Read more!

తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు

 

 

 

త్వరలో తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు రాబోతున్నాయి. త్వరలో రాబోతున్న మహంకాళి అమ్మవారి బోనాలు, రంజాన్, బతుకమ్మ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్నామని మంత్రి పద్మారావు తెలిపారు. ముందుగా రాబోతున్న రంజాన్, మహంకాళీ జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ పండుగలను ఘనంగా జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ఈ మూడు పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ... రంజాన్ పండుగను ప్రభుత్వం తరఫున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పండుగల సందర్భంగా జంటనగరాల్లో సీఎం పర్యటిస్తారని ఆయన చెప్పారు.