హై వే వెంబడించి మహిళపై కాల్పులు..
ఢిల్లీలో ఓ ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. తాము చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పినందుకు మహిళపై కాల్పులు జరిపి చంపారు. వివరాల ప్రకారం.. సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ ఇంకా ఇద్దరు మహిళలతో స్కార్పియో వాహనంలో వెలుతున్నారు. అయితే మార్గమధ్యంలో వీరు ఓ పబ్ దగ్గర ఆగగా.. ఆక్రమంలో అక్కడ ఉన్న ముగ్గురు దుండగులు కారులో ఉన్న మహిళలపై కామెంట్లు విసిరారు. ఈ నేపథ్యంలో కారులో ఉన్న మహిళ వారు చేసిన వ్యాఖ్యలపై ఎదురు తిరిగి దుండగుల మీద మండిపడింది. ఆ సందర్బంలో మీ అంతు చూస్తామని చెప్పిన దుండగులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం మరో ఇద్దరిని వెంటపెట్టుకొని వచ్చి.. స్కార్పియో కారును ఎక్స్ ప్రెస్ హై వే మీద వెంబడించారు. ఐఫ్కో చౌక్ దగ్గర బేస్ బాల్ బ్యాట్ లతో స్కార్పియో కారు అద్దాలు పూర్తిగా ద్వంసం చేశారు. తుపాకులు తీసుకుని కారులో ఉన్న సిద్దాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి వచ్చిన కారులో తప్పించుకుని పారిపోయారు. తీవ్రగాయాలైన సిద్దాంత్, దేవిశ్రీ గురుగ్రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.