English | Telugu

24 గంటలూ అలా మొబైల్ ని వాటేసుకోకండి...

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే జీవితం గడవడం లేదు..రోజు అస్సలు పూర్తి కావడమే లేదు..? కరోనా టైం నుంచి ఈ మొబైల్ మేనియా పిల్లలకు కూడా పాకింది. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురూ నాలుగు మొబైల్స్ తో రోజు గడిపేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు తిండి తినడం లేదని బాధపడేవారు ఇప్పుడు మొబైల్ వదలడం లేదని కౌన్సిలింగ్ సెంటర్స్ కి తీసుకెళ్తున్నారు. అలాంటి మొబైల్ కి సంబంధించి బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అందరినీ ఒక ప్రశ్న అడిగింది. మొబైల్ ఫోన్ మన దగ్గర ఎంత సేపు ఉండొచ్చని ఎవరో ఆమెను అడిగారట. ఆ ప్రశ్న ఇప్పుడు అందరినీ అడిగింది. అలాగే ఆన్సర్ కూడా చెప్పింది. "అమ్మ దగ్గర మనం ఎంతసేపు కూర్చోగలుగుతామో అంత సేపు మొబైల్ ఫోన్ మన దగ్గర మొబైల్ ఉండొచ్చు అని  చెప్పింది. అదేం లాజిక్ అనుకుంటున్నారు కదా..

భైరవకోన మంత్రదండం కూడా సుమ మాట వినట్లేదట...

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ షోకి గెస్ట్ గా వచ్చిన సందీప్ కిషన్ తో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేసింది యాంకర్సు మ. ఈ షోకి "ఊరి పేరు భైరవకోన" మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. అలాగే హీరోహీరోయిన్స్  సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ వచ్చారు. సందీప్ కిషన్ చేతిలో మంత్రం దండంతో ఎంట్రీ ఇచ్చాడు. "ఆమ్ హోమ్ పట్..నా అంత అందంగా ఇక్కడ ఉండేవాళ్ళను తయారు చేద్దామంటే అది జరిగే పనిలా అనిపించడం లేదు." అని సుమ కామెడీగా చెప్పేసరికి "జరగని పనికి ప్రయత్నిస్తే మంత్రదండం మాత్రం ఏం చేస్తది" అని కౌంటర్ వేసాడు సందీప్ కిషన్. ఈ షోకి మూవీ రైటర్ ఆనంద్ కూడా వచ్చారు. సుమ ఆయన్ని ఇలా అడిగింది "మీరు కథ రాసేటప్పుడు కథ మిమ్మల్ని హాంట్ చేయదా..అలా భయపడినప్పుడు ఏం  చేస్తారు మీరు" అని అడిగింది సుమ. "చాలా హాంట్ చేస్తుంది అప్పుడు నేను ఒక ఆరేడుమందితో కలిసి పడుకుంటాను" అని చెప్పాడు.

మతాన్ని కాదు మానవత్వాన్ని చూడండి అంటూ మెసేజ్...

కౌషల్ మందా ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ ఐపోతుంది. బిగ్ బాస్ సీజన్ 2 తో ఎవరూ అందుకోలేని క్రేజ్ ని ఆయన సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ లో కౌశల్ ఆర్మీ కూడా పుట్టుకొచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు కొన్ని కథలు కూడా విన్నట్టు కౌషల్ చెప్పాడు. ఐతే తాను మూడు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదని ఫీలయ్యాడు. కానీ తన ప్రయత్నాలను మాత్రం వదిలిపెట్టలేదు కౌషల్. అలాంటి బిగ్ బాస్ విన్నర్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పాడ్ కాస్ట్ వీడియోని పోస్ట్ చేసి ఒక కథ చెప్పాడు. "అనగనగా ఒక ఊరిలో ఒక ముస్లిం రాజు. అతని పేరు  షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. అతను  తన భూమిని ఒక హిందూ దేవాలయ నిర్మాణం కోసం ఇచ్చాడు. ఈ టెంపుల్ డిజాయినర్ గా ఒక బుద్దిస్ట్ పని చేశారు.

పింకీకి అసలేమయ్యింది...లెగ్ ఫ్రాక్చర్ ?

సూపర్ జోడి డాన్స్ షో స్టార్టింగ్ ఎపిసోడ్ లో పింకీ మానస్ తో కలిసి  ఎంత సందడి చేసిందో అందరికీ తెలుసు. ఐతే ఈ రాబోయే వారం షోలో మాత్రం పింకీ కనిపించలేదు..అసలేం జరిగిందో చూద్దాం. సూపర్ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రియాంక కనిపించలేదు. యాంకర్ శివ వచ్చి సోలోగా "ముద్దేమో మునసబుకు పెట్టేసానే" అనే సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేస్తుండగా జడ్జ్ మీనా సాంగ్ ఆపమని చెప్పింది. దాంతో శివకి అసలక్కడ ఏం జరుగుతోందో అర్ధం కాక డాన్స్ చేయడం ఆపేసాడు. వెంటనే మీనా "అదేంటి శివా.. పింకీని తీసుకొస్తానని వెళ్లారు కదా.. మరి మీరు మాత్రమే వచ్చి డాన్స్ చేస్తున్నారు ఏమయ్యింది " అని అడిగేసరికి శివ ఏదో ఆన్సర్ చెప్పబోయాడు. ఇంతలో పింకీ చేతిలో ఒక పేపర్ ని పట్టుకుని నడవలేక నడవలేక నడుస్తూ వచ్చి స్టేజి మీద కుర్చీలో కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది.

కుమారి ఆంటీ ఇజ్జత్ తీసేసిన కీర్తి భట్...ఫుడ్ అస్సలు బాలేదు!

సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది. బీబీ ఉత్సవంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. త్వరలో బిగ్ బాస్ హౌస్ కి కూడా వెళ్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటి కుమారి ఆంటీ దగ్గరకు అంత మంది వెళ్లి ఫుడ్ తింటున్నారంటే ఎంతో బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. అలాగే బుల్లి తెర నటి కీర్తి భట్ ఆమె వుడ్ బి విజయ్ కార్తీక్ ఇద్దరూ ఆమె నిర్వహించే ఫుడ్ అడ్డాకు వెళ్లారు. ఇక అక్కడ నాన్ వెజ్ ఒక్క ముద్ద తినేసరికి బాబోయ్ అని కీర్తి కళ్ళు మూసుకుందట..అంత భయంకరమైన కారంగా ఉందని తినలేకపోయిందని చెప్పాడు కార్తీక్. తానే వండితే కుమారి ఆంటీ కన్నా చాలా బాగా చేస్తానని చెప్పింది కీర్తి. మొదట్లో బాగానే ఉండేదేమో కానీ రద్దీ పెరిగేసరికి ఎలా చేస్తే ఏముందిలే అన్నట్టుగా ఉంది ఫుడ్ అన్నారు.

పర్మిషన్ లేకుండా ఏం చేసినా ఊరుకోనంటూ వార్నింగ్...

సోషల్ మీడియాలో  శ్రీవాణి-విక్రమ్ జోడి వీడియోస్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. శ్రీవాణి సీరియల్స్ చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు వీళ్ళు వాలెంటైన్స్ డే స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. "మా ప్రేమ జర్నీ ఈ ఏడాదితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2006 లో మా ప్రేమ మొదలయ్యింది. 2007 లో పెళ్లి చేసుకున్నాం. ఇన్నేళ్లు సంతోషంగా ఉన్నాం..ఇక శ్రీవాణి షూటింగ్ లో ఉంది..తనకు నేను చేసే చికెన్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేనే వండి షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లి ఇస్తాను..ఇక కేక్ , చాక్లేట్లు కూడా తీసుకుంటాను. అవంటే  శ్రీవాణికి చాలా ఇష్టం. " అని చెప్పాడు విక్రమ్. షూటింగ్ స్పాట్ కి వెళ్లిన విక్రమ్ ని చూసి శ్రీవాణి షాకైపోయింది.

రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేసాడు..యావర్-గౌతమ్ తో మల్టీస్టారర్ మూవీ...హీరోయిన్ శుభశ్రీ!

బిగ్ బాస్ హౌస్ లో శుభశ్రీ రాయగురు-గౌతమ్ కృష్ణ జంటకు ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి షోస్ లో, ఈవెంట్స్ లో కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాలెంటైన్స్ డే రోజున  శుభశ్రీ గౌతమ్ తో కేక్ కట్ చేయించింది. గౌతమ్ ఆమెకు  రింగ్ పెట్టి ప్రొపోజ్ చేసాడు..ఇంతకు అసలు విషయం ఏమిటో చూద్దాం. గౌతమ్ నటించిన "సోలో బాయ్" మూవీ ప్రమోషన్స్ ని శుభశ్రీ వెరైటీగా కండక్ట్ చేసింది. ఒక సెపరేట్ రూమ్ ని ఏర్పాటు చేసింది..కళ్ళకు గంతలు కట్టి లోపలికి  తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 లోని లేడీ కంటెస్టెంట్స్ కళ్ళను మాత్రమే చూపించి ఆ కళ్ళు ఎవరివో గుర్తు పట్టాలంటూ టాస్క్ ఇచ్చింది..ఆ తర్వాత ఎలాంటి అమ్మాయి కావాలో అడిగింది.. ఎడ్యుకేషన్ పక్కన పెడితే మంచి కేరింగ్ గా చూసుకునే అమ్మాయి కావాలి అని చెప్పాడు.

టాప్ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో "ఆదివారం పరివారం షో" సెకండ్ ప్లేస్ లో "సూపర్ సింగర్ "

బుల్లితెర మీద స్టార్ మాలో ప్రసారమయ్యే షోస్ కి ఒక రేంజ్ లో రేటింగ్ వస్తూ ఉంటుంది. ఐతే రేటింగ్ రావడం అంటే ఏమంత సామాన్య విషయం కాదు. మంచి వ్యూస్ రావాలి అంటే కలర్ ఫుల్ సెట్ ఉండాలి. మంచి కాన్సెప్ట్ ని ఎంచుకోవాలి..ఆ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసే మంచి టీమ్ ఉండాలి...టీంలో మంచి ఎనర్జీతో పాటు టైమింగ్ , స్పాంటేనిటీ ఉండాలి...అలాగే టైమింగ్ కి తగ్గట్టు పంచ్‌లు పడాలి..ట్రెండ్ కి తగ్గట్టు బిహేవియర్ ఉండాలి...ఇవన్నీ ఒకెత్తు ఐతే కేకపుట్టించే కంటెంట్ తో కలర్ ఫుల్ యాంకర్ తో ఈ షో నిర్వహించాలి.. ఇన్ని మెయింటైన్ చేసి ఒక షోని బయటకు వదిలితే అది అద్భుతంగా హిట్ కొట్టాల్సిందే. మరి అలాంటి షోస్ లో ఈ వారం టాప్ లో ఉన్నవి "ఆదివారం విత్ స్టార్ మా పరివారం".