నటితో ఎంపీ చిలిపి చేష్టలు!

  మలయాళ నటి శ్వేతా మీనన్ పట్ల కేరళ ఎంపీ పీతాంబర కురువ్ అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నటి శ్వేతా మీనన్ కూడా ధ్రువీకరించారు. కేరళలోని కొల్లాంలో జరిగిన పడవల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని, అక్కడ ఒక రాజకీయవేత్త తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్వేతా మీనన్ తనతో అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయవేత్త పేరు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంలో తాను కేరళ సీఎం ఊమెన్ చాందీని కలసి ఆ రాజకీయవేత్త పేరును ఆయనకే చెబుతానని శ్వేతామీనన్ ప్రకటించారు.   అయితే ఆ కార్యక్రమంలో శ్వేతామీనన్‌తోపాటు ఎంపీ పీతాంబర కురువ్ కూడా పాల్గొనడంతో మీడియా మొత్తం పీతాంబర కురువన్ శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు ప్రసారం చేసింది. అయితే ఎంపీ పీతాంబర కురువన్ మాత్రం తనమీద వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇంతకీ శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని భావిస్తున్న ఎంపీ పీతాంబర కురువ్ వయసు ఎంతో తెలుసా... 73 సంవత్సరాలు.

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం

  దీపావళి పండుగ హాడావిడి కొదంరి జీవితాల్లో మాత్రం చీకటిని నింపింది. ఎన్నో ఆశలతో తమ కుటుంబాలను కలుసుకోవాటానికి వెళుతున్న చాలా మంది ప్రయాణికులు రైలు ప్రమాదంలో మరణించారు. విజయనగరం జిల్లాలోని గొట్లాం స‌మీపంలో ఈ పెనువిషాదం చోటుచేసుకుంది. రైలు కింద‌ప‌డి 8 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.    సిగ్నల్‌ రాకపోవటంతో బొకారో సమీపంలో రైలు ఆగని సమయంలో ఎస్‌1 ఎస్‌ 2 భోగిల్లో మంటలు వస్తున్నట్టుగా వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలునుంచి దూకి ఒక్కసారిగా పక్కట్రాక్‌ మీదకు వచ్చారు. అదే సమయంలో పక్కట్రాక్‌ పై వచ్చిన విజయవాడ ప్యాసింజర్‌ ప్రయాణికులను డీ కొట్టింది.   శనివారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఒక్క‌సారిగా ఢీకొట్ట‌డంతో ట్రాక్‌పై మృత‌దేహాలన్ని చిధ్ర‌మైయ్యాయి. తెగిప‌డిన అవ‌య‌వాల‌తో ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయింది. ప్  

రోహిత్‌ శర్మ రికార్డ్‌

  దీపావళి ఒక రోజు ముందుగానే క్రికెట్‌ అభిమానులకు పండుగ వచ్చింది.. సాధారణ స్కోర్‌ చేయటమే కష్టం అనుకున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ వీరోచిత ఇన్నింగ్స్‌ తో  భారత్‌ తిరుగులేని స్కోర్‌ను సాదించింది. అంతేకాదు ఈ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ తన కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ 209ని సాధించాడు. దీంతో 200 మార్క్‌ దాటిన మూడో భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రోహిత్‌ శర్మ.   గతంలో సచిన్‌, సెహ్వాగ్‌లు మాత్రమే సాదించిన ఈ రికార్డ్‌ను రోహిత్ అది కొద్ది సమయంలోనే అందుకున్నాడు. 158 బాల్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ, 16 సిక్స్‌ లు , 12 ఫోర్లతో 209 పరుగులు చేశాడు. రోహిత్‌ దూకుడుకు థావన్‌ 60, ధోని 62 పరుగులు తోడై భారత్‌ 383 పరుగుల భారీ స్కోర్‌ను ఆస్ట్రేలియా ముందుంచింది. రోహిత్‌ ఇన్నింగ్స్‌ చూసిన క్రికెట్‌ పండితులు సచిన్‌ రిటైర్‌మెంట్‌ తరువాత కూడా భారత క్రికెట్‌ కు ఎటువంటి ప్రమాదం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మందుబాబులకు దీవాళి ఆఫర్‌

  మన రాష్ట్రంలో కురాగాయలు, నిత్యావసారాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం మందుబాబుల గురించి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తుంది.. నిత్యవసారల కోసం గంటల తరబడి పిల్లజల్లాతో కలిసి సామాన్యులు క్యూలో నిలబడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం మందుబాబుల కోసం ఆల్కహాల్‌ను డోర్‌ డెలీవరీ చేయడానికి ప్రణాలిక రెడీ చేస్తుంది.   అంద్రప్రదేశ్‌ బేవరేజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా 1200 దుకాణాల ద్వారా మధ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడానికి రెడీ అవుతుంది. ఒక కామన్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయడం లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడం మధ్యంన్ని ఆర్డర్‌ చేసే విధంగా ప్రణాలిక సిద్దం చేస్తున్నారు.   ఇప్పటికే ఇందుకు సంభందించిన ఫైళ్లు సియం పేషికి కూడా చేరాయి.. గతంలోనే ఈ ప్రతి పాదనకు సూచన ప్రాయంగా అంగీకరించిన సియం ఇక ఆ ఫైళ్లపై సంతకం చేయటమే తరువాయి..

అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారా?

  రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి పదహారు మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఒక వినతిపత్రం పంపించారు. ఆ వినతిపత్రంలో సీమాంధ్రుల మీద తెలంగాణ ఎమ్మెల్సీలు కురిపించిన ప్రేమని చూసి సీమాంధ్రులు ఇంత ప్రేమని తట్టుకోలేం బాబోయ్ అంటున్నారు. హైదరాబాద్‌ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సీమాంధ్రుల మీద ప్రేమతో టీ ఎమ్మెల్సీలు దీనిమీద ఒక సవరణ ప్రతిపాదించారు. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కాదుకదా, రెండు మూడేళ్ళు తాత్కాలిక రాజధానిగా కూడా ఉంచకూడదట. దానికి కారణం ఏమిటంటే, హైదరాబాద్ సీమాంధ్ర ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నందువల్ల అక్కడి నుంచి ఇక్కడి వరకూ రావడానికి సీమాంధ్రులు ఇబ్బంది పడతారట. పదేళ్ళపాటు సీమాంధ్రులని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదట.   కాబట్టి రాష్ట్రాన్ని విభజించిన వెంటనే ఓ సంవత్సరం లోగానే సీమాంధ్ర రాజధానిగా వైజాగ్‌ని ఎంపిక చేసేస్తే ఓ పనైపోతుందని సూచించారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రుల్ని తరిమేయడం వాళ్ళ ఇష్టం.. సీమాంధ్ర రాజధానిగా ఏ నగరాన్ని చేయాలన్నది కూడా వాళ్ళ ఇష్టమేనన్నమాట. బాగుందయ్యా.. చాలా బాగుంది!

రెండు నాలుకల ధోరణి!

  నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాన్ని గత కొన్న సంవత్సరాలుగా టీఆర్ఎస్ బహిష్కరిస్తూ వస్తోంది. ఆరోజును విద్రోహదినంగా, బ్లాక్ డేగా పాటించాలని పిలుపు ఇస్తోంది. టీఆర్ఎస్ కార్యాలయాల్లో నల్లజెండాలు ఎగురవేస్తూ హడావిడి చేస్తోంది. టీఆర్ఎస్ ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యంగా తెలంగాణ అంతటా ప్రతి ఏడాదీ అవతరణోత్సవాలు వైభవంగా జరుగుతూనే వున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన తర్వాత శుక్రవారం కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం తెలంగాణలో కూడా వైభవంగా జరిగింది. యథావిధిగానే టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలు ఎగరేసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ చేసే దాడులకు భయపడి సామాన్య ప్రజలు సొంతగా ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాలు తక్కువగా జరుపుకున్నప్పటికీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలలో మాత్రం ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ సమైక్యతకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతంలోని కొందరు ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఈ వేడుకలలో పాల్గొనలేదు.   అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సంగారెడ్డిలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన సంస్కారం చాలా వుంది. ‘ఆంధ్రప్రదేశ్’ అనే నీడలో అధికారాన్ని అనుభవిస్తూ అవతరణ వేడుకలలో పాల్గొనకపోవడం క్షమించరాని నేరం. కన్నతల్లినే మరచిపోయినవారిని ఏమనాలి? మొన్నామధ్య మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ ఆధ్వర్యంలో సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభ జరిగింది. ఆ సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకి ఎంతో అన్యాయం జరిగిందని అరుణమ్మ వాపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవంలో అన్ని దినపత్రికలలో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది.   ఆ ప్రకటనలలో సోనియా, మన్మోహన్, కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోతోపాటు సమాచార ప్రసార శాఖ మంత్రి డి.కె. అరుణ ఫొటో కూడా వుంది. ఆ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, తెలుగుజాతి ప్రగతికి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ అనే మాటలు కూడా వున్నాయి. ఆ ప్రకటనలో మంత్రిగారు డి.కె.అరుణ ఫొటో కూడా వుంది కాబట్టి, ఆ ప్రకటనలో వున్న వాక్యాలతో ఆమె ఏకీభవిస్తున్నట్టే అర్థం. పేపర్లలో ఇచ్చే ప్రకటనలలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ని పొగుడుతారు. మిగతా అన్నిచోట్లా ఆంధ్రప్రదేశ్‌ని తిట్టిపోస్తారు. దీన్నే రెండు నాలుకల ధోరణి అంటారు.

బీజేపీ యాత్రలు!

  కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చుట్టూ కాంగ్రెస్ నాయకులు ప్రదక్షిణలు చేస్తూ వుండటం ఎప్పుడూ చూసే విషయమే! తెలంగాణ ఇష్యూ విషయంలో కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ యాత్రలు ఏ స్థాయిలో వుంటాయో అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ తరహా యాత్రలు రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్నారు. ప్రస్తుతం అటు తెలంగాణ బీజేపీ నాయకులు, ఇటు సీమాంధ్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శనివారం నాడు తెలంగాణ బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ దగ్గరకి వెళ్ళి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడారు. మరోవైపు సీమాంధ్ర బీజేపీ నాయకులు మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషిని కలిశారు. విభజన సందర్భంగా సీమాంధ్రకు అన్యాయం జరక్కుండా చూడాలని ఆయనతో మొరపెట్టుకున్నారు. తెలుగుజాతి పరువుని ఢిల్లీ పెద్దల పాదాల దగ్గర పెట్టే సంస్కృతి బీజేపీలో కూడా పెరుగుతోంది.

ఇదెక్కడి న్యాయం పెద్దయనా?

  రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ని పోగొట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తన విచక్షణని ఎంతమాత్రం ఉపయోగించుకుండా, సోనియాగాంధీ చెప్పినవాటికి తలుపుతూ ఆయన తెలుగువారి అభిమానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ముజఫర్ నగర్‌లో జరిగిన అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మట్లాడి అందరిచేతా తలంటు పోయించుకున్న విషయం తెలిసిందే. ఆ ముజఫర్ నగర్‌లోనే రెండు రోజుల క్రితం స్పల్ప ఘర్షణలు జరిగాయి. దేశంలో మరే సమస్యా లేనట్టు ప్రధాని మన్మోహన్ ఆ ఘర్షణల మీద వెంటనే స్పందించారు. ఆ స్పందన వెనుక బీజేపీని తక్కువ చేయాలనే ఉద్దేశమే ఉన్నట్టు కనిపించింది. ఘర్షణల మీద ప్రధాని స్పందిస్తూ, సమాజాన్ని కొంతమంది మతం, కులం, వర్గాలుగా విభజిస్తున్నారని వాపోయారు. పాపం పెద్దాయన బాగానే వాపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రాంతం పేరున విభజిస్తోంది. మరి దీనిమీద స్పందించడం మన్మోహన్ సింగ్ సాబ్‌కి తెలియదా? ఇదెక్కడి న్యాయం పెద్దాయనా?

గ్యాస్ కాదు.. నిజం!

  ఇది నమ్మలేని నిజం.. గ్యాస్ సిలెండర్ల ధర తగ్గింది. గ్యాస్ సిలెండర్ ధరని ఇంకో రెండు మూడు వందలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఈమధ్యే వార్తలు వచ్చాయి. ఆ బాంబు ఎప్పుడు నెత్తిన పడుతుందా అని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి టైమ్‌లో గ్యాస్ సిలెండర్ల ధరలు తగ్గిస్తున్నామని చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇళ్ళలో ఉపయోగించే సిలెండర్ల ధర 53.50 రూపాయలు తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలెండర్ల మీద 91 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గ్యాస్‌కి, ఆధార్ కార్డుకి లింకు పెట్టిన తర్వాత గ్యాస్ వినియోగారులు విన్న తొలి శుభవార్త ఇది. దీపావళి పండగ సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు లభించిన కానుకగా ఈ తగ్గింపును వినియోగదారులు భావిస్తున్నారు. ఇంతకీ ఈ తగ్గింపుడు నిజంగానే తగ్గింపుడా.. లేక తుఫాను ముందు ప్రశాంతత లాగా భవిష్యత్తులో జరిగే భారీ పెరుగుదలకి ముందు ఊరటా?

బాణసంచా విధ్వంసం

  దీపావళి దగ్గరపడుతున్న సమయంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే బాణసంచా పరిశ్రమల్లో పేలుళ్ళు జరుగుతున్నాయి. ఈ పేలుళ్ళలో ఎంతోమంది కార్మికులు మరణిస్తున్నారు. శుక్రవారం నాడు తమిళనాడులోని కుంభకోణంలో ఒక బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మరణించారు. పదిమందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం నాడు చైనాలోని బీజింగ్‌లో వున్న ఒక బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటు కుంభకోణం, అటు బీజింగ్‌లో జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువమంది మహిళలే వున్నారు.

సమయపాలన లేని సీఎం

    ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారికి సరైన విధంగా నష్టపరిహారం ఇవ్వాలని, నష్టాన్ని అంచనా వేయడంలో సక్రమంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు భావించారు. దీనికోసం శనివారం ఉదయం 11.30 నిమిషాలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. అయితే అనుకున్న సమయానికి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన కార్యాలయంలో లేకపోవడంతో హతాశులయ్యారు. చెప్పిన సమయానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో లేకపోవడం పట్ల వారు అక్కడే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీఎంని కలవటానికి ఎమ్మెల్యేలమైన తమకే సాధ్యం కావడం లేదంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.   సీఎం తీరును నిరసిస్తూ తమ ముఖ్యమంత్రికి అందించదలచిన వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయం గోడకి అతికించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఈ సందర్భంగా విమర్శించారు. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బలవంతంగా పంపించడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్యతోపులాట జరిగింది.

ఎర్రన్నాయుడు స్మృతికి నివాళి!

  కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించి సంవత్సరం అయింది. ఆయన ప్రథమ వర్ధంతిని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితోపాటు పార్టీ ముఖ్య నాయకులు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని, తెలుగుదేశం పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎర్రన్నాయుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా వుంటుందని చెప్పారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు చేసిన కృషి మరువలేనిదని శ్లాఘించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు వున్న ఎర్రన్నాయుడి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చెబుతూ, ఈ సంవత్సర కాలంలో పార్టీలో ఆయన లేని లోటు కనిపించిందని చెప్పారు.

దిగ్విజయంగా కొడుకు నామినేషన్ దాఖలు

  వడ్డించేవాడు మనోడయితే అన్నట్లు పార్టీ టిక్కెట్లు ఇచ్చేవాడు మనోడయితే పార్టీ అధికారికంగా అభ్యర్దుల పేర్లు ప్రకటించకపోయినా నామినేషన్ వేసుకోవచ్చును. కాంగ్రెస్స్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్ మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రఘోఘడ్ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు తండ్రి (కాంగ్రెస్) హస్తం పట్టుకొని భారీ ఊరేగింపుతో నిన్న నామినేషన్ దాఖలు చేసారు.   దిగ్విజయ్ సింగ్ తను వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోనని చూచాయగా చెప్పడం వలన సహజ రాజకీయ న్యాయ సూత్రాలు, సిద్దాంతాల ప్రకారం ఆయన సీటు ఆయన కొడుకుకే దక్కాలి గనుక, జయవర్ధన్ సింగ్ నామినేషన్ వేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. అమ్మ దయ, యువరాజు మద్దతు అపారంగా కలిగి ఉన్న దిగ్విజయ్ సింగ్ ఆ మాత్రం చొరవ తీసుకోవడంలో వింతేమి లేదు కూడా.   జయవర్ధన్ సింగ్ రాజకీయ ఆరంగ్రేటం చేయడాన్ని, తండ్రి కుర్చీలో కూర్చోవలనుకోవడాన్ని, రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలను కోవడాన్ని కూడా తప్పుపట్టడం తప్పే అవుతుంది. అది తప్పయితే....        

పండగ చేసుకోండి

  వెంటనే గ్యాసు, డీసిల్, పెట్రోల్,కిరోసిన్ ధరలను పెంచకపోతే వేల కోట్లు నష్టాలు వచ్చేస్తాయని నిత్యం పాట పాడే ఆయిలు కంపెనీలు, తమ ఉద్యోగులకు బోనసులు, ఇంక్రిమెంట్లు వగైరా ప్రతీ ఏటా ఘనంగా ఇస్తూనే ఉంటాయి. అంటే అవి నష్టాలకి బోనస్ అనుకోవాలేమో!   మరి వాటికి నిన్నఏ స్వామీజీ అయినా తనకు కలలో కనిపించిన పెట్రోల్, గ్యాసు బావుల ఆచూకి తెలిపి, వాటిని బకెట్ వేసి తోడుకోమని చెప్పాడో ఏమో తెలియదు, కానీ నిన్న అర్ధరాత్రి నుండి నుండి గృహ వినియోగ దారుల వంటగ్యాస్ సిలిండర్ పై రూ.53.50, వ్యాపార వినియోగదారులకి రూ.90లు తగ్గించేసి, ప్రజలని (దీపావళి) పండగ చేసుకోమన్నారు. రెండు రోజుల క్రితమే పెట్రోల్ పై లీటర్ కి రూ.1.15 తగ్గించడం చూస్తే ‘స్వామీజీ ఆయిల్ బావుల కలలు’ నిజమేననిపిస్తుంది.   అయితే తరుగుట పెరుగుట కొరకేనని పెద్దలు చెపుతారు. ఐదు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మిజోరం, డిల్లీ) శాసనసభ ఎన్నికలు నవంబర్, డిశంబర్ నెలలో జరగబోతున్న ఈ తరుణంలో ఇటువంటి ఆకస్మిక వరాల వానలు సహజమేనని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. అయితే ఇది తుఫాను వచ్చే ముందు కురిసే చిరు జల్లుల వంటివని, అందువల్ల ఈ ప్రశాంతతని చూసి ఏమరపాటుగా ఉండవద్దని పదేపదే వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు.   ఎందుకంటే ఏదో ఫరేక్ కమిటీ అట! ఒక్కో గ్యాస్ సిలిండర్ మీద కనీసం రూ.250 పెంచకపోతే ఆయిలు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనసులు, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడుతాయని కేంద్రాన్ని గట్టిగా హెచ్చరించింది. అందువల్ల ఈ ఎన్నికలేవో అయిపోగానే ఇప్పుడు తగ్గించిన రూ.53.50X5=267.50లలో రూ.17.50 నష్టాన్ని భరించయినా సరే, సిలిండరుకి కేవలం రూ.250 మాత్రమే పెంచి మళ్ళీ (సంక్రాంతి) పండుగ చేసుకోమని చెప్పే అవకాశం బాగా ఉంది.   గానీ అప్పుడు సాధారణ ఎన్నికలు వస్తాయి కదా? అని ఎవరయినా అమాయకులు ప్రశ్నించవచ్చును. కానీ ప్రజలకి ‘గజినీ లాగా షార్ట్ టైం మెమొరీ ప్రాబ్లెం’ ఉందని పాపం వాళ్ళకి కూడా తెలియదు. గానీ ప్రభుత్వానికి, దానిని నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. గనుక ఎన్నికలకి మూడు నాలుగు నెలల ముందే గ్యాస్ ధరలు పెంచేస్తే, ఎన్నికల సమయానికి దానిని మరిచిపోవడమే కాక దానికి బాగా అలవాటు పడిపోతారు కూడా. అటువంటి సమయంలో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ సిలిండర్ మీద పదో పాతికో తగ్గిస్తే వెర్రి బాగుల ప్రజలు అల్పసంతోషంతో మళ్ళీ హస్తం గుర్తు మీదే ‘దభీ దభీ’మని గుద్దేస్తారు.   ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోదని గ్రహిస్తే పోతూపోతూ సిలిండర్ ధరలో ఏకంగా ఐదారు వందలు తగ్గించేసి, తరువాత వచ్చే మోడీ కుర్చీ క్రింద గ్యాస్ బాంబు అమర్చిపెట్టి వెళ్ళిపోయినా వెళ్లిపోవచ్చును. అయితే దీపావళి పండుగ పూట మనం అంత దూరం ఇప్పుడు ఆలోచించడం వల్ల ఏ ఉపయోగము ఉండదు. సిలిండర్ ఉన్నపుడే పండుగ చేసుకోవాలంటారు పెద్దలు. గనుక సిలిండర్ ధర తగ్గినప్పుడే తెచ్చేసుకొని ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే రేపటి రోజు మన ‘హస్తం’ లోఉంటుందని గ్యారంటీ లేదు.

ఉల్లిపాయలున్నవి జాగ్రత్త!

  మహిళలు బజారు నుండి తిరిగివచ్చేటప్పుడు జర భద్రం! మీ బ్యాగులో వంద గ్రాముల కంటే ఎక్కువ ఉల్లిపాయలుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఉల్లిపాయల కోసం మిమ్మల్ని ఎవరయినా కిడ్నాప్ చేసినా ఆశ్చర్యం లేదు.   రంగా రెడ్డి జిల్లా, కడిచర గ్రామంలో ఉల్లిపాయల వద్ద రాత్రి కాపలాగా ఉన్న ఊరడి ఎల్లయ్య (65) అనే వృద్దుడిని బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చంపి, ఉల్లిపాయల బస్తాలు దొంగిలించుకుపోయారు.   అదేవిధంగా తమిళనాడు నుండి ఉత్తరప్రదేశ్ లో జవున్పూర్ కు ఉల్లిపాయల లోడుతో వెళుతున్నలారీ డ్రైవర్ని, క్లీనర్నికొందరు దుండగులు రెండు కారుల్లో వెంబడించి వారిని చంపి లారీతో సహా ఉల్లిపాయలను ఎత్తుకు పోయారు. కానీ వారు పోలీసులకి దొరికిపోయారు. గతంలో కూడా తాము ఇలాగే ఒక టొమేటోల లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ని చంపామని కానీ క్లీనర్ మాత్రం తప్పించుకు పోయాడని వారు చెప్పారు. అయితే టొమేటోలు చాలా త్వరగా కుళ్ళిపోవడంతో ఇకపై నిలువ ఉండే దుంపలు, ఉల్లిపాయలు వంటి వాటినే దోచుకోవాలని నిశ్చయించుకొన్నామని వారు చెప్పారు.   అందువల్ల మహిళలు బహు పరాక్! వృద్దులు బహు పరాక్! తల్లులు మీ పిల్లలని పక్కనున్న కూరల కొట్టుకి వెళ్లి ఉల్లిపాయలు కొని పట్టుకొని రమ్మని మాత్రం దయచేసి పంపకండి. తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారని గుర్తుంచుకొండి. అదేవిధంగా దయచేసి బయటకి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయలు పట్టుకు వెళ్ళకండి. ఉల్లిపాయలు ధర కిలో వందకి రూపాయలకి పడిపోయిందని తొందరపడి వందేసి గ్రాములు కొనేయకండి. కొని ప్రాణాల మీదకు తెచ్చుకోవదని మనవి. ఆనక హెచ్చరించలేదని బాధపడకండి. అదేవిధంగా మీరు బయట ఊళ్లకు వెళుతున్నపుడు ఉల్లిపాయలను మీ బ్యాంక్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రీజర్ లాకర్లో పెట్టుకోవడం మరిచిపోకండి. ఒకవేళ అలా వీలుకానిచో బయట ఊళ్లకు వెళ్ళేటప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీసులకి మీ ఇంట్లో ఎన్ని గ్రాములు ఉల్లిపాయలు దాచారో వివరంగా తెలియజేయండి మరిచిపోకుండా.   కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్పెషల్ ఉల్లి టాస్క్ ఫోర్స్ లను అన్ని రాష్ట్రాలకు పంపనుంది. కనీసం అంతవరకయినా విచ్చలవిడిగా వందేసి, రెండేసి వందల గ్రాములు ఉల్లిపాయలు కోనేయోద్దని మనవి. బ్రతికుంటే ఉల్లికాడలు తినయినా బ్రతకొచ్చునని గుర్తుంచుకోండి. జరా భద్రం!

జగమంత కుటుంబం నాది

  బీసీసీఐ అధ్యక్షుడు యన్.శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ కంపెనీ అధిపతి కూడా కావడంతో సముద్రంలో ఉప్పుకి చెట్టు మీద కాయకి సంబంధ కుదిరినట్లుగానే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విడదీయరాని లంకె ఏర్పడింది. అయితే ఇది కూడా షరా మామూలుగానే మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఏర్పడిందే కానీ కొత్తగా ఏర్పడింది కాదు గనుక, వాళ్ళ అనుబంధం గురించి ఎవరూ అనుమానించనక్కరలేదు. అందుకు సీబీఐ, కోర్టులు ఉన్నాయి.   మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో కానీ జగన్కి జగమంత కుటుంబాన్నిఅందులో శ్రీనివాసన్, విజయ సాయి రెడ్డి వంటి పెద్దమనుషులను చాలా మందినే ఇచ్చిపోయాడు. అందుకే జగన్ జైల్లో అంత కాలం ఉన్నా ఏనాడు కూడా ఒంటరిగా ఉండే సమస్య ఏర్పడలేదు. జగమంత ఈ కుటుంబంలో అందరినీ చంచల్ గూడా జైల్లో ఉన్నంత కాలం రోజు పలకరించుకోవడం వీలుపడుతుంది. గానీ ఉమ్మడి కుటుంబంలా సాగుతున్న ఆ అనుబంధాలు అందరికీ బెయిలు రావడంతో దూరమయిపోక తప్పలేదు.   ఒకసారి బయట ప్రపంచంలో పడ్డాక నిరాహార దీక్షలు, ధర్నాలు, శంఖాలు, ఊదుకోడాలు వగైరా వగైరా సవాలక్ష వ్యవహారాలుంటాయి గనుక ఒకరినొకరు ఇది వరకులా రోజూ పనిగట్టుకొని  పలుకరించుకోవాలంటే వీలుపడదు. అంత మాత్రాన్నవిశ్వసనీయత ఉన్నవాళ్ళేవరూ కూడా తమ మమతలు, అనుబందాలు ఎన్నడూ మరిచిపోరు. ఏ పూర్వజన్మ సుకృతాల వల్లనో ఈ జన్మలో మానవులకు అన్ని బంధాలు, అనుబంధాలు ఏర్పడుతాయని పెద్దలు చెపుతారు. అలా ఏర్పడిన మరో బంధమే శ్రీనివాసన్ రూపంలో నేడు కోర్టు మెట్లు దగ్గర ఎదురయితే మడమ తిప్పని వంశంలో పుట్టిన జగన్ ఆయనని పలుకరించకుండా వెళ్లిపోతారని అనుకోవడం కేవలం ప్రతిపక్షాలకే సాధ్యం.   వీలయితే కాఫీ, నాలుగు మాటలు అని ఆ ఇద్దరూ కమ్మగా కాసేపు కబుర్లు చెప్పుకొన్నారుట! దానిని చూసి ఓర్వలేని వాళ్ళు పాపం! ఆ మంచి మనసుల కలయిక గురించి కూడా ఏవేవో వ్రాసేస్తున్నారు పాపం!   అయినా వారేమి ఇద్దరు ముగ్గురవ్వాలి, ఈ ముగ్గురు రేపు నలుగురవాలి. ఆనక ఐదు ఆరవ్వాలి అని ఆశించడం లేదు కదా? లోకులు కాకులు. పొడుస్తూనే ఉంటారు. అలా ఎందుకు కలిసారని పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలా బాధగా ఉంటుంది. తప్పదు. అనుమానాలు, అపోహలు మొగుడు పెళ్ళాల మధ్యే తప్పవు. ఇక జగమంత కుటుంబలో సభ్యులు ఒకరిద్దరు కోర్టు మెట్లు దగ్గిర కలిస్తే కలగకపోవు. నిజమే చాలా బాధగా ఉంటుంది. తప్పదు. ఈ లోకంలో మంచి వాళ్ళకే అన్ని కష్టాలు. చాలా బాధ కలుగుతుంది నిజంగా చాలా బాధ కలుగుతుంది.

బీజేసీ సమైక్య రాగం?

      కేంద్రంలో తన ప్రభుత్వం వున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని బీజేపీ, అధికారం కోల్పోయిన తర్వాత సరుకు లేని చిన్న రాష్ట్రాల సిద్ధాంతంతో తెలంగాణకు మద్దతు ఇచ్చింది. సీమాంధ్రలో బలంలేని బీజేపీ తెలంగాణలో అయినా పాగా వేద్దామని పథకం వేసి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమానికి జై కొట్టింది. తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించి హడావిడి చేస్తున్న తర్వాత బీజేపీ ధోరణిలో మార్పు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.     త్వరలో బీజేపీ సమైక్యానికి జై కొట్టే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తెలంగాణ వచ్చినా భారతీయ జనతాపార్టీకి ఒరిగేదేమీ లేని పరిస్థితులు ఏర్పడటం ఒక కారణమైతే, మరొకటి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నరేంద్రమోడీ ఆలోచనా విధానం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆ క్రెడిట్ తమదంటే తమదంటూ ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ జుట్టూ జుట్టూ పట్టుకుంటున్నాయి. ఆ రెండు పార్టీల మధ్యలోకి బీజేపీ ఎంటరయ్యే ఛాన్స్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. సీమాంధ్రలో బీజేపీ అడ్రెస్ ఆల్రెడీ గల్లంతయింది. ఇప్పుడు తెలంగాణకి జై కొట్టిన పుణ్యమా అని ఆ గల్లంతు కంటిన్యూ అవ్వనుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఏ రాజకీయ ప్రయోజనం కలగనప్పుడు తానెందుకు తెలంగాణకి మద్దతివ్వాలన్న అతర్మథనం బీజేపీలో పెరిగినట్టు తెలుస్తోంది. దీనితోపాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వ్యవహార శైలి కూడా తెలంగాణ విషయంలో బీజేపీలో మార్పు తెస్తోంది. గతంలో బీజేపీ కేవలం తెలంగాణ సంక్షేమం గురించే మాట్లాడేది. హైదరాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్న మోడీ తనకు తెలంగాణతోపాటు సీమాంధ్ర కూడా ముఖ్యమేనని తేల్చి చెప్పారు. ఈమధ్యకాలంలో మోడీ నోటి వెంట ఐక్యతకి సంబంధించిన మాటలే వస్తున్నాయి. తాజాగా దేశం ఐక్యంగా ఉండాలంటూ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలను మోడీ ఉదహరిస్తున్నారు. అలాగే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ నాయకత్వం ఆ నాటకాటనే సాకుగా చూపించి సమైక్యం వైపు మళ్ళే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డికి జేసీ దివాకర్ దీపావళి బంపర్ ఆఫర్

ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య మినీ సీరియల్ వార్ నడుస్తోంది. ఇంతవరకు జరిగిన సీరియల్లో మొదట జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మధ్య లంకె ఉందని ప్రకటించడం, బొత్స ఆయనని పార్టీ నుండి బయటకి పొమ్మని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, పొమ్మనడానికి నువ్వెవరని? జేసీ అడగడం, దానికి బొత్స సంజాయిషీ ఇచ్చుకోవడం, మళ్ళీ దానికి లగడపాటి కౌంటర్ వేయడం వరకు చూసాము.   ఇక తాజా ఎపిసోడ్లో “జగన్మోహన్ రెడ్డి కోరినట్లయితే కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడుపుతానని” దివాకర్ రెడ్డి ప్రకటించి ఈ సీరియల్కి మరో ఆసక్తికరమయిన ట్విస్ట్ ఇచ్చారు. నోరు విప్పదని చెప్పినా విప్పడం అంటే బస్తీ మే సవాల్! అనే భావించక తప్పదు. మిగిలిన భాగం తరువాత ఎపిసోడ్లో చూద్దాము.    

బాబు మగాడ్రా బుజ్జీ..!

      తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంత తెగింపు ఉన్న నాయకుడో రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు.. దేశం మొత్తానికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి తన తెగింపును ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డదారిలో సంపాదించుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ బిజీగా వుంది. టీఆర్ఎస్ వేర్పాటు గానాన్ని ఎంత గొంతు చించుకుని పాడుతున్నా అటు సీమాంధ్ర ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారు.     ఇది ఎంతమాత్రం మింగుడుపడని టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తూ విఫలమవుతూనే వుంది. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేయడానికి తంటాలు పడుతోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల దగ్గర వున్న తాళ్ళ వీరప్పగూడెంలో వర్షానికి దెబ్బతిన్న పత్తిపంట రైతులను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తే నానాయాగీ చేయడానికి టీఆర్ఎస్ అన్ని సన్నాహాలూ చేసింది.   ఈ విషయం తెలిసినా చంద్రబాబు వెనుకడుగు వేయలేదు. దామరచర్లకు చేరుకుని, వర్షానికి దెబ్బతిన పత్తిపంటని పరిశీలించి, రైతులకు నైతిక మద్దతును అందించారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్రోహదినం పాటిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబు పర్యటన సందర్భంగా కాస్తంత హడావిడి చేశారు. వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ముందుకు వెళ్ళారు. ప్రజల సంక్షేమం కోరుకునే నాయకుడిగా తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు.  తమను పరామర్శించడానికి వచ్చిన రైతుల నుంచి చంద్రబాబుకు చక్కని స్పందన లభించింది. దామరచర్ల ప్రాంతంలోని రైతులు చంద్రబాబును తమసొంత మనిషిలా భావించి ఆయన దగ్గర తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకున్నారు. ఇదంతా తెలంగాణ నాయకుల గొంతులో వెలక్కాయపడేలా చేసింది. తాము హడావిడి చేస్తామని తెలిసినా రైతులను పరామర్శించడానికి  వచ్చిన చంద్రబాబు ధైర్యాన్ని వాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.