Read more!

ఉన్మాది దాడిలో దంపతులకు గాయాలు

 

తిరుమలలో శ్రీవారి దర్శనానికి నడకదారిలో వెళ్తున్న భక్తుల మీద అక్కగార్ల గుడి సమీపంలో ఓ ఉన్మాది దాడి చేశారు. భక్తులను గాయపరచడానికి ఉన్మాది ప్రయత్నించడంతో భక్తులందరూ చెల్లాచెదురైపోయారు. అయితే తమిళనాడులోని తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తలను పట్టుకున్న ఆ ఉన్మాది తన దగ్గర వున్న కత్తితో వారిద్దరి గొంతులు కోశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న అశ్విన్ ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఉన్మాది కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.