English | Telugu

లావణ్య - వరుణ్ మిస్టర్ అండ్ మిసెస్ పర్ఫెక్ట్ జోడి..

సూపర్ సింగర్ నెక్స్ట్ వీక్ ప్రోమో మస్త్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి మెగా ఫ్యామిలీలోని కొత్త కపుల్ వచ్చి మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు. వీళ్ళిద్దరిది ఒక పిక్ ని స్క్రీన్ మీద వేశారు మేకర్స్. ఐతే ఇందులో టోపీలు పెట్టుకుని ఎవరిని ఎవరు చూసుకోకుండా ఉన్నారు. ఈ పిక్ ని చూసిన లావణ్య అప్పటి మెమోరీస్ ని గుర్తు చేసుకుంది. అప్పటికే నేను, వరుణ్ ఫ్రెండ్స్ కూడా కాదు అని చెప్పింది లావణ్య. అసలు ఆ పిక్చర్ ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు అని చెప్పింది. ఇక శ్రీముఖి ఈ జంటకి ఎంత వరకు నాలెడ్జిని క్రాస్ చెక్ చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసింది. "మీరు ఫస్ట్ టైం లావణ్య గారిని కలిసినప్పుడు ఆవిడ వేసుకున్న డ్రెస్ కలర్ ఏమిటి" అని అడిగింది "నాకు నిన్న వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తులేదు అని చెప్తూనే మేం కలిసినప్పుడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది" అని చెప్పాడు వరుణ్ తేజ్.

"ఇద్దరూ కలిసి ఫస్ట్ హాలిడేకి ఎక్కడికి వెళ్లారు" " థాయిలాండ్ వెళ్లాం" అని చెప్పాడు. "వరుణ్ ఫేవరేట్ ఫుడ్ ఏమిటి" అని లావణ్యను అడిగింది "వరుణ్ కి బిర్యానీ అంటే ఇష్టం" అని చెప్పింది. ఇక అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ఒక్క ప్రశ్నకు మ్యాచ్ అయ్యేలా జవాబు చెప్పినా పర్ఫెక్ట్ జోడీ కింద లెక్క కానీ ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ పర్ఫెక్ట్ జోడి అన్నాడు. ఇక జడ్జి శ్వేతా లైఫ్ లో బ్లాక్ బస్టర్ మూవ్మెంట్ ఏమిటో చెప్పండి అని శ్రీముఖి అడిగేసరికి "మాష్టారు మాష్టారు సాంగ్ లాంచ్ చెన్నైలో జరిగినప్పుడు హీరో ధనుష్ తో పాటూ ఆ పాటను పాడడం" బెస్ట్ మూమెంట్ అని చెప్పింది శ్వేతా. సరే అనంత శ్రీరామ్ గారు ఒక హీరోయిన్ తో డేట్ కి వెళ్లారు అని శ్రీముఖి అంటూనే మళ్ళీ హే అనంత్ గారికి అంత సీన్ లేదని అంటున్నారంటూ మళ్ళీ పంచ్ లు వేసేసరికి ఇప్పుడే నిరూపిస్తా అంటూ శ్రీముఖిని తీసుకుని వెళ్ళిపోయాడు అనంత్ శ్రీరామ్.



Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.