తమన్నాకు తీరని కోరిక..!

        దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించనట్లు... మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి కూడా అలానే ఉంది. నాజూకు అందాలతోపాటు... లేలేత పరువాలతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ బాలీవుడ్ వరకూ ఈజీగా దూసుకుపోయిన తమన్నా.... టాలీవుడ్ లో మాత్రం ఓ అవకాశం కోసం... కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. అదే ప్రిన్స్ మహేశ్ బాబు సరసన నటించే ఛాన్స్....‍! తమన్నాకు ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ, ఎప్పుడూ హీరోయిన్లనే డామినేట్ చేసే మహేశ్ బాబు మాత్రం... తన కన్నా తళతళమని మెరిసిపోయే మిల్కీ బ్యూటీతో నటించేందుకు జంకుతున్నాడట. కాబట్టీ.. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించేయాలన్న మన మిల్కీ బ్యూటీ కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు.

మెగా క్యాంప్ లో శ్రుతిహాసన్ జోరు

  గబ్బర్ సింగ్ హిట్ తో ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకున్న శ్రుతి హాసన్ పెద్ద హీరోల సరసన వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ 'రేసు గుర్రం'లో హీరోయిన్ గా ఎంపికైంది. తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన గబ్బర్ సింగ్ తో మెగా క్యాంప్ లోకి అడుగుపెట్టిన శృతి.... ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు'లో ఎంపికైంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్- హరీష్ శంకర్ సినిమా, రవితేజతో “బలుపు”, బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. తాజా ఆఫర్ తో మెగా హీరోలు ముగ్గురితో ఈ స్లిమ్ బ్యూటీ ఆడిపాడినట్టే. ఇప్పటికే మాంచి ఊపుమీద ఉన్న అమ్మడి కేరీర్ ఇకపై 'రేసుగుర్రం'లా దూసుకుపోతుందేమో చూడాలి.

మురికిగుంటలో నాని, అమలా పాల్

        “జెండాపై కపిరాజు” సినిమాలో... జంటగా నటిస్తోన్న నానీ, అమలాపౌల్... ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో... హీరోహీరోయిన్లు మురికిగుంటలోకి దూకే సన్నివేశం ఒకటి ఉంది. అందుకోసం దర్శకుడు నిజంగానే వారిని ఓ మురికి కాలువలోకి దిగమన్నారట. దర్శకుని మాటకు గౌరవమిస్తూ... ఇంకేమాత్రం ఆలోచించకుండా... అందులోకి దూకేశారట మన జంట. సింగిల్ టేక్ లోనే ఈ కీలకమైన షాట్ ఓకే అయిపోవడం, సన్నివేశం అనుకున్నదానికన్నా బాగా రావడంతో... యూనిట్ సభ్యుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. అందుకే నానీ, అమలా గట్స్, వర్క్ కమిట్మెంట్ టిన్సెల్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.

మళ్ళీ పవన్, రమణ గోగుల కాంబినేషన్...?

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కాంబినేషన్ ఎలాంటి హిట్స్ అందించిందో అందరికీ తెలిసిందే...! “తమ్ముడు”, “బద్రి” బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. “జానీ” సినిమా ఫ్లాప్ అయినా.... ఆడియో మాత్రం అలరించింది. “అన్నవరం” నిరాశనే మిగిల్చడంతో.... క్రమంగా రమణగోగుల తన ప్రభావాన్ని కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ సందడి చేస్తోందన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రానికి రమణ గోగుల స్వరాలు సమకూర్చనున్నారట. సో... ఈసారి మరింత ఎనర్జీ పుంజుకుని వస్తున్న ఈ కాంబినేషన్ మెగా ఫ్యాన్స్ ను ఏమేరకు ఉర్రూతలూగిస్తుందో... వేచి చూడాలి..

మణిరత్నం లాస్ట్ గ్లోరీ...‍!

        అద్భుతమైన ప్రేమకావ్యాలను తెరపై ఆవిష్కరించిన దర్శకరత్నం... మణిరత్నం పేరువింటేనే ఇప్పుడు నిర్మాతలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. “కడలి” మిగిల్చిన విషాదమే దీనికి కారణం అనుకున్నా... మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. మణిరత్నం... టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న రోజుల్లో ఆయన డేట్స్ కోసం.... తొలుత సుహాసినిని సంప్రదించవలసి వచ్చేది. ఇది కొందరికి మింగుడు పడనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో అదే విధానాన్ని అనుసరించేవారు. వరుస ఫ్లాపులు చవిచూస్తున్నా... ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది. నిర్మాతలు... మణికి దూరమైపోవడానికి ఇదే ప్రధానమైన కారణం అని కాలీవడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

సినీ రైటర్ గా ఫెయిల్ అయిన చేతన్ భగత్

  రచయితగా ఎంతో పాపులర్ అయ్యి ఉండొచ్చు... కానీ సినిమాకు సంబంధించి... ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ను అందిపుచ్చుకుంటేనే అసలు సిసలు సినీరచయిత అవగలరు. పాపం అది తెలుసుకోలేకే... బోల్తాపడ్డాడు... ప్రముఖ రచయిత చేతన్ భగత్. విషయంలోకి వెళితే... తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “కిక్” సినిమా సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ మూవీకి స్క్రిప్ట్ రాసే బాధ్యత భుజానేసుకున్నాడు చేతన్ భగత్. తీరా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి... సల్మాన్ కు చూపిస్తే... ‘తెలుగు 'కిక్' లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ ఇందులో లేవని పెదవి విరిచేశాడట. దీంతో పాపులర్ రచనలు చేసిన తాను... ఓ కమర్షియల్ మూవీ కథకు హంగులద్దాలేక పోయానని మధన పడిపోతున్నాడు ఈ క్రియేటివ్ రైటర్.

కావాలన్న మహేష్...వద్దన్న నమ్రత

        టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఎక్కువగా పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించడానికి ఇష్టపడేవారు కాదు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ తన స్టైల్ ను మార్చినట్లుగా కనిపిస్తుంది. పైకి బిడియంగా కనిపి౦చే ప్రిన్స్... సరద సంభాషణలు సాగిస్తూ అందర్ని మురిపిస్తున్నాడు. హైదరాబాద్ కొండాపూర్ లో కొత్తగా ఏర్పాటైన ‘రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్' ప్రారంభోత్సవానికి హాజరైన మహేష్... తమ పిల్లలకు సంబంధించి ట్రీట్ మెంట్ విషయంలో 'రెయిన్ బో' ఆసుపత్రి వాళ్లు బాగా కేర్ తీసుకున్నారని అన్నారు. తన కొడుకు గౌతమ్, కూతురు సితార విషయంలో డాక్టర్లు చాలా శ్రద్ద చూపించారని అన్నారు. అంతటితో ఊరుకోకుండా తనకు మరో పాప కావాలని ఉందని మహేశ్ అన్నారు. పక్కనే ఉన్న నమ్రత అంతే సరదగా…"నో మోర్ ప్లీజ్, ఐ కాంట్” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఈ ఐడియల్ కపుల్ ను చూసి అంతా మురిసిపోయారు. 

నటి కవిత కూతురి ప్రేమ వివాహం

  పాతతరం కథానాయిక, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత కూతురు మాధురి దళిత నేతల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకుంది. కవిత కూతురు మాధురి, సికింద్రాబాద్ లో ప్రైవేటు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న అల్కపల్లి రాజ్ కుమార్ గత రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయినా మాధురి రాజ్ కుమార్ ను వివాహం చేసుకుంది. మాధురి బంధువులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ పై కేసు ఫైలు చేసి, పెద్దపల్లికి వెళ్ళి రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరు పై డైరెక్టర్ దాసరి సెటైర్లు

    తెలుగు సీరియల్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో దాసరి నారాయణరావు కేంద్రమంత్రి చిరంజీవిపై పరోక్షంగా సెటైర్లు వదిలారు. మా టీవిలో డబ్బింగ్ సీరియల్స్ కాకుండా తెలుగు సీరియల్స్ మాత్రమే ప్రసారమయ్యేలా చిరంజీవి చొరవ తీసుకోవాలని సూచించారు. తెలుగు మహాసభల్లో చిరంజీవి తెలుగువాడినని నిరూపించుకున్నారు. తెలుగు బాషను మరచిపోతున్నామని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి.       కేంద్రమంత్రి చిరంజీవి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన్ను కలిసే అవకాశం తెలుగు టీవీ కళాకారులకు దొరకడం లేదు. తెలుగు టీవీ కళాకారుల ఆందోళన విషయం ఆయనకు ఇంకా తెలియలేదనుకుంటా.. తెలిస్తే తన మా టీవిలో డబ్బింగ్ సీరియళ్లు రాకుండా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని దాసరి అన్నారు.     

బాలీవుడ్ లో టాలివుడ్ హవా

  దక్షినాది సినీ రంగం నుండి బాలివుడ్ వెళ్ళిన ఆసిన్, త్రిష, ఇలియాన, కాజల్ అగర్వాల్ వంటి అందాల భామలు అక్కడ తమ ప్రతిభను నిరూపించుకొన్న సంగతి అందరికే తెలిసిందే. త్వరలో మరో అందాల భామ సమంత కూడా బాలివుడ్ బాట పట్టనుంది. ఆమెకు ఇటీవలే బాలివుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన హిందీ సినిమా ‘సింగం’కు సీక్వెల్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత అజయ్ దేవగన్ తో జత కట్టబోతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలయ్యే అవకాశం ఉంది.   ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బాలివుడ్ వెళ్ళిన రామ్ చరణ్ తేజ్ ‘జంజీర్’ అనే సినిమాలో అపూర్వ లఖియా దర్శకత్వంలో నటిస్తున్నారు. దీనిని తెలుగులో ‘రుస్తుం’ అనే టైటిల్ తో విడుదల చేస్తారని సమాచారం.   తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న నటుడు నానీ కూడా త్వరలో యష్రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించే ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడు.   ఇక ప్రభుదేవా, రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా బాలివుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తరువాత బాలివుడ్ లో అడుగుపెట్టిన పూరీ జగన్నాథ్ కూడా అమితాబ్ బచ్చన్ తో తీసిన తన మొట్ట మొదటి సినిమా ‘బుడా’తో తన ప్రతిభ నిరూపించుకొన్నారు. అయితే, ఆ తరువాత ఆయన మళ్ళీ బాలివుడ్ వైపు తిరిగి చూడలేదు. కానీ, అయన ప్రతిభను మాత్రం బాలివుడ్ సరిగ్గానే గుర్తించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న, పూరీ జగన్నాథ్ ఆ సినిమా పూర్తయిన తరువాత, ఒక హిందీ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అంగీకరించినట్లు బాలీవుడ్ నిర్మాత ఒకరు ఇటీవల మీడియాకు వెల్లడించారు. ప్రముఖ బాలివుడ్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు. ఈ సినిమా తరువాత మరో సినిమా కూడా తన బ్యానర్ లోనే నిర్మించాలను కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా పూర్తీ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ కు బెల్లంకొండ సింగల్ పేమెంట్..!

      టాలీవుడ్ లో సంచలనాలకు మారుపేరైన ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన సినిమా ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ సురేష్ యంగ్ టైగర్ కి ఒకేసారి పారితోషికాన్ని మొత్తాన్ని ఇచ్చేసి ప్రొడ్యూసర్లని షాక్ కి గురి చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడ ఒకరు. మాములుగా అయితే సినీ పరిశ్రమలో హీరోలకు విడతల వారీగా మూడు, నాలుగు వాయిదాలలో పారితోషికం అందిస్తారు. అలాంటిది ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించాడన్న వార్త చర్చకు తెరలేపింది. అయితే గత కొంత కాలంగా బెల్లంకొండ సురేష్ చేస్తున్న పనులకు మిగతా ప్రొడ్యూసర్స్ కి నిద్ర పట్టడం లేదు.  

పార్వతీ పై పోలీస్ కేసు

        కొన్నిరోజుల క్రితం అసభ్యంగా నటిస్తున్నారంటూ అనుష్క, ప్రియమణి పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ చేరిపోయింది. మహేష్ బాబు దూకుడు సినిమాలో ఐటెంసాంగ్ సాంగ్ తో బాగా ఫేమాస్ అయింది పార్వతీ మెల్టన్. తాజాగా ఈ బక్కపలచటి ముద్దుగుమ్మ పై ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.   పార్వతీ మెల్టన్ నటించిన యమహో..యమ సినిమాలో బాగానే అందాలను ఆరబోసిందని టాక్ ఉంది. ఈ సినిమా పోస్టర్లను చూసిన కొంతమంది పార్వతి చాలా అసభ్యంగా నటించిందని ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. పార్వతీ మెల్టన్ సినిమాల్లో అనుష్క రేంజికి రాకపోయిన పోలీస్ కేసులను ఎదుర్కోవడంలో మాత్రం ఆమె రేంజికి వచ్చింది!