English | Telugu

మోసం చేశాడ‌ని ఆరోపించిన భార్య‌.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన న‌టుడు!

ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కిన మ‌ల‌యాళం టీవీ న‌టి అంబిలీ దేవి భ‌ర్త‌, న‌టుడు ఆదిత్య‌న్ జ‌య‌న్ ఆత్మ‌హ‌త్య య‌త్నం చేశారు. అందిన స‌మాచారం ప్ర‌కారం ఆదివారం సాయంత్రం త్రిసూర్‌లోని త‌న కారులో అత‌ను చేయి న‌రాల‌ను కోసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. వెంట‌నే అత‌డిని త్రిసూర్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్ర‌స్తుతం అత‌ను ఐసీయూలో ఉన్నాడు.

"అత‌ను అధిక మోతాదులో నిద్ర‌మాత్రలు మింగాడు. అత‌డి పొట్ట‌ను శుభ్రం చేశాం. చేతి మ‌ణిక‌ట్టు ద‌గ్గ‌ర కోసుకున్న గాయం ఉంది. త‌దుప‌రి చికిత్స కోసం స‌ర్జ‌న్‌ను సంప్ర‌దిస్తున్నాం. రోగి కొంచెం మ‌గ‌త‌లో ఉన్నాడు కానీ రెస్పాండ్ అవుతున్నాడు. 24 నుంచి 48 గంట‌ల అబ్జ‌ర్వేష‌న్ త‌ర్వాతే వివ‌రాలు తెలియ‌జేస్తాం." అని హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి.

భార్య అంబిలీదేవితో వ్య‌క్తిగ‌త గొడ‌వ‌ల కార‌ణంగా అత‌ను ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచాడు. ఆదిత్య‌న్ త‌న‌ను మోసం చేశాడ‌ని అంబిలి ఆరోపించారు. విడాకులు ఇవ్వ‌మని అడుగుతున్నాడ‌నీ, లేదంటే చంపుతాన‌ని బెదిరిస్తున్నాడ‌నీ ఆమె ఆదిత్య‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఆమె ఆరోప‌ణ‌ల‌ను ఆదిత్య‌న్ ఖండించాడు. త‌న‌కు చెడ్డ‌పేరు తీసుకురావ‌డానికి అలాంటి ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌ల్ని ఉప‌యోగించుకోవ‌ద్ద‌ని అత‌ను కోరాడు.

2019లో అంబిలీదేవి, ఆదిత్య‌న్ జ‌య‌న్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఆ ఇద్ద‌రూ 'సీతాక‌ల్యాణ‌మ్‌' అనే టీవీ షోలో జంట‌గా న‌టించారు. ఆ ఇద్ద‌రికీ అర్జున్ అనే కొడుకు ఉన్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.