టీడీపీ నేత‌పై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి

 

 తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ​దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్​, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన రాజు మంగళగిరి ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ ​దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. నిన్నటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు టీడీపీ నేత‌పై దాడితో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.