బ్లూమింగ్టన్లో తెలుగుదేశం-పసుపుదళం సంబరాలు
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని సెంట్రల్ ఇల్లినాయిస్లోని బ్లూమింగ్టన్ పట్టణంలో బ్లూమింగ్టన్ తెలుగుదేశం శాఖ - పసుపుదళం ఆధ్వర్యంలో తెలుగుదేశం విజయోత్సవాలను కన్నుల పండువగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా సుమారు నలభై కార్లతో 15 మైళ్ళ దూరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ కుటుబం సభ్యులతో కలసి విజయోత్సవ సంబరాలను చేసుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకున్నారు. ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. మహిళలు పసుపు పచ్చని సంప్రదాయ వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది కళాహృదయులు ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెద్దలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎలా అభివృద్ధిలోకి తెచ్చారనే అంశం మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజేష్ యార్లగడ్డ, శ్రీనివాస్ కొసరాజు, కన్నెగంటి కృష్ణ, వెంకట్ లెల్ల, చంద్ర చిట్టిబొమ్మ, వేణు దండ, రాజా వెలగపూడి, శ్రీ గోగినేని, క్రిష్ కిలారు, శివ బూసా, నరసింహారావు అబ్బిన, శ్రీనివాస్ మానం, వెంకట్ లెక్కల, వెంకట్ గోగినేని, సుధీర్ చౌదరి, వంశీకృష్ణ పేపల్ల, రాకేష్ కిలారు, కిరణ్ గుడిపూడి, చైతన్య సోమినేని, నాగరాజు కూరపాటి, శరత్బాబు గోడి, రవి వట్టికూటి, హేమంత్ మువ్వ, ఇమ్రాన్ ఖాన్, శ్వేత శింగరి, చక్రవర్తి కొటారు, రామ్ తాళ్ళూరి తదితరులు పాల్గొన్నారు.