పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా....
ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం కూటమి 165 స్థానాలను సొంతం చేసుకుంది. 10 స్థానాలతో వైసీపీ సరిపెట్టుకుంది. ఎన్నికల ఫలితాలను మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో 5 స్థానాలు కూటమి, 2 స్థానాలు వైసీపీ గెలిచాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానంలోని 6 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి, ఒక స్థానం వైసీపీ గెలిచాయి. రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి, 3 స్థానాలు వైసీపీ గెలిచాయి, కడప పార్లమెంట్ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం కూటమి, 2 స్థానాలు వైసీపీ గెలిచాయి. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 5 స్థానాను తెలుగుదేశం కూటమి, రెండు స్థానాలను వైసీపీ కూటమి గెలిచాయి. ఇక మిగిలిన 20 పార్లమెంట్ స్థానాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, అనంతపురం, హిందూపురం, నంద్యాల పార్లమెంట్ స్థానాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది.