Illu illalu pillalu : ట్యూషన్ మొదలెట్టిన ప్రేమ.. శ్రీవల్లి ప్లాన్ ఏంటంటే!
on May 20, 2025
స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -162 లో.....సాగర్ తో నర్మద కాళ్ళు నొక్కించుకుంటుంది. అప్పుడే నర్మదకి వేదవతి కాల్ చేస్తుంది. ఏంటి అత్తయ్య నాపై బెంగ పెట్టుకున్నారా అప్పుడే కాల్ చేసారని నర్మద అనగానే అదేం లేదు క్షేమంగా వెళ్ళారా అని చేసానని వేదవతి అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకోవడం చూడలేని శ్రీవల్లి నేను మాట్లాడతానని ఫోన్ తీసుకుంటుంది.
నర్మద రేపు సిటీ తిరగడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతుంది. పక్కనే రామరాజు ఉంటాడు. మావయ్య మాట్లాడతాడటా అని రామరాజు కి ఫోన్ ఇవ్వగానే సాగర్ తో రామరాజు గంటసేపు ఫోన్ మాట్లాడతాడు. దాంతో నర్మద కోప్పడుతుంది. అక్కడ రైస్ మిల్ లో ఎప్పుడు మీ నాన్న తో మాట్లాడుతావు.. ఇక్కడ కూడా గంట సేపు మాట్లాడాలా అని నర్మద కోప్పడుతుంది. మరుసటి రోజు ప్రేమ, వేదవతి ఇద్దరు నర్మద లేకుంటే బోర్ గా ఉందని అనుకుంటారు. వాళ్ళ మాటలు శ్రీవల్లి వింటుంది. అప్పుడే తిరుపతి కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకొని వస్తాడు. ప్రేమ ట్యూషన్ చెప్తానని వాళ్ళకి చెప్తుంది.
వెంటనే ధీరజ్ దగ్గరికి ప్రేమ వెళ్లి.. ఈ రోజు ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను.. నాకు అల్ ది బెస్ట్ చెప్పవా అని అడుగుతుంది. భర్తని సంప్రదాయంగా అడగాలని ధీరజ్ అనగానే.. ధీరజ్ కాళ్లు మొక్కబోతుంటుంది ప్రేమ. ఏ వద్దు నేను జోక్ చేసానని ధీరజ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రేమకి అల్ ది బెస్ట్ చెప్పగానే తను మురిసిపోతుంది. ఆ తర్వాత నర్మద ట్రైనింగ్ కి వెళ్లాడానికి రెడీ అవుతుంది. తరువాయి భాగంలో సాగర్ కోసం నర్మద గిఫ్ట్ తీసుకొని తనకోసం వెయిట్ చేస్తుంది. సాగర్ రాత్రి అయిన కూడా ఇంటికి రాడు. వస్తున్నానంటూ లేట్ చేస్తుంటే నర్మదకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
