ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజీ
ఆంధ్రప్రదేశ్ కు ఎస్సీ ఎస్టీ ఛైర్మన్ గా కారెం శివాజీని నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పదవిలో మూడేళ్ల పాటు కారెం శివాజీ కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేసుకుంటూ, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఎస్సీ ఎస్టీ ప్రజల బాగోగులు, ప్రయోజనాలు రక్షించేందుకు ఈ కమిషన్ కృషి చేస్తుంది. ఎస్సీ ఎస్టీ చట్టం, 2003 లో అమల్లోకి వచ్చింది. 2006లో తర్వాత కమీషన్ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో, ఇప్పుడు మళ్లీ కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసుకుని, దానికి ఛైర్మన్ ను నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాగా, వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు ఇలా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతల్ని కారెం శివాజీ తెలిపారు.