కన్నయ్య కుమార్ పై చెప్పు దాడి.. ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్త
జైఎన్యూ సంఘ నేత కన్నయ్య కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. నాగపూర్ లోని ఓ సభలో పాల్గొన్న ఆయనపై భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు చెప్పు విసిరి దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కన్నయ్య సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శాంతించాలని, తనపై చెప్పు విసిరిన వ్యక్తి చెప్పులు పోగొట్టుకున్నాడని అన్నారు. అంతేకాదు వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జెఎన్యూ, హెచ్ సీయూలో జరిగిన ఘటనల్లో నా చెప్పులు పోయాయని.. అది గమనించిన భజరంగ్ దళ్, ఏబీవీపీ సోదరులు తనకు చెప్పులు తెచ్చారని.. కానీ ఇక్కడ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఇక కన్నయ్య కుమార్ పై బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఒక్కో చెప్పు పారేసుకుంటే కాళ్లు కాలుతాయి, నాపై ద్వేషం పెంచుకున్నా పర్లేదు. కానీ, మీ కాళ్లు కాలకుండా చూసుకోండి. నా మీద ప్రేమతో చెప్పులు పోగొట్టుకోకండి' అని ఆయన చమత్కరిస్తూ మాట్లాడారు. ఇదిలా ఉండగా కన్నయ్యపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.