English | Telugu

గాయపడిన వారిని కాపాడిన జానీ మాస్టర్...

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అటు కొరియోగ్రాఫర్ గా ఇటు జనసేనలో కార్యకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా  జానీ మాస్టర్ పనిచేశారు. టాప్ స్టార్స్ అందరితో కలిసి  ఆయన పనిచేశారు. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.  తెలుగు బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా పనిచేశారు జానీ మాస్టర్. అలాంటి జానీ  మాస్టర్ రీసెంట్ గా ప్రమాదం బారిన పడిన ఇద్దరిని కాపాడారు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "నిన్న జనసేన అధినేతని కలిసి తిరిగి వెళుతుండగా విజయవాడ బెంజ్ సర్కిల్ కరకట్ట దగ్గర వేరు వేరు ప్రమాదాలు జరిగాయి.

నా జీవితంలో మూడు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా...

జబర్దస్త్ లో ట్రాన్స్జెండర్ పింకీ గురించి అందరికీ తెలుసు. మొదట జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ చివరికి తనకు నచ్చిన అమ్మాయి రూపంలోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇప్పుడు మూవీస్ లో కొన్ని షోస్ లో చేస్తోంది. అలాంటి పింకీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను చెప్పింది. " చిన్నప్పటి నుంచి మా అక్క డ్రెస్సులు వేసుకునేదాన్ని. తర్వాత అలా అమ్మాయిగా ఉండడమే నాకు కరెక్ట్ అనిపించింది. అప్పుడే అనుకున్నా నేను అమ్మాయిలా మారాలి సర్జరీ చేయించుకోవాలి అని. అలా మా నాన్న రిటైర్ అయ్యాక మా చెల్లి పెళ్లి చేసాక నేను కొంత డబ్బు దాచుకుని సర్జరీ చేయించుకున్న. నిజంగా ఆ టైంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కనీసం నన్ను చూసుకుని మంచినీళ్లు ఇచ్చేవాళ్ళు కూడా లేరు.

Geethu Royal : తెలియకుండా మోసం చేయడం కరెక్ట్ ఎలా అవుతుంది!

నిన్నటి ప్రేమికుల రోజుని చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరు గ్రాంఢ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. వారిలో ముఖ్యంగా ఇన్ స్ట్రాగ్రామ్ లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఎక్కువగా జరుపుకున్నారు. అయితే ప్రేమలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవారిని మోసం చేయకూడదంటూ గీతు రాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. సరికొత్తగా ప్రేమికులకి సలహాలు సూచనలు ఇస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పని చేస్తే మనల్ని ప్రేమించిన వారు భాదపడతారని తెలిసినప్పుడు.. వాళ్ళకి తెలియకుండా చేయడం, చేసి దాచడం కరెక్ట్ ఎలా అవుతుంది. తెలియకుండా మోసం చేయడం కరెక్ట్ ఎలా అవుతుంది. లాజిక్ ఉంది కదా అని గీతు రాయల్ ఈ పోస్ట్ లో అంది. 

ఆ జోడిని స్క్రీన్ మీద చూసి చాలా రోజులయ్యిందట...

ప్రేమికుల రోజున కొన్ని జంటలు కలిసుంటే చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక సెలబ్రిటీస్ విషయంలో ఎవరెవరు కలిసుంటే బాగుంటుందో ఆడియన్స్ డిసైడ్ చేసి వాళ్ళను అలా చూడాలి అనుకుంటూ ఉంటారు. అలా కలిసుంటే బాగుంటుంది అని  ఆడియన్స్ ఆశ పడే జంట బుల్లితెర మీద ఎవరైనా ఉన్నారు అంటే అది సుధీర్ - రష్మీ.. పాపం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం కలవడం లేదు, ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. సుధీర్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రష్మీ షోస్ చేసుకుంటూ ఉంది. వీళ్ళ ప్రేమ, పెళ్లి అప్ డేట్స్ కోసం కొన్ని చానెల్స్ వాళ్ళు సుధీర్ ఫ్రెండ్స్ ని అడిగిన వాళ్ళు కూడా పెద్దగా ఆన్సర్స్ చెప్పడం లేదు.

లావణ్య - వరుణ్ మిస్టర్ అండ్ మిసెస్ పర్ఫెక్ట్ జోడి..

సూపర్ సింగర్ నెక్స్ట్ వీక్ ప్రోమో మస్త్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి మెగా ఫ్యామిలీలోని కొత్త కపుల్ వచ్చి మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు. వీళ్ళిద్దరిది ఒక పిక్ ని స్క్రీన్ మీద వేశారు మేకర్స్. ఐతే ఇందులో టోపీలు పెట్టుకుని ఎవరిని ఎవరు చూసుకోకుండా ఉన్నారు. ఈ పిక్ ని చూసిన లావణ్య అప్పటి మెమోరీస్ ని గుర్తు చేసుకుంది. అప్పటికే నేను, వరుణ్ ఫ్రెండ్స్ కూడా కాదు అని చెప్పింది లావణ్య. అసలు ఆ పిక్చర్ ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు అని చెప్పింది. ఇక శ్రీముఖి ఈ జంటకి ఎంత వరకు  నాలెడ్జిని క్రాస్ చెక్ చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసింది. "మీరు ఫస్ట్ టైం లావణ్య గారిని కలిసినప్పుడు ఆవిడ వేసుకున్న డ్రెస్ కలర్ ఏమిటి" అని అడిగింది "నాకు నిన్న వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తులేదు అని చెప్తూనే మేం కలిసినప్పుడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది" అని చెప్పాడు వరుణ్ తేజ్.