Read more!

ఫిరోజాబాద్‌లో టెర్రర్ టెర్రర్!

 

 

 

ఉత్తర ప్రదేశ్ చివరికి ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు నిరాఘాటంగా జరిగిపోతూ వున్నాయి. మరోవైపు దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ అన్యాయాలన్నిటినీ చూసి తట్టుకోలేని జనం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు హిసాత్మకంగా కూడా మారుతున్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలోని రామ్‌ఘర్‌లో గత రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక దొంగల ముఠా చేతిలో హతమయ్యారు. దీనికి నిరసనగా జిల్లా ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. జనం పోలీసు అధికారులపై రాళ్లదాడికి దిగడంతో డిజిఐ విజయ్ సింగ్ మీనాతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. రెచ్చిపోయిన జనం అక్కడి వాహనాలను, షాపులను ధ్వంసం చేశారు. ఒక పోలీసు వ్యానును తగులబెట్టారు. మొత్తమ్మీద ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితి చెయ్యిదాటినట్టు కనిపిస్తోంది.