హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే మా నినాదం : సీఎం చంద్రబాబు

 

విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైజాగ్‌లో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. విశాఖలో అద్బుతమైన వాతవరణం ఉంది.  శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళలు భద్రతలో అగ్రస్థానంలో ఉంది అని తెలిపారు. విశాఖ ప్రజల స్ఫూర్తిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు..హుద్‌హుద్ తుఫాను సమయంలో వైజాగ్‌ వాసులు చూపిన చొరవ, సేవాభావాన్ని ఎప్పటికీ మరువలేను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమం ప్రధాని బర్త్‌డే రోజు జరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో 11 ఏళ్లలోనే భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఏపీనీ నిర్మించడమే కు ప్రభుత్వ ధ్యేయం" అని అన్నారు. 

ప్రజల హెల్త్‌కి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. 

ప్రతి సంవత్సరం ఆరోగ్య రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్లు ఖర్చు చేస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో, పేదలకు అండగా నిలిచేందుకు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకొచ్చాం" అని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత హెల్త్ బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల కోసం ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. 

టాటా, గేట్స్ ఫౌండేషన్‌ సహకారంతో 'ప్రాజెక్ట్ సంజీవని' ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. హైబీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు" అని ఆయన వివరించారు. గైనకాలజీ, ఈఎన్‌టీ, కళ్లు, డెర్మటాలజీ, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ఈ క్యాంపుల్లో అందుబాటులో ఉంటాయని చంద్రబాబు తెలిపారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu