బెంగుళూరు-నాందేడ్ రైలుకి ప్రమాదం, 6 మంది మృతి

  ఈ రోజు తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుండి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలుని లారీ డ్డీ కొంది. ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న కర్నాటకలోని దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వి. వెంకటేష్ నాయక్, మహమ్మద్ మరో ముగ్గురు మరణించారు. లారీ డ్రైవర్ కూడా మరణించాడు.   అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో మడకశిర రైల్వే గేటు వద్ద సుమారు 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మడకశిర నుండి తాడిపత్రికి గ్రానైట్ తీసుకువెళుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో మూసి ఉన్న రైల్వే గేటుని డ్డీ కొని రైల్వే ట్రాక్ పైకి చొచ్చుకు పోయి సరిగ్గా అదే సమయంలో బెంగుళూరు నుండి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలుని డ్డీ కొంది. లారీలో ఉన్న గ్రానైట్ పలకలు హెచ్-1 బోగీలోకి దూసుకుపోయాయి. యస్-1 నుండి యస్-5వరకు బోగీలు పట్టాలు తప్పాయి.   ప్రమాదం సంగతి తెలుసుకోగానే అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకాంతం, పోలీసులు, వైద్య, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని తక్షణమే సహాయ చర్యలు చేప్పట్టారు. గాయపడినవారిని ధర్మవరం, పెనుగొండ, అనంతపురం ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని బస్సులలో వారివారి గమ్యస్థానాలకి పంపిస్తున్నారు. రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లు: పెనుగొండ:08555 220249 ధర్మవరం:08559 222555, అనంతపురం:08554 236444.

చిరంజీవి సీఎం అయితే వేరేలా ఉండేది.. డొక్కా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ చనిపోయిన తరువాత కాంగ్రస్ పార్టీ కె రోశయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చేసింది. ఆతరువాత రోశయ్య సీఎం పదవి నుండి తప్పుకున్న వెంటనే ఆ బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని తను కోరానని అన్నారు. అప్పుడు దీనిలో భాగంగానే కేంద్రానికి లేఖ కూడా రాశానని.. ముఖ్యంగా కేంద్రం కొత్త సీఎంను నియమిస్తున్న సమయంలో సీఎం పదవిని ఎక్కాలని చూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి మోసగాడని.. చిరంజీవిని సీఎం చేయాలని కూడా ఆలేఖలో పేర్కొన్నారని తెలిపారు. అప్పుడు కాని చిరంజీవిని సీఎం చేసి వుంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు కానీ.. కాంగ్రెస్ పరిస్థితి కానీ మరోలా ఉండేదని డొక్కా అన్నారు.

చిరంజీవి బర్త్ డే పై వర్మ ట్వీట్లు.. నాకు నచ్చలేదు

  విమర్శలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. మరి ఇప్పుడు ఈయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? అది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు గురించి. ఈ రోజు చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే మరోపక్క రాంగోపాల్ వర్మకు ఇదేం నచ్చలేదట. చిరంజీవి గారికి అప్పుడే 60 ఏళ్లంటే నమ్మలేకపోతున్నాను.. చిరంజీవిని 26 ఏళ్లప్పుడు చూశాను అప్పటినుండి ఇప్పటివరకూ ఆయన అలాగే ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవికి 60 ఏళ్లు వచ్చాయని దానిని ఓ పెద్ద పండుగలా చేయడం.. 60 ఏళ్లు వచ్చాయని అందరికి తెలిసేలా చేయడం నచ్చలేదని ట్విట్ చేశారు. అంతేకాదు తన తండ్రి పుట్టిన రోజు వేడుకలను చాలా భారీగా ప్లాన్ చేసిన రాంచరణ్ పై కూడా సైటైర్ వేశారు. రామ్ చరణ్ తేజ గట్టిగా ఒత్తిడి చేసి ఈ వేడుక చేస్తున్నారా అని అన్నారు. పాపం రాంగోపాల్ వర్మకు ఈ మధ్య ఏ మేటర్ దొరకనట్టు లేదు ఆఖరికి చిరంజీవి పుట్టినరోజు మీద పడ్డారు. మరి రాంగోపాల్ వర్మ ట్వీట్లకు ఏలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.  

భూసేకరణ పై పవన్ సీరియస్.. షూటింగ్ ఆపేసి మరీ

పస్తుతానికి ఏపీ భూసేకరణ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతల నుండి  లాక్కోవద్దని చంద్రబాబును ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ట్వీట్లను పట్టించుకోకుండా శుక్రవారం ఐదు గ్రామాల పరిధిలో భూసేకరణకు రైతులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తన ట్వీట్టర్ అనే ఆయుధంతో మండిపడ్డారు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యాఖ్యలను ఉద్దేశించి తన అంతరంగాన్ని పవన్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. "ఒక పార్టీ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీకి విధేయత చూపడంలో అర్థం ఉంటుంది.. అంతేకాని పార్టీ విధి విధానాలు దేశ ప్రయాజనాలను దెబ్బతీసేలా ఉన్నప్పుడు అది నేరానికి పాల్పడడంతో సమానమని, రాజకీయాలకు దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం కావాలని రాంజెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలను ఆయన ట్వీట్ చేశారు."   అంతేకాదు ఏపీ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను అడ్డుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని భూములను  బలవంతంగా లాక్కుంటే సహించబోనని గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఈ విషయంపై పోరాడటాని ఆయన తన సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఆపేసి హైదరాబాద్ కు చేరుకున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన ఐదు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు పర్యటించాలని చూస్తున్నట్టు.. ఇదే విషయంపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు కూడా అదివారం నాడు పవన్ కళ్యాణ్ ను కలిసి భూసేకరణ గురించి.. ఏపీ అవసరాలను గురించి చర్చించనున్నట్టు సమాచారం. మరి ఏమవుతుందో  చూడాలి.

ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? డొక్క చీలుస్తాం

  ఏపీకీ ప్రత్యేక హోదా వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఓ పక్క ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా?.. ఈనెల 25న జరగబోయే చంద్రబాబు, మోడీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రత్యేక హోదా విషయంపై ఎం నిర్ణయం తీసుకుంటారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ప్రత్యేక హోదా అంశంపై వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. గుంటూరు జిల్లా శంకర్‌విలాస్ సెంటర్, అరన్నల్ పేట ఓవర్‌బ్రిడ్జ్‌లపై "ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే డొక్క చీలుస్తాం, టాప్‌ లేచిపోద్ది, రంగు పడుద్దంటూ" కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతోఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు ఈ ఫ్లేక్సీలు పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై పలు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ.. భూసేకరణ వివరణ

  భూసేకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ట్విట్టర్ లో ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. రైతుల నుండి భూములు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపు పవన్‌కల్యాణ్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. భూసేకరణ గురించి.. ఏపీలో ఉన్న సమస్యల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నట్టు తెలుస్తోంది. కాగా రేపు ఉదయం చంద్రబాబు పార్టీ నాయకులతో విజయవాడలో సమావేశమయి భాసేకరణ, కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై చర్చించి అనంతరం సాయంత్రం విజయవాడ నుండి హైదరాబాద్ కు రానున్నారు.

ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు..

  ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించేందుకు గాను ఈ నెల 25న భేటీకానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం అప్పుడే స్పష్టత ఇవ్వకపోవచ్చుననే ఊహాగానాలు రేగుతున్నాయి కానీ ప్రత్యేక  ప్యాకేజీపైన మాత్రం కేంద్రం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడానికి  ‘ప్రాథమిక’ ప్యాకేజీని కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ కూడా ఇప్పటికే ప్రధాని కార్యలయానికి చేరినట్టు సమాచారం. అయితే చంద్రబాబు.. మోడీ భేటీ అనంతరం వారు మాట్లాడుకున్నాక మార్పులు చేయడంకంటే ముందుగానే ఏపీకి ఏం కావాలో తెలుసుకుని సమగ్రంగా ప్యాకేజీని తయారు చేయాలని ప్రధాని మోదీ కేబినెట్‌ కార్యదర్శి పి.కె.సిన్హాకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పి.కె.సిన్హా మోదీ ఆదేశాల ప్రకారం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అనిల్‌ సింఘాల్‌ను ఫోన్‌ చేసి ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో  ఏపీ ప్రభుత్వం తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అనిల్‌ సింఘాల్‌ అందజేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాదా?

  ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? ఇప్పుడు అందరికి వచ్చే ప్రశ్న ఈ ఒక్కటే. ఇప్పుటికే ఒకవైపు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాగైనా ప్రత్యేక హోదా తేవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా ఒక్కటే కాదు ఏపీకి కావలసిన అవసరాలు, ఇబ్బందుల గురించి కూడా చర్చించనున్నారు. అంతేకాదు మోడీ  బీహార్ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలా కాకుండా ఉత్తర ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్టుల తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన 200 పేజీల ముసాయిదాను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.   అయితే అందరూ మోడీ చంద్రబాబు ల భేటీ కోస..ఆ భేటీలో ప్రత్యోక హోదా విషయంపై ఏం నిర్ణయం తీసుకుంటారా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రత్యేక హోదా రాదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు,కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమని.. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దీంతో ప్రత్యేక హోదా రాదనే విషయం అశోక గజపతి రాజు మాటాల్లోనే అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

చిరంజీవి బర్త్ డే స్పెషల్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమని కొన్ని సంవత్సరాలపాటు ఏలి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎవరి సపోర్టు లేకుండానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నెం1 స్థానాన్ని కొట్టేశారు. తన సినీ ప్రస్థానంలో మొత్తం 149 సినిమాలు చేయగా ఇప్పుడు అందరూ 150 వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఈరోజు చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అంతే కాదు తండ్రి పుట్టిన రోజును తనయుడు రాంచరణ్ గ్రాండ్ గానే  ప్లాన్ చేశాడు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో  గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలుకూడా రానున్నట్టు తెలుస్తోంది.

బీహార్ లిఫ్ట్‌లు చిన్నవి.. అమిత్ షా ఎక్కకపోవడమే మంచిది

  భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ ఎన్నికల నేపథ్యంలో చర్చించడానికి వెళ్లి లిఫ్ట్ లో 40 నిమిషాలు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ అమిత్ షా పై సెటైర్లు విసిరారు. బీహార్ లిఫ్ట్‌లు చాలా చిన్నవని, అమిత్ షా వంటి లావువాళ్లను అవి మోయలేవని విమర్శించారు. అమిత్ షా లావుగా ఉన్నందునే లిఫ్ట్ ఆగిపోయిందన్నారు. అధిక బరువు ఉన్న వ్యక్తులు లిఫ్ట్ ఎక్కకపోవడమే మంచిదన్నారు. దీనికి బీజేపీ కూడా వెంటనే స్పందించిం ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది.

లిఫ్ట్ లో చిక్కుకుపోయిన అమిత్ షా

  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దాదాపు 40 నిమిషాలు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారంట. బీహార్ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంపై చర్చించడానికి పాట్నా వచ్చిన ఆయన పార్టీ నాయకులతో చర్చించారు. అనంతరం తిరిగి రాత్రి 11.30 గంటలకు అమిత్ షా, ఆయన వ్యక్తిగత కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు భూపీందర్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి సాధన్ సింగ్, భద్రతా సిబ్బంది లిఫ్ట్ లో బయలుదేరగా లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ఆసమయంలో వారి దగ్గర ఉన్న ఫోనులు కూడా పనిచేయలేదు.. లిఫ్ట్ లో ఉన్న ఎమర్జెన్సీ నెంబరుకు పని చేసినా అది కూడా పనిచేలేదు దీంతో వారందరూ దాదాపు 40 నిమిషాలు లిఫ్ట్ లోనే ఉండాల్సి వచ్చిందంట. అయితే తరువాత అమిత్ షా ఆదేశాల మేరకు సీఆర్ పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి లిఫ్ట్ ఇనుప డోర్ లు పగలగొట్టి అమిత్ షాను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారట.

ట్వీట్లు వేస్తే సరిపోదు.. వెళ్లి కాపాడు

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరోసారి పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు చేశారు. గతంలో కూడా ఈయన ఒకసారి ఓటుకు నోటు వ్యవహారంపై ప్రశ్నిస్తా అన్నావు కదా ఏం చేస్తున్నావ్ అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ రాజధానిలో భూముల సేకరణను ఉద్దేశించి వీహెచ్ పవన్ కళ్యాణ్ ను సూచించారు. భూసేకరణ వద్దంటూ ట్వీట్టర్ లో ట్వీట్లు చేస్తూ ఇంట్లో కూర్చుంటే సరికాదు.. అక్కడికి వెళ్లి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఏపీ ప్రభుత్వం అన్యాయంగా రైతుల నుండి భూములను లాక్కుంటుందని.. పవన్ కళ్యాణ్ రాజధాని వెళ్లి ఆపాలని సూచించారు. కాగా రైతుల నుండి పంటలు పండే భూములు తీసుకోవద్దని.. ఉండవల్లి, బేతపూడి, పెనుబాక గ్రామాల్లో ఉన్న భూములను భూసేకరణ నుండి మినహాయించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ ద్వారా చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే.

అనుష్క త్రిషలపై జక్కన్న ప్రశంసలు

  జక్కన్న రాజమౌళి చెక్కిన బాహుబలి సినిమా ఘన విజయం సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తయిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా అన్ని సినిమాల వైపు ఓ లుక్కెస్తున్నట్టున్నారు. ఏ సినిమాలు వున్నాయ్.. ఎవరెవరు ఎలా చేస్తున్నారు అని బాగా పరిశీలిస్తున్నట్టున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రెండు సినిమాలు బాగా నచ్చాయంట. సైజ్ జీరో సినిమాలో లావుగా, డీగ్లామర్ గా అనుష్క పాత్ర.. అలాగే నాయకి సినిమాలో త్రిష పాత్రలు బాగా నచ్చాయంట. అంతేకాదు ఈ సినిమాలకి సంబంధించి ట్వీట్టర్ లో పోస్టులు కూడా చేశాడు . సైజ్ జీరో సినిమాలో అనుష్క చాలా చక్కగా ఉందని.. ఇంకా నాయకి పాత్రలో అయితే త్రిష ఒక చేత్తో కత్తి.. ఒక చేత్తో పూజా సామాగ్రి పట్టుకొని చాలా బావుందని.. ఈ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతుందని ట్వీట్స్ చేశాడు. మరి జక్కన్నకే  ఈ సినిమాలు అంత బాగా నచ్చాయంటే మరి ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చుతాయో చూడాలి.

చంద్రబాబుకు బులెట్ ప్రూఫ్ బస్సు.. 5 కోట్లు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనల నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఈప్రత్యేక సౌకర్యాలతో కూడిన బులెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసింది. సుమారు రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన ఈ బస్సు ఈ రోజు ఉదయం విజయవాడ చేరుకుంది. అయితే చంద్రబాబు కూడా విజయవాడలోనే ఉన్న నేపథ్యంలో దానిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిని ఆయన జిల్లా పర్యటనల్లో భాగంగా మాత్రమే ఉపయోగించనున్నారు. చంద్రాబాబు ఈ బులెట్ ప్రూఫ్ బస్సును తయారు చేసే బాధ్యతను ఆర్టీసీ అధికారులకు అప్పగించడంతో వారు బెంజ్ కంపెనీకి చెందిన బస్సును కొనుగోలు చేసి.. ఛండీగఢ్‌లో దానిని బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దడం జరిగింది. ఈ బస్సు శక్తివంతమైన బాంబు దాడులను కూడా తట్టుకుని నిలుస్తుందని తెలుస్తోంది.  

డీఎస్ కు ప్రభుత్వ సలహాదారు పదవి..

  డీఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి మారిన సంగతి తెలసిందే. అలా పార్టీ మారారో లేదో అప్పుడే కేసీఆర్ తనకు పదవిని కట్టబెట్టేశారు. అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ జీవో జారీ చేశారు. అంతేకాదు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా జీవో జారీ చేశారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా డీఎస్ కు ఫోన్ చేసి చెప్పడం జరిగిందట. దీనికి డీఎస్ హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని.. తనపై నమ్మకంతోనే ఇంతటి బాధ్యతను అప్పగించారని.. కెసిఆర్‌కు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని.. నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పారు.   గత నెల జూలై 8వ తేదీన డీఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాను బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని.. అంతేకాని పదవుల మీద వ్యామోహంతో కాదని చెప్పిన సంగతి తెలిసిందే.

శవంతో సెల్ఫీల పోటీ.. స్పెషల్ వీడియో

  సెల్ఫీ.. ప్రస్తుతం చాలా మందికి ఈ సెల్ఫీ పిచ్చి బాగానే పట్టింది. తింటున్నా.. కూర్చున్నా.. టక్కున సెల్ఫీ తీసుకోవడం అప్ డేట్ చేయడం. ఎంత వెరైటీగా సెల్ఫీ పెడితే అంత గొప్ప అన్నట్టు ఉంది చూస్తే. దానికోసం సాహసాలు కూడా చేస్తూ రకరకాలుగా ఫోటోలు తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రాణాలు పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పిచ్చి ఎంతలా అంటే కనీసం ఏ పరిస్థితిలో ఉన్న సందర్భం ఏంటీ అని కూడా చూసుకునే స్థితిలో కూడా లేకుండా పోతున్నారు కొందరు. అయితే ఇప్పుడు రష్యావాళ్లు ఒక మెట్టు ఎక్కి ‘సెల్ఫీస్ విత్ డెడ్' పేరుతో సోషల్ మీడియా ఓ కాంపిటీషన్ కు తెర లేపారు. దీనిలో పాల్గొన్నవారు చనిపోయిన వారితో సెల్ఫీ తీసుకుంటే వాటిలో బెస్ట్ సెల్పీలను ఎంపిక చేసి వాటికి బెస్ట్ క్యాష్ ప్రైజులను బహుకరిస్తారట. అయితే ఈ కాంపిటీషన్ సంగతేమో కాని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాని ఈ కాంపిటీషన్ ను నిర్వహించిన వారు మాత్రం చనిపోయిన వ్యక్తితో సెల్ఫీలు దిగటమనేది ‘ఒక రకమైన కళ' అంటూ సమర్థించుకుంటున్నాయి. ఈ ఒక్కటి చాలు మానవీయ విలువలు రోజురోజుకు ఎంత దిగజారుతున్నాయో చెప్పడానికి.  

చెప్పేంత విషయాలు ఏం లేవు.. గవర్నర్

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌తో అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అయితే గవర్నర్ భేటీపై ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్వవహారం పైనా చర్చించేందుకు కలిసారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భేటీ అనంతరం గవర్నర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భేటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదని.. సంచలనమైన విషయాలు ఏం లేవని ఒక గవర్నర్ గా మాత్రమే కలిశానని చెప్పారు. కాగా ఇరురాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత సమస్యలు.. ఉద్యోగుల విభజన.. షెడ్యూల్ 9,10లోని వివాదాల వల్ల సమస్యలు.. ముఖ్యంగా ఈ సమస్యల వల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తలసాని యాదవ్ రాజీడ్రామా వ్యవహారం ఏం చర్చలోకి రాలేదని.. సరైన సరైన సమయంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.   ఆతరువాత గవర్నర్ నరసింహన్ దంపతులు ఇరువురు కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించారు. ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను  పరామర్శించి సంతాపం తెలియజేశారు.

టీడీపీకి పవన్ కళ్యాణ్ అవసరమెంత?

  ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ట్వీట్లతో నేతలపై మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్లకు అందరూ ఎలా ఉన్నా టీడీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తగ్గట్టుగానే ఘాటుగా సమాధానమిస్తున్నారు. గతంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఇలాగే మాటల యుద్ధాలు.. ట్వీట్ల యుద్ధాలు జరిగాయి. అలాగే ఈసారి కూడా భూసేకరణ నేపథ్యంలో రైతల భూములు తీసుకోవద్దని.. ఏడాదికి మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని.. ఉండవల్లి, బేతపూడి, పెనుబాక భూములను భూసేకరణ నుండి మినహాయించాలని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబునే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు యనమల స్పందించి భూసేకరణ వద్దంటున్నారు మరి ఏం చేయాలో కూడా చెబితే బావుంటుందని ఒకింత వెటకారంగానే సమాధానవిచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా రైతు సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎటకారంగా ఉందా ఉంటూ స్ట్రాంగ్ గానే యనమలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్వీట్లకు టీడీపీ నేతల్లో ఎవరో ఒకరు కాస్త ఘాటుగా స్పందించినా.. తరువాత ఆపార్టీకి సంబంధించిన నేతల్లో ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ కు తామేమి వ్యతిరేకం కాదంటూ వారు ఆ ఉద్దేశంతో అనలేదంటూ సమర్ధిస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో స్వయంగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తామని.. తాము పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. యనమల విషయంలో కూడా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో తమకు ఎలాంటి విబేధాలు లేవని.. తనని ఒప్పించే భూములు సేకరిస్తామని చెప్పారు.     దీనిని బట్టి చూస్తే టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కు బాగానే ప్రాధాన్య ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా బీజేపీ టీడీపీ పార్టీలు మిత్రపక్షాలు అని తెలిసిన విషయమే. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ పార్టీలకు తన మద్ధతు ఎప్పుడో తెలిపాడు. ఈ నేపథ్యంలో టీడీపీ పవన్ కళ్యాతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే తాను ఎంత ప్రశ్నించిన.. ఎంత ఘాటుగా ట్వీట్లు చేసిన టీడీపీ మాత్రం తనను సమర్ధిస్తూనే ఉంది. దీనికి కారణం అతనికి అభిమానులు ఎక్కువ.. జనాల్లో అతనికి ఉన్న క్రేజ్ కూడా కావచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు టీడీపీ పవన్ కళ్యాణ్ కు అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా అని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ కి వచ్చే లాభమేంటి అని అనుకుంటున్నారు. అందులోనూ నిజం లేకపోలేదు.. ఎందుకంటే ఎప్పుడో పార్టీ పెట్టి కొన్ని రోజులు అసలు ఏం మాట్లాడకుండా ఉండి.. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఉపయోగముంటుందో పార్టీకే తెలియాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చేదెంతో.. పోయేదెంతో తెలియదు కాని పవన్ కళ్యాణ్ మాత్రం తక్కువ టైంలోనే తన కంటూ ఒక ప్రాధాన్యతను ఏర్పరచుకున్నాడు. అది గొప్ప విషయమే కదా..