విశాఖలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సంపూర్ణం
విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సాగరతీరాన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపి రాముడు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పోలీసు దళాలు, భద్రతా దళాలు, హోం గార్డులు, ఎన్.సి.సి. బృందాలు, సైనిక స్కూల్ విద్యార్ధులు తదితర బృందాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి. విశాఖలోనే మొట్టమొదటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. విశాఖనగరంలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం విశాఖలో మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించినట్లవుతుంది.