Top Stories

రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

  రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలపడం తద్వారా కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరానికి పునఃవైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చట్టం - 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఏపీలోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు.    తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుందని తెలిపారు. అన్ని భాషలను గౌరవిస్తూనే మాతృభాషకు అగ్రతాంబూలం ఇవ్వాలన్న  లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్ర లేఖనం తదితర వాటిలో  అధునాతన అధ్యయానికి, పరిశోధనలు సులభతరం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. భవిష్యత్ లో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు పరిశోధనలకు అవకాశం కల్పించబడుతుందన్నారు. అంతేగాక తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున  సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, వారసత్వానికి వారధిగా నిలుస్తూ పవిత్ర గోదావరి చెంతన ఉన్న  రాజమహేంద్రవరంలో తెలుగు వైభవంగా వెలుగొందుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషా సంస్కృతులు, కళలు మరింతగా విరాజిల్లుతాయన్న అభిప్రాయాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం Publish Date: May 20, 2025 8:05PM

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

  తిరుమల తిరుపతి దేవస్థాన మండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది.  స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు.  తిరుమల ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. టీటీడీ ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.⁠  తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.  ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని ఈవో వెల్ల డించారు. ⁠తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ⁠టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థుల బదిలీలు.. వీర్ఎస్ దిశగా కసరత్తు చేయాలని డిసైడ్ అయ్యారు.   
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే Publish Date: May 20, 2025 7:18PM

రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు.. సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పణ

  ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.  అనంతరం సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు.  ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్‌ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్‌ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం అమరావతి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 2.30 గంటలకు అమరావతికి తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు.   
రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు.. సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు  సమర్పణ Publish Date: May 20, 2025 6:33PM

మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు

జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.  ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వానం నుండి భోజనాల వరకు అన్నీఈ కమిటీలే చూసుకుంటాయి. మొత్తంగా మహానాడుకు సంబంధించి సమన్వయ బాధ్యతలన్నీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసుకుంటారు. నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి, పార్టీ ఎంపీ  రామ్మోహన్‌నాయుడు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 19 కమిటీలకు సంబంధించి ఒక్కో కమిటీలో పది నుంచి 20 మంది ఉంటారు.   పల్లా శ్రీనివాస్‌, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, నారా లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్నాయుడి నేతృత్వంలో వసతి  , రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదే విధంగా కడపలో మహానాడు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఇక మహానాడులో తొలి రోజు అంటే మే 27న  పార్టీ అధినేత ఎన్నిక కోసం చంద్రబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు పార్టీ చంద్రబాబును పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. అలాగే రెండో రోజు వివిధ అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతుంది. చివరి రోజు పార్టీ పలు తిర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది.  
మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు Publish Date: May 20, 2025 4:37PM

రైతు సమస్యలపై ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.  మరోవైపు రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పంటల దిగుబడులపై సీఎంకు అధికారులకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. లిక్కర్ స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. ▪️హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం. ▪️విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి. ▪️అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. ▪️దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ. ▪️భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం. ▪️ఏపీ లెదర్ పుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం. ▪️పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం. ▪️రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు.
రైతు సమస్యలపై ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయం Publish Date: May 20, 2025 4:34PM

భారత దౌత్య బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలు

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత  ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని  9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత పాక్ భారత్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడటం, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఒకింత సడలినా..  పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ వ్యూహాత్మకంగా  పాకిస్థాన్ పై దౌత్యయుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే..  పహల్గాం ఉగ్రవాదికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదననంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది.   ఈ ఏడు ప్రతినిథి బృందాలకు అఖిల పక్షాలకు చెందిన నేతలు నాయకత్వం వహిస్తారు. ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. అలాగే మిగిలిన ఆరు బృందాలకూ.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, అదే పార్టీకి చెందిన వైజయంత్ పాండా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా,  డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎంపీ శ్రీకాంత్  నాయకత్వం వహిస్తారు. కాగా ఈ బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలకు కూడా స్థానం దక్కింది.   రాజమహేంద్రవరంఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రవిశంక్ ప్రసాద్ నేతృత్వం వహించే బృందంలో సభ్యురాలు. ఈ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ లలో పర్యటిస్తుంది. అలాగే... ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలె నాయకత్వంలోని బృం దంలో  నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం నాయకుడు లావు కృష్ణదేవరాయులు సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం ఈజిప్ట్, క్వటార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలలో పర్యటిస్తుంది. ఇక శశిథరూర్ నేతృత్వం వహించే బృందంలో అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో పర్యటిస్తుంది.  
భారత దౌత్య బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలు Publish Date: May 20, 2025 3:57PM

దేశంలో ఆందోళన రేపుతోన్న కరోనా కేసులు..అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన

  దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్  దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్‌-1, ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ముంబైలో ఇద్దరు మహిళల మరణం తీవ్ర కలకలం రేపింది. వీరు కరోనా కారణంగానే మృతి చెందారంటూ వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్  స్పందించి, ఈ వార్తలను ఖండించింది.  సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించిన మాట వాస్తవమే అయినా, వారి మృతికి కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. తాజాగా కోవిడ్ భారిన పడిన బాధితులలో కొందరు తాము తీవ్ర అలసటతో బాధపడుతున్నారు. వర్షాకాలం వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు.  ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.   
దేశంలో ఆందోళన రేపుతోన్న కరోనా కేసులు..అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన Publish Date: May 20, 2025 3:46PM

వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై  విచారణను ఏపీ హైకోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం పోలీసుల పీటీ వారెంట్  పై వంశీ హౌస్ మోషన్ పిటిషన్   దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్   మంజూరు చేయాలని  ఆ పిటిషన్ లో కోరారు. అయితే వంశీ బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  ఇక పోతే బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈ సాయంత్రం వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.  ఇలా ఉండగా.. అక్రమ మైనింగ్ కేసులో కింది కోర్టు అనుమతించినా గురువారం వరకూ పీటీ వారంట్ జారీ చేయబోమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏది ఏమైనా బెయిలు విషయంలో వల్లభనేని వంశికి మరోసారి చుక్కెదురైంది. 
వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా Publish Date: May 20, 2025 3:19PM

కుమారుడికి గ్రాడ్యుయేషన్ పట్టా.. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివర్శిటీలో  జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. గ్రాడ్యుయేష‌న్ కు సంబంధించిన ఫోటోను  కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఈ గోప్ప ప్రయాణంలో నీవు చాలా కష్టపడ్డావు. ఎంతగానో ఎదిగావు, మమ్మల్ని గర్వపడేలా చేశావు అంటూ  ఆనందం వ్యక్తం చేశారు.  కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆమెకు వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కవిత ఈ నెల 23న అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.  
కుమారుడికి గ్రాడ్యుయేషన్ పట్టా.. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన కవిత Publish Date: May 20, 2025 3:02PM

హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు

  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది. ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది. ఇటీవల ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మే17వ తేదీ నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. క‌నీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గ‌రిష్ఠ టికెట్ ధ‌ర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచినట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన చార్జీలను యథాతథంగా ఉంచలని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది.  
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు Publish Date: May 20, 2025 2:54PM

ఏపీకి భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వాతా వరణ శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు  దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వేసిన ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది.   కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది.  వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య,  సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే  విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు  నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది.  
ఏపీకి భారీ వర్ష సూచన Publish Date: May 20, 2025 2:45PM

సవాళ్ళకు జవాబు.. క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ!

తెలుగు దేశం  అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,  ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు.  గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో..  అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో ..  చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు. రాష్ట ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి ఇవ్వలేదు. పార్టీ పటిష్టత పై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా పార్టీనే కాదు, రాష్ట్రం కూడా ఎంతగానో నష్ట పోయింది. వైసీపీ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో..  జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకు పోయారు.   గతంలోనే ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. మరో మారు అలాంటి అనర్ధం జరగ కుండా ఉండేందుకు, ఇప్పటికే చాల వరకు పట్టాల పైకి తెచ్చిన పరిపాలన పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూనే, పార్టీ పటిష్ఠతపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు.  అవును.. కింది స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గాల వారీగా  ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి..  మారుతున్న పరిస్థితులకు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలకు  అనుగుణంగా నూతన పద్దతులను అడాప్ట్ చేసుకోవడం, ఆచరణలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొట్టినపిండి. అంతే కాదు ఒక్క రాజకీయ, పరిపాలన రంగాలలోనే కాదు, ఏ రంగంలో అయినా  టెక్నాలజీ సమర్ధవంతంగా వినియోగించుకోవడం అభివృద్దికి మూల మంత్రంగా చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తారు. అదే విషయాన్ని ఆయన పలు సందర్భాలలో, అనేక వేదికల నుంచి ప్రస్తావించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన  తెలుగువన్  రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని చేసిన ప్రసంగంలోనూ.. చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ పాతికేళ్ళ విజయ ప్రస్థానం సాగించిన, తెలుగు వన్   చైర్మన్ కంఠంనేని రవిశంకర్  ను అభినందిచారు. అలాగే..  ఇటీవల కాలంలో అన్ని రంగాలకు ఆయువు పట్టుగా మారిన సోషల్ మీడియా సమర్ధ వినియోగం పైనా చంద్రబాబు నాయుడ దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే..  నియోజకవర్గాల వారీగా నిర్వహించే  శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సంస్థాగత విషయాలు.. రాజకీయ అంశాలతో పాటుగా, సోషల్ మీడియా సద్వినియోగం విషయంలోనూ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పార్టీ నేతల తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులకు రాజకీయ అవగాహన, రాజకీయ వ్యూహాల పట్ల అవగాహనా కల్పించడంతో పాటుగా..  స్వర్ణాంధ్ర విజన్ – 2047,  పీ – 4 ఇనిషియేటివ్స్ ముఖ్య ఉద్దేశాలపై అవగాహన కల్పిస్తామని నేతలు చెప్పారు. అదే విధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం జరుగుతుందని తెలిపారు.   ఇప్పటికే కుప్పం, మంగళగిరి సహా మరి కొన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ముందుగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన  విశాఖపట్నం నార్త్, చింతలపూడి, తెనాలి, పెనుగొండ,కనిగిరి నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఈ ఐదు నియోజక వర్గాల్లో శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మంచి చెడులను సమీక్షించుకుని, రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.      ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సిద్దాంతం, పార్టీ లక్ష్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన కార్యక్రమాలు, సోషల్ మీడియాని సమర్ధవంతంగా వినియోగించుకోవడ్డం వంటి పలు కీలక అంశాలపై ఎంపిక చేసిన క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ లో  ప్రొఫెసర్లు, ఇతర రంగాలకు చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుందని అంటున్నారు.  అదే విధంగా   వైసీపీ సోషల్ మీడియా సాగించే ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు వీలుగా మండల స్థాయి నుంచి కార్యకర్తలకు సోషల్ మీడియా సమర్ధ వినియోగంపై శిక్షణ ఇవ్వడం కూడా శిక్షణలో భాగంగా ఉంటుందని అంటున్నారు.
సవాళ్ళకు  జవాబు..  క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ! Publish Date: May 20, 2025 2:33PM

గులాబీ బాస్‌‌ కేసీఆర్‌కు బిగ్ షాక్..కాళేశ్వరం కమిషన్ నోటీసులు

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు భారీ షాక్ తగిలింది. గులాబీ బాస్‌తో పాటు పాటు మాజీమంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో.. తెలంగాణ సర్కారు కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తుంది.  అయితే గులాబీనేత గతంలో నరసింహారెడ్డి కమిషన్ విచారణను న్యాయస్థానంలో సవాలు చేసి, దాని చైర్మన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఘోష్ కమిషన్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు పని చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ పని చేశారు . ఈ తరుణంలోనే కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి.  
గులాబీ బాస్‌‌ కేసీఆర్‌కు బిగ్ షాక్..కాళేశ్వరం కమిషన్ నోటీసులు Publish Date: May 20, 2025 2:31PM

ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణఏం కేసులు మాజీ సీఎం జగన్ బ్యాచ్ కి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ నలుగురూ జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.  మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికీ తెలిసి కొన్ని విషయాలు జరిగాయనీ,  అందువల్లే నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. ఈ నలుగురినీ కలిపి విచారించిన తరువాతనే ఈ కేసులో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయని సీట్ చెబుతోంది.  ఈ నలుగురినీ కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ( మే 20) విచారణ జరగనుంది.  మరోవైపు రాజ్‌కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ కోర్టులో మూడు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై  ఏసీబీ కోర్టు సోమవారం (మే 19) విచారణకు వచ్చింది. ఈ విచారణను కూడా ఏసీబీ కోర్టు మంగళవారం (మే 20)కి వాయిదా వేసింది. దీంతో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో ఏ30 పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు మంగళవారం (మే 19) విచారించనుంది. అలాగే ఈ కేసులో ఏ 6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారమే.   విచారించనుంది.మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్  అడ్డంగా బుక్కైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?! Publish Date: May 20, 2025 10:26AM

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం అక్రమ కనెక్షన్ లేనా?

హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషాద ఘటన కలకలం రేపింది.  అగ్నిప్రమాద కారణాలపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. చూస్తున్నాయి.  షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడు కారణాలుగా  అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినా, అక్రమ  విద్యుత్ కనెక్షన్ లు కూడా అగ్నిప్రామాదానికి ప్రధాన కారణంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మామూలుగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగే అవకాశం ఉండదని విద్యుత్ శాఖ చెబుతోంది.  ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్‌ కారణంగానే ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అంటోంది. అదే సమయంలో  అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు విద్యుత్ శాఖ పేర్కొంది.  దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్రమ కనెక్షన్ల వ్యవహారం ఏమిటంటే..  నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ కనెక్షన్‌ తీసు కుంటున్నారు. ఈ కారణంగానే బాధిత కుటుంబం కరెంట్‌ మీటర్‌పై లోడ్‌ పడిందనీ, ఆ అధికలోడ్ కారణంగా తొలుత విద్యుత్ మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చెక్క షోకేస్ కు మంటలు వ్యాపించాయని అంటున్నారు.  అక్కడ నుంచి మంటలు ఏసీ కంప్రెషన్ కు తాకాయనీ, దీంతోనే ప్రమాద తీవ్రత అధికమైందన్న అనుమానాలను విద్యుత్ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.   అగ్నిమాపక సిబ్బంది కూడా ఓవర్‌ లోడ్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు.  
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం అక్రమ కనెక్షన్ లేనా? Publish Date: May 20, 2025 10:10AM

పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి అధీనంలోని ప్రభుత్వ భూమి స్వాధీనం

జగన్ హయంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  పెద్దిరడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది. అడ్డూ అదుపూ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  భూ కబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అండతో అదికారులను గుప్పిట పెట్టుకుని వింటారని ప్రభుత్వ భూమి... అటవీ భూమి.. ప్రైవేట్ భూములు అన్న తేడా లేకుండా పెద్దిరెడ్డి కబ్జాల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి.   గత ఎన్నికలలో  వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే పుంగనూరులో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తన కబ్జాల వ్యవహారం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్న వెంటనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం కేసులో కూడా పెద్ది రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని  బీకే పల్లి సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమిలో కొంత భాగం మాజీ సైనికుడికి కేటాయించారు.  ఈ భూమిలో పెద్దిరెడ్డి  1.35 ఎకరాలు   భూమి నుంచి కబ్జా చేశారు. 552-7 సర్వే నెంబర్ లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో బైపాస్ రోడ్డు, ఫ్లై ఓవర్ కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1 లోని 1.35 ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. మదనపల్లి సర్వేయర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఐ భరత్ రెడ్డి హద్దులు గీసి ఆక్రమణలు తొలగించి 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి గా తేల్చారు. ఆ భూమిని పెద్దిరెడ్డి అధీనం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 
పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి అధీనంలోని ప్రభుత్వ భూమి స్వాధీనం Publish Date: May 20, 2025 9:48AM

తల్లిదండ్రులే చేతులారా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.. కారణాలు ఇవే!

పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే.. నిర్ణయాలు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు. తల్లిదండ్రుల తప్పేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది. కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.                                              *నిశ్శబ్ద.  
తల్లిదండ్రులే చేతులారా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.. కారణాలు ఇవే! Publish Date: May 20, 2025 9:30AM

టీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ...

ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
 టీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ... Publish Date: May 20, 2025 9:30AM

మద్యం కుంభకోణం గుట్టురట్టు? సిట్ కు ఆధారాలు అందించిన మద్యం కంపెనీల యాజమాన్యాలు

నిజం నిప్పులాంటిది. అధికారం ఉందికదాని దానిని గుప్పిట మూసి ఉంచుదామంటే కుదరదు. చేయి కాలిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ.. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కోట్లు దండుగున్న అవినీతి తిమింగళాల గుట్టు బయటపడుతోంది. అవును మద్యం కుంభకోణం గుట్టు రట్టౌతోంది. ఈ కుంభ కోణంలో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా వాస్తవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు బాధితులు. వాస్తవానికి ఈ కుంభకోణంలో బాధితులైన వారు లిక్కర్ కంపెనీల యజమానులు. ముడుపులు ఇచ్చి ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందు తాము ఇచ్చిన ముడుపులు, వాటిని తీసుకున్న వారి వివరాలను బయటపెడుతున్నారు.   తాజాగా ఆర్థోస్ అనే కంపెనీ యజమాన్యం దర్యాప్తు అధికారులకు విస్తుపోయే వాస్తవాలను వివరించారు. తుపాకీని తమ కణతకు గురిపెట్టి మరీ దోపిడీ చేశారని వివరించింది. అలా తమ ప్రాణాలు తీస్తామని బెదిరించింది మరెవరో కాదు.. వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి అని దర్యాప్తు అధికారులకు తెలిపింది.  ఖజురహో అనే బ్రాండ్ మద్యాన్నిసరఫరా చేయడానికి తమకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. అందుకోసం ముడుపులు తీసుకున్నారని వివరించింది.  వాస్తవానికి జగన్ హయాంలో లిక్కర్ కంపెనీలను చాలా వరకూ వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తిని గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని కంపెనీల్లో కేసు బాటిల్స్ కు ఇంత అని చెప్పి కమిషన్ వసూలు చేశారు. ఆ కమిషన్ ను నగదు రూపంలోనే కాకుండా.. బంగారం సహా ఇతర మార్గాల్లో వసూలు చేసుకున్నారు. ఇందు కోసం తప్పుడు కంపెనీలు సృష్టించారు. ఖర్చు లేని చోట ఖర్చు చూపించారు. లాజిస్టిక్స్అదనీ, ఇదనీ ఇష్టారీతిగా ఖర్చులు చూపించారు.  ఇతర ఖర్చులు చూపించారు.   ఇప్పుడు దర్యాప్తులో భాగంగా లిక్కర్ కంపెనీల యజమానులు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇంకా   ధైర్యం చేయకపోయినా..  తాము   ముడుపులు ఎలా చెల్లించామన్న వివరాలను వెల్లడించారు.  తాము కేసుల్లో ఇరుక్కోకుండా, తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా జాగ్రత్తపడుతూనే..  ఐదేళ్ల పాటు జలగల్లా తమ రక్తాన్ని పీల్చేసిన వారికి సంబంధించిన వివరాలను, వారెలో దోపిడీ చేశారో అందుకు అవసరమైన ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేస్తున్నారు.  ఆ వివరాలు, ఆధారాలను సేకరించిన  సిట్ ఇక మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు.   
మద్యం కుంభకోణం గుట్టురట్టు?  సిట్ కు ఆధారాలు అందించిన మద్యం కంపెనీల యాజమాన్యాలు Publish Date: May 20, 2025 9:25AM

భారత్ కు అమెరికా మరో షాక్?

15 షిప్ మెంట్ల మామిడి పండ్ల ధ్వంసం! భారత్, అమెరికా మధ్య దాదాపు కోల్డ్ వార్ లాంటి పరిస్థితి నెలకొందా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు భారత్ కు ఒకింత ఇబ్బందికరంగా పరిణమించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకుర ఇరు దేశాలనూ ఒప్పించింది తానేనని ట్రంప్ ప్రకటించడం, భారత్ దానిని ఖండించడం తెలిసిందే. భారత్ పాకిస్ధాన్ వ్యవహారాలలో మూడో దేశం ప్రమేయం లేదనీ, ఇరు దేశాల సైన్యాధ్యక్షుల మధ్య చర్చల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ విస్పష్టంగా తేల్చేసింది. అలాగే, ఆ తరువాత భారత్ అమెరికాకు వంద శాతం సుంకాల మినహాయింపు హామీ ఇచ్చిందని అమెరికా ఏకపక్షంగా చేసిన ప్రకటననూ ఇండియా నిర్ద్వంద్వంగా ఖండించింది.  దీంతో అమెరికా పెద్దరికం చిన్నబోయింది. అమెరికా ఒత్తిడిని భారత్ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదని ప్రపంచ దేశాలకు విస్పష్టంగా తెలిసియింది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత్ పట్ల ఒకింత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. అమెరికా వ్యవహార శైలి కారణంగా ఇరు దేశాల మధ్యా బంధాలు దెబ్బతింటున్న పరిస్థితులు కానవస్తున్నాయి.   తాజాగా  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు.  సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.  భారతీయ కరెన్సీలోదాదాపు  రూ.42,694,000లు. దీంతో వీటిని తిరిగి భారత్ కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయడం తప్ప మరో అవకావం లేని  పరిస్దితి ఎగుమతి చేసిన మామిడి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్ కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్దితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు.  భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్ పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలే కారణమని అంటున్నారు. దీంతో అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేసిన  భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్దితి ఏర్పడింది. వాస్తవానికి భారత్ కు అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతిదారు   అమెరికాయే. ఇప్పుడు అమెరికా చర్య కారణంగా రైతులకే కాకుండా, భారత ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ తగిలిందనే భావించాల్సి ఉంటుంది.   కాల్పుల విరమణపైనా, ఆ తర్వాత సుంకాలపైనా ట్రంప్ ప్రకటనల్ని భారత్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఈ మామిడి పండ్ల తిరస్కరణ వ్యవహారం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే దీనిపై అటు అమెరికా కానీ, ఇటు ఇండియా కానీ ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. 
భారత్ కు అమెరికా మరో షాక్? Publish Date: May 19, 2025 3:36PM

ఈసారి ఆసియా కప్ లేనట్లేనా?

పాకిస్తాన్ కు భారత్ మరో షాక్  త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి తప్పుకునేందుకు బీసీసీఐ నిర్ణయం? భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న  పాక్‌కు మరో షాక్ తప్పేటట్టు లేదు. త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి వైదొలగేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్‌లో పాక్‌పై ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్‌తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈసారి ఆసియా కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ భారత్, పాక్ మ్యాచ్‌లే. ఈ మ్యాచ్‌ లు జరిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దీంతో, ఆసియా కప్ లాభదాయకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా బోర్డుకు పీసీబీ చైర్మన్ మోహ్‌సీన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా ఐసీసీ బాధ్యతలు తీసుకున్నాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలను మోహ్‌సీన్ చేపట్టారు. ఇక భారత్ నిర్ణయంతో పాక్‌‌కు ఆర్థికంగా గట్టి షాక్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఆసియా కప్  లేనట్లేనా?  Publish Date: May 19, 2025 3:20PM

ఇకపై ఇద్దరిదే ఒకటే మాట ..ఒకటే బాట!

బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు. అవును  రెండు రోజుల క్రితం కేటీఆర్  స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి రెండు గంటలకు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి.. డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్యా వివాదం సర్డుమణిగింది అనేందుకు ఒక సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో  ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగతున్న నేపధ్యంలో ఇద్దరు కలిసి కూర్చుని..  ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ క్యాడర్  కు మంచి సంకేతం పంపుతుందని అంటున్నారు.   నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో, ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో అంతర్గత కుమ్ములాటల గురించి పార్టీలో, ప్రజల్లో,  మీడియాలో   పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా  కేటీఆర్ , హరీష్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక కేసీఆర్  కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ నేపద్యంలోనే బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత హరీష్, కేటీఆర్ మధ్య దూరం పెరిగడమే కాకుండా.. హరీశ్ రావు కారు దిగి సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, హరీష్ రావు ఈ వార్తలను ఒకటికి పదిసార్లు ఖండించారు. అంతే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా, తనకు అభ్యంతరం లేదని  మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే..  గత పాతికేళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా  కేసీఆర్ మాటే తనకు వేదవాక్కని హరీష్ స్పష్టం చేశారు. నిజానికి, హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్  తో ఏ విషయంలోనూ విభేదించలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా  కేసీఆర్  మాట జవదాటలేదు. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదని అంటారు.  ముఖ్యంగా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా,  పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్  ప్రాధాన్యత రోజుర్జుకు పెరుగుతూ వచ్చిన  సమయంలోనూ హరీష్ రావు పెదవి విప్పలేదు. ప్రశ్నించలేదు.  కేసీఆర్   మాట జవ దాటలేదు.  కాబట్టి.. ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా హరీష్ రావు  ఎదురు తిరిగక పోవచ్చని అంటారు.   అయినా అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్ధుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్  క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతున్న నేపద్యంలో.. భవిష్యత్  బంధాలు ఎలా ఉంటాయి  అనే విషయంలో సహజంగానే  హరీష్ రావు వర్గంలో అనుమానాలు ఉన్నట్లు చెపుతున్నారు. నిజానికి  పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నంత వరకు కుటుంబంలో చిన్నా పెద్ద  పొరపొచ్చాలు ఎన్ని వచ్చినా, కేసీఆర్ పెద్దరికంతో ఏదో విధంగా సర్డుబాటు చేస్తూ వచ్చారు.  కానీ, పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతికి వెళ్ళిన తర్వాత తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన హరీష్ అనుచరుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు. అందుకే, కేసీఆర్ చొరవ తీసుకుని, నష్ట నివారణకు నడుం బిగించినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని కేసీఆర్  ఇటు హరీష్ రావు ను, అటు కేటీఆర్ ను  కన్విన్స్ చేసినట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను,  కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా అభ్యంతరం చెప్పను అని మీడియా ముఖంగా, ప్రకటించారని చెపుతున్నారు.  అలాగే, కేటీఆర్ ను హరీష్ వద్దకు కేసీఆరే పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇద్దరి మధ్య సుదీర్ఘంగా రెండు గంటల పాటు జరిగిన భేటీలో  చాలా విషయాలు ఖుల్లం ఖుల్లా చర్చకు వచ్చినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా.. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ ముఖ్యనాయకుల మధ్య విబేధాలు లేక పోవడమే కాదు, విబేధాలు లేవన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ క్యాడర్ లోకి బలంగా తీసుకు పోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ఇక పై ప్రతి విషయంలో ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అన్నట్లు ముందుకు సాగాలని నిర్ణయించారని, అందులో భాగంగానే  ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్  పై దృష్టిని కేంద్రీకరించారని చెపుతున్నారు. అయితే  ముందు ముందు ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కవిత  సంగతేంటి? ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడవలసిందే  అంటున్నారు.
ఇకపై ఇద్దరిదే  ఒకటే మాట ..ఒకటే బాట! Publish Date: May 19, 2025 10:56AM

వైసీపీకి మోడీయే దిక్కు.. కుండబద్దలు కొట్టేసిన నల్లపురెడ్డి

వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా? ఇదే విషయాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా పార్టీ అధినేత జగన్ కు చెబుతున్నారా?  అసలు 2024 ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయానికి బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడమే కారణమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఈ పార్టీ సీనియర్ నేతల మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు,  కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి   పార్టీకి భవిష్యత్ ఉండాలంటే జగన్ మోడీని శరుణు వేడి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎలాంటి శషబిషలకూ తావివ్వకుండా.. 2024 ఎన్నికల సమయంలో జగన్ బీజేపీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీ పరాజయానికి కారణమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  కనీసం వచ్చే ఎన్నికలలో అయినా, అంటే 2029 ఎన్నికల నాటికైనా వైసీపీ బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే పార్టీ మనుగడ ఉంటుందని అన్నారు.  ఇదే విషయాన్ని  తాను నేరుగా జగన్ కు కూడా చెబుతానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  2024 ఎన్నికల సమయంలో బీజేపీ కోరినప్పటికీ జగన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశారనీ, అప్పుడు పొత్తు వద్దనుకోవడం వల్లనే వైసీపీ ఆ ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిందని అన్నారు. అలా అనడం ద్వారా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అప్పటి జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మోడీ సర్కర్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందనీ, అలాంటప్పుడు.. ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడం తప్పేనన్నారు.   కనీసం వచ్చే ఏన్నికలలోనైనా జగన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్నారు. బీజేపీతో పొత్తు ఉంటేనే వైసీపీకి భవిష్యత్ ఉంటుందన్నారు. 
వైసీపీకి మోడీయే దిక్కు.. కుండబద్దలు కొట్టేసిన నల్లపురెడ్డి Publish Date: May 19, 2025 10:10AM

అంగరంగ వైభవంగా తెలుగు వన్ రజతోత్సవ వేడుకలు

పాతిక వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగువన్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రజతోత్సవ  సభకు నిండుదనం తెచ్చారు. పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి మహా విశిష్ట అతిథిగా హాజరై తెలుగువన్ టీమ్‌ని ఆశీర్వదించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి  నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె,  స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.  కార్యక్రమంలో పది మంది ప్రముఖులను తెలుగువన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సన్నానించారు సహస్రావధాని మేడసాని మోహన్, ప్రజావైద్యులు  డాక్టర్ పాములపర్తి రామారావు, తెలుగు మీడియా అకాడమీ చైర్మన్ కల్మెకొలను శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ గ్రహీత్ చంద్రబోస్, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నతాధికారి డాక్టర్ పి.వి.రమేష్, వ్యవసాయ నిపుణుడు ముళ్లగూరు అనంతరాముడు, నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావు, సీఎస్ బీ, ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలత,  స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్‌లను  తెలుగువన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.
అంగరంగ వైభవంగా తెలుగు వన్ రజతోత్సవ వేడుకలు Publish Date: May 19, 2025 8:05AM

ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగుజాతి.. చంద్రబాబు

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్‌ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కంఠంనేని రవిశంకర్‌  తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం (మే 18) పాల్గొన్నారు.  జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు     తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందంటే అందదుకు రవిశంకర్ కృషి, పట్టుదలే కారణమన్న చంద్రబాబు.. తాను   విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్‌ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారన్నారు. ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు. తర్వాత వార్తా పత్రికలు వచ్చాయి. తర్వాత సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది.  రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు.   తెలుగు వన్ ఛానల్ కు ప్రస్తుతం వరకు 55 బిలియన్ వ్యూవ్స్, 120 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియాలు, 15 వందలకు పైగా సినిమాలతో  తెలుగువన్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని చంద్రబాబు అన్నారు. కంఠంనేని రవిశంకర్ నిర్మించిన అమరావతి సినిమాపైనా చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆ నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా.. అమరావతికి అన్యాయం జరిగిందన్న కోపంతో, ఆవేదనతో ధర్మం, న్యాయం కోసం నిలబడి అత్యంత సాహసంతో రాజధాని ఫైల్స్ సినిమాతీసిన ధీరోదాత్తుడు రవిశంకర్ అని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.   సామాజిక బాధ్యత విషయంలోనూ రవిశంకర్ ముందుంటారన్న చంద్రబాబు ఇప్పటి వరకూ కంఠంనేని 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారని  అందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలకు కూడా చంద్రబాబు అభినందనలు తెలిపారు. తాను అరెస్టైన సమయంలో హైదరాబాద్‌లో మీరు పోరాడిన విధానం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. గచ్చిబౌలిలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు మనం మంచిపని చేస్తే ప్రజలు మర్చిపోతారు అని అంటుంటారు..కానీ ఏ విధంగా ప్రజలు స్పందింస్తారనేది ఆ సభ కళ్లకుకట్టిందన్నారు.  సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలన్న రవిశంకర్ సూచనను చంద్రబాబు స్వాగతించారు. సామాజిక మాధ్యమంతో  ఎంత లాభం ఉందో..అంతనష్టం ఉంది. సోషల్ మీడియాను వేదికగా తీసుకని వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచన చేసే వారిని నియంత్రించాల్సి ఉంది అన్నారు. 
ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగుజాతి.. చంద్రబాబు Publish Date: May 19, 2025 7:49AM

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

  హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. మరోవైపు హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో  పెను అగ్నిప్రమాదం తప్పిన తప్పింది. పెట్రోల్ ట్యాంకర్ బ్యాటరీ పేలడంతో  మంటలు చెలరేగాయి.  పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ లారీ ఉండటంతో సమయానికి ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు చనిపోతున్నారని అన్నారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై ఇప్పటికైనా సమీక్ష నిర్వహించాలని వారు కోరుతున్నారు
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం Publish Date: May 18, 2025 2:57PM

టీడీపీ నేత‌పై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి

   తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ​దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్​, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన రాజు మంగళగిరి ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ ​దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. నిన్నటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు టీడీపీ నేత‌పై దాడితో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.  
టీడీపీ నేత‌పై  వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి Publish Date: May 18, 2025 2:09PM

గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాదం బాధాకరం.. వరుస అగ్ని ప్రమాదాలపై చర్యలు లేవి? : కేటీఆర్

    హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు. ఈ ఘటన చాలా హృదయవిదారకం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. మంటలు త్వరగా అదుపులోకి రావాలి. ఘటనను ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటారు.  ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అని కేటీఆర్ సూచించారు. అలాగే ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలి. పాతబస్తీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి. అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలి. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలి. ’’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.  మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నదని విమర్శించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని చెప్పారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  
గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాదం బాధాకరం.. వరుస అగ్ని ప్రమాదాలపై చర్యలు లేవి? : కేటీఆర్ Publish Date: May 18, 2025 1:32PM

అగ్ని ప్రమాద ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరం : సీఎం చంద్రబాబు

  హైదరాబాద్  గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. పాత బస్తీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామన్నారు
అగ్ని ప్రమాద ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరం : సీఎం చంద్రబాబు Publish Date: May 18, 2025 12:43PM