ప్రముఖ కవి శేషం రామానుజాచార్యులు కన్నుమూత..
ప్రముఖ కవి, పండితుడు, వ్యాఖ్యాత శేషం రామానుజాచార్యులు తుది శ్వాస విడిచారు. ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారిగా విభిన్న కార్యక్రమాలను ఆయన సమర్థవంగా నిర్వహించారు. అంతేకాదు తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, యాదగిరీశుని ఉత్సవాల్లో శేషంరామానుజాచార్యులు చేసే వ్యాఖ్యానాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆముక్తమాల్యద, చింతరామృతం, చైతన్యరేఖలు, సమాలోచన, రంఘనాథ వైభవం వంటి ఎన్నో రచనలు రాశారు. ఈయన మృతికి పలువురు ప్రముఖ కవులు, కళాకారులు నివాళులర్పించారు. శేషం రామానుజాచార్యులకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.