దానిపై మాకూ అంతే హక్కుంది.. చంద్రబాబు

  హైదరాబాద్ పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఆంధ్ర రాష్ట్రానికి కూడా అంతే హక్కు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ఏదో సమస్య సృష్టిస్తూ.. లేనిపోని వివాదాలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి వచ్చేశామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కొట్లాడితే వచ్చేది ఏమీ లేదన్నారు. తనకు ఎవరితోను రాజీపడాల్సిన అవసరం లేదని, నా విశ్వసనీయతనే తనకు శ్రీరామ రక్ష అన్నారు. ఏపీకీ ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా రెండూ ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని.. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ది చెందే వరకూ కేంద్రం సహరించాలని కోరానని చెప్పారు. ఎవరూ ఆధైర్యపడవద్దని, అందరం కలిసి సాధించుకుందామని చెప్పారు.

జగన్ కు చంద్రబాబు కౌంటర్

ఓటుకు నోటు విషయంపై చంద్రబాబు భయపడుతున్నారని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ చంద్రబాబును విమర్శించగా, చంద్రబాబు దానికి ధీటుగా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. నేను భయపడేందుకు నా పైన ఉన్న కేసులు ఏమిటో చెప్పాలని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్ ఇప్పుడు కేసుల గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.   అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని.. వారికి కావల్సింది కేవలం పదవి మాత్రమే కావాలి.. తనకు రాష్ట్ర అభివృద్ది కావాలని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంతో చర్చలు కూడా జరిగాయి.. కేంద్రం కూడా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిందని అన్నారు. భూసేకరణ విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని.. రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారని.. రాజధాని ఆపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇద్దామనుకుంటే రాజకీయం చేస్తున్నారన్నారని విమర్శించారు.

మరో పాక్ ఉగ్రవాది పట్టివేత

  గత కొద్దిరోజుల క్రితం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ప్రాంతంలో మహ్మద్ నవేద్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేయగా జవాన్లు ఎదురు దాడికి దిగి కాల్పులు జరపగా మహ్మద్ నవేద్ పట్టుబడ్డాడు. ఇప్పుడు భారత సైన్యం చేతికి మరో ఉగ్రవాది దొరికాడు. నలుగురు పాక్ ఉగ్రవాదులు ఉత్తర కాశ్మీర్లో చొరబడగా ఉగ్రవాదులకి.. జవాన్ల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా షాజద్ అహ్మద్ అనే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఇతడు పాకిస్తాన్ లోని బాలోచిస్తాన్ కు చెందిన ముజఫడ్ కు చెందినవాడిగా పోలీసు అధికారులు గుర్తించారు. ఇతనికి ఇంతకుముందు భారత్ లో చొరబడిన ఉగ్రవాదులకు సంబంధం ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం షాజద్ అహ్మద్ ను మిలటరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

దయచేసి పవన్ కళ్యాణ్ తో జగన్ ను పోల్చొద్దు

  ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ కేవలం సీఎం కుర్చీ మీద వ్యామోహంతోనే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని.. అంతేకాని ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని మండిపడ్డారు. అంతేకాదు దయచేసి పవన్ కళ్యాణ్ తో జగన్ పోల్చవద్దని.. పవన్ కళ్యాణ్ కు జగన్ కు చాలా తేడా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతుల మీద ఉన్న ప్రేమతో వారి కోసం మాట్లాడుతుంటే జగన్ మాత్రం వారిని రైతులను రైచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు.  కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ కంటే ముందే భూసేకరణ విషయంలో ఏపీ రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకొని రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. వారి ఇష్టప్రకారమే ఇస్తే తీసుకోండని.. వారిని ఒప్పించి భూసేకరణ చేయండని చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఏ రోజూ తీరిక లేనట్టూ ఈ నెల 29 అంటే రాఖీ రోజూ ప్రత్యేక హోదాపై ధర్నాకు దిగడం జగన్‌ పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

జగన్ జోస్యం నెరవేరేనా?

  ఈమధ్య జగన్ మోహన్ రెడ్డి జోస్యంబా చెపుతున్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెపుతున్నారు. ఇంతకు ముందు కూడా జగన్ ఇంకా మూడేళ్లు మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఉంటుందని.. తరువాత మాదే అధికారమని చెప్పుకొచ్చారు. మరి జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు కాని ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు అందరూ నవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది.   ఎందుకంటే అయిన దానికి కాని దానికి కేవలం టీడీపీ ప్రభుత్వాన్నిఇరుకున పెట్టాలని మాత్రమే జగన్ ఎప్పుడు చూసిన ధర్నాలు చేస్తుంటారు. ఆరకంగానైనా టీడీపీపైన ఒత్తిడి తీసుకురావచ్చనే ఉద్దేశం తప్ప ఏం లేదు. దీనిలో భాగంగానే మొన్న ప్రత్యేక హోదా విషయంలో ఇక్కడెక్కడా ధర్నా చేయడానికి స్థలం లేనట్టు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేశారు. ఏమైంది.. ప్రతిపక్ష నేతలను విమర్శించి.. మీడియాలో కనిపించడం తప్ప వచ్చిందేమీ లేదు. అయినా ప్రతిపక్షాలను విమర్శించడానికి అక్కడివరకూ వెళ్లాలా అన్న వారు కూడా లేకపోలేదు. పోనీ ధర్నా వల్ల ఏమన్న పేరు వచ్చిందంటే అదీ లేదు.. ఎందుకంటే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ కూడా ధర్నా చేస్తానని చెప్పిన తరువాతే జగన్ ధర్నా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా అంతే జరిగింది. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకన్నారు. ఇప్పుడు జగన్ ధర్నా అంటూ అక్కడ హడావుడి చేయడం తప్ప ఏంలేదు. మరోవైపు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రెడిట్ మొత్తం కొట్టేశాడు.. ఇప్పుడు జగన్ ఏం చేసినా లాభం లేదని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మళ్లీ ఈనెల 29న రాష్ట్ర బంద్ కు కూడా పిలుపునిచ్చారు. మరి ఈబంద్ వల్ల ఏం ఒరుగుతుందో చూడాలి. మొత్తానికి జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. అందుకే ఇప్పటినుండే తరువాతం తానే సీఎం అని ‘‘కచ్చితంగా ఎప్పుడో చెప్పలేను కానీ అతి త్వరలోనే రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని జోస్యం చెపుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు జగన్ పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారని విమర్శిస్తున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

కేటీఆర్ కు మీరే చెప్పాలి జగన్.. సీఎం

  ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల రిలీవింగ్ పై ఎప్పటినుండో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికత ఆధారంగా ఆంధ్రా విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవింగ్ చేసి వారికి వేతనాలు కూడా చెల్లించట్లేదు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం రమేషే జగన్ కు ఫోన్ చేసి ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదని.. ఈ విషయంపై కేటీఆర్ తో మాట్లాడి వారికి వేతనాలు ఇప్పించాలని కోరారట. సీఎం రమేష్ చెప్పిన దానికి జగన్ కూడా సముఖత చూపించారట. అంతేకాదు జగన్ ఈ విషయంపై కేటీఆర్ తో కూడా మాట్లాడినట్టు.. ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.   దీనికి కేటీఆర్ కూడా స్పందించి రిలీవింగ్ చేసిన విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ద్యుత్ సంస్థల యాజమాన్యంతో చెప్పినట్లుగా.. దీనిలో భాగంగానే విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను కలిసినట్టు తెలుస్తోంది. కాని ఇంతా జరిగిన ఈ అంశం కేసీఆర్ పరిధిలో ఉండటం వల్ల ఆ తరువాత కెటిఆర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారని అంటున్నారు.

రాష్ట్రానికి రూ.2,25,486 కోట్లు ఇవ్వండి: బాబు డిమాండ్

  ప్రధాని నరేంద్ర మోడీతో మొన్న సమావేశమయిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేప్పట్టేందుకు వీలుగా రాష్ట్రానికి మొత్తం రూ. 2,25,486 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. తానేమీ కొత్తగా నిధులు కోరడం లేదని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులను కోరుతున్నానని ఆయన స్పష్టం చేసారు. బీహార్ రాష్ట్రానికి ఇటీవల మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని చూసి తను ఈ డిమాండ్లు ప్రధాని ముందు పెట్టడం లేదని, వీటి గురించి చాలా కాలంగా కేంద్రప్రభుత్వాన్ని తను అడుగుతున్నానని తెలిపారు. కనుక తను సమర్పిస్తున్న ఈ నివేదిక ఆధారంగానే నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్రానికి అందించవలసిన ఆర్ధిక ప్యాకేజిపై రోడ్డు మ్యాప్ తయారు చేయాలని ఆయన కోరారు.   చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించిన నివేదికలో శాఖల వారిగా కోరిన నిధుల వివరాలు: సాగునీరు, వ్యవసాయాభివృద్ధికి: రూ. 24, 627 కోట్లు, గ్రామీణ త్రాగునీటి సరఫరా: రూ. 13,714 కోట్లు, విద్యుత్: రూ. 3,190 కోట్లు, అటవీ శాఖ: రూ.1,950 కోట్లు, రహదారులు, మౌలిక వసతులు: రూ. 27,985 కోట్లు, రైల్వేలు: రూ. 21,420 కోట్లు, పోర్టుల అభివృద్ధి: రూ. 4,800 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి: రూ. 3,100 కోట్లు, పర్యాటక శాఖ: రూ. 4,750 కోట్లు, పట్టణాభివృద్ధి రూ. 14,106 కోట్లు, మొత్తం: రూ. 2,25,486 కోట్లు.

సానియాకు షాక్.. ఖేల్ రత్నపై స్టే

  భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాకు ఖేల్‌రత్న ప్రకటించింన సంగతి తెలిసిందే. అయితే సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై పారాలింపిక్ అథ్లెట్ హెచ్ ఎన్ గిరీశ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై స్టే విధించింది. తాము స్టే ఎత్తివేసేవరకూ ఆమెకు ఖేల్ రత్న ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల్లో రజత పతక విజేత గిరీశ హోసనగెరె నాగరాజె గౌడ కేంద్రం తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్రం అనుసరించే పాయింట్ల విధానం ప్రకారం తాను 90 పాయింట్లతో రేసులో ముందున్నానని, సానియా మిర్జా నా దరిదాపుల్లో కూడా లేదని తెలిపాడు.

కేసీఆర్ జాగీరా అది

  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. తన ఇష్టమొచ్చినట్టు చేయడానికి తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా అని మండిపడ్డారు. తన ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు.. అందరూ నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఇది తన ఇల్లు కాదు ప్రజాస్వామ్యమని ఎద్దేవ చేశారు. ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తానని కేసీఆర్ అంటున్నారు.. కేసీఆర్‌దేమైనా రాజరికమా..? లేక జమిందార్ పాలనా? అని నిలదీశారు. ప్రాజెక్టులపై అఖిలపక్షంతో మాట్లాడి.. చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయినా ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులపై నిందిస్తున్నారు.. మరి కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడ లేదని.. అప్పుడు గుర్తుకురానివి ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని అన్నారు. రైతులపట్ల నిర్లక్షం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ రానున్న రోజుల్లో అందుకు తగినమూల్యం చెల్లించుకోక తప్పదని పొన్నం వ్యాఖ్యనించారు.

జగన్ కల నెరవేరదు

  ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి చంద్రబాబు చాలా కృషిచేస్తున్నారని చినరాజప్ప అన్నారు. కానీ జగన్ టీడీపీ ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కంటున్నారని.. అది ఎప్పటికీ జరగదని విమర్శించారు. అంతేకాదు ప్రత్యేక హోదాని అడ్డుపట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతు ప్రయోజనాల కోసం మాట్లాడితే.. జగన్ రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమ కూడా జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రినవుతానని పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్చందంగా భూములు ఇస్తుంటే జగన్ ఇప్పుడు వచ్చి రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. కొన్ని లక్షల ఎకరాలు కొట్టేసిన జగన్ ఇప్పుడు రైతుల భూములు లాక్కుంటున్నారంటూ ఆరోపించడం విచిత్రంగా ఉందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత జగన్‌కు లేదు’ అని ఆయన విమర్శించారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ జగన్ విజయవాడలో ఈ రోజు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ చెబితే ఒప్పు.. జగన్ చెబితే రాజకీయమా?

ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుండి భూములు సేకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతునిస్తూ.. ఆపార్టీ నేతలు వారితో పాటు భూసేకరణ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన.. భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులు భయపడొద్దని.. మీకు అండగా మేము ఉన్నామని అన్నారు. అంతేకాక భూసేకరణపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల దగ్గరనుండి భూములు లాక్కోవద్దని చెప్పారు.. ఇప్పుడు జగన్ కూడా అదే చెపుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ చెపితే నిజమని అంటున్న నాయకులు జగన్ చెబితే రాజకీయ మంటున్నారని విమర్సించారు. ఇద్దురు చెప్పింది ఒకటే అయినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఒప్పు ఇప్పుడు జగన్ చెప్పింది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

అనుష్కకి అదేషాక్ తగులుతుందా..?

సినీ పరిశ్రమలో  హీరోలూ తమ సినిమాల్లో వచ్చిన లాభాల్లో వాటా కావాలని అడగటం పరిపాటి. ఇప్పుడు హీరోయిన్ లు కూడా కాస్త తెలివిమీరి పోయారు. వాళ్లకు కూడా సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా అడుగుతున్నారు. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న అనుష్క కూడా ఇదే దారిపట్టింది. తను ఆర్య జంటగా నటిస్తున్న సైజ్ జీరో సినిమా పై ఇప్పటికే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాకి గాను అనుష్క పారితోషికానికి బదులు సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లో వాటా కావాలని అడుగుతుందట. గతంలో ఛార్మి కూడా జ్యోతి లక్ష్మీ సినిమాకి ఇలాగే చేసి చేతులు కాల్చుకుంది. మరి సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఏదైనా అటూ ఇటూ జరిగితే అనుష్క పరిస్థితి కూడా అలాగే అవుతుందా చెవులు కొరుక్కుంటున్నారు.  

కేంద్రానికి సుప్రీం ప్రశ్న... మీ వైఖరేంటీ

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కృష్ణా జలాల వివాదంపై మీ వైఖరి చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. గతంలో రాష్ట్ర ఒకటిగా ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్‌ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని పిటిషన్ వేశారు దీనిపై సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు జరుగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్‌ హాజరై వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని అదేసమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

నాందేడ్ రైలు ప్రమాదం.. గ్రానైట్ రాయికి పూజలు

  బెంగుళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురలంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రాణాలను బలిగొన్న గ్రానైట్ రాయికి ఎవరో పూజలు చేశారు. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న 20 టన్నుల గ్రానైట్ రాయికి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టారు పూజలు చేయడంతో కలకలం రేపింది. అయితే గ్రానైట్ రాయికి సంబంధించిన యజమానులే ఈ పూజలు నిర్వహించి ఉంటారని అంటున్నారు. మరోవైపు ఇంకోసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే పూజలు నిర్వహించారని మరికొందరు అంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తక్కువ ప్రాణ నష్టం జరిగినందుకు రైల్వే అధికారుల సూచన మేరకు కొందరు కాంట్రాక్టర్లు పూజలు నిర్వహించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పూజలు ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదు కాని ఇప్పుడు అక్కడ అది పెద్ద హాట్ టాపిక్ అయింది.

ఆవిషయం మీరే చెప్పండి.. చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మరియు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా తదితరులు పాల్గొన్నారు. ముందు 45 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఉండగా ఈ చర్చ మాత్రం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఏపీ ప్రత్యేక హోదాపైన సమస్యలపైన సుదీర్ఘ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్ల చాలా నష్టపోయామని.. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులపై వ్యవహరిస్తున్న తీరు తదితర విషయాలు మాట్లాడారు. మాకు ఇష్టం లేకుండా రాష్ట్ర విభజన చేశారు.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లా ఏపీ అభివృద్ధి చెందాలని దానికి కేంద్రమే సహాయం చేయాలని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని.. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో ఎందుకు ఇవ్వలేక పోతున్నారో కూడా మీరే చెప్పాలని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే చంద్రబాబు చెప్పిన అంశాలన్నింటిని విన్న మోదీ స్పందించి ‘‘ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. ఏపీ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు మేం కట్టుబడి ఉన్నాం.. వాటి నుంచి వైదొలగే ఆలోచన లేదు’’ అని తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు ఏపీ సమస్యలను మోదీకి వివరిస్తున్నప్పుడు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒకటి రెండుసార్లు అడ్డుపడగా చంద్రబాబు కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. రుణ మాఫీ పేరుతో ఎక్కువ ఖర్చు చేశారని ఇప్పుడు లోటు బడ్జెట్‌ అని మా వద్దకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించగా..  రైతులకు రుణ మాఫీ మా ఎన్నికల వాగ్దానం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా సమతుల్యం చేసుకోవాలి. ఆర్థిక సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ రాజకీయంగా మా మనుగడ కూడా చూసుకోవాలి. రైతులు బాగా చితికిపోయినందువల్లే ఆ హామీ ఇచ్చాం. అమలు చేశాం’’ అని కాస్త ఘాటుగానే చెప్పారు.