tdp mla revanth reddy

కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటా.. రేవంత్ రెడ్డి

  తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఈ రోజు నోటుకు ఓటు కేసు విచారణలో ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించిందని.. తనను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని అన్నారు. గద్దె దిగే వరకూ కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటానని.. మరో 25 ఏళ్లైనా కొడంగల్‌ నియోజకవర్గం నుంచి గెలుస్తానని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈకేసులో నిందితులైన సెబాస్టియన్‌, ఉదయ్‌సింమాలు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారులు సప్లమెంటరీ సమన్లను కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ చార్జిషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత సమన్లు పంపించనున్నట్లు కోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయిన అనంతరం మరోసారి ఏసీబీ ఎదుట రేవంత్‌ అయ్యే అవకాశం ఉంది.

ap capital amaravathi

ఏపీకి కేంద్రం 500 కోట్ల సహాయం

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే ఏపీ అధికారుల దగ్గర నుండి ప్రజల వరకూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రం నుండి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. ఇప్పుడు అది చాలా ఆసక్తికరంగా మారింది.   అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నూతన రాజదానిలో అసెంబ్లీ, రాజ్‌భవన్ తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 500 కోట్లు ఇచ్చేందుకు సముఖత చూపినట్టు తెలుస్తోంది. భవనాల డిజైన్లు, ఇతర వివరాలతో పూర్తిస్థాయి నివేదిక పంపితే వాటిని పరిశీలించి రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రాజ్‌భవన్‌, అసెంబ్లీతోపాటు మరో ఒకటి రెండు భవనాలు ఉండే అవకాశముంది.   ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల కార్యలయాలు వారి వసతి గృహాలు తదితర విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ys jagan cbi probe

ఆక్రమాస్తుల కేసులో జగన్‌కు షాక్

  అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడప జగన్మోహన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. జగన్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి జఫ్తు చేసింది. అనంతపురం జిల్లాలో పెన్నా గ్రూపుకు చెందిన 231 ఎకరాల భూమిని.. హైదరాబాదులోని హోటల్‌ను కూడా తాత్కాలికంగా జఫ్తు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఈ కేసులో రూ.7.85 కోట్ల ఆస్తులను జఫ్తు చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలోనే ఈడీ ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని.. జప్తుకు ఆదేశించిన 250 ఎకరాలపై చర్యలు తీసుకోవాలని ఈడి... రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు దాదాపు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

Arun jaitly

రాహుల్‌ బుర్ర లేని మేధావి

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందరికి స్పష్టంగా అర్ధమవుతోంది. సమావేశాలు పారంభమైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా సభను సాజావుగా సాగనివ్వకుండా పార్లమెంట్ లో రచ్చ రచ్చ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలపై వైఖరిపై మండిపడుతున్నారు. అసలు దీనంతటికి తెరవెనుక ఉండి నడిపిస్తుంది రాహుల్ గాంధీ అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి వయసు పెరుగుతున్నా బుర్ర పెరగడం లేదని.. వయసు పెరుగుతున్న కొద్దీ రాహుల్‌కు అజ్ఞానం పెరుగుతోందన్నారు. అతనికి సగం తెలిసీ సగం తెలియకుండా మాట్లాడుతున్నారని.. రాహుల్‌ బుర్ర లేని మేధావని తెలివితేటలు లేని నిపుణుడని చురకలు వేశారు. సగం తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్ల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయాయని ఆరోపించారు.

pankaja munde maharashtra

చెప్పులు మోయించిన మంత్రిగారు

  అధికారం ఉందికదా అని ఎం చేసినా సరిపోతుంది అని అనుకుంటారు కొంత మంది. అలా అధికారం అహంకారంతో చేసే పనుల వల్ల కొన్ని సార్లు విమర్శల పాలవుతారు. అలా చేసి ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటుంది మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే. ఈ మంత్రి గారు చెప్పులు ఆమె దగ్గర పనిచేసే సిబ్బంది ఒకరు మోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మంత్రి పంకజ ముండే మహారాష్ట్రలో కరువు సంభవించిన పర్భానీ జిల్లా సొన్ పెత్ ప్రాంతంలో పర్యటించారు. అయితే అక్కడ నడవడానికి వీలులేకపోవడంతో ఆమె తను వేసుకున్న చెప్పులు విడిచి నడిచారు. ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే ఆమె వేసుకున్న చెప్పులను తన పక్కన ఉన్న సిబ్బందిలో ఒకరు మోయడంతో ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు.   ఇప్పుడు ఈ విషయంపై ప్రతిపక్షాలు.. అదను దొరికింది కదా అని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రిగారు సమాధానం చెప్పాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి పంకజ్ ముండే వివరణ ఇస్తూ ‘మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని.. చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చింది' అని చెప్పారు. అక్కడ చూడాల్సింది కరువు వల్ల దెబ్బతిన్న రైతల సమస్యలు అని అంతేకాని నా చెప్పుల గురించి కాదని సమాధామిచ్చారు.

cash for vote

లోకేశ్ vs కేటీఆర్ పోటాపోటీ నోటీసులు

  ఓటు నోటు కోసులో ఇప్పటికే ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై అనేక కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో అంశం చర్చాంశనీయమైంది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఎంతో మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై రెండు ప్రభుత్వాలు పోటా పోటీగా నోటీసులు జారీ చేసే పనిలో పడ్డాయి. తెలంగాణ ఏసీబీ ప్రభుత్వం టిడిపీ యువనేత లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చెంప దెబ్బ కొట్టినట్టు ఏపీ ప్రభుత్వం తెలంగాణ మంత్రి కెటిఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు ఏపీ సీఐడి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మత్తయ్య బెదిరింపుల కేసులో కెటిఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్దమయ్యారు.   మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2013లో విశాఖ జిల్లా పెందుర్తిలో నమోదైన హత్యాయత్నం కేసు ఘటన తెరపైకి రావడం గమనార్హం. గతంలో ఈకేసుకు సంబంధించి సిఎం కెసిఆర్ వ్యక్తిగత గన్‌మెన్ మధుసూదన్ రెడ్డి, మరో వ్యక్తి సతీష్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి కానీ విచారణకు రాలేదు. అయితే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నేరుగా నోటీసులు హైదరాబాదుకు తెచ్చి ఇచ్చింది. దీనిలో భాగంగా వారికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారు అందుబాటులో లేకపోవడంతో నేరుగా వారి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి నోటీసులు అందజేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే నోటుకు ఓటు కేసులో పోటా పోటీగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు బయట వచ్చిందా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఓటు నోటు కేసు సంగతేమో కాని ఈ కేసు నేపథ్యంలో ఇంకెన్ని కేసులు బయటపడతాయో.. ఎంతమందికి నోటీసులు వెళతాయో చూడాలి.

maggi

మ్యాగీపై నిషేదం ఎత్తివేత

  నెస్లే ఇండియాకు చెందిన మ్యాగీ నూడిల్స్ లో హానికర పదార్ధాలున్నాయంటూ పలు రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేదం విధిచింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై నెస్లే ఇండియాకు ముంబై కోర్టులో ఊరట లభించింది. మ్యాగీ పై నిషేదం విధించడంపై ముంబై హోకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపైన విచారణ జరిపిన హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వ మ్యాగీపై విధించిన నిషేధాన్నిఎత్తివేసింది. మరోసారీ నూడుల్స్ నమూనాలపై పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాచులో ఐదేసి శాంపిల్స్‌ను మూడు ల్యాబ్‌లకు పంపించి పరీక్షించాలని, ఆరువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

baghdad A truck bomb

ఉగ్రవాదుల పైశాచికం.. 60 మంది మృతి

  ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ట్రంక్ బాంబ్ పెట్టి పలువురు ప్రాణాలను బలిగొన్నారు. ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో సరద్ ప్రాంతంలోని మార్కెట్ లో ఉదయం పూట నిత్యం రద్దిగా ఉంటుంది. ఇదే అదనుగా చూసుకొని ఉగ్రవాదులు ఒక ట్రక్ బాంబ్ తీసుకొని వచ్చి అక్కడ పార్క చేశారు. ఈ ట్రక్ ఒక్కసారిగా పేలి ఈ దాడిలో 60 మంది మరణించగా దాదాపు 200 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. కొంతమంది శరీరాల నుండి అవయవాలు తెగి గాలిలో ఎగిరిపడ్డాయి. కొంత మంది అమాయకుల కాళ్లు, చేతులు తెగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తలించారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

cm chandrababu

మోదీ ఫోన్ చేశారు.. 15 తర్వాత రమ్మన్నారు.. చంద్రబాబు

  ఏపీ ప్రత్యేక హోదాపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఏపీకీ ప్రత్యేక ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో ఏపీలో ఆందోళనలు, నిరసనలు మొదల్యయ్యాయి. మరోవైపు ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని మునికోటి ఆత్మహత్యతో ఈ వివాదం ఇంకా ముదిరింది. కొంత మంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెపుతుంటే మరోవైపు కొంతమంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదాకోసం తప్పకండా పోరడతామని.. ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెపుతున్నారు. ఈ మాటలకు అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఏపీ ప్రజల పరిస్థితే అయోమయంలో పడింది.   దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం పై మండిపడినట్టు వార్తలు వినిపించాయి. దీనిలో భాగంగానే చంద్రబాబు ‘ప్రత్యేక హోదా విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరలతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం గురించి చెప్పానని.. రాష్ట్రంలోని సమస్యలు గురించి ఆయనకు వివరించానని.. ఆయనకు ఆయనకు నా ఆవేదన తెలియజేశానని చెప్పారు. ఈ నెల 15 తర్వాత ఢిల్లీకి రమ్మన్నారని.. కూర్చుని మాట్లాడుకుందాం’ అని మోదీ అన్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్క సమస్య గురించే కాదని అనేక సమస్యల గురించి ప్రధానితో కాని.. కేంద్ర మంత్రులతో కాని చర్చిస్తునే ఉన్నానని చెప్పారు. కొంతమంది ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే చాలని మభ్య పెడుతున్నారని, కానీ అదొక్కటే వస్తే సరిపోదని, విభజన బిల్లులో పేర్కొన్నవన్నీ సాధించుకోవాల్సి ఉందన్నారు.

rahul gandhi

ఇప్పుడు ఏం చేసి ఏం లాభం

  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగినయనున్నాయి. అసలు ఈ సమావేశాలు ప్రారంభమైన తరువాత పార్లమెంట్లో కాంగ్రెస్ నేతల ఆందోళనలు తప్ప ఇంకేం జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ విషయాలు చర్చకు రాలేదు. కనీసం ఏపీ నేతలు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చర్చించే అవకాశం కాని.. తమ రాష్ట్ర సమస్యలు గురించి కాని విన్నపించుకునే సమయం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ నేతలు . సభ అలా మొదలవుతుందో లేదో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆందోళనలు మొదలుపెట్టేవారు. అసలు మోదీ పార్లమెంట్ సమావేశాలు ప్రాంభమయ్యేముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ సమావేశంలోనే కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పారు.. లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రేజేలు రాజీనామా చేయాలని లేకపోతే సభ సజావుగా సాగనివ్వమని తేల్చి చెప్పారు. అన్నట్టుగానే మాట మీద నిలబడి సభ సజావుగా సాగనివ్వకుండా రభస రభస చేశారు.   అయితే ఒక రకంగా పార్లమెంట్ సమావేశాలు అలా జరగడానికి.. కాంగ్రెస్ నేతలు అలా రెచ్చిపోవడానికి కారణం ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని చెప్పుకోవచ్చు. సెలవులు అంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్షాలమీద చాలా ధీటుగా విరుచుకుపడుతున్నారు. తనను విమర్శించే వాళ్లకు సమాధానం చెప్పాలని ఈ రకంగా చేస్తున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. మోదీ ముందు తనెంత అని విమర్శించే వాళ్లకు తను కూడా ఏం తక్కువ కాదని చూపించాలనుకుంటున్నారేమో కాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే పర్యటనలు పేరిట పాదయాత్రలు కూడా చేస్తున్నారు.   దీనిలో భాగంగానే ఇప్పుడు మళ్లీ తెలంగాణ పర్యటనపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెసు తెలంగాణ సీనియర్‌ నేత వి. హనుమంతరావు కూడా చర్చించినట్టు సమాచారం. పర్యటన తేదీలను త్వరగా ఖరారు చేస్తే జిల్లాల్లో తిరిగి విద్యార్థుల్ని చైతన్యపరుస్తామని వీహెచ్‌ చెప్పారట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రాలో ధర్నా చేయాలని రాహుల్‌ గాంధీకి వి. హనుమంతరావు సూచించారట. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఏపీలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని.. వారిక మద్ధతిస్తూ ఏపీలో ఏదో ఒక ప్రదేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకూ ధర్నా చేయాలని చెప్పారట. విహెచ్ ప్రతిపాదనకు రాహుల్ కూడా ఒప్పుకున్నారట. మొత్తానికి రాహుల్ గాంధీ ఏదో ఒక విధంగా ప్రజలలో పేరు సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఏపీ ప్రజలు సోనియాను ఎప్పుడూ క్షమించలేరు. రాష్ట్రాన్ని విడదీయోద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. విడగొట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎన్ని ధర్నాలు చేసినా పార్టీ అధికారంలోకి రావడం కష్టం.. మరోవైపు తెలంగాణలో అధికారం పార్టీ టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఇతర పార్టీలు అధికారంలోకి రావు.. పాపం రాహుల్ గాంధీకి పాదయాత్రలు చేసి చేసి కాళ్లు నొప్పులు రావడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదని తెలుసుకుంటే మంచిది.

durgam cheruvu

దుర్గం చెరువు.. 1500 కోట్ల భూమి ఆక్రమణ

  హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో ఉన్న దుర్గం చెరువు ప్రాతంలోని భూమి ఆక్రమణలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దుర్గం చెరువును ఒక పక్క భూ కబ్జాదారులు మరోపక్క రాజకీయ నాయకులు కలిసి అన్యాయంగా ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఎకరాల భూమిని కొన్ని కోట్లు విలువ చేసే భూమిని భూభకాసురులు నమిలేశారు. అక్కడ రిసార్టులు.. అంటూ పబ్బులు అంటూ భూమిని ఆక్రమించుకొని ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇంతా జరుగుతున్నా మన పట్టించుకునేవారు ఉన్నారా అంటే లేదనే వార్తలే వినిపిస్తున్నాయి. మరోవైపు దుర్గం చెరువును కాపాడేందుకు పర్యావరణ వేత్తలు, స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నా భూ ఆక్రమణలు మాత్రం ఆగడంలేదు.   అయితే ఈ వ్యవహారంపై పరిశీలన జరపాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం దీనిపై వివరాలు చేపట్టేందుకు ఒక కమిటీని ఏర్పటుచేసింది. ఈ కమిటీ తెలిపిన వివరాలు చూసి ప్రభుత్వం ఒక్కసారిగా ఖంగుతిన్నది. ఒకటి కాదు రెండు కాదు 60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి తెలుపుతూ దుర్గం చెరువు ప్రాతంలో 60 ఎకరాల భూమి అన్యాయంగా ఆక్రమించారని.. ఆ భూమి ధర సుమారు రూ. 1,500 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. సుమారు 67 హెక్టార్లలో ఉన్న దుర్గం చెరువు ప్రాతంతో సగానికి సగంపైగా ఆక్రమణకు గురైందని తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహారం పై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల వద్ద కూడా వివరాలు సేకరించి అక్కడ ఉన్నభవన నిర్మణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఒక నిర్ణయంతో ఉందని అక్కడ అన్యాయంగా నిర్మించిన భవనాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దుర్గం చెరువు ప్రాంతాన్ని ఇకో టూరిజంగా మార్చాలని అనుకుందని.. కాని అది అప్పటికే భూకబ్జాదారుల లొసుగులో ఉందని ఆప్రాజెక్టు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని వివరించారు. ఈ ఆక్రమణకు గురైంది ఎంతటి వారైనా సరే ఊరుకునేది లేదని.. దీనిపై ప్రాథమిక సర్వే చేసిన తరువాత ఆక్రమణలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు.  

ap employees shift

ఏపీకి 22 వేలమంది ఉద్యోగులు తరలింపు

  ఇప్పటికే ఏపీ రాజధానిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలను.. ఉద్యోగులను ఏపీలోకి బదలాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారు. అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఉద్యోగులను తరలించే విషయంపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెఎస్ జవహర్ కమిటీ కూడా దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరులకు తరలించే నేపథ్యలో జరిపిన విచారణలో దాదాపు 22, 000 ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే రెండు నెలల్లో ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కు అందజేసింది. దీనిలో భాగంగా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐవైఆర్‌ కృష్ణారావు ఉద్యోగ సంఘాల నాయకులతో  సమావేశం అయి అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి రావాలంటే అందుకు తగిన కార్యలయాలు కాని, వసతి సౌకర్యాలు కాని సరిగా లేవు. ఏయే శాఖల నుంచి ఎంతమంది ఉద్యోగులు వెళ్లాలి? ఆయా శాఖలు, విభాగాల కార్యాలయాలకు ఎన్ని చదరపు అడుగుల స్థలం కావాలి అనే విషయంపై అధ్యయనం చేసి.. ఇంతమంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి ఉండటానికి మొత్తం 30 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే  కెఎస్ జవహర్ కమిటీ విజయవాడ, గుంటూరు నగర పరిసర ప్రాంతాలను పరిశీలించింది.  గన్నవరం విమానాశ్రయం సమీపంలోని మేధా టవర్స్‌, లైలా టవర్స్ కూడా పరిశీలించి అక్కడ కూడా ప్రభుత్వ కార్యలయాలు ఏర్పాటు చేయలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

మీ చరిత్ర చదువుకో.. సుష్మా

పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనలతో.. అట్టుడికి పోతున్నాయి. అలా సభ ప్రారంభమవుతుందో లేదో లలిత్ మోదీ వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ వాదనను కూడా వినకుండా అదేపనిగా పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారు. కాగా సుష్మా తన వాదనను వినిపించేందుకు.. లలిత్ గేట్ వ్యవహారంపై సమాధానం చెప్పేందుకు స్పీకర్  సుమిత్రా మహాజన్ అనుమతి ఇచ్చారు. దీంతో సుష్మా తన వివరణ ఇచ్చారు. తాను మానవత్వంతో లలిత్ మోదీ భార్యకు సహాయం చేశానని.. అది కూడా అందుకు వీలైతేనే.. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతేనే అనుమతించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. అయితే సుష్మా వివరణ ఇస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం తనను చెప్పనీయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు రావాలని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలని గొడవ చేస్తుండగా.. దీంతో స్పీకర్ కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడి సమాధానం వినాలనుకునే వాళ్లు వినండి లేనివాళ్లు బయటకు వెళ్లి పోవచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సుష్మా కూడా గందరగోళం మధ్యే వివరణ ఇచ్చారు.    అంతేకాదు పనిలో పనిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి కూడా రెండు చురకలు  అంటించారు. క్విడ్ ప్రోకోకు పాల్పడింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని.. రాహుల్ గాంధీ ఒకసారి సెలవులు తీసుకొని విశ్రాంతి తీసుకున్నారు.. ఈసారి మరోసారి సెలవులు తీసుకొని మీ కుటుంబ చరిత్ర చదువుకో అని మండిపడ్డారు. లలిత్ మోడీకి రైట్ ఆఫ్ రెసిడెన్సీ ఎలా లభించిందని తమను అడగటం కాదని, ఆయనకు రైట్ ఆఫ్ రెసిడెన్సీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు.

25 ఏళ్లలో చేయనిది 7 ఏళ్లలో చేశాడు

  మంత్రి లక్ష్మా రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. దీనికి గాను తెలంగాణ టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించి తెలంగాణ అధికార నేతలు రేవంత్ రెడ్డిని విమర్శించడం ఆపేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బావుంటుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ ను చాలా అభివృద్ధి చేశాడు.. 25 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని ఏడేళ్లలో తాను సాధించాడని అన్నారు. అలాంటి రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ హామీల మీద హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు పర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి ‘జై హింద్’ చెప్పక తప్పదు

  రాజకీయ పార్టీ అన్నాక స్వంత బాకా ఊదుకోవడానికి దానికో న్యూస్ పేపర్, ఓ న్యూస్ ఛానల్ ఇప్పుడు తప్పనిసరయి పోయాయి. ఈ విషయాన్ని పార్టీ పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గ్రహించగలిగిది పార్టీ పెట్టిన 130 సం.లకి గానీ ఆ జ్ఞానోదయం కాని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మనం ఎక్కవలసిన రైలు ఇంచుమించు ఒకట్టిన్నర శతాబ్దాలు లేటు ఇకనయినా ఓ ఛానల్ పెట్టుకోకపోతే శేషజీవితమంతా ప్రతిపక్ష బెంచీలకే పరిమితమయిపోయి పార్లమెంటుని స్తంభిస్తూ తృప్తిపడవలసి వస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటోంది.   అయితే కాంగ్రెస్ అధిష్టానం మేల్కోవడానికి 130 సం.లు పట్టిందేమో కానీ కేరళ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా కాలం క్రితమే మేల్కొని ‘జై హింద్ టీవి’ అనే న్యూస్ ఛానల్ నడిపించుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఛానల్ ని జాతీయ ఛానల్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి ఏకె అంధోని తెలిపారు. అందుకోసం జై హింద్ టీవీకి జాతీయ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసారు. త్వరలోనే ఆ ఛానల్లో సోనియా, రాహుల్ భజన కార్యక్రమాలు, స్తోత్రాలు, రాహుల్ గాంధీ మేధోసంపత్తికి అద్దం పట్టే ఆయన ప్రసంగాలు వగైరా దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి.   ఈరోజుల్లో కేవలం సాంప్రదాయ ఓటు బ్యాంకుని నమ్ముకొంటే ఎవరూ ఓట్లు వేయడంలేదని మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం ఎంతవసరమో ప్రత్యర్ధ రాజకీయ పార్టీల విమర్శలను, దుష్ప్రచారాన్ని త్రిప్పి కొట్టడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతరాన్ని క్యాచ్ చేయడానికి టీవీ ఛానల్ చాలా అవసరమని అయన అన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి ‘జై హింద్’ చెప్పేయడానికి ఛానల్ వచ్చేస్తోందని అందరూ గమనించ ప్రార్ధన.

చంద్రబాబు ఇల్లు.. ఏసీబీ కానిస్టేబుళ్ల ఓవరాక్షన్

  తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు చేసిన ఓవరాక్షన్ కు ఏసీబీ అధికారి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ నుండి రహస్యంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. దీంతో కానిస్టేబుళ్లపై సీఎం సీఎస్‌వో ఆగ్రహం వ్యక్తం చేసి.. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తెలంగాణ ఏసీబీ ఉన్నతాధికారి క్షమాపణ చెప్పారు.   మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి గన్‌మెన్‌లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడేవాడని అందుకే విచారణ చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.