యుపిఎకి ములాయం వార్నింగ్

యుపిఎలో సంక్షోభం ముదురుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యుపిఎ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ బాటలోనే ఆయన నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌డిఐలపై యుపిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఆయన కాంగ్రెసు నాయకత్వాన్ని హెచ్చరించారు. తాజాగా ములాయం యుపిఎ ప్రభుత్వానికి దూరం జరిగి, తృతీయ కూటమికి పునాదులు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. యుపిఎకు ఇప్పటి వరకు ఎస్పీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది. ఎస్పీకి 22 మంది లోకసభ సభ్యులున్నారు. వీరి మద్దతు యుపిఎకు కీలకం.

 

 

అయితే మద్దతు ఉపసంహరించుకునే విషయంపై మమతా బెనర్జీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎస్పీ, తెలుగుదేశం, వామపక్షాలు గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యుపిఎ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తాయి. ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి ములాయం సింగ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఈ ర్యాలీలో ములాయం సింగ్, వామపక్షాల నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, ఎబి బర్దన్‌లతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.