జలదృశ్యం వద్దే బాపూజీ అంత్యక్రియలు

 

 

స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్‌బాపూజీ అంత్యక్రియలు జలదృశ్యంలో చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.శనివారం ఉదయం సీఎంతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి జానారెడ్డి భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో , హుస్సేన్ సాగర్ ఒడ్డున ఎలాంటి కట్టడాలు ఉండరాదని కోర్టు ఆదేశాల రీత్యా ,కొంత సందేహ పడింది. అయితే తెలంగాణ వాదులు, తెలంగాణ కాంగ్రెస్ నేతల కోరిక మేరకు చివరకు ప్రభుత్వం జలదృశ్యంలోనే నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో తెలంగాణ వాదులు అక్కడ అంత్య క్రియల ఏర్పాట్లు చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమ నేపద్యంలో దీనిపై వివాదం ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. మరోవైపు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి బాపూజీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.