలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, ఆ తరువాత ఎంత మంది నచ్చజెప్పాలని చూసినా, ఎవరెన్ని సార్లు క్షమాపణలు కోరినా ఆయన తన మనసు మార్చుకోలేదు. స్వంత బందువయి ఉండి కూడా తను స్థాపించిన పార్టీ జెండాని అవమానించారనే బాధతో వారి కుటుంబాన్నికూడా చనిపోయే వరకు దూరంగానే ఉంచారు. ఆ తరువాత కూడా యన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా వెంకటరత్నంని కానీ, ఆయన కుటుంబ సభ్యుల వైపు కానీ కన్నెత్తి చూడలేదు.   అయినప్పటికీ, వారందరికీ నేటికీ నిమ్మకూరు అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది. అదేవిధంగా నిమ్మకూరు వాసులకు కూడా నందమూరి కుటుంబం అంటే ఎనలేని అభిమానం. అయితే, ఆనాడు జరిగిన దానిని ఇంకా మనసులో పెట్టుకొని తన వారిని తన గ్రామాన్ని దూరం చేసుకోవడం ఎందుకనుకున్నారో, లేక పార్టీలో మారుతున్న సమీకరణాలకు అనువుగా తను కూడా బలం పెంచుకోవాలని తలచేరో తెలియదు కానీ, నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఆగ్రహానికి గురయిన తమ బందువు వెంకటరత్నం ఇంట్లో చాలా ఏళ్ల తరువాత ఈ మద్యనే అడుగు పెట్టారు. అంతే కాకుండా ఆయన కుమారుడు శివరామకృష్ణ ఇంట్లో కూడా బస చేశారు. అయితే, అదే ఊరిలో జూ.యన్టీఆర్ నెలకొల్పిన తన తల్లితండ్రుల విగ్రహలవైపు ఆయన కన్నెత్తి చూడకపోవడంతో, అక్కడ నివసిస్తున్న నందమూరి వంశస్తులు కోరిక మీద విగ్రహాలకు పూలమాలలు వేసి, అక్కడి నుండి మళ్ళీ నేరుగా శివరామకృష్ణ ఇంటికి వెళ్ళిపోయారు.   బాలకృష్ణ ఈ విధంగా అకస్మాత్తుగా వారిపట్ల ఇంత అభిమానంగా వ్యవహరించడం అక్కడి ప్రజలనే కాకుండా, వెంకటరత్నం అతని కుమారుడు శివరామకృష్ణలను కూడా ఆశ్చర్య పరిచింది. అయితే, ఇందుకు కారణాలు ఇదమిద్ధంగా ఎవరూ చెప్పలేకపోయినప్పటికీ, తన సోదరుడు హరికృష్ణతో, అతని కుమారుడు జూ.యన్టీఆర్ తో పెరిగిన దూరం వల్లనే ఆయన తన స్వగ్రామంలో నివశిస్తున్న నందమూరి వంశస్తులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చును.   అంతే గాక, వచ్చే ఎన్నికలలో తప్పకుండా శాసనసభకే పోటీ చేస్తానని పదేపదే చెపుతున్న బాలకృష్ణ బహుశః నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజక వర్గం నుండే పోటీ చేయాలని భావిస్తునట్లయితే, ఆ ప్రయత్నాలలో భాగంగానే పాత విబేధాలు పక్కన పెట్టి, మళ్ళీ తనవారి మద్దతు కూడగట్టుకొంటునారని భావించవచ్చును.   జూ.యన్టీఆర్ స్థాపించాడనే కారణంతో, తన తల్లితండ్రుల విగ్రహాలకు కూడా బాలకృష్ణ పూలదండలు వేయడానికి ఇష్టపడక పోవడం చూస్తే, ఆయనకి తన సోదరుడు హరికృష్ణపై, అతని కుమారుడు జూ.యన్టీఆర్ పై ఎంత కోపం ఉందో అర్ధం అవుతోంది. ఇక, బాలకృష్ణ చర్యలకు ఆయన సోదరుడు ఎటువంటి ప్రతిచర్యలు ప్రదర్శిస్తారనే దానిని బట్టి బాలకృష్ణ అంతర్యం అర్ధం చేసుకొనే వీలుంటుంది.   కానీ, తన తండ్రి వద్దనుకొన్నవెంకటరత్నం, అతని కుమారుడు శివరామకృష్ణలను కూడా అక్కున చేర్చుకొనేందుకు సిద్దపడుతున్న బాలకృష్ణ, స్వయాన్న తన సోదరుడిని, అతని కుమారుడిని ద్వేషించడం, దూరం చేసుకోవడం సమంజసంగా లేదు. ఈ రోజు వారినిరువురినీ ద్వేషించి, మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఇదే విధంగా మనసు మార్చుకొని పాత కక్షలను, మనస్పర్ధలను పక్కన బెట్టి కలుసుకొందామని ఆయన భావించవచ్చును. కానీ, అప్పటికే చాలా ఆలస్యం, తిరిగి చక్కదిద్దుకోలేనంత నష్టం జరిగిపోయి ఉంటుంది.   మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లను ఆయుధంగా చేసుకొని తమతో ఆడుకోగలిగిదంటే కారణం వారి ఈ బలహీనతలు అది కనిపెట్టగలిగినందునేనని చెప్పవచ్చును. అందుకే పెద్దలు ‘ఇంటి గుట్టు లంకకు చేట’న్నారు.

Ex-Chief Minister K. Rosaiah Joined in Vijayawada Hospital

మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఆశ్వస్థత

  ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య స్వల్పంగా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కృష్ణాజిల్లా పోరంకిలోని ఆర్యవైశ్య సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రోశయ్య సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిణామంతో తేరుకున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హుటాహుటిన రోశయ్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడినుండి రోశయ్యను విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి డాక్టర్లు రోశయ్యను మూడు గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. రోశయ్య ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పార్థసారథి వివరించారు. రోశయ్య అధిక రక్తపోటుతో బాధపడుతుండగా ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని తెలిసింది.

Mohan babu chiranjeevi

చిరంజీవి పై మోహన్ బాబు సెటైర్!

        కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎలాంటి వేదికైనా, ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకొని పరోక్షంగా సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా మోహన్ బాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ రాజకీయాలలోకి వస్తానని, అయితే ఏ పార్టీలో తాను చేరేది త్వరలో చెబుతానని, పార్టీ పెట్టే ధైర్యం లేదని, ఆ పార్టీ పెట్టి సంపాదించుకునే ధైర్యం కాని లేవని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.   తనకు పదవులపై ఆసక్తి లేదనీ, తాను రాజకీయాల్లోకి వస్తే పదవులు ఆశించనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూస్తానని అన్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని అన్నారనే చర్చ సాగుతోంది. అయితే కొందరు మాత్రం మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అన్నాడని,  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై మోహన్ బాబు సెటైర్ వేసి ఉంటారని అనుకుంటున్నారు.

sharmila

షర్మిల పాదయాత్ర ఆపేస్తే ప్రళయం వస్తుందా?

  షర్మిల సవాళ్ళు చూస్తే, ‘కొండకు వెంట్రుక ముడేసి లాగితే వస్తే కొండ కదిలి వస్తుంది, లేకుంటే పోయేది వెంట్రుకే’నన్నట్లుంది. బయ్యారం గనులలో తన భర్త అనిల్ కుమార్ కు, రక్షణ స్టీల్స్ లో తనకు వాటాలున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న తెరాస, తెదేపా నాయకులు మరియు ఆ పార్టీ అధినేతలు దానిని నిరూపిస్తే తన పాదయాత్రను వెంటనే విరమించుకొని ఇంటికి వెళ్ళిపోతానని, లేకుంటే వారు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని సవాళ్ళు విసురుతున్నారు.   ఆమె సవాళ్ళకు తెదేపా, తెరాసలు ఇంతవరకు స్పందించలేదు. కానీ, షర్మిల పాదయాత్ర ఆపేస్తే భూమి తలక్రిందులయిపోదు, ప్రళయం వచ్చిపడిపోదు. ఆమె తన పార్టీ ప్రచారం కోసం పాదయాత్ర చేస్తున్నారు తప్ప, దానివల్ల ప్రజలకి ఒరిగేదేమిలేనపుడు, తను పాదయాత్ర ఆపేస్తానని బెదిరించడం వల్ల ఎవరికీ నష్టం? అందువల్ల ఏమయినా నష్టం జరిగితే ఆమె పార్టీకే జరుగుతుందేమో తప్ప ప్రజలకి వచ్చే నష్టం ఏమిలేదు. ఒకవేళ ఆమెకు పాదయాత్ర చేయడం కష్టంగా ఉన్నట్లయితే, ఆమె నిరభ్యంతరంగా విరమించుకొని ఇంటికి వెళ్లిపోవచ్చును. అందుకు అభ్యంతరం చెప్పేవారుండరు. చెప్పినా ఆమె వారికి సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు కూడా. కానీ పాదయాత్ర విరమించుకోనేందుకు, ఈవిధమయిన కుంటిసాకులు వెతుకోవడం అనవసరం.   తన పాదయాత్రని, ప్రతిపక్షనేతల పదవులకి బోడి గుండుకి మోకాలుకీ ముడి పెట్టినట్లు ముడి పెట్టి కీలకమయిన పార్టీ అధ్యక్ష పదవులకి రాజీనామా చేయమని ఆమె కోరడం హాస్యాస్పదం. అంతగా అయితే ఆమె చంద్రబాబును ఆరోపణలు నిరూపించలేకపోతే ఆయన కూడా పాదయాత్ర ఆపగలరా? అని సవాలు చేసుకొంటే కొంచెం సబబుగా ఉంటుంది.   రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. కానీ ఏవీ నిరూపింపబడిన దాఖలాలు లేవు. అదేవిధంగా పార్టీ నేతలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు చేసుకోవడం కూడా సహజమే. కానీ ఎవరూ దైర్యం చేసి ముఖాముఖి చర్చకు కూర్చొన్న దాఖలాలు లేవు. ఒకవేళ టీవీ చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నా ఎదుట వారు చెప్పినదానికి సమాధానం చెప్పేబదులు, పెద్ద గొంతులతో అరుచుకొని సమస్య నుండి బయటపడటం కూడా ఒక విజయవంతంగా అమలు పరుస్తున్న ఒక పద్దతిగా మారిపోయింది.   ఇటువంటి పరిస్థితుల్లో తెదేపా, తెరాసలు చేస్తున్న ఆరోపణలు కానీ, దానికి షర్మిల విసురుతున్న ప్రతి సవాళ్ళు కానీ కేవలం ప్రజలను ఆకట్టుకోవడానికి, నిజాయితీగా ఒప్పుకొంటే అవి ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప వేరే ప్రయోజనం లేదు. వారందరూ వాదనల్లో నిజంగా బలం ఉందని నమ్మినట్లయితే, ఈ విధంగా ప్రజలను మభ్య పెట్టేబదులు ఆ విషయం కోర్టుకు వెళ్లి తెల్చుకొంటే మంచిది. అప్పుడు దొంగలెవరో, దొరలెవరో కోర్టులే తేల్చి చెప్పుతాయి.

Dhoni’s depiction as Lord Vishnu holding shoe sparks protest

మరో వివాదంలో ధోనీ

  టీం ఇండియా కెప్టెన్ ప్రస్తుత ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ వివాదంలో చిక్కుకున్నాడు. గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ అనే టైటిల్ తో 'బిజినెస్ టుడే' అనే మ్యాగజైన్ కవర్ పేజీ పై విష్ణుమూర్తి అవతారంలో కనిపించాడు. ఈ ఫోటోలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను చేతులతో పట్టుకుని కనిపించాడు. అయితే ఒక చేతిలో షూ కూడా పట్టుకుని కనిపించాడు. హిందువులు ఆరాధించే విష్ణుమూర్తిని ఇలా అవమానించడంపై, తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ధోనీపైన, బిజినెస్ మ్యాగజైన్ పైన కేసు నమోదు చేయాలని హిందూ మతసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. పంజాబ్ లోని బొహ్రీచౌక్ లో నిరసనకారులు భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

Mohan babu Politics

మోహన్ బాబు ఏ పార్టీలోకి?

      తెలుగు సినిమా ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''ఇవాళ ఒక్క సినిమా హిట్టయితే 'నేనే ముఖ్యమంత్రి' అనుకునే వాళ్లున్నారు. కానీ అది కొంతమందికే చెల్లింది. సినిమా వేరు. రాజకీయం వేరు. ప్రజలకు నిజంగా మేలు చేసేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు'' అని అన్నారు. 2014లో తాను రాజికియల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరతాననేది ఇప్పుడే చెప్పను. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. చేరేది పాత పార్టీయా, కొత్త పార్టీయా అనేది అప్పుడే చెబుతా. దైవసాక్షిగా చెబుతున్నాను. నేను ఏ పార్టీలో చేరితే దానికి ప్రచారం కోసం వెళ్తాను తప్ప మనసా, వాచా ఒక పదవి అలంకరించాలని లేదు. రాజకీయంగా నేను నెంబర్‌వన్ కావాలని కోరుకోవడం లేదని చెప్పారు.

mukesh ambhani

అంభానీ రక్షణపై మాట మార్చిన హోంశాఖ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటడ్ అధినేత ముకేష్ అంభానీకి ‘జెడ్’క్యాటగిరీ రక్షణ ఇవ్వనున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన హోంమంత్రిత్వ శాఖ, ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు, మీడియాలో ఈ విషయమై జరుగుతున్న చర్చలకు జడిసి మాట మార్చిందిప్పుడు.   హోంశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ “ఎవరయినా వ్యక్తులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని రుజువుచేసే సరయిన ఆధారాలతో మమ్మల్ని సంప్రదించినట్లయితే, మేము ఆ అభ్యర్ధనను నిఘా వర్గాలకు అందజేసి విచారణ చేయిస్తాము. ఒకవేళ, వారు దానిని దృవీకరిస్తే, మేము తగిన భద్రత కల్పించేందుకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కకట్టి సదరు వ్యక్తులకు తెలియపరుస్తాము. దానికి వారు అంగీకరించినట్లయితే మేము సుశిక్షితులయిన మా సి.ఆర్. పీ.యఫ్. సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేస్తాము. ముకేష్ అంభానీకి జెడ్ క్యాటగిరీ భద్రతా కల్పించడానికి నెలకు రూ.15లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాము,” అని మీడియాకు తెలిపారు. కానీ, వారు వేసిన అంచనా మొత్తం ప్రతీనెలా చెల్లించేందుకు ముకేష్ అంభాని సుముకత వ్యక్తం చేసారా లేదా? అనే విషయంపై సమాధానం దాటవేశారు. అంటే, ప్రభుత్వం బహుశః అంభానీకి ఉచిత సేవలు అందజేసే ఆలోచనలో ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.   సీపీఐ పార్లమెంటు సభ్యుడు ఏపీ. బర్ధన్ పార్లమెంటులో ప్రభుత్వాన్నితీవ్రంగా విమర్శిస్తూ “దేశ రాజధానిలో సైతం స్త్రీలకు, చిన్నారులకు రక్షణ కల్పించలేని సిగ్గులేని ఈ ప్రభుత్వం, కొట్లాదిపతి అయిన అంభానీకి మాత్రం ప్రత్యేకరక్షణ ఏర్పాట్లు చేసేందుకు తెగ ఆత్రుతపడుతోంది. ప్రభుత్వం కార్పోరేట్ పెద్దల సేవలో తరించాలని ఉవ్విళ్ళూరడం సిగ్గుచేటు. సామన్య ప్రజల భద్రతకు పైసా ఖర్చు పెట్టాలంటే వెనకాడే ప్రభుత్వం, స్వయంగా స్వంత భద్రతా ఏర్పాట్లు చేసుకోగల అంభానీకి, ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నుల నుండి సొమ్మును ధారాపోసి భద్రత కల్పించాలనుకోవడం, సామన్య ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి అది నడిపిస్తున్న ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో తెలియజేస్తోంది,” అని తీవ్రంగా విమర్శించారు.   కొసమెరుపు ఏమిటంటే, నిన్నహోంమంత్రి సుషీల్ కుమార్ షిండే లోక్ సభలో ప్రతిపక్షాల విమర్శలకు జవాబిస్తూ “ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేవలం ఒక్క డిల్లీలోనే అత్యాచారాలు జరగట్లేదు. యావత్ భారత దేశంలో జరుగుతున్నాయి,” అని నిర్లజ్జగా చెప్పడం విశేషం. ప్రతిపక్షాలు మళ్ళీ అయన మీద దుమ్మెత్తి పోస్తే గానీ,తానూ మాట్లాడిన మాటల్లో పొరపాటును ఆయన గ్రహించలేకపోయారు.

Court issues NBW against Sanjay Dutt; actor appears and gets bail

మరో కేసులో సంజయ్ దత్

  నూరానీ ప్రొడ్యూసర్ గా 'జాన్ కి బాజీ' చిత్రంలో నటించడానికి సంజయ్ దత్ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. సగం సినిమా పూర్తయిన తరువాత సినిమా షూటింగ్ లలో పాల్గొనకుండా, తను ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బులు అడిగితే తనను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయని నూరానీ తరపు న్యాయవాది నీరజ్ గుప్తా పిటీషన్లో పేర్కొన్నాడు. గత ఫిబ్రవరి 13న అంథేరీ మెట్రోపాలిటన్ కోర్టులో షకీల్ ఫిర్యాదు చేశాడు. కోర్టుకు హాజరుకావాలని రెండుసార్లు కోర్టు సమన్లు పంపినా సంజయ్ దత్ పట్టించుకోలేదు. దాంతో అంథేరీ మెట్రోపాలిటన్ కోర్టు సంజయ్ దత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అందుకున్న సంజయ్ దత్ సోమవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. కోర్టు సంజయ్ దత్ కు బెయిల్ మంజూరు చేసింది.

Justice JS Verma

నిర్భయ చట్ట రూపకర్త వర్మ మృతి

  నిర్భయ చట్ట రూపకర్త జస్టీస్ వర్మ సోమవారం రాత్రి 9.30 నిముషాలకు మృతి చెందినట్లు గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ వైద్యులు ధృవీకరించారు. శుక్రవారం ఆయన కడుపులో రక్తస్రావంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వర్మను హాస్పిటల్ కు తీసుకువచ్చారని, అప్పటికే ఆయన కాలేయం పూర్తిగా విఫలమైందని మేదాంత మెడిసిటీ వైద్యులు తెలిపారు. న్యూఢిల్లీ లోల నిర్భయపై జరిగిన లైంగిక దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం జస్టీస్ వర్మ నేతృత్వంలో తిసభ్య కమిటీని నియమించింది. ఈ ప్యానెల్ అత్యాచార నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి, కొన్ని సిఫారసులతో కేవలం 29 రోజుల్లో నివేదిక సమర్పించింది. అందులోని కొన్ని సూచనల ఆధారంగా రూపొందించిన నిర్భయ చట్టాన్ని పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. ఎన్డీటీవీ ఈ నెల 15న ఆయనకు ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో గౌరవించింది. జస్టీస్ వర్మ (80) జనవరి18వ తేదీ 1933 సంవత్సరంలో జన్మించారు. 1955 లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1973లో మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, 1986 జూన్ లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నియమితులయ్యారు.1989 సెప్టెంబర్ నుంచి 1989 మధ్య కాలంలో రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నియమితులైన ఆయన 1997 మార్చి 25 నుంచి 1998 జనవరి 18 దాకా సుప్రీం కోర్టు 27వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి  రిటైరయ్యారు. జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ గా కొంతకాలం సేవలు అందించారు. న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారటీ తొలి చైర్ పర్సన్ గా కూడా సేవలందించారు. జస్టీస్ వర్మ మృతిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

KCR and his family members have been collecting money for themselves

కెసిఆర్ పై టిడిపి తిట్ల దండకం

  టిడిపి అధ్యక్షుడు కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆదివారం కెసిఆర్ ఖండించిన విషయం విధితమే. కెసిఆర్ తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి నాయకులు తిట్ల పురాణం అందుకున్నారు. కెసిఆర్ గల్ఫ్ బ్రోకర్, పొలిటికల్ లోఫర్, ఫామ్ హౌస్ లో గ్లాసులు ఎత్తడం కాదు, పార్లమెంట్ లో గొంతు ఎత్తడం కాదని టిడిపి అధికార ప్రతినిధి నర్సిరెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు. నీది తాగుబోతుల పార్టీ, వసూళ్ళ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ, తాగి ఊగే పార్టీ, తాగకుండా ఉండలేని పార్టీ, తెగ తాగి ఫామ్ హౌస్ లో పడుకునే పార్టీ అని టిడిపి ఎమ్మెల్యే నర్సారెడ్డి కెసిఆర్ పై ధ్వజమెత్తారు. టిడిపిది పాలు, కూరగాయలు అమ్ముకునే పార్టీ అని కెసిఆర్ వ్యాఖ్యానించారని అది నిజం అనుకున్నా తమది స్కాములు, బ్లాక్ మెయిళ్ళు, దోపిడీ వ్యవహారాల పార్టీ కాదని, నిర్యానీ, బీర్ల పార్టీ కాదని, అల్లుడి విద్యాసంస్థలను, కూతురు సినిమా పరిశ్రమను, కొడుకు పరిశ్రమలను ప్రజలను పిండి చేస్తుంటే కెసిఆర్ ప్రాజెక్టులను కొల్లగొడుతూ నాలుగుచేతులా సంపాదిస్తున్నాడని, బయ్యారంపై పార్లమెంటులో బయ్యారం గనులపై చర్చ జరిగితే కెసిఆర్ ఆ ఛాయలకే పోలేదని, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కు బయ్యారం భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ చంద్రబాబు బయ్యారం వెళితే ఉద్యమం ముసుగులో చంద్రబాబును అడ్డుకొనే ప్రయత్నం చేశారని తీవ్రంగా ఆరోపించారు. మరొక నాయకుడు తెలంగాణా టిడిపి ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ కెసిఆర్ డి చందాల దందా అని, తెలంగాణా సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నాడని, తమ దగ్గర ఆధారాలున్నాయని, కెసిఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.

ysr congress

నెల్లూరు వైకాపాలో ముసలం

  ఫ్లెక్సీ బ్యానర్లతో ఎదుట పార్టీలో చిచ్చుపెట్టి చంకలు కొట్టుకొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ కన్వీనర్ పదవులను భర్తీ చేసేప్రయత్నంలో ఇప్పుడు స్వంత పార్టీలోనే చిచ్చు రగులుతోంది. ఒక జిల్లాలో మొదలయిన ఈ చిచ్చు మరో జిల్లాకు దావానంలా వ్యాపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీలో మంటలు రగులుకొన్నాయి.   జిల్లాలో పార్టీకి బలమయిన పునాది వేసిన యం.పీ.మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభీష్టానికి వ్యతిరేఖంగా కాకాని గోవర్దన్‌రెడ్డిని జిల్లా కన్వీనర్ నియమించడంతో మొదలయిన ఈ యుద్ధం చివరకు కాకాని రాజీనామా వరకు చేరింది. రాబోయే ఎన్నికలలో జిల్లాలో పార్టీని గెలిపించుకోవాలంటే తన బంధువు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి, నెల్లూరు అర్బన్ నియోజకవర్గానికి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన తన అనుచరుడు మురళికి పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డి గట్టిగా కోరుతున్నారు.   అయితే, కాకాని పార్టీ అధిష్టానంతో మాట్లాడి నెల్లూరు రూరల్‌కు పార్టీ అభ్యర్ధిగా కాటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, నెల్లూరు అర్బన్‌కు బీసిసామాజిక వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌యాదవ్‌లకి పార్టీ అభ్యర్దులుగా ఖరారు చేయించినట్లు వార్తలు రావడంతో మేకపాటి భగ్గుమన్నారు.   ఈ సమస్యకు మూల కారణమయిన కాకానినే పదవిలోంచి తప్పించడం మంచిదని భావించిన మేకపాటి తన అనుచరుల ద్వారా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, కన్వీనర్ గా మురళిని నియమించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, రెడ్లప్రాబల్యం అధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ కన్వీనర్ గా అదే వర్గానికి చెందిన తాను ఉండటమే పార్టీకి మేలని కాకాని గోవర్ధన్‌రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించగలిగిన్నపటికీ, అలకబూనిన ఎంపి మేకపాటిని శాంతపరిచేoదుకు, కాకానిని జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పించి, ఆయన సూచించిన మరళినే పార్టీ కన్వినర్‌గా ఎంపికచేయాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలియడంతో, వెంటనే కాకాని కూడా మేకపాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డికి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకూ లేఖలు వ్రాసారు.   మేకపాటి జిల్లాలో పార్టీ పదవులను, జిల్లాలో పలునియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికలలో పార్టీ టిక్కెట్లు ఇప్పటి నుండే అమ్ముకొని ఆశావహులనుండి డబ్బులు భారీగా డబ్బు దండుకొంటున్నారని ఆరోపిస్తూ లేఖలు వ్రాయడమే కాకుండా, తనను అప్రదిష్టపాలు చేస్తునందున కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ వ్రాశారు.   ఇక, తమకు అనుకూలంగా పార్టీ నిర్ణయం ప్రకటించకపోతే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో తెలియ జేసేందుకు, మేకపాటి సోదరుడు-ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో సహా కలిసి వెళ్లి, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి సభలకు హాజరయ్యారు. జగన్ మోహన్ రెడ్డి ని ఉరి తీయాలని, వైయస్సార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు వెలివేయాలన్నమంత్రి ఆనం సభకే వారు వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. అయితే, తమ ఉద్దేశ్యం కేవలం పార్టీకి హెచ్చరికలు జారీ చేయడమే కనుక, సభలోమంత్రి అనం వైఎస్ పేరును ప్రస్తావించలేదన్నసాకుతో వారు సభనుంచి అర్ధంతరంగా బయటకొచ్చేసారు. దీనితో కంగు తిన్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమిచేయాలో, ఎవరిని వదులుకోవాలోతెలియక జైల్లో తలపట్టుకొని కూర్చొన్నారు.

జగన్ సినిమా అట్టర్ ఫ్లాప్

        ప్రజాప్రస్థానం పేరిట వైసీపీ నేత షర్మిల చేపట్టిన పాదయాత్రపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ఫెయిల్యూర్ స్టోరీ అని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ అన్నారు. కడప సీటు ఇవ్వలేదని అలకయాత్ర చేస్తున్నారని విమర్శించారు. పీఆర్‌పీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని, జగన్ సినిమా రిలీజ్ కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పెట్టాల్సింది ఎన్టీఆర్, మహేష్‌బాబూ ఫోటోలు కాదని దుర్యోదనుడు, దుశ్శాషనుడు, రావణాసురుడు, సూర్పనఖ ఫోటోలు పెట్టుకోవాలని రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర పరుగు పందెంగా మారిందని మరోనేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. పాదయాత్రలో షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. స్థాయి మరిచి చంద్రబాబును విమర్శించినందుకే కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర తిరస్కరణకు గురైందన్నారు. పులిచింతల, బందరు పోర్టు నిర్మాణంలో భారీగా ముడుపులు తీసుకున్నారన్నారు. రక్షణ స్టీల్స్ షర్మిల బినామీ సంస్థ అని దేవినేని ఉమా ఆరోపించారు.

త్వరలో మరో ప్రాంతీయవాద పార్టీ

  తెరాస సృష్టించిన ప్రాంతీయ విబేదాలతో సాంకేతికంగా ఇంకా రాష్ట్రం చీలకపోయిన ప్రజలు మాత్రం ఎప్పుడో చీలిపోయారు. తెరాస చేస్తున్న ఉద్యమాల ప్రభావం కేవలం తెలంగాణ జిల్లాల మీదనే కాక యావత్ రాష్ట్రoపై, రాష్ట్రంలో అన్ని రంగాలపై పడటంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమయింది. ఉద్యమాలు చేస్తున్న నాయకులకి, వాటిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి పెద్దగా తేడా చేయకపోయినా, ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న నిరుపేదలు కూడా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తోంది. రాష్ట్రంలో నేడు నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకి ఈ ఉద్యమం మొదటి కారణం కాగా, ప్రభుత్వ అసమర్థత, అవినీతి రెండో కారణంగా చెప్పవచ్చును.   ఇటువంటి నేపద్యంలో, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలoటూ ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ని స్థాపించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ పై రాయలసీమ జిల్లా యాత్రలు చేస్తూ తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరిoఛి వారిని క్రమంగా ఉద్యమం దారి పట్టిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తమ ప్రాంతానికి న్యాయం చేయలేదని, చివరికి కర్నూలు నగరం రాజధాని అయ్యే అవకాశాన్ని కూడా తమవారే పాడుచేసారని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక ప్రత్యేక రాష్ట్రo ఏర్పడటం ఒకటే మార్గం అని ఆయన అన్నారు. అందుకోసం త్వరలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తన పార్టీ పేరు, సభ్యుల పేర్లు తదితర వివరాలు ప్రకటిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

గన్నవరం నుండి పోటీకి హరికృష్ణ ఆసక్తి

  ఫ్లెక్సీ బ్యానర్లతోనందమూరి సోదరుల మద్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన చిచ్చుఇంకా నివురు గప్పిన నిప్పులా రగులుతోనే ఉందని మీడియాలో కొత్తగా షికారు చేస్తున్నపుకార్లు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికలలో హరికృష్ణ గన్నవరం నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తని హరికృష్ణ కానీ జూ.యన్టీఆర్ గానీ దృవీకరించలేదు, ఖండించలేదు. ఒకవేళ నిజంగా ఆయన గన్నవరం నుండే పోటీ చేయదలిస్తే ముందుగా సిట్టింగ్ యంయల్యే దాసరి బలవర్ధాన్ రావు, అక్కడి నుండి పోటీ చేయాలనుకొంటున్న వల్లభనేని వంశీకి ఇబ్బందులు మొదలయినట్లే. అప్పుడు హరికృష్ణను కాదనలేని తెదేపా, అదే నియోజకవర్గం నుండి పోటీచేయాలని పట్టుదలతో ఉన్నవారిద్దరికీ నచ్చజెప్పడం, వారిని మరో నియోజక వర్గానికి పంపి అక్కడి వారితో మళ్ళీ శిగపట్లు పట్టడం అనివార్యం అవుతుంది. బహుశః ఈ ఆలోచనతోనే హరికృష్ణ గన్నవరం ఎంచుకొన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే, ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ మొదలు పెట్టిన మరో మైండ్ గేమ్ అయ్యున్దవచ్చును. ఏది ఏమయినప్పటికీ, మళ్ళీ హరికృష్ణ మరో మారు మీడియా ముందుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోక తప్పనిసరి పరిస్థితి సృష్టించింది.