మోడీ ముందు కేజ్రీ పెట్టిన డిమాండ్లు ఇవే..!

ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కేజ్రీవాల్ విమర్శించడం..కేజ్రీవాల్ ఏం చేసినా మోడీ ప్రశ్నించడం ఇది రోజూ జరిగేదే. ఇలా రోజూ విమర్శల పర్వాన్ని కొనసాగించలేక విసుగుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధాని ముందు బంపర్ ఆఫర్ పెట్టారు. తాను సూచించిన ఐదు డిమాండ్లకు ప్రధాని ఓకే అంటే దేశంతో పాటు తాను సెల్యూట్ చేస్తానన్నారు.  కేజ్రీవాల్ డిమాండ్లు ఇవే:- 1 ట్విటర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారిని ఫాలో అవకండి. 2. రోహిత్ వేముల మృతికి కారణమైన కేంద్రమంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి.  3. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఎన్నికల్లో నెగ్గి  ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి.           దొడ్డి  దారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం మానాలి. 4. ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని అంగీకరించండి. 5. భారత్ మాతాకీ జై అనని వారిపై దాడులు చేయడం మానండి. దాడులు చేసినవారిని జైలులో పెట్టండి. ప్రజల ఆహారపు          విషయాలలో జోక్యం చేసుకోకండి.  

ఇండియాను పట్టుకున్న దుష్టగ్రహం ఎవరో తెలుసా?

తనదైన స్టైల్లో ఎప్పుడూ విమర్శలు చేసే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గోన్న ఆయన ప్రధానిపై అంతెత్తున లేచారు. ఇండియాను ఇప్పుడో దుష్ట గ్రహం పట్టుకుందని దాని పేరే నరేంద్రమోడీ అన్నారు. మోడీ ప్రమాణం స్వీకారం చేశాక దేశంలో నీటి కష్టాలు పెరిగాయని, తీవ్ర కరువు వర్షాభావం దేశాన్ని పట్టి పీడించడం ప్రారంభమైందన్నారు. అక్కడితో ఆగకుండా గురువులు, బాబాల ఆస్తులపై విచారణ జరిపించాలని లాలూ డిమాండ్ చేశారు. ఈ వార్తలు స్థానికంగా సంచలన సృష్టించాయి.  

కన్నతల్లిదండ్రులే కూతురికి విషమిచ్చి..

బెంగుళూరులో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులు, సోదురుడే కూతురికి విషమిచ్చి చంపేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నాన్జన్ గూడలో గురుమల్లప్ప(64), మంజుల(48) కు ఒక కూతురు మధు కుమారి, కొడుకు గురుప్రసాద్. అయితే 21 ఏళ్ల మధు కుమారి జయరాం అనే దళిత యువకుడిని ప్రేమించింది. అయితే ఇది ఏమాత్రం ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు మధు కుమారిని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే మామిడి పండ్లరసంలో పురుగుల మందు కలిపి ఆమెకు ఇచ్చారు. దీన్ని తాగిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. మధు మృతికి కారణమైన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కన్నయ్య కుమార్ ను చంపేస్తాం.. బస్సులో తుపాకీ, ఒకలేఖ

  జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ రోజు రోజుకి ఎంత పాపులర్ అవుతున్నాడో.. అదే విధంగా ఆయనకు సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయి. అంతకు ముందు పెద్దగా ఎవరికి తెలియని కన్నయ్య కుమార్ జెఎన్యూ ఘటన తరువాత మాత్రం దేశవ్యాప్తంగా నోటెట్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయనకు తెలత్తుతున్న సమస్యలకు గాను కేంద్రం ఆయనకు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మరో ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ నుంచి జేఎన్యూ మధ్య నడిచే బస్సులో పోలీసులు ఓ అనుమానాస్పద బ్యాగును గుర్తించారు. దీనిని తెరచి చూసిన పోలీసులు అందులో తుపాకీ, ఒకలేఖను గుర్తించారు. ఆ లేఖలో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ను హత్యచేస్తామని పేర్కొనడంతో కలకలం రేగుతోంది. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

బ్రిటిష్ యువరాజుకి మోడీ షేక్ హ్యాండ్... ప్రింట్ పడింది..

  మనం సాధారణంగా పలకరింపుగా షెక్ హ్యాండ్ ఇస్తుంటా. అయితే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏదో లైట్ గా ఇస్తే.. కొంత మంది మాత్రం చాలా గట్టిగా పట్టుకొని ఇస్తారు. కానీ ఇక్కడ మన ప్రధాని మోడీ ఇచ్చిన షేక్ హ్యాండ్ కి చేయి మీద ఏంకగా ప్రింటే పడిపోయింది. ఇంతకీ మోడీ ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.. ఎవరికి ప్రింట్ పడిందనేగా డౌట్.. అసలుసంగతేంటంటే.. మోడీ.. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ దంపతులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ పలకరింపుగా విలియమ్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మోడీ ఇచ్చిన షేక్ హ్యాండ్ కి ఆయన చేయి పట్టుకున్నంత మేర యువరాజు చేయి పాలిపోయినట్లై ప్రింట్ లా పడింది. మొత్తానికి మోడీ గారి షేక్ హ్యాండ్ పవర్ ఎంటో అందరికీ తెలిసింది.

భూమాకి చిక్కులు.. తిట్టినందుకు దళితుల రాస్తారోకో..

భూమా నాగిరెడ్డికి ఒకదాని తరువాత ఒకటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే భూమాకు, శిల్పా కు మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శిల్పా అనుచరుడిపై దాడి జరగగా దానికి భూమానే కారణమంటూ ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో వ్యవహారంలో భూమాకి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు దళితులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక దళితులు భూమాని కలిసి తమకు అంబేద్కర్ భవన్ ను కట్టించాలని కోరగా ఆయన మండిపడ్డారంట. తినడానికి తిండిలేని వారికి అంబేద్కర్ భవన్ అంత అవసరమా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంట. దీంతో దళితులు భూమా నాగిరెడ్డి తమ పట్ల అవహేళనగా మాట్లాడాడని ఆరోపిస్తూ, కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కర్నూలు - గుంటూరు రహదారిపై పాములపాడు వద్ద రోడ్లను దిగ్బంధించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

కన్హయ్య కుమార్‌కు వీఐపీ సెక్యూరిటీ..!

ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ ఆ వివాదం తరువాత రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. అతను ఎక్కడికి వెళ్లినా సరే జనం తరలివస్తున్నారు. దాంతో పాటే ఆయన్ని అడ్డుకోవడానికి పలు వర్గాలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు.   ఈ ర్యాలీలో పాల్గోన్న వారిని ఉద్దేశిస్తూ వారిద్దరూ ప్రసంగిస్తుండగా వారిపై చెప్పులు, బూట్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు నాగపూర్‌లో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న కన్హయ్యకుమార్ వాహనశ్రేణిని భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లేదంటే అక్కడ భారీ ఘర్షణ చోటు చేసుకునేది. వరుస సంఘటనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కన్హయ్య కుమార్‌కు వీఐపీ సెక్యూరిటి కల్పించాలని నిర్ణయించింది. ఆయనతో పాటు ఉమర్ ఖలీద్‌ల ఇంటి వద్ద వారు పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది.

రెండో పెళ్లిపై రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీ సరదా తీరుస్తా

  సెలబ్రిటీలు కానీ.. రాజకీయ నేతలు కానీ..ముఖ్యంగా క్రీడాకారాలు ఈమధ్యన విలేకరులకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రష్య అధ్యక్షుడు పుతిన్ కూడా చేరిపోయాడు. ఇటీవల పుతిన్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. ఓ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను మీరు రెండో పెళ్లి చేసుకున్నారా? అని దీనిపై అడగగా మొదట తడబడినా.. ఆతరువాత మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తన ప్రైవేటు జీవితం కన్నా, రష్యా అధ్యక్షుడిగా పనితీరునే ప్రజలు గమనిస్తున్నారని, అయితే, ఏదో ఒకరోజు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి మీ సరదా తీరుస్తానని అన్నారట. దీంతో విలేకరులకు దిమ్మతిరిగినంత పనైందట.

ఒంటిమిట్ట, భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

  శ్రీరామనవమి సందర్భంగా రాముని ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో సీతా రాముని కల్యాణం చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా కడపజిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ కోదండరామాలయంలో నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిధులుగా గంటా శ్రీనివాసరావు హాజరయి.. కోదండరాముడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి కూడా హాజరయ్యారు.     ఇంకా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయం ముందు ప్రత్యక్షమైన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి వెళ్లి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

ప్రియాంక అవసరం నాకు లేదు.. రాబర్ట్ వాద్రా

  సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాపై భూ కొనుగొళ్ల వ్యవహారంపై ఆరోపణలు ఉన్నసంగతి తెలిసిందే. రాజస్థాన్, హర్యానాలో వాద్రా కంపెనీలు అక్రమ భూ కొనుగోళ్లకు పాల్పడినట్టు బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాద్రా స్పందించి.. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే ఉంటాను.. దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని ఆయన అన్నారు. అంతేకాదు.. ఈ విషయంపై ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రియాంక అవసరం నాకు లేదు అని అన్నారు. నా తండ్రి నాకు చాలినంత ఇచ్చారు.. అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగల చదువు నాకుంది' అని వాద్రా ఏఎన్‌ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. ఇంకా ఆయన రాజకీయ ఎంట్రీపై మాట్లాడుతూ.. తానేప్పుడూ రాజకీయాల్లోకి రానని చెప్పలేదు.. నా ఆత్మసాక్షి రమ్మంటే వస్తాను.. దేనికైనా టైమ్ రావాలని వ్యాఖ్యానించారు. అయితే అంతా బాగానే ఉన్నా వాద్రా ప్రియాంక గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడ హాట్ టాపిక్ అయ్యాయి.

మంత్రులు గంటా, అయ్యన్నలకు చంద్రబాబు క్లాస్.. అంతవరకూ ఎందుకు రానిచ్చారు..

చంద్రబాబు మంత్రులకు అప్పుడప్పుడు క్లాస్ పీకడం కామనే. ఇప్పుడు తాజాగా మరో ఇద్దురు మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. విశాఖ రైల్వే జోన్ కోసం గుడివాడ అమన్ నాథ్ దీక్ష ప్రారంభించడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దీక్షకు ప్రజల నుండి మద్దతు పెరుగుతోందని నిఘా వర్గాలు చంద్రబాబుకి చెప్పడంతో ఈవిషయంపై మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడులకు క్లాస్ పీకారట. అసలు దీక్ష చేసే వరకూ ఎందుకు రానిచ్చారని.. అసలు దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని.. ఇప్పుడు ఏం చేసినా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని, జిల్లా వ్యవహారాలను గాలికి వదిలేశారని మండిపడ్డారట. జోన్ వస్తుందన్న సెంటిమెంటుతో ఉన్న ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ అసలు అలా ఎలా అంటారు.. గల్లా

  టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కోసం ప్రయత్నించడంలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జయదేవ్.. పవన్ కళ్యాణ్ అసలు అలా ఎలా మాట్లాడుతారని.. తాను స్వయంగా పవన్ ను కలిసి అభివృద్ధి ఎలా జరుగుతున్నదో, తామెలా కష్టపడుతున్నామో తెలియజేస్తానని అన్నారు. అంతేకాదు బీజేపీ పొత్తుపై గురించి కూడా మాట్లాడుతూ.. 2019 లో జరిగే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందో.. లేదో ఖచ్చితంగా చెప్పలేమని.. అప్పటివరకూ ఆ పార్టీతో కలిసి నడుస్తామని వ్యాఖ్యానించారు.

ఎర్రబెల్లి చెల్లని రూపాయి.. రేవంత్ రెడ్డి

  టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లిపై.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం హన్మకొండలో టీడీపీ మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల వర్క్‌షాపు, జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఎర్రబెల్లి దయాకర్ గురించి మాట్లాడుతూ.. టీడీపీ పార్టీలో అన్ని పదవులు అనుభవించి టీఆర్ఎస్ లో చేరారు.. ఇక్కడ ఒక వెలుగు వెలిగిన ఆయన టీఆర్ఎస్లో మాత్రం చెల్లని రూపాయిగా ఉన్నారని.. పాపం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఎద్దేవ చేశారు. టీడీపీలో ఉండగా ఎర్రబెల్లికి పదవులు ఇవ్వకుండా ఉండి ఉంటే.... ఇప్పటికీ ఎర్రబెల్లి రేషన్ డీలర్ గానే ఉండేవాడని ఎద్దేవా చేశారు.

మళ్లీ మాట మార్చిన పాకిస్థాన్..

  మన ప్రత్యర్ధ దేశమైన పాకిస్థాన్ ఎప్పుడూ మాట మారుస్తూనే ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు అర్ధమైంది మనకి. నాలుకకి నరం లేనట్టు మాట్లాడే పాకిస్థాన్ ఒకసారి ఒక మాట మాట్లాడితే.. ఆవెంటనే మరో మాట మాట్లాడుతుంది. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది పాక్. గతంలో భారత్-పాక్ కు మధ్య ధ్వైపాక్షిక చర్చలు జరగాల్సి ఉంది. అయితే అదే సమంయలో పఠాన్ కోట్ పై దాడి జరగడంతో అప్పుడు ఆచర్చలకు బ్రేక్ పడింది. దీంతో అప్పటి నుండి పాక్-భారత్ ల మధ్య చర్చలపై డౌట్ ఉండేది. అసలు జరుగుతాయా లేదా అన్న సందేహాలు ఉండగా పాక్ ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే తప్ప చర్చలు జరిగేది లేదని మన ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు భారత్ తో ద్వైపాక్షిక చర్చలు నిలిచిపోయినట్లేనని భారత్ లో ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్ గత వారంలో ప్రకటించారు. అందుకు పూర్తి భిన్నంగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా నిన్న ఇస్లామాబాదులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన జకారియా, ఈ విషయంలో ద్వారాలు మూసుకుపోలేదని ప్రకటించారు. మొత్తానికి పాకిస్థాన్ తాము చేసిన వ్యాఖ్యలపై తమకే నిలకడ లేకుండా మాట్లాడుతున్నారు.