బిబి బజ్ ప్రోమో అవుట్.. గీతు రాయల్ మాస్ జాతర షురూ!
తెలుగులో వచ్చే టీవీ షోలలో బిగ్ బాస్ కి ఉండే క్రేజే వేరు. ఐపీఎల్ కి ఉండే క్రేజ్ ఇండియా మొత్తం ఉంటే తెలుగు బిగ్ బాస్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందనడంలో ఆశ్చర్యమే లేదు. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తిచేసుకొని ఏడవ సీజన్లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్-7 కి హోస్ట్ గా నాగార్జున చేయగా, ఈ సారి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వచ్చారు. ప్రియాంక సింగ్, యాక్టర్ శివాజీ, సింగర్ దామిణి, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతికరోజ్, పల్లవి ప్రశాంత్, షకీల, కిరణ్ రాథోడ్, శుభశ్రీ, టేస్టి తేజ, అమర్ దీప్, ఆట సందీప్, శోభా శెట్టి కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు.