English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి, సీతాకాంత్ ల పెళ్ళి మాణిక్యం ఎందుకు చేయాలనుకుంటున్నాడో తెలుసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -46 లో.. సీతాకాంత్ తో రామలక్ష్మి మంచిదంటు సిరి చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తాడు.. అసలు నేను రామలక్ష్మిని తప్పుగా అర్థం చేసుకున్ననా అని అనుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. సీతాకాంత్ లిఫ్ట్ చెయ్యడు. రెండవసారి లిఫ్ట్ చేస్తాడు. ఎందుకు పదే పదే చేస్తున్నావ్ మాట్లాడడం ఇష్టం లేదని అర్థం చేసుకోలేవా అని సీతాకాంత్ అంటాడు. మాట్లాడడం ఇష్టం లేకపోతే కట్ చేస్తారు ఆలా అని ఫోన్ చూస్తూ ఉండరని రామలక్ష్మి అంటుంది.

పల్లవి ప్రశాంత్ కి వెల్లువెత్తుతున్న ప్రశంసలు...

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్, శివాజీ, భోలే షావలి ఈ  ముగ్గురూ కలిసి పేదవాళ్లకు డబ్బును, బియ్యాన్ని డొనేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ లక్ష, ఆట సందీప్ 25 వేలు ఇచ్చారు అలాగే ఇద్దరూ  విడివిడిగా ఏడాదికి సరిపడా బియ్యాన్ని కూడా ఇచ్చారు. ఇక ఈ వీడియో వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. నెటిజన్స్ ఐతే వాళ్ళ దాతృత్వానికి ఖుషీ ఐపోతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. "లవ్ యు ప్రశాంత్ నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా..." అని సందీప్ రిప్లై ఇచ్చాడు.

నవదీప్ సమ్మర్ సూక్తులు...ముందు పెళ్లిచేసుకో..తర్వాత స్నానం చేయొచ్చు!

ఇన్స్టాగ్రామ్ లో నవదీప్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఆడియో వింటూ  కార్ లో కూర్చుని కళ్ళజోడు పెడుతూ తీస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వుకోక తప్పదు ఎవరైనా సరే ..ఇంతకు ఆ ఆడియోలో వస్తున్న మాటలేంటంటే "మీరిద్దరూ కలిసి స్నానం చేయండి. ఏదో సినిమాల్లో చూపిస్తారు కదా అనుకుంటారు..కానీ ఏమీ కాదు. చాలా చక్కగా ఇద్దరూ కలిసి స్నానం చేస్తే మీ మైండ్, బాడీ చాలా రిఫ్రెష్ అవుతుంది. ఇది చాలా సిల్లీగా, ఎంబరాసింగ్ గా అనిపించొచ్చు కానీ మీరిద్దరూ  వైఫ్ అండ్ హజ్బెండ్. దానికి ఫీలవ్వాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి" అన్న మాటలకు ఓ రేంజ్ లో ఊహల్లోకి వెళ్ళిపోయాడు.

నాకు పిల్లనెవరూ ఇస్తలేరు...కాన్సంట్రేషన్ అంతా కెరీర్ మీదనే ఉంది!

సూపర్ సింగర్ షో ఎట్టకేలకు గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ షోలో సిక్స్ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఐతే టైటిల్ ఎవరిదీ అనేది ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. అలంటి టైంలో జడ్జ్ రాహుల్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. "పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు ఎవరూ పిల్లనివ్వడం లేదు.  పెళ్లనేది ఎప్పుడు జరగాలి అని ఉంటే అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతం నేను నా కెరీర్ మీద ఫోకస్ చేసాను. చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ కాన్సంట్రేషన్ దాని మీదనే ఉంది. అలాగే ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ కి గామా అవార్డు కూడా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.

గుప్పెడంత మనసు కాలేజీలో దెయ్యం.. జగతి మేడం అనుకుంటా సర్ అంటున్న నెటిజన్స్!

గుప్పెడంత మనసు సీరియల్ ఫీవర్ ఆడియన్స్ లో చాలా ఉంది. ఆ సీరియల్ లో డిబిఎస్టి కాలేజీకి మంచి పేరు వచ్చింది. ఆ కాలేజీ వాతావరణం కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. విశాలమైన ప్రాంతంలో  కొంతమందే స్టూడెంట్స్ ఉండడం. చుట్టూ చెట్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిషి, మహేంద్ర, జగతి కార్లు అక్కడికి వేసుకుని రావడం . ఇక వసు, రిషి కాలేజీ మెట్ల మీద చెట్ల కింద , గట్ల  మీద కూర్చుని ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ ఉండడం. అలాంటి కాలేజీ గురించి ఆ  సీరియల్ ఫాదర్ మహేంద్ర భూషణ్ ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ కాలేజీ సుమారు 25 టు 30 కోట్లు ఉంటుందట..కానీ అతి తక్కువలో అంటే సుమారు రెండున్నర కోట్లకు అమ్మేస్తే తాను కొనుక్కున్నట్లు చెప్పాడు. అంత కాస్ట్లీది తక్కువకు దొరికేసరికి కొనేసుకుని చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు.

మగాళ్ల వంటకు..ఆడవాళ్ళ వంటకు తేడా ఉంటుంది కదా...

కుమారి ఆంటీ ఇప్పుడొక బిగ్ సెలబ్రిటీ ఐపోయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా డైలాగ్ సోషల్ మీడియానే షేక్ చేసేసింది. ఆమె ఫుడ్ సెంటర్ కి వెళ్లి ఫుడ్ టేస్ట్ చేసేవాళ్లంతా కూడా వ్వాహ్ వా  అంటూనే ఉన్నారు. ఐతే ఆమె ఫుడ్ అంతా బాగుంటుంది అంటున్నారు కదా అని కార్తీకదీపం సీరియల్ కీర్తి భట్ తన భర్తతో కలిసి వెళ్లి ఫుడ్ టేస్ట్ చేసి అస్సలు బాలేదు అని చెప్పింది. ఆ మాటలు  సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  ఆమె మాటలకు  తాజాగా కుమారి ఆంటీ  స్పందించింది. " కీర్తిభట్ నా షాప్ కి వచ్చిన రోజు నేను ఊరికి వెళ్లాను. వంట నేను చేయలేదు. ఆరోజు వేరే వాళ్ళు వంట చేశారు. మగాళ్ల వంటలకు , ఆడవాళ్ళ వంటలకు చాలా తేడా ఉంటుంది.