మహాభారత యుద్దంలో అర్జునుడి రథం పై హనుమంతుల వారు ఎందుకు కూర్చొన్నారు...

 


మహాభారత యుద్దంలో అర్జునుడి రథం పై హనుమంతుల వారు ఎందుకు కూర్చొన్నారు...

 


మహాభారతంలో ఆశ్చర్యపరిచే సంఘటనలు చాలా ఉన్నాయి. అవి స్ఫూర్తిదాయకంగా,  ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలో మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జునుడి రథంపై ఎందుకు కూర్చొన్నాడు అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  దీని వెనుక ఒక కథ కూడా ఉంది. దీని గురించి తెలుసుకుంటే..

పురాణాలలో ఏముంది?

మహాభారత కథ ప్రకార ఒకసారి హనుమంతుడు రామేశ్వరం దగ్గర అర్జునుడిని కలిశాడు. అర్జునుడు తాను విలుకాడు అని చాలా గర్వపడ్డాడు. ఈ గర్వంలో, అర్జునుడు హనుమంతుడితో త్రేతాయుగంలో, నువ్వు, నీ సైన్యంతో కలిసి రాళ్ల వంతెన నిర్మించావు, నేను గనుక  అక్కడ ఉంటే, నా బాణాల సహాయంతోనే వంతెనను నిర్మించేవాడిని అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు రాళ్ల వంతెన సైన్యం బరువును మోయగలదని, కానీ బాణాల వంతెనపై ఇది సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు అర్జునుడు హనుమంతుడికి ఒక సవాలు చేశాడట.

సవాలు..

 అర్జునుడు హనుమంతుడిని సవాలు చేస్తూ, నేను బాణాలతో నిర్మించిన వంతెనపై మూడు అడుగులు కూడా నడవలేకపోతే, నేను అగ్ని గుండా వెళతాను అని అంటాడు. కానీ మీరు మూడు అడుగులు నడిస్తే, మీరు అగ్ని గుండా వెళ్ళాలి అని అన్నాడు.  హనుమంతుడు ఈ సవాలును స్వీకరించాడు.

శ్రీకృష్ణుని మాయ.. 

హనుమంతుడు వంతెనపై మూడు అడుగులు నడవడంలో విజయం సాధించాడు. కాబట్టి సవాలు ప్రకారం అగ్ని పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై హనుమంతుడిని ఆపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో మొదటి అడుగు వేయగానే వంతెన విరిగిపోతుందని చెప్పాడు.

అందుకే అతను తాబేలు రూపంలో వంతెన కిందకు వచ్చాడు. అతను రెండవ అడుగు వేయగానే వంతెన విరిగిపోయింది. హనుమంతుడు భగవంతునిపై కాలు పెట్టగానే నీరు రక్తంతో ఎర్రగా మారింది. ఇది తెలుసుకున్న హనుమంతుడు తన పాదం భగవంతునిపై పడటం చూసి సిగ్గుపడ్డాడు. అర్జునుడు కూడా తన తప్పును గ్రహించాడు. అప్పుడు వారిద్దరూ శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్పారు.

శ్రీకృష్ణుని కోరిక..

 ఇదంతా జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక కోరిక కోరాడు.  హనుమంతుడిని మహాభారత యుద్ధంలో అర్జునుడి రథాన్ని రక్షించి, దానిని అభేద్యంగా మార్చమని కోరాడు. శ్రీకృష్ణుని కోరికను దృష్టిలో ఉంచుకుని, హనుమంతుడు యుద్ధం అంతటా అర్జునుడి రథం జెండాలో కూర్చొని ఉన్నాడు.

                        *రూపశ్రీ.