కేసీఆర్ ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటా! రేవంత్ రెడ్డి

  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మరికొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు మెహబూబ్ నగర్ కొండగల్ మార్కెట్ యార్డు వద్ద అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఆయన నియోజక వర్గంలో ఉన్న మార్కెట్ యార్డుకి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేసారు. కానీ, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో ఆయన తను అంచరులతో కలిసి అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. భూమిపూజ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారిని స్టేషన్లో ఉంచి తరువాత విడుదల చేసారు.   స్థానిక ఎమ్మెల్యేనయినా తనకు ప్రొకాల్ ప్రకారం ఆహ్వానం పంపకపోగా తనను పోలీసుల చేత అరెస్ట్ చేయించినందుకు రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈవిధంగా అరెస్టులతో తనను ఎవరూ భయపెట్టలేరని, తెదేపాను ఎంతగా అణగద్రొక్కే ప్రయత్నిస్తే మరినత శక్తివంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడుతామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దించేవరకు తన పోరాటం సాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ను ఏకేసిన వెంకయ్యనాయుడు

 ఏపీకి కేటాయించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందని.. ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణా ఏర్పడాలి అలాగే ఏపీకి న్యాయం జరగాలి.. అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అని పార్లమెంట్ లో ఎవరు గొంతు చించుకున్నారో అందరికి తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని అడ్డుకుంటానంటే నాకు అభ్యంతరం లేదని, కానీ తాను వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి ప్రాజెక్టు వస్తుందన్నారు. గడ్డిబొమ్మలు పెట్టి తన దిష్టి బొమ్మలు తలగబెట్టినంత మాత్రన అలాంటివి లెక్కచేయనని మండిపడ్డారు. అంతేకాదు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెగ హడావుడి చేస్తుంది.. మరి యాభై ఏళ్లు పాలన చేసిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు. తాను కష్టపడి ఇంతటి స్థాయికి వచ్చానని నలభై రాజకీయానుభవం ఉన్న నాకు మొదటి నుండి ఇదే పార్టీలో ఉన్నాను.. ఇదే పార్టీలో చస్తాను అని అన్నారు. అంతేకాని వారసత్వ రాజకీయాలతో రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ పార్టీలోకి మారతారో తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తమను అడగడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

చంద్రబాబు మోడీల భేటీ తేదీ ఖరారు

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీల భేటీ ఈ రోజు జరగాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. అనుకొని పరిస్థితుల్లో సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో భేటీ కాస్త వాయిదా పడింది. అయితే కేంద్రం తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి రావచ్చని తెలిపింది. దీంతో చంద్రబాబు నాయుడు ఈనెల 25న భేటీకి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఏపీలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. అందులోను మోడీ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో చంద్రబాబు కూడా ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యమైందని భావించే 25వ తేదీనే సమావేశానికి ఎంచుకున్నారు.   మరోవైపు ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాపైన ఇంకా ఏపీకి కావలసిన అవసరాలపై చంద్రబాబు తగిన ముసాయిదాను తయారుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపైన  అంతేకాదు ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించాలని.. ఈ మేరకు మోడీని కూడా ఒప్పించాలని నిర్ణయం తీసుకన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రత్యేక హోదా విషయంలో ఉత్తరఖండ్ మోడల్ లా ఏపీకి ప్రత్యేక హోదాకాని.. ప్రత్యేక ప్యాకేజీకాని కావాలని కోరనున్నట్టు సమాచారం. 

ఏపీకి ఒక్కచుక్క నీరివ్వం..

  ఏపీ నీటిపారుదల శాఖ కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణ నీటి పారుదల శాఖ నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు ఒక్కచుక్క కూడ తాగునీరు ఇవ్వలేమని.. ఈ నిల్వ ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పింది. అంతేకాదు ఏపీ శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేస్తేనే సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేస్తామని తిరకాసు పెట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్ననేపథ్యంలో సెప్టెంబర్‌ రెండో వారంలోగా కృష్ణానదికి వరదలు వచ్చి శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లు నిండితేనే తప్ప రెండు రాష్ర్టాలకు నీటి కరువు తీరుతుందని.. లేదంటే, శ్రీశైలంలో 803 అడుగులకు దిగువన ఉన్న 17-18 టీఎంసీలు, సాగర్‌లో 509 అడుగులకు దిగువన ఉన్న 130 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు వాడుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాగునీటి కోసం రెండు రిజర్వాయర్లను ఖాళీచేయడం తప్ప వేరే మార్గం లేదని రెండు రాష్ర్టాల నీటి పారుదల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

మహేష్ బాబుకి కేటీఆర్ ఫోన్.. ఒక ఊరు దత్తత

  మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా విజయవంతం అయి సూపర్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలాగైతే ఒక ఊరిని దత్తత తీసుకొని దాని అభివృధ్ధికి పాటుపడతారో.. దాని స్ఫూర్తితో రియల్ లైఫ్ లో కూడా ఊరిని దత్తత తీసుకుంటున్నారట. దీనికి కారణం తెలంగాణ సీఎం కుమారుడు.. ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పడమే కారణమట. అసలు సంగతేంటంటే.. శ్రీమంతుడు సినిమాపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మహేశ్ బాబుకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఆయనే స్వయంగా మహేశ్  బాబుకు ఫోనే చేసి సినిమా బావుందని అభినందనలు తెలిపి గ్రామజ్యోతి పథకంలో భాగంగా.. సినిమా స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకోవాలని కోరారట. దీనికి మహేష్ బాబు కూడా సానుకూలంగానే స్పందించారట. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ బాబే ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను కూడా త్వరలో తెలియజేస్తానని..   మరోవైపు మహేశ్ బాబు ఏపీలో కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని మహేష్ తెలిపారు. మొత్తానికి మహేశ్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడనిపించాడు.  

చిరంజీవి 150 సినిమాపై వీడిన కన్ఫ్యూజన్

  చిరంజీవి 150వ సినిమా గురించి ఇప్పటకే ఎన్నో వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ రాకముందే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదట్లో ఈ సినిమాకి వినాయక్ డైరెక్టర్ అని వార్తలు వచ్చాయి.. తరువాత ఈ పూరి జగన్నాథ్ అని అన్నారు. ఆతరువాత పూరిజగన్నాథ్ కాదు అని కూడా వార్తలు వచ్చాయి.. అయితే మళ్లీ ఈ సినిమాకు పూరీనే డెైరెక్టర్ అని మళ్లీ అన్నారు. మొత్తానికి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇప్పటికీ అభిమానులకు కన్ఫ్యూజన్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కన్ఫ్యూజన్ వీడింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కాదని ఈ విషయాన్ని చిరంజీవీనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు పూరి ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పాడని, సెకండ్ హాఫ్ ఇంకా ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు ఇంకా వేరే దర్శకులు కథలు కూడా వింటున్న అని అవి కనుక నచ్చితే వచ్చే రెండు మూడు నెలల్లో షూటింగ్ మొదలవుతుంది అని చిరు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ పోయిన మళ్లీ చిరంజీవి 150వ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా తెలియని సస్పెన్స్ గానే ఉన్నది.

మహిళల రేప్ పై ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు

  సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మహిళల అత్యాచారం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళను నలుగుర వ్యక్తులు ఒకేసారి ఎలా అత్యాచారం చేస్తారని, అదంతా వట్టిదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే దానిని మిగిలిన వారిని కూడా ఆపాదిస్తున్నారని అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, హింసలు పెరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ములాయం పైవిధంగా వ్యాఖ్యానించారు. మిగిలిన రాష్ట్రాలకంటే ఉత్తరప్రదేశ్ చాలా బెటర్ అని.. ఇక్కడ అత్యాచారాలు, నేరాల సంఖ్య తక్కువగా ఉందని.. అసలు గ్యాంగ్ రేప్‌లు లేవని అన్నారు. అయినా రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క నేరంపై ప్రభుత్వం దృష్టి సారించాలంటే కష్టమన అన్నారు. ఇదిలా ఉండగా ములాయం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం సింగ్ ఇలా వ్యాఖ్యానించడం అనైతికం అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

అది కూడా పవన్ చెబితే బావుంటుంది.. యనమల

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భూసేకరణ వద్దంటూ.. మూడు పంటలు పండే భూములను రైతల దగ్గర నుండి లాక్కోవద్దంటూ ట్వీట్టర్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీఎం చంద్రబాబు మరోసారి ఆలోచించాలని కూడా సూచించారు. భూసేకరణ నుండి ఉండవల్లి, పెనుబాక, బేతపూడి గ్రామాలను మినహాయించాలని చంద్రబాబును కోరారు.   అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆర్ధిక మంత్రి యనమన రామకృష్ణుడు స్పందించి పవన్ కళ్యాణ్ భూసేకరణ వద్దు.. భూములు లాక్కోవద్దు అంటున్నారు. మరి భూసేకరణ వద్దంటున్న పవన్ కళ్యాణ్ ఏం చేయాలో కూడా చెబితే బావుంటుందని అన్నారు. భూసేకరణ లేకుండా రాజధాని అభివృద్ధి ఏలా జరుగుతుందని అన్నారు. అయిలా దానికి తగిన పరిహారం కోరాలి కాని భూసేకరణ వద్దంటే ఎలా అని ప్రశ్నించా

చంద్రబాబు మోడీల భేటీ వాయిదా

  బీహార్ కు ప్రధాని మోడీ భారీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై చర్చలు ఎక్కవయ్యాయి. దీనిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంపై రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటారా అని అందరూ రేపటి సమావేశం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటి సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యలయం బాంబు లాంటి వార్త పంపింది. దీంతో రేపటి భేటీ కాస్త వాయిదా పడింది. అయితే ఈనెల 25 లేదా 28, 29,31 తేదీల్లో ఏ రోజు వీలైతే ఆరోజు అపాయింట్‌మెంట్‌ ఇస్తామని పీఎంవో తెలిపడంతో ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక రోజు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంది.   మరోవైపు ఇప్పటికే చంద్రబాబు రేపటి భేటీలో ఏపీకి కావాల్సిన అవసరాలపై అధికారులతో చర్చించి దానికి సంబంధించిన ముసాయిదాను కూడా తయారుచేశారు. అంతేకాదు ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించాలనుకున్న నేపథ్యంలో భేటీ వాయిదా. మొత్తానికి చంద్రబాబు మోడీ భేటీ అయితేనే కాని ప్రత్యేక హోదాపైన కాని తదితర విషయాలపైన కాని స్పష్టత రాదు. మరి ఈసారైనా భేటీ జరుగుతుందో మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.

ఏపీ సర్కార్ తో పవన్ ట్వీట్ ఫైట్ వీడియో

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వ చేపట్టిన భూసేకరణపై వ్యతిరేకత చూపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై భూసేకరణ వద్దంటూ ట్వీట్స్ చేశాడు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని.. ఈ విషయంపై సీఎం చంద్రబాబు మరోసారి ఆలోచించాలని ట్వీటారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడితోపాటు నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని పవన్‌ చంద్రబాబును కోరారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి మిత్రపక్షమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ గవర్నమెంట్ పై ఈ విషయంలో టీడీపీకి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. మరి పవన్ కళ్యాణ్ ట్వీట్లకు చంద్రబాబు స్పందిస్తారో లేదో చూడాలి.

పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా?

  పార్టీలో ఉండాలా పోవాలా అంటూ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డిని ప్రశ్నించారు. ఇంతకీ ఏ విషయంలో వివేకానంద రెడ్డికి అంత కోపం వచ్చిందంటే చింతా మోహన్, పనబాక లక్ష్మీ చెప్పిన వారికే పదవులు ఇవ్వడంతో ఆనం రఘువీర రెడ్డి మీద ఫైర్ అయ్యారు. దీని కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాలోని సేవాదళ్, ఎస్సీ కమిటీ జిల్లా అధ్యక్ష పదవులను చింతా మోహన్, పనబాక లక్ష్మీ వారికి ఇవ్వడం.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇందిరా భవన్‌లో ఆనం రఘువీరా రెడ్డిని కలిసి నెల్లూరు జిల్లాలో తమ పరువు ఉండాలా?.. పార్టీకి పట్టుమని పది మందిని కూడా తీసుకువచ్చే సామర్థ్యం లేని ఇలాంటి వారికి పదవులు ఇస్తే పార్టీ బతుకుతుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకొని వారిని తొలగిస్తే సరి లేకపోతే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాదు ఇప్పటికే పార్టీ చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పార్టీకే మంచిది కాదని అన్నారు. అయినా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటే మేమేందుకు.. మేము పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ను ప్రశ్నించిన నాగం

నాగం జనార్ధనరెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. హైదరాబాదులోని బషీర్‌బాగ్‌లో తెలంగాణ బచావో కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభన చేసిన తరువాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా.. పేద రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. అయినా గుడుంబా తాగితే ఆరోగ్యం పాడవుతుందని.. మందు రేట్లు తగ్గించారు.. ఇప్పుడు ఛీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఎప్పటినుండో ఉన్న సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని.. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ గుడ్ బై చెప్పి వేరే కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన ముందు తెలుగుదేశం పార్టీలో సీనీయర్ మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తరువాత బీజేపీలోకి మారారు. అయితే ఆపార్టీలో ఆయనకు సరైన ప్రాదాన్య లేకపోయేసరికి ఇప్పుడు వేరు కుంపటి ఏర్పాటు చేసుకుంటున్నారు. 'బచావో తెలంగాణ మిషన్' పేరిట ప్రజావేదిక ఏర్పాటవుతోంది.

మనకెందుకు రావడంలేదు.. చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ నియోజక వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన  మాట్లూడుతూ అసలు ఇల్లు కూడా వదిలి బయటకు రాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎమ్మెల్యేగా పోటీచేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా గెలుస్తున్నారు.. ఓటర్లు ఆమెను గెలిపిస్తుంటే.. నిరంతరం కుప్పంలో అభివృద్ధి పనులు చేపడుతూ.. ప్రజల బాగోగులు తెలుసుకుంటూ.. తరుచూ నియోజక వర్గంలో పర్యటించే మనకు ఆశించిన మెజారిటీ ఎందుకు రావడంలేదని చంద్రబాబు పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. అంతేకాదు కొంతమంది నేతలు అహంతో వ్యవహరిస్తున్నారుని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ చేపట్టే ఏ కార్యక్రమమైనా కాని కార్యకర్తల ప్రమేయంతోనే సాగాలన్నారు. కాగా పలు సమస్యలను కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకురాగా.. వాటితో తానూ ఏకీభవిస్తున్నానన్నారు.

ఏపీ ఏపీయే.. బీహార్ బీహారే

  ప్రస్తుతానికి ఇప్పుడు ఏపీలో అందరూ చర్చించే అంశం ఏంటంటే అది ప్రత్యేక హోదా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నా.. ఎన్నో ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా నరేంద్ర మోడీ బీహార్ కు పత్యేక ప్యాకేజీ కింద లక్షా ఇరవై వేల కోట్లు ఇస్తానని ప్రకటించడంతో ఇప్పుడు ఏపీ ప్రత్యేకహోదా పై వేడి రాజుకుంది. చంద్రబాబు నరేంద్ర మోడీని కలిసేది కూడా రేపే కావడంతో ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పై  ఉత్కంఠ రేపుతోంది. కాగా అసలు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినా ఊహించిన దానికంటే ఎక్కువ ప్యాకేజీనే ఇచ్చారు మోడీ.. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. మరోవైపు చంద్రబాబు కూడా ఏపీ ప్రత్యేక హోదా పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ప్రత్యేక హోదా ఇంకా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాలని ఇదే విషయాన్ని మోడీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసి రాష్ట్ర విభజన చేశారని.. ఏపీకి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలన బిహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ కన్నారెండింతలు ఎక్కువ ప్యాకేజీనే ప్రకటించాలని మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరఖండ్ విడిపోగా అప్పుడు కేంద్రం ఉత్తరఖండ్ కు ఇచ్చిన ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీనే ఏపీ ఇవ్వాలని చంద్రబాబు మోడీని కోరనున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్శదర్శి పి.వి.రమేశ్‌ ఆంధ్ర రాష్ట్రానికి కావలసిన అవసరాలు, ప్యాకేజీలో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఎంపీలతో కూడా రెండుమూడుసార్లు భేటీ అయి ఏపీ ప్యాకేజీపై రెండు నివేదికలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ నివేదికలపై చంద్రబాబు పీవీ రమేశ్‌ భేటీ అయి దీనిపై చర్చించి తుది ముసాయిదాను తయారుచేయనున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఏపీకీ ప్రత్యేక ప్యాకేజి విషయంలో ఎలాంటి పేచీ పెట్టకపోయినా ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ఇప్పుటికే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబుకు నచ్చజెప్పాలని చూస్తున్నట్టు సమాచారం. నీతి ఆయోగ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే హోదా అంశాన్ని తేల్చుతామని చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. అయితే, చౌహాన్‌ కమిటీ సిఫారసుతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏపీ ప్రత్యేక హోదాపై అటు ప్రతిపక్షనేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంతో ఏపీని పోల్చొద్దని.. ఏపీ ఏపీయే.. బీహార్ బీహారే అని.. ఏపీకి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీనిలో భాగంగా వైసీపీ ఈనెల 29న బంద్ కూడా నిర్వహించనుంది. మొత్తానికి ప్రత్యేక హోదా పై స్పష్టత రావాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. చంద్రబాబు మోడీ భేటీలో ప్రత్యేక హోదాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాలి.

హైదరాబాద్ లో పాక్ ఉగ్రవాది కుటుంబ సమేతంగా మకాం

  పాక్ ఉగ్రవాదులు చాప క్రింద నీరులా దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఆ సంగతి ఇదివరకే నిఘావర్ఘాలు గుర్తించినా కొందరు స్థానికులు వారికిస్ సహాయ సహకారాలు అందిస్తుండటంతో వారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. పాకిస్తాన్ కి చెందిన మహమ్మద్ నాసిర్ అనే ఉగ్రవాది గత నాలుగు నెలలుగా తన కుటుంబంతో సహా హైదరాబాద్ లోనే ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరికీ తెలియకపోవడం, అనుమానం కలగకపోవడం విచిత్రమే. పహాడీ షరీఫ్ వద్ద గల జల్ పల్లి యునానీ ఆసుపత్రిలో అతని భార్య ఉద్యోగం కూడా సంపాదించడంతో అదే ఆసుపత్రి సెల్లార్ లో గల ఒక గదిలో నాసిర్ కుటుంబం ఉంటోంది. బహుశః అతనికి అంతకంటే సురక్షితమయిన ప్రదేశం మరొకటి ఉండదేమో? అందుకే అతనిపై ఎవరికీ అనుమానం కలుగలేదని భావించాల్సి ఉంటుంది.   హైదరాబాద్ కంటే ముందు వారు హర్యానాలో పానిపట్ అనే పట్టణంలో చాలా ఏళ్ళు నివసించారని అతని భార్య తెలిపింది. ఏడేళ్ళ క్రితమే తాము భారత్ లోకి ప్రవేశించామని ఆమె తెలిపింది. దిల్ శుక నగర్ బాంబు దాడుల కేసులో ప్రధాన నిందితుడు జియా ఉర్ రెహ్మాన్ పారిపోవడానికి మొహమ్మద్ నాసిర్ సహకరించినట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసులు మహమ్మద్ నాసిర్ తో బాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, సిం కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొన్నారు. వారి ద్వారా పాక్ ఉగ్రవాదుల కుట్రల గురించి మరిన్ని వివరాలు, వారికిస్ సహకరిస్తున్న వారిని పట్టుకొనే అవకాశం ఏర్పడింది.

విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్

  కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి పిలుపునిచ్చారు. విద్యార్ధి సంఘాలు కూడా బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. గత 15 నెలల కాలంలో వేర్వేరు జిల్లాలలో ఉన్న అదే కాలేజీ బ్రాంచీలలో ఇంతవరకు మొత్తం 11 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, అయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.   మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్ధుల మృతికి కారనాలేవితో తెలియకుండానే ఆయన ప్రభుత్వాన్ని నిందించడం తప్పని అన్నారు. విద్యార్ధుల మృతిపై విచారణ జరిపించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. విద్యార్ధుల మరణాలకి కారకులయిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఆయన తెలిపారు.