వైసీపీ విజయంపై బెట్టింగ్..5 కోట్లు పోగొట్టుకున్న ప్రొడ్యూసర్

ఆటల్లో ఎవరు గెలుస్తారు అనే కాకుండా.. ఎన్నికల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై బెట్టింగ్ వేయడం ఈమధ్య బాగా ట్రెండ్ అయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వారి స్థోమతకు తగ్గట్టుగా కొండొకచో స్థోమతకు మించి కూడా ఫలానా పార్టీ గెలుస్తుంది అంటూ బెట్టింగ్ లు వేస్తున్నారు. అలా బెట్టింగ్ వేసే.. టాలీవుడ్ కి చెందిన ఓ బడా నిర్మాత ఏకంగా రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడట. తాజాగా వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 సీట్లు గెలవగా.. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయింది. వైసీపీ ఘోర పరాజయం చెందడం పట్ల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలీదు కానీ.. ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ మాత్రం తెగ ఫీలై పోతున్నాడట. ఏపీ ప్రజలు జగన్ రెండో ఛాన్స్ ఇస్తారని, వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని బలంగా నమ్మిన ఆ నిర్మాత.. ఏకంగా ఐదు కోట్లు బెట్టింగ్ వేశాడట. వైసీపీ దారుణ ఓటమితో   ఆ నిర్మాత ఐదు కోట్ల రూపాయలకు మునిగిపోయాడట.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆ నిర్మాత "అనవసరంగా బెట్టింగ్ వేశాను.. ఆ డబ్బులతో ఒక చిన్న సినిమా తీసినా బాగుండేది." అని తెగ బాధపడుతున్నాడట. అందుకే పెద్దలు అంటారు.. "క్షవరం అయితే గాని వివరం రాదు" అని.

మోడీ మళ్ళీ వస్తారంటారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ ఎనిమిదో తేదీన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటి వరకు అయితే మళ్ళీ మోడీ అనే అంటున్నారు. అయితే, ఈలోపు ఏమైనా జరగొచ్చు.  2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మోడీ వేవ్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో మోడీ మ్యాజిక్ అన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా మోడీ వేవ్ గానీ, మోడీ మ్యాజిక్ గానీ కనిపించలేదు. గత రెండు ఎన్నికలలో మిత్రపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం సొంతగానే వచ్చింది. ఈ ఎన్నికలలో ఎన్డీయేకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి మిత్రపక్షాల సహకారంతోనే వచ్చింది.  మూడోసారి కూడా మోడీనే ప్రధానమంత్రి అవుతారని  ప్రస్తుతానికి అయితే ప్రచారం జరుగుతోంది. బయట ఎవరికీ ఎలాంటి సందేహమూ  లేదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. మోడీ ప్రమాణ స్వీకారానికి ఇంకా మూడు రోజుల టైమ్ వుంది. ఈ మూడు రోజుల్లో ఏమైనా జరగొచ్చు. బీజేపీలోనే ఒక వర్గం బయల్దేరి మోడీ ప్రభ తగ్గిపోయింది కాబట్టి, ప్రధాన పదవిని వదులుకోవడం బెస్ట్ అని వాదన లేవదీయొచ్చు.. గడ్కరి లాంటి టక్కరిని ముందు నిలిపి ఇంటర్నల్ రాజకీయం నడపొచ్చు.  ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో టక్కుటమారాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ మరో్సారి రంగంలో దిగవచ్చు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలంటే తప్పనిసరిగా మద్దతు ఇచ్చి తీరాల్సిన చంద్రబాబు, నితీష్ కుమార్‌లకు ఏదైనా ‘ప్రధాన’ ఆఫర్ ఇచ్చి, తన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ప్రోత్సహించవచ్చు... ఎన్డీయే మిత్రపక్షాలను కూడా ఇండియా కూటమి వైపు లాక్కోవచ్చు. అప్పుడు రాజకీయ పరిస్థితే మారిపోవచ్చు.. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు.. ఏం జరిగినా గమనించడమే మన పని!

జనసేనకు గాజుగ్లాస్ గుర్తు ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అద్భుత విజయంతో జనసేనకు  గాజుగ్లాసు గుర్తు పర్మనెంటుగా దక్కింది. ఏదైనా ఒక పార్టీకి ఒక గుర్తును శాశ్వతంగా కేటాయించాలంటే ఈసీ నిబంధనల మేరకు ఆ పార్టీకి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో కనీసం 6శాతం ఓట్లు రావాలి. అలాగే కనీసం రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానంలో విజయం సాధించాలి. తాజాగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ ఆ అర్హత సాధించింది. ఈ ఎన్నికలలో జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలలో విజయం లభించింది. అలాగే 6శాతం ఓట్ల బెంచ్ మార్క్ కూడా దాటేసింది. దీంతో ఇక కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్ గా జనసేనకు కేటాయించనుంది.  

సజ్జల డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ : డొక్కా

ఫోన్ ట్యాపింగ్ కారణంగానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సున్నాకు పడిపోయింది. బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం చేసిన ఫోన్ ట్యాపింగ్ ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. కెసీఆర్ అంటకాగిన జగన్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలు లేటెస్ట్ గా వినిపిస్తున్నాయి.  ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉమ్మడి ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవులు నిర్వభించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్‌ నేత డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీ నేత స‌జ్జ‌ల ఆధ్వ‌ర్యంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందన్నారు. "స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ నేత‌ల ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది. ప్ర‌జాప్ర‌తినిధుల ఫోన్లు, వారి వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌లు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే వైసీపీ స‌ర్కార్ బెదిరింపుల‌కు పాల్ప‌డింది. దీనిపై వెంట‌నే విచార‌ణ జ‌రపాలి" అని డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో డొక్కా మాణిక్య వరప్రసాద్ మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం అనంతరం కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసన మండలికి ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. నిజానికి- డొక్కా సొంత నియోజకవర్గం తాడికొండ.  

జనం ఛీ కొట్టినా మారవా జగన్!

పాలన అంటే బటన్ నొక్కి సంక్షేమం పంచడమే.. అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి కల్పన ఏవీ అక్కర్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన జరిగింది. విధ్వంసంతో ఆరంభమై విధ్వంసంతోనే ఐదేళ్లు కొనసాగిన జగన్ పాలనపై జనంలో పెల్లుబికిన ఆగ్రహ ప్రతిఫలమే ఈ ఫలితం అనడంలో సందేహం లేదు. అయితే తప్పులను ఒప్పుకోవడం, వాటిని సరిదిద్దుకుందామన్న జ్ణానం కానీ వైసీపీ నేతలలో, స్వయంగా జగన్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు.   జగన్ పాలన అంతా వ్యతిరేకించిన వారిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవడం, ప్రజలకు సంక్షేమం పేరిట కేవలం సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కడమే అన్నట్లుగా కొనసాగింది.   ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ప్రజలను పట్టించుకోవడం మానేసి.. ఐదేళ్ల తరువాత జరిగే  ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వ సొమ్మును సంక్షేమం పేరిట పంచేస్తే చాలన్నట్లుగా వ్యవహరించారు. ఆ క్రమంలో జనానికి మోహం చాటేశారు. డబ్బులు సంగతి తరువాత ముందు  అభివృద్ధి సంగతేంటో చెప్పు అని జనం నిలదీస్తారన్న భయం. అందుకే బటన్ నొక్కడానికి మాత్రమే బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పరదాలు కట్టుకున్నారు.    సరే  ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత కూడా ఆయన తన విధానాలను జనం తిరస్కరించారని చెప్పడం లేదు. అమ్మ ఒడి  , చేయూత, ఆసరా , జగనన్న విద్యా దీవెన, రైతు బంధు ఇలా పలు పథకాల పేర లక్షల రూపాయలు పంచాను, ఆ సొమ్ము తీసుకున్న వారు తనకు ఎందుకు ఓటు వేయలేదని ఆగ్రహిస్తున్నారు.   ఆయన ఆగ్రహం సంగతి పక్కన పెడితే.. జగన్ తమకు సొమ్ములు పందేరం చేసి కట్టుబానిసలుగా బతకాలని ఆశిస్తున్నారని జనం గ్రహించారు. జగన్ తమకు సంక్షేమం పేర పందేరం చేస్తున్న సొమ్ములు ఆయన జేబులోంచి ఇస్తున్నవి కావనీ జనానికి స్పష్టంగా తెలుసు. అసలు సంక్షేమం అంటే ఎవరికైనా తొలుత గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి సొంత బుర్రలోంచి పుట్టిన పథకాలుగా జగన్ ప్రచారం చేసుకున్నారు.  గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నడూ సంక్షేమం అందిస్తున్నాం కదా? ఇక జనాన్ని పట్టించుకోనవసరం లేదని భావించలేదు. అభివృద్ధి ద్వారా  సంపద సృష్టి చేసి, ఆ సంపదను పేదలకు పంచాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగింది. అయితే జగన్ మాత్రం సంపద సృష్టి, అభివృద్థి మాటలు మరిచిపోయి ఓట్ల కోసం మీకు సొమ్ములు పందేరం చేస్తున్నాం అన్న తీరులో జగన్ సర్కార్ వ్యవహరించింది. అందుకే వైసీపీ సంక్షేమ డప్పుపై జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది.   ఆ సంగతి గడపగడపకూ, మంత్రుల సామాజిక బస్సుయాత్ర సందర్భంలోనే ప్రస్ఫుటమైంది. అయితే జగన్ ప్రజాగ్రహాన్ని ఖాతరు చేయలేదు. పథకాలు అందవు అంటూ బెదరించి, అధికారులను ప్రయోగించి ఏపీకి జగనే కావాలని చెప్పించారు. వారికి తోడు... జగన్ కోసం జగన్ చేత జగనే నియమించుకున్న వాలంటీర్లతో పథకాల భయం పెట్టి జనాన్ని నోరు ఎత్తకుండా చేసి ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. ఇంత చేసుకున్న జగన్ ఓటమి తరువాత నాడు జగన్ కు జై అన్న జనం అంతా ఏమయ్యారు? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి పరిపూర్ణమైన తరువాత మీడియా సమావేశంలో నేను ఇచ్చిన సంక్షేమ సొమ్ము తీసుకున్న వారి ఓట్లన్నీ ఏమయ్యాయో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. సంక్షేమం పేరిట పంచిన సొమ్ము నీ జేబులోది కాదనీ, అయినా సంక్షేమం సమృద్ధిగా అందించావు, రాష్ట్రం పురోగమిస్తోంది. అందుకే నువ్వే కావాలి జగన్ అని జనం అనాలి కానీ, నీకు నువ్వనేసుకుంటే ఎలా మాజీ సీఎం అంటూ నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.   నిజమే ప్రజలు జగన్ కావాలనుకుంటే అది వాళ్ళే చెప్పాలి. వాళ్లు చెప్పేశారు. జగన్ నువ్వు మాకు వద్దు అని. అంత స్పష్టంగా ప్రజా తీర్పు వెలువడిన తరువాత కూడా నా సంక్షేమ లబ్ధిదారుల ఓట్లు మాకు దక్కకపోవడం వెనుక ఆధారాలు లేని కుట్ర ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని ఎత్తి చూపుతున్నాయి.  తన వైఫల్యాలు, తప్పిదాలు, ఓటమి.. ఇలా ప్రతి అంశం వెనుకా ఎవరిదో కుట్ర ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. 

రేపు ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్?

పవన్ కళ్యాణ్ గెలుపుతో ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడి హోదా కోల్పోయి, తన పేరును ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ గెజిట్‌లో తన పేరు మార్చుకోవడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. వాటిని పూర్తి చేసి, పేరు మార్పు కోసం దరఖాస్తు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు అంటే గురువారం నాడు ముద్రగడ పద్మనాభం ఇంటికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.  కొన్నికొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, ముద్రగడ కాపు నాయకుడిగా ఎప్పటినుంచో పోరాటం చేస్తూ వున్నారు. వైసీపీ ప్రభావంలో పడిన ఆయన ఆవేశంగా చేసిన పేరు మార్పు ప్రతిజ్ఞను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాపు నాయకుడిగా ముద్రగడని తాను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్‌ని ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ముడ్రగడ కుమార్తె క్రాంతి భారతి మాత్రం తండ్రి వ్యవహార శైలిని వ్యతిరేకించి, పవన్ కళ్యాణ్‌కి మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కుటుంబాలను విడగొట్టడం తనకు ఇష్టం వుండదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ఈసారి ఎన్నికలలో క్రాంతి భారతిని జనసేన నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పేరు మార్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ వుండటం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వయసులో ఆ పెద్ద మనిషి ప్రయత్నాలను విరమింపజేసి, ఆయన్నిశాంతపరచాలంటే తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ముద్రగడ కుమార్తె క్రాంతి భారతికి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 

అమరావతిలో దీక్షా శిబిరాల ముగింపు... కూటమి ఘన విజయంతో రైతుల కళ్లల్లో ఆనందబాష్పాలు

పదేళ్ల క్రితం  ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత వరకు పర్మినెంట్ రాజధాని నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. అమరావతి రాజధాని కల సాకారం కానుంది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఊపిరి పీల్చుకునే రోజులు వచ్చాయి. ఐదేళ్లుగా రాజధాని నినాదాలతో హోరెత్తిన అమరావతి ప్రాంతమంతా చల్లబడనుంది..అక్కడి దీక్షా శిబిరాలను ఎత్తివేస్తున్నట్లు  దీక్షా శిబిరాల నిర్వాహకులు తెలిపారు 2019 డిసెంబర్ 17న జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడంతో అమరావతి  రైతులు పెద్ద ఎత్తున  ఉద్యమం చేపట్టారుఎన్నో రకాలుగా ఆందోళనలు చేసినా,కోర్టుకెళ్లినా వైసిపి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. 2024 సార్వత్రిక  ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. కూటమికి నాయకత్వం వహించిన తెలుగు దేశం పార్టీకి జనసేన నేత పవన్ కళ్యాణ్ పూర్తి సంఘీ భావం ప్రకటించారు. కౌంటింగ్ ఫలితాల్లో కూటమి భారీ మెజారిటీ సాధించడం వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో  అమరావతి రైతులంతా సంబరాలు చేసుకుని ఉద్యమాన్ని విరమించారు..

బాబోయ్ ముద్రగడ.. భయపడిపోతున్న రెడ్లు!

పవన్ కళ్యాణ్‌ని ఓడగొడతామని, పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను తన పేరు చివర్లో ‘రెడ్డి’ అని చేర్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తాను తన ఓటమిని అంగీకరిస్తున్నానని, తన పేరు చివర్లో ‘రెడ్డి’ అని చేర్చుకుని పేరు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాపులు హమ్మయ్య మా కాపు కులానికి ఒక పెద్ద సమస్య వదిలిపోతోంది అని సంతోషిస్తుంటే, రెడ్డి కులస్తులు మాత్రం ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’ తమ రెడ్డికులాన్ని ఏం చేస్తారో అని భయపడిపోతున్నారు. కాపుల నాయకుడిని అని చెప్పుకుంటూ ముద్రగడ కాపులను ఎంత ఇబ్బంది పెట్టారో చరిత్రను పరిశీలించిన వారికి తెలుస్తుంది. ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు కాపులు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు చంద్రముఖిగా మారిన గంగ తరహాలో ‘రెడ్డి’గా మారిన ముద్రగడ తమ రెడ్డి కులాన్ని ఏం చేస్తారో అని రెడ్లు భయపడిపోతున్నారు. 

పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి...ప్రజాగ్రహమే కారణం

కర్మ సిద్ధాంతము అనేది  ఇపుడు ఎపిలో అమలవుతోంది. హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం,, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. వైఎస్ జగన్  ఐదేళ్ల రాక్షసపాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారు. ఎపిలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి నేతలు, కార్యకర్తల మీద దాడులు చేసిన వైసీపీ గూండాలు బరితెగించే పనులే  చేశారు . మచిలీ పట్నం జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును అర్ధ రాత్రి దాటిన తర్వాత పెట్రోల్ పోసి తగల బెట్టారు. వైసీపీ గూండాలు చేసిన భౌతికదాడులు, హింసాత్మక సంఘటనలను జగన్ ప్రభుత్వం నిలువరించలేకపోయింది. పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఎఫ్ ఐ ఆర్ కట్టే పోలీసు అధికారులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ఈ అరాచకమే ప్రజల్లో జగన్ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైంది. కౌంటింగ్ ఫలితాలు డిక్లేర్ కాకమునుపే  వైఎస్ ఆర్  యూనివర్శిటీ బోర్డును తీసేసి ఎన్ టిఆర్ యూనివర్శిటీ పేరు రాసుకున్నారు.  జగన్ ప్రభుత్వ హాయంలో పెట్రేగిపోయిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కుర్చీలు విసురుతూ బీభత్సం సృష్టించారు. అక్కడే పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం చూపారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని నిలువరించలేకపోయారు. దాడి భయంతో ఓ పోలీసు పారిపోవడం కనిపించింది. ఇది టీడీపీ, జనసేన కార్యకర్తల పనేనని కొందరు ఆరోపించడాన్ని మచిలీపట్నం జనసేన నేత వాడ వీర ప్రతాప్ ఖండించారు. మచిలీపట్నంలో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణ మూర్తి చేసిన అకృత్యాలకు ప్రజల నుంచి ఒక రెవల్యూషన్ ప్రారంభమైంది ఇందులో  భాగంగానే ఈ దాడి జరిగింది      

ఎన్డీయే కన్వీనర్ చంద్రబాబు?.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం!

టిడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు బయలు దేరారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పనిలో పనిగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 9న జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి మోడీ, షా తదితర పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉంది. ఫలితాల సరళి తెలిసిన క్షణ నుంచీ ఆయన పాలనపై దృష్టి సారించారు. ఫలితాల వెల్లడి ఒక వైపు సాగుతుండగానే ఆయన మంగళవారం (జూన్ 4) సాయంత్రం చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా  ఇరువురి మధ్యా దాదాపు రెండు గంటలకు పైగా చర్చ జరిగింది.   చంద్రబాబు ఎన్డీయే సమావేశానికి వెళ్లడం కూటమి భాగస్వామ్య పార్టీ అధినేతగా సహజమే అయినా,  కేంద్రంలో బీజేపీ సొంతంగా పార్టీ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా మిగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలంటూ చంద్రబాబును కోరింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎనలేని ప్రాధా న్యత సంతరించుకుంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు అనివార్యంగా ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. జాతీయ రాజకీయాలలో ఇప్పుడు చంద్రబాబు మాట తిరుగులేని విధంగా చెల్లుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అందరూ మోడీ మూడో సారి ఏర్పటు చేస్తున్న ప్రభుత్వం వాజ్ పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వంలా చంద్రబాబు సెంట్రిక్ గా నడుస్తుందని అంటున్నారు. బీజేపీ అజెండా కాదు, సెక్యులర్ అజెండాయే మోడీ అనుసరించకతప్పని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అదే విధంగా ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహాయసహకారాలు అందుతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు

ఈ ఎన్నికలలో తెలుగుదేశం కూటమికి అఖండ విజయం అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్పూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియాకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ళ జగన్ తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. ‘‘జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బందిపడ్డాయో చూశాం. ఎక్కడైనా గెలవాల్సింది రాజకీయ నాయకులు కాదు.. ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యున్నతంగా నిలబడలన్నదే నా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు.. దేశం, ప్రజాస్వామ్య పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో వుండే వ్యక్తుల కూడా వచ్చి ఎన్నికల కోసం పనిచేశారు. పక్క రాష్ట్రాలకు కూలీ పనులకు వెళ్ళిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం ఓట్లు టీడీపికి, 39.37 శాతం వైసీపికి వచ్చాయి’’ అని చంద్రబాబు అన్నారు.

ముద్రగడ ఇక కాపు కాదు.. రెడ్డి!

ముద్రగడ పద్మనాభం ఇకపై కాపు కాదు... రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే తాను తన పేరును రెడ్డి అని మార్చుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తోపాటు జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటిస్తూ, ‘‘గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాల్ విసిరానండి.. పిఠాపురంలో ఓడించి పంపకపోతే, నా పేరును ‘పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పాను. నా మాటకు నేను కట్టుబడి వున్నాను. నేను ఓటమి చెందానండి.. అన్నమాట ప్రకారం నా పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చమని కోరడం కోసం గెజిట్ పబ్లికేషన్‌కి సంబంధించిన దరఖాస్తులు తెప్పించాను. వీటిని పూర్తిగా నింపి, పేరు మార్పు కో్సం నేను దరఖాస్తు చేస్తానండి’’ అన్నారు.  ముద్రగడ పద్మనాభం తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటున్న నేపథ్యంలో, ఆయనను ఇక ‘కాపు’గా భావించాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఎంతమాత్రం కాపు నాయకుడు కాదు కాబట్టి.. ఇకపై కాపులు ఆయనని కాపు నాయకుడిగా గౌరవించడం మానేయాలి అని కాపులు భావిస్తున్నట్టు సమాచారం.

వైఛీపీ.. జనం తీర్పు ఆదే!

ఏపీ లో కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ కు వరుసగా మూడోసారీ నిరాశే మిగిలింది.  షర్మిల ట్రంప్ కార్డ్ పనిచేయలేదు. ఆమె స్వయంగా పోటీ చేసిన కడప లోక్ సభ స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయారు.  2021లో చంద్రబాబుకు అసెంబ్లీ జరిగిన అవమానం తో ఆయన సభకు మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు.   ఈ ఎన్నికలలో 144 సీట్లతో పోటీచేసి 135 స్థానాలు గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.  జగన్ అరాచకపాలన అంతం చేయడమే లక్ష్యం. ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తాను అని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబును స్కిల్ కేసులో జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయనతో జైలులో ములాఖత్ అయిన పవన్ కల్యాణ్.. అక్కడే తెలుగుదేశంతో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత బీజేపీనీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసేలా ఒప్పించారు.   ప్రభుత్వ ఓటు చీలకండా చివరివరకూ కాపాడాలని జన సేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకుని పోరాడారు. ఆయన కృషి ఫలించినది. మూడు పార్టీల మధ్యా ఓట్ల బదలీ నిరాటంకంగా జరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలలోనూ విజయం సాధించింది. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలలో ఎనిమిది చోట్ల విజయం సాధించింది.  కూటమి ఐక్యత వైసీపీని   11 స్థానాలకు పరిమితం చేసింది.   అమరావతిలో రైతులు,మహిళలపై దమనకాండ,నిరుద్యోగం,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చంద్రబాబుతో సహా టీడీపీ నేతల అరెస్టులు, మద్యనిషేధమని  నకిలీ బ్రాండ్స్ తో ప్రజారోగ్యం హరించడం,  పరిశ్రమలు రాకపోవడం ,కరెంట్ చార్జీలు పలుసార్లు పెంచడం, రైతులకు సాగునీరు సరైనసమయంలో అందించకపోవడం, మితిమీరిన అహంకారంతో వైసీపీ అంటే జనం ఛీకొట్టే స్థితికి వచ్చారు.   

ప్రతి అడ్డమైన వాడికీ అమెరికా ఒకటి దొరికింది!

ఇండియాలో అడ్డమైన పాపాలు చేయడం.. ఆ పాపాలకు పరిహారం అనుభవించే సమయానికి ఏదో ఒక సాకు చెప్పి అమెరికాకి పారిపోవడం... ఈ మధ్యకాలంలో ప్రతి అడ్డమైన వాడికీ అమెరికా ఒకటి దొరికింది! తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వున్నంతకాలం ఎంచక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిన మాజీ పోలీస్ అధికారి, ఎస్.ఐ.బి. మాజీ చీఫ్ ప్రభాకరరావు, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హాయిగా అమెరికా పారిపోయాడు. క్యాన్సర్ వచ్చింది, మోకాల్లో బ్రెయన్ వాచింది.. అంటూ కారణాలు చెబుతూ అక్కడే సెటిలై, ఇక్కడి అధికారులతో వాట్సప్‌లో టచ్‌లో వుంటున్నాడు. అలాగే ఏపీలో జగన్ బూట్లు నాలుక అరిగిపోయేలా నాకిన ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు మీద అక్రమ కేసులు పెట్టి వేధించి, ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి అమెరికాలో సెటిలైపోయి, రోజూ పీకల్దాకా మందు కొడుతూ, నోటికొచ్చినట్టు వాగుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు. అలాగే పంచ్ ప్రభాకర్ లాంటి పిచ్చికుక్క అమెరికాలో సెటిలైపోయి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడి మీద అరుస్తూ బతికేస్తోంది. పంచ్ ప్రభాకర్ లాంటి పిచ్చికుక్కలు చాలానే అమెరికాలో సెటిలై వున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వేస్టుఫెలో అమెరికా పారిపోయే ప్రయత్నాల్లో వున్నాడు. అతగాడే సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్! జగన్ రాక్షస ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి మీద, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల మీద తప్పుడు కేసుల నమోదులో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి సంజయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో సంజయ్ కూడా అమెరికా పారిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. తన వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్తానంటూ ఈయనగారు దరఖాస్తు చేసుకోగానే, జగన్ బూట్లు నాకిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెంటనే అనుమతి ఇచ్చేశారు. మరి ఈయన తిరిగి వస్తాడో, సంపాదించిన కోట్ల డబ్బుతో అమెరికాలోనే ఎంజాయ్ చేస్తూ బతికేస్తాడో! 

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ షురూ...తీన్మార్ మల్లన్న గెలిచేనా ?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి  గెలిచి ఖాతా తెరిచారు. ఒక రోజు తర్వాత  సార్వత్రిక ఎన్నికల  ఫలితాల కౌంటింగ్ లో ఒక్క లోకసభ నియోజకవర్గంలో కూడా ఖాతా తెరవ లేదు. కంటోన్మెంట్  సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఘోర పరాజయాన్ని చవి చూశారు.    తెలంగాణ 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జీరో ఫలితాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ నేటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ఇటీవల జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.  లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరైంది.

గెలిచీ ఓడిన బీజేపీ!

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు గెలవాలి.కాని  బీజేపీ సొంతంగా 250 స్థానాలు మాత్రమే వచ్చాయి.మ్యాజిక్ ఫిగర్ కు 22 స్థానాలు తగ్గాయి. కాని ఎన్డీఏ మిత్రపక్షాలకు 41 స్థానాలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకాలేదు. వాజపేయి ప్రభుత్వ అనంతరం 20 ఏళ్లతర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం.. (అంటే పూర్తిగా మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడే కేంద్రంలో  ప్రభుత్వ మనుగడ.) ఏర్పడనుంది. ఇది ఏ రకంగా చూసినా మంచి పరిణామమే.  బీజేపీ నిరంకుశ విధానాలకు నిస్సందేహంగా కళ్లెం పడినట్లే.  ఏ ప్రధాన నిర్ణయం తీసుకోవాలన్నా మిత్రపక్షాల అంగీకారం అనివార్యం. 400మార్కు దాటితే మా ఎజెండా అమలు చేస్తామన్న మోదీ   ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఆచితూచి అడుగులు వేయాలి. అటు కాంగ్రెస్ కూడా పుంజుకుంది. సొంతంగా 99 స్థానాలు సాధించడమే కాకుండా, తన నేతృత్వంలోని ఇండియా కూటమి మొత్తంగా  234 స్థానాలలో విజయం సాధించింది.   అధికారం రాకపోయినా దగ్గర వరకూ రావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్  నేతలు రాహుల్,ఖర్గే వ్యాఖ్యానించారు.అధికారం రాకపోయినా రాజ్యాంగాన్ని రక్షించామని రాహుల్ చెప్పడం విశేషం. ముఖ్యంగా ఉత్తరాదిలో తగ్గిన స్థానాలకు దక్షిణాది, ఒడిసా ల్లో బీజేపీ భర్తీ చేసుకుంది. ముందుచూపుతోనే మోదీ దక్షిణాదిపై దృష్టి పెట్టడంతో కొంత వరకూ గట్టెక్కారు. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో గెలవడంతో చావుతప్పి కన్నులోట్టపోయినట్లయింది. కేరళలో బీజేపీ ఖాతా తెరవడం విశేషం.అలాగే  ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడులో  బీజేపీకి దక్కింది శూన్యమే. అయోధ్య  పరిధిలోని ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం బీజేపీ పరాజయం పాలు కావడం.. రామభక్తి రామభక్తే, రాజకీయం రాజకీయమే అని జనం కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లైంది.  అలాగే ఒడిశాలో పట్నాయక్ పార్టీ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచినది. అసెంబ్లీలో కూడా గెలిచి తొలిసారిగా  ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. తెలంగాణలో ఎనిమిది స్థానాలు సాధించింది. ఏపీలో మూడు స్థానాలు గెలిచింది.రాహుల్ గాంధీ రెండుచోట్లా గెలిచారు. అమేథిలో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తంగా బీజేపీకి ఈ ఫలితాలు ఒక స్పష్టమైన హెచ్చరికగా మిగులుతాయి.  ఒళ్లుదగ్గర పెట్టుకుని పని చేయమని జనం స్పష్టమైన సూచన చేశారనే భావించాల్సి ఉంటుంది.   

కేసీఆర్ అభినందనలు అక్కర్లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో కేసీఆర్ అర్జెంటుగా చంద్రబాబుకు, పవన్‌కి అభినందనలు తెలియజేశాడు. బీజేపీకి మాత్రం అభినందనలు తెలపలేదు. అసలు ఈయన పనికిరాని అభినందనలు ఎవరిక్కావాలంట? కేసీఆర్ అభినందనలు రిజెక్టెడ్! కడుపులో కత్తులు, పైకి కౌగిలింతలు అంటారు చూశారా.. కేసీఆర్ అభినందనలు కూడా అలాంటివే. కేసీఆర్‌కి ఆంధ్రులంటే మంట.. ఆంధ్రులను తిట్టనిదే ఈ కేసీఆర్‌కి పెగ్గు దిగదు. ఆయన ఫ్యామిలీకి ముద్ద దిగదు. ముఖ్యంగా చంద్రబాబును తిట్టనిదే పూట గడవదు. నిన్నగాక మొన్న రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో సున్నా స్థానాలు పొందిన కేసీఆర్ కడుపు చంద్రబాబు విజయాన్ని చూసి యాసిడ్ పోసినట్టు మండిపో్తూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ని ఎలా నాశనం చేయాలా? చంద్రబాబును ఎలా నాశనం చేయాలా అని నిరంతరం ఆలోచించే కేసీఆర్ ఇప్పుడు సుద్దపూసకి అమ్మ మొగుడిలాగా అభినందనలు చెబితే, మురిసిపోయి థాంక్స్ చెప్పేవారు ఎవరూ లేరిక్కడ.  జగన్ అధికారంలో వున్నంతకాలం వీళ్లిద్దరి మధ్య దోస్తీ బాగా నడిచింది. ఆ జగన్ దరిద్రుడు అమరావతిని సర్వనాశనం చేస్తే, ఈ దరిద్రుడు కేసీఆర్ హైదరాబాద్‌లో కూర్చుని ఎంటర్‌టైన్‌మెంట్ చూశాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఈ పోటుగాడు చేసే దిక్కుమాలిన పాలనను అందరూ ఎత్తిచూపుతారని, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూపుతారని ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలని నిరంతరం కోరుకున్నాడు. కేసీఆర్ దిష్టికళ్ళకు తోడుగా మన అష్ట దరిద్రుడు కూడా కలసి రావడంతో మొత్తం సర్వనాశనమైపోయింది. నాశనమైపోయిన ఆంధ్రప్రదేశ్‌ ఈ దిక్కుమాలిన కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వస్తువు అయిపోయింది. పక్క రాష్ఠ్రం చూడండి ఎంత దరిద్రంగా తయారైందో.. మన రాష్ట్రం చూడండి ఎంత అద్భుతంగా వుందో అని ఈ కేసీఆర్ కుటుంబం సభ్యులు చేసిన వెటకారాలు మర్చిపోవడానికి ఆంధ్రులు పౌరుషం లేని వాళ్ళు కాదు.. పురాణ కాల నుంచి ఈ భూమ్మీద వున్న జాతి ఆంధ్ర జాతి. అదను చూసి వాత పెట్టడంలో సిద్ధహస్తులు. చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించి, జలగ జగన్‌తో చేతులు కలిపి కోట్లకు కోట్లు సప్లయ్ చేసి చంద్రబాబు ఓడిపోవడానికి నీవంతు సహకారం అందించి, చంద్రబాబు ఓడిపోయినప్పుడు కేసీఆర్ మాట్లడిన వెటకారం మాటలను ఎవరు మరచిపోగలరు? చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఈయనగారి పుత్రరత్నం చేసిన కామెంట్లను మరచిపోవడం సాధ్యమా?  నిన్నగాక మొన్న ఈయన దారుణంగా ఓడిపోయినప్పుడు తన ఓటమి గురించి ముందు తెలియదు.. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆయన పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో కూడా ఆయనకు తెలియదు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ మళ్ళీ వస్తాడని ఈయనకి తెలుసంట. ఈ మేరకు ఈయనకి ఎవరో సమాచారం ఇచ్చారంట.. సమాచారం ఇచ్చినవాడెవడు? విన్న ఈయన ఎవరు? మీ ఓటమి తప్పించుకోవడం మీవల్ల కాదుగానీ, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో చెప్పే శక్తి మీకుందా? మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చాయి. ఈ ఘోర పరాజయాన్ని కేసీఆర్ ముందే ఊహించాడా? ఇది ఊహించలేని పెద్దమనిషికి ఆంధ్రప్రదేశ్‌లో జయాపజయాల సంగతి ఎందుకంట? జైల్లో వుండాల్సిన వాళ్ళు బయట వున్నారు... ఇదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి పెద్ద బ్యాడ్‌లక్. ఆల్రెడీ కవితక్కాయ్ జైల్లో వుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావ్ తదితర రాయల్ ఫ్యామిలీ మెంబర్లలందరూ జైల్లో పడతారు. ఇక మా జలగ సంగతి సరేసరి... అవినాష్ రెడ్డితో కలసి జైలుకు వెళ్ళడానికి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి. మీరంతా కలసి ఏ తీహార్ జైల్లోనో ఫ్రెండ్‌షిప్ చేసుకోండి.. మా ఆంధ్రప్రదేశ్ జోలికి.. చంద్రబాబు జోలికి ఫ్రెండ్‌షిప్, అభినందనల పేరుతో కూడా రాకండి..