Read more!

హిమాచల్‌ నుంచి తిరిగొచ్చిన నాయిని

 

 

 

హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతైన మర్నాటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే వుండి విద్యార్థుల గాలింపు కార్యక్రమాలను పర్యవేక్షించిన తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌‌కి తిరిగి వచ్చేశారు. తాము ఎంత ప్రయత్నించినా విద్యార్థుల జాడ కనుక్కోలేకపోయినందుకు ఆయన తన బాధను వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా విద్యార్థుల జాడ తెలియకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. దాదాపు వారం పాటు నాయిని అక్కడే వుండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నాయినితోపాటు గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు.