political party colours for govt buildings in telugu states

రంగు పడుద్ది... అన్ని పార్టీలది అదే పైత్యం

  "ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలది అదే పైత్యం" అన్నట్టుంది ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితి. పేర్లు వేరు కానీ దాదాపు అన్ని పార్టీలది అదే తీరు. చివరికి ఓట్లేసి గెలిపించిన మనమే పెట్టాలి కన్నీరు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం కర్చీఫ్ వేస్తుంటాం. ఎందుకు? కాసేపు ఆ సీటులో కూర్చొని ప్రయాణం చేయాలని. మనకి తెలుసు ఆ సీటు శాశ్వతం కాదని. అయినా సీటు కోసం పోటీ పడతాం. కర్చీఫ్ వేసి సీటులో కూర్చొని ప్రయాణం చేస్తాం.. స్టాప్ రాగానే దిగిపోతాం. తర్వాత ఎవరో వచ్చి ఆ సీట్లో కూర్చుంటారు. అయినా ఆ కాసేపు కూర్చోవడం కోసం మనం కర్చీఫ్ వేయడం మానం, పక్కన వాళ్ళతో గొడవ పడటం మానం. "ఆర్టీసీ బస్సులో సీటు కోసం కర్చీఫ్".. ఇలాంటి కాన్సెప్ట్ నే రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. అధికారం శాశ్వతం కాదని తెలిసినా తాము అధికారంలో ఉన్నంత కాలం.. తమ పార్టీ జెండా రంగులే రాష్ట్రమంతా కనిపించాలని రంగులతో నింపేస్తున్నారు. బస్సుల నుంచి భవనాల వరకు వేటిని వదలకుండా పార్టీ జెండా రంగులతో కప్పేస్తున్నారు. ఏ ఒక్క పార్టీనో కాదు.. అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల తీరు ఇలాగే ఉంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ రంగుల పైత్యం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ జెండా రంగు గులాబీ. ఇంకేముంది తెలంగాణ అంతా గులాబీ మయం. బస్సులు, భవనాలు, చివరికి గుళ్లకు కూడా ఈ మధ్య గులాబీ రంగు దర్శనమిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఏపీ సంగతి సరేసరి. అప్పుడు చంద్రబాబుది.. ఇప్పుడు వైఎస్ జగన్ ది ఇద్దరిది ఒకటే తీరు. అన్నట్టు ఆఖరికి పుష్కారాల సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఈ రంగుల పిచ్చిని పక్కన పెట్టలేదు. నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ తీరాన అవతలి వైపు పుష్కర ఘాట్లకు పసుపు రంగు, ఇవతలి వైపు గులాబీ రంగు ఘాట్లు దర్శనమిచ్చాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చింది. గులాబీ రంగే కొనసాగుతోంది. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా. అందుకే పసుపు రంగు పోయి వైసీపీ జెండా రంగులు దర్శనమిస్తున్నాయి. అసలే జగన్ మొదటి సారి సీఎం అయ్యారు. ఇంకేముంది రాష్ట్రాన్ని పార్టీ జెండా రంగులతో నింపేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, త్రాగునీటి బోర్లు, ఇతర భవనాలు, ఆఖరికి స్మశానాలు కూడా వేటిని వదలకుండా రంగులతో నింపేస్తున్నారు. ఇంతటితో అయిపోలేదు.. సీఎం కూర్చునే కుర్చీల దగ్గర కూడా ఈ రంగుల గోలే. కేసీఆర్ కుర్చీలో గులాబీ టవల్, బాబు కుర్చీలో పసుపు టవల్, జగన్ కుర్చీలో తెలుపు టవల్ దర్శనమిస్తున్నాయి. ఇక సభలు ఏర్పాటు చేస్తే అవి కూడా పార్టీ రంగులతోనే నింపేస్తున్నారు. చుట్టూ కట్టే క్లాత్ నుంచి, డెకరేషన్ చేసే ఫ్లవర్స్ వరకు అన్నిట్లో పార్టీ జెండా రంగులు ఉండేలా చూసుకుంటున్నారు. అసలు ఈ రంగుల వల్ల ఏంటి ప్రయోజనం?.. ప్రజాధనం వృధా తప్ప. అధికారంలోకి రాగానే రంగులతో నింపేస్తారు. మరో పార్టీ అధికారంలోకి రాగానే.. ఈ రంగులను ఆ రంగులు కప్పేస్తాయి. ఇలా భవనాల రంగులు మారడం తప్ప ప్రజల బ్రతుకులు మారడంలేదు. రంగులు వేసినంత మాత్రాన నాయకులు ప్రజలకు దగ్గర కారు. రంగులు వెలిసిపోయినట్టే ప్రజలు కూడా నాయకుల్ని మర్చిపోతారు. రంగులు వేయడం మానేసి భవిష్యత్తుకి బాటలు వేయండి. ప్రజలకు మంచి చేయండి. అప్పుడు మీరు రంగులు వేయకుండానే ప్రజలు మీ పార్టీకి అండగా ఉంటారు. మిమ్మల్ని, మీ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇది అన్ని రంగుల పార్టీలకు మేమిస్తున్న ఉచిత సలహా అనమాట.

Chiranjeevi to meet AP CM YS Jagan

ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ.. సైరా జగన్మోహన్‌రెడ్డి

  తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయ ప్రముఖులు కూడా సైరాను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి నారా లోకేష్ వంటి వారు సైరాపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు చిరంజీవి సినీ రాజకీయ ప్రముఖుల్ని కలిసి సైరా చిత్రాన్ని వీక్షించాలని కోరుతున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి సైరా చిత్రం చూడమని కోరనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. మరి జగన్ కు సైరా చూసే తీరిక దొరుకుతుందో లేదో తెలియదు కానీ.. చిరంజీవి ఆయనతో భేటీ కాబోతున్నారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరోవైపు చిరంజీవి జగన్ తో భేటీ అంటున్నారు. దీంతో మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. అయితే దీని వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. సైరాకు ఏపీలో అదనపు షోలు కావాలని మంత్రి కన్నబాబు ద్వారా చిరంజీవి అడిగిస్తే.. జగన్ అంగీకరించారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా జగన్ ని కలిసి, కృతఙ్ఞతలు తెలిపి, సైరా వీక్షించాల్సిందిగా కోరనున్నారని సమాచారం.

CPI Strong Warning to KRC

మద్దతు ఉపసంహరించుకుంటాం... కేసీఆర్ కి సీపీఐ వార్నింగ్

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్‌కు సీపీఐ వార్నింగ్ ఇచ్చింది. టీఆర్ఎస్‌కి మద్దతు ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేయడంతో ... హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతుపై పునరాలోచిస్తామని సీపీఐ ప్రకటించింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న చాడ వెంకట్‌ రెడ్డి... ఆర్టీసీ కార్మికులకు సీపీఐ అండగా ఉంటుందని ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తమ్ కు షాకిచ్చి, ఎలాగైనాసరే హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే సీపీఐ మద్దతు తీసుకుంది. సీపీఐ కూడా అధికార పార్టీ అడిగేసరికి ఓకే చెప్పింది. అయితే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో... టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తామంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటన చేశారు. అసలే, హుజూర్ నగర్ లో పార్టీ పరిస్థితి బాగాలేదని సర్వేలు చెబుతున్నాయి. మండలాలు, గ్రామాలు, వార్డులు వారీగా నేతలను రంగంలోకి దింపి ప్రజలను కలుస్తున్నా, గెలుపు అవకాశాల్లేవని కేసీఆర్ సర్వేల్లోనూ, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ లోనూ తేలింది. ఇక, ఇప్పుడు ఒకవైపు ఆర్టీసీ సమ్మె ప్రభావం... మరోవైపు అంతోఇంతో బలమున్న సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ హెచ్చరించడంతో, టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరి సీపీఐ హెచ్చరికపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Puvvada Ajay Kumar Press Meet On RTC Strike

ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కేసు... తాత్కాలిక సిబ్బందికి పువ్వాడ వార్నింగ్

సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తుంటే.... ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 55శాతం బస్సులను నడిపినట్లు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్‌... ఆ సంఖ్యను వందశాతానికి పెంచుతామన్నారు. డీఎస్పీ ఇన్‌‌‌ఛార్జ్‌గా ప్రతి డిపోలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటుచేసి బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. ప్రతి బస్సులోనూ పాసులను కచ్చితంగా అనుమంతించాల్సిందేనన్న మంత్రి పువ్వాడ.... టికెట్ ధర కంటే అధికంగా వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాత్కాలిక సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి బస్సులోనూ టికెట్ ధరల పట్టిక పెడతామని, అందులో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా తాత్కాలిక సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికులు కూడా టికెట్ ధర కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని పువ్వాడ సూచించారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రతి బస్సులోనూ పెడతామని, ఎవరైనా ఎక్కువ డబ్బులు అడిగితే, ఫిర్యాదు చేయ్యొచ్చని తెలిపారు. ఇక, దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా... అవసరమైన మేర బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. 14నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్న నేపథ్యంలో... అన్ని డిపోల నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని సర్వీసులను యథావిధిగా నడుపుతామన్నారు. ప్రస్తుతం 5వేలకు పైగా బస్సులను నడుస్తున్నాయన్న మంత్రి పువ్వాడ అజయ్.... ఇవాళ్టి నుంచి మొత్తం బస్సులను రోడ్లపైకి తీసుకొస్తామన్నారు. అయితే, 50శాతానికి పైగా బస్సులను నడుపుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రోడ్లపై మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు... తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ రైళ్లను ఆశ్రయిస్తుండటంతో... ట్రైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

 Reverse Tendering

రివర్స్ టెండరింగ్‌లో మరో ట్విస్ట్... ఇసుకపై జేసీలకు అధికారం

పాలనలో పారదర్శకత చూపుతున్న ఏపీ సీఎం జగన్ మరో ముందుడుగు వేశారు. రివర్స్ టెండరింగ్ పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్ లో ఛాన్స్ కల్పించనున్నారు. అలాగే, పది లక్షలు నుంచి వంద కోట్ల టెండర్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. జనవరి ఒకటి నుంచి కొత్త విధానం అమలు చేయనున్నారు. విధాన రూపకల్పన, పారదర్శకత శాశ్వతంగా ఉండే విధంగా పాలసీ రూపొందిస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ సంబంధిత కార్యకలాపాల సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించారు. మరోవైపు, ఇసుక కొరతపైనా జగన్ దృష్టిపెట్టారు. ఇసుక సరఫరాపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ‌్యంలో చర్యలు చేపట్టారు. నూతన విధానం సక్రమంగా అమలుతోపాటు ఇసుక కొరత లేకుండా చేసేందుకు జాయింట్ల కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇసుక తవ్వకాల నుంచి సరఫరా వరకు అన్నీ జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలని జగన్ ఉత్తర్వులు జారీ చేసింది.

All Party Leaders Fires on CM KCR over RTC Strike

నీకంటే చిన్నవాడు చేశాడు... నువ్వెందుకు చేయలేవు... కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అఖిలపక్షం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టంచేశారు. సమ్మె చేస్తోంది... కార్మికుల స్వలాభం కోసం కాదన్న అశ్వద్ధామరెడ్డి .. ప్రజల కోసం, సంస్థ కోసమేనని అన్నారు. అరెస్టులు చేసినా, జైళ్లలో పెట్టినా, పోరాటం ఆగదన్నారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌పై నేతలు నిప్పులు చెరిగారు. పది రోజుల్లోగా సమస్యకు పరిష్కారం చూపాలంటూ డెడ్‌లైన్ విధించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే... 19న తెలంగాణ బంద్‌కి పిలుపునిస్తామని అఖిలపక్షం హెచ్చరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్న కోదండరాం... ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతుంటే... ఎలా సెల్ఫ్ డిస్మిస్ అవుతారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే... నువ్వెందుకు చేయవంటూ కేసీఆర్‌ను చాడ వెంకట్ రెడ్డి నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లనే అడిగారని, గొంతెమ్మ కోర్కెలు కోరలేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తే... ఇక్కడ కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దసరా పండక్కి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా కేసీఆర్... ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురుపోసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి సర్కార్ మెట్టు దిగకపోవడం... కార్మికులు పట్టు వీడకపోవడంతో... ఆర్టీసీ సమ్మె... సకల జనుల పోరాటంగా మారుతోంది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి రాజకీయ పార్టీలు, ఉద్యోగ ప్రజాసంఘాలు మద్దతు పలకడంతో ... సమ్మె రోజురోజుకీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది.

Drilling for uranium begins at Allagadda

కడప మాదిరిగా యురేనియం తవ్వకాలకు బలికాబోయిన ఆళ్లగడ్డ...

కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

private hospitals making money over viral fever

విషజ్వరాల పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో మొదలవుతున్న కొత్త దందా...

అమ్మో జ్వరాలు అనేలా చేశాయి ఈ సీజన్ లో వచ్చిన విష జ్వరలు.నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో విషజ్వరాలను ఆసరాగా చేసుకుని భారీ దందాకు తెరలేపాయి. సాధారణంగా వచ్చే విష జ్వరాలను డెంగీ గా చూపుతో ప్లేట్ లెట్స్ పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు కొందరు  ప్రైవేటు ఆసుపత్రి అధికారులు. అవసరమున్నా లేకున్నా టెస్టుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాక పేదల జేబుల ను గుల్ల చేస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా వ్యాపిస్తున్న విషజ్వరాల ప్రైవేటు ఆసుపత్రు లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తున్న విష జ్వరాలు దందాకు భారీ ఊతమిస్తున్నాయి. పారిశుధ్య లోపంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ను సరిగ్గా పాటించకపోవడం తో దోమలు విపరీతం గా వ్యాపిస్తున్నాయి. ఈ దోమకాటు వల్లనే ఈ సీజన్ లో నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ తో పాటు ప్రమాదకరమైన డెంగీ జ్వరాల కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా లో ఇప్పటి వరకు యాభై ఆరు డెంగ్యూ కేసులు ఇరవై ఐదు చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. వీరి దృష్టికి రాకుండా ఉన్న వారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనాలు వెల్లువడుతున్నాయి. పలుచోట్ల డెంగీ మరణాలు కూడా సంభవించాయి అయితే వీటిని ప్రభుత్వ లెక్కల్లో డెంగీగా నమోదు చేయడానికి అధికారు లు నిరాకరిస్తున్నారు.జ్వరాల బారిన పడిన ప్రజల్లో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతుండగా వ్యాధి తీవ్రత ను బట్టి ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే ప్రైవేటు ఆసుపత్రులకు అదునుగా మారుతోంది. ఒక పేషెంట్ తమ ఆసుపత్రి వచ్చాడంటే అతన్ని ఎలా పీల్చి పిప్పి చేయాలన్నా ముందస్తు ప్లాన్ చేసి ఆ ప్రకారంగా వైద్యం దశల వారీగా అందిస్తున్నారు. దీంతో పేషెంట్ కు ఖర్చు తడిసి మోపెడవుతుంది. ముందుగా ప్రైవేటు ఆసుపత్రి కి వెళ్లిన పేషెంట్ లకు టెస్టుల్ లోనే అసలు పరీక్ష మొదలవుతుంది. గతంలో గుర్తింపు పొందిన ల్యాబ్స్ లో పరీక్ష లు నిర్వహిం చేవారు. కానీ ఇటీవల కొత్త గా ప్రైవేటు ఆసుపత్రుల్లో ల్యాబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో అర్హులైన టెక్నీషియన్స్ లేక పోయినా వైద్యుల పర్యవేక్షణ లో టెస్టుల రిజల్ట్స్ ఇస్తున్నారు. తమ ట్రీట్మెంట్ అమౌంట్ టార్గెట్ గా తప్పుడు రిపోర్టు లు రోగులకిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని రోగులను భయబ్రాంతులకు గురి చేస్తూ తదుపరి చికిత్స లు చేస్తున్నారు. అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తూ అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూ లో పెట్టి అదనపు డబ్బు వసూలు చేస్తూ రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరం తో ఆసుపత్రి లో అడ్మిట్ అయితే కనీసం ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజును గుంజుతున్న ఆసుపత్రుల నల్లగొండ లో భారీగా పెరిగిపోయాయి.ఇక డెంగీ అనగానే ప్లేట్ లెట్స్ పేరుతో కొత్త తరహా దందాకు తెరలేపుతున్నారు. ఒక రోగికి సాధారణం గా ఒకటిన్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటే సాధారణ స్థాయి లో ఉన్నట్టు లెక్క. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ని ల్యాబ్స్ లో రోగికి కావలసిన ప్లేట్ లెట్ కౌంట్ తక్కువ చూపుతూ అత్యవసర స్థితిని కృత్రిమం గా కల్పిస్తున్నారు. ప్లేట్ లెట్స్ పడిపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ రోగిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. రోజు కు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్లేట్ లెట్స్ ఎక్కించాలంటూ ఒక ప్యాకెట్ కు పదిహే ను వేల నుంచి ఇరవై వేల వరకు మరో రూపంలో వసూలు చేస్తున్నారు. కనీసం వారం రోజులు ఆసుపత్రి లో వుంచుకుని డబ్బు లు పిండేస్తున్నారు ఇలాంటి ఘటనే నల్లగొండ పట్టణం లోని డాక్టర్స్ కాలనీ లో చోటుచేసుకుంది.పట్టణాని కి చెందిన రూపక్ కుమార్ అనే వ్యక్తి సాయి శ్రీనివాస్ ఆసుపత్రుల్లో జ్వరం పేరుతో అడ్మిట్ కాగా ఆసుపత్రి ల్యాబ్ లో ప్లేట్ లెట్ కౌంట్ చాలా తక్కువ చూపారు. అనుమానం వచ్చిన రోగి బంధువు లు బయట మరో ల్యాబ్ లు చేపిస్తే సాధారణం గా ఉండాల్సిన కౌంట్ ఉంది దీంతో వీరు డీఎంఅండ్ హెచ్ వోకు ఫిర్యాదు చేశారు రంగం లోకి దిగిన డీఎంఅండ్ హెచ్ వో ఏ కొండలరావు సాయి శ్రీనివాస్ ఆసుపత్రి ని తనిఖీ చేస్తే అసలు బండారం బయటపడింది. ఆ ల్యాబ్ కు అనుమతి లేదని అందులో ఉన్న టెక్నీషియన్ కు అర్హత లేదని తేల్చి ల్యాబ్ ను సీజ్ చేశారు. ఇదే సందర్భం గా మరి కొన్ని ల్యాబ్స్ ను తనిఖీ చేయగా సాయితేజ డయాగ్నిస్టిక్ సెంటర్ లు కూడా ల్యాబ్ లు తప్పుడు నివేదిక ఇచ్చారని సీజ్ చేశారు. అధికారుల తనిఖీ ల విషయం తెలిసిన మరి కొన్ని ల్యాబ్స్ నిర్వహకులు వాటిని మూసి వేసి బయటకు వెళ్లిపోయారు. వాస్తవం గా డెంగీ నిర్ధారణ పరీక్ష అనేది జిల్లా లో ఎక్కడా ప్రైవేటు ఆసుపత్రుల్లో లేవని డీఎంఅండ్ హెచ్ వో కొండలరావు స్పష్టం చేస్తున్నారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అనవసరంగా సామాన్య ప్రజల ను దోచుకోవద్దు అని చెబుతున్నారు. ఇక జిల్లా లోని ప్రైవేట్ ఆసుపత్రు లు ల్యాబ్ లు పోయినా తమ దాడులు కొనసాగుతాయని డీఎంఅండ్ హెచ్ వో కొండలరావు హెచ్చరిస్తున్నారు.డెంగీ కి భయపడాల్సిన పని లేదని తగ్గు ముఖం పట్టే జ్వరమే ఉంటుంద ని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. చికిత్స తీసుకోవడం లో నిర్లక్ష్యం ఉంటే కానీ లేదంటే శారీరకంగా నీరసంగా ఉంటే తప్ప ప్రాణాపాయం ఉండదని ప్రభుత్వ వైద్యు లు చెబుతున్నారు. విషజ్వరాలు వచ్చినపుడు సాధారణంగా ప్లేట్ లెట్స్ తగ్గిపోతుంటాయని మళ్లీ సాధారణ వైద్యం తోనే వాటంతట అవే పెరుగుతూ వస్తాయంటున్నారు వైద్యనిపుణులు.

andhra pradesh and telangana chief secretaries meeting in new delhi

ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ భేటీ...

ఏపీ ప్రభుత్వం మరి కాసేపట్లో హోం మంత్రితో చర్చలు జరపనున్నారు. .ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాల పై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాలతో ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. విభజన చట్టం లోని తొమ్మిది, పది షెడ్యూళ్లలో ప్రస్తావించిన ప్రభుత్వ సంస్థలూ ఆస్తులు, ఉద్యోగుల విభజన పై సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ ఇంకా తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్న అంశాల  మీదనే ప్రధానంగా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రట్రీలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చర్చిస్తున్నారు.   ఇప్పటికీ షడ్యూల్ తొమ్మిది, పది ఆ రేండు ఇన్స్ ట్యూషన్స్లో పొందుపరచిన , సంస్థల విభజన, ఆస్తుల విభజన, ఆ సంస్థల ఉద్యోగుల విభజన కూడా కొలిక్కి రావాల్సింది. దానితో పాటు  రాష్ట్రం వెలుపల కలిగినా ఉమ్మడి ఆస్తుల పంపకాలు కూడా జరగాల్సి ఉంది. అందులో  ఢిల్లిలో  ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భవనం కూడా ఒకటి. ఇలాంటివి ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాల మీద  ఈ సమావేశం చర్చ జరగనున్నది. ఈ  సమస్యలకు సానుకూల పరిష్కారంమే ఈ సమావేశ ముఖ్య ఉద్దశమని చెప్పుకోవచ్చు.  గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం కారణంగా కొన్ని అంశాల్లో ఒక ఏకాభిప్రాయం రాలేదు కానీ ఇప్పుడు పలు పర్యాయాలు కూర్చుని సమావేశాలల్లో అనేక విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు.ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశంలో భాగంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు కేంద్ర హోం శాఖ దగ్గర కూర్చుని ఎలా పంచుకోవాలి, ఎలా ఏ విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది.కేంద్ర హోంశాఖ చెప్పడం ద్వారా ఈ ఆస్తుల పంపకాలు కానీ ఉద్యోగుల పంపకాలు కానీ ఆ  విభజన చట్టం లో పొందు పరిచిన వాయుదా పడ్ద అంశాల్ని కూడా వీలైనంత త్వరగా పరీష్కరించుకోవాలనే  ఉద్దేశం తో ఈ సెక్రటరీల సమావేశం జరుగుతుంది.  ఇప్పటికైన ఈ సమావేశంతో ఆ వాయిదాకేసులు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి.

Waltair Division

వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ జరుగునా లేదా?

వాల్తేరు డివిజన్ కోసం విశాఖలో పోరాటాలు ఉధృతం అవుతున్నాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ డివిజన్ ను రద్దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ప్రకటించినప్పట్నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్దరణ కోసం ఉద్యమ బాట పట్టాయి.ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించిన ఆంధ్ర ప్రజలు సంతోషంగా లేరు. అందులోనూ ఉత్తరాంధ్ర వాసులైతే తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఎంతో చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ప్రకటించటమే.వాల్తేరు డివిజన్ ను పునరుద్దరించాలని జోన్ ప్రకటించినప్పట్నుంచి డిమాండ్ లు ఎక్కువయ్యాయి. దీనిని గమనించిన కొన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ కోసం తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు ధర్నాలు చేస్తూ ప్రజాభిష్టం మేరకు పోరాటాలు చేస్తున్నాయి. తాము నిర్వహించే సమావేశాలకు పలు రాజకీయ పార్టీలను మేధావులను ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాయి. వారి సలహాలు సూచనలు తీసుకుని పోరాటాలను ఉధృతం చేస్తున్నాయి. వాల్తేరు డివిజన్ ను కొనసాగించాలని సీఐటీయూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో మిగిలిన రాజకీయ పార్టీ లలో కదలిక ఏర్పడింది. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటును గౌరవించకపోతే తాము వెనకబడిపోతామేమోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రేపో మాపో ప్రధాన పార్టీలు కూడా ఉద్యమంలోకి వచ్చే అవకాశముంది. వాల్తేరు డివిజన్ లేకుండా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడం ప్రజలనూ వంచించడమేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ రావు విమర్శించారు.చిత్రమేంటంటే ప్రత్యేక రైల్వే జోన్ కావాలని వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యాలని గతంలో ఆందోళన చేసిన టిడిపి, వైసిపి ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. బిజెపి నేతలు మాత్రం ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారు కదా వాల్తేరు డివిజన్ లేకపోతే ఏమవుతుంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కానీ వామపక్షా లు, ప్రజా సంఘాలు, కళాకారుడు మాత్రం వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యా లని బలంగా కోరుకుంటున్నారు.ప్రత్యేక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర లో చిరకాల వాంఛ అని ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామ ని విభజన చట్టం లో కూడా చెప్పార ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆశతో వాల్తేరు డివిజన్ ను ఎత్తేసి రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించిందని విమర్శిస్తున్నారు.భారతదేశ చరిత్ర లోనే డివిజన్ ఎత్తేసి జోన్ ఇచ్చే ఘటనే లేదని గుర్తు చేస్తున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి వాల్తేరు డివిజన్ ను పునరుద్ధరణ చెయ్యాలని విశాఖ నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

pakistan in big trouble

ప్రపంచంలో అధిక అప్పులు చేసిన దేశంగా పాక్...

పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అందినచోటల్లా అప్పు లు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగానే అక్కడి పరిస్థితి ని తేటతెల్లం చేస్తూ తాజాగా కొన్ని నివేదికల వెలుగు లోకొచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది లోనే ఇమ్రాన్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల తొమ్మిది బిలియన్ల పాకిస్థానీ రూపాయల మేర అప్పు లు చేసింది. దీంతో అత్యధిక అప్పు లు చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది.ఈ మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్థాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి రుణాల వివరాలు పంపింది. ఈ డేటా ప్రకారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారం లోకొచ్చిన ఏడాది లోపే దాదాపు ఏడు లక్షల కోట్లు రుణంగా తీసుకున్నారు.రెండు వేల పధ్ధెనిమిది ఆగస్టు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు వరకు విదేశీ వనరుల ద్వారా రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల కోట్లు అప్పు గా పొందింది.మరో నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు వందల కోట్లు స్వదేశీ వనరుల ద్వారా తీసుకుంది. ఇంతకు ముందు పాకిస్థాన్ లోని ఏ ప్రభుత్వమూ ఏడాదిలోపు అంత రుణం తీసుకున్నది లేదు. ప్రస్తుతం ప్రభుత్వ రుణం ముప్పై రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లకు చేరుకుంది.ఇమ్రాన్ అధికారంలోకి రాక ముందు పాకిస్థాన్ ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల కోట్ల అప్పు ఉండేది. ప్రస్తుతం తొలి ఆర్థిక త్రైమాసాని కి పాకిస్తాన్ ఒక లక్ష కోట్ల మేర పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొంభై ఆరు వేల కోట్లు వసూలు చేయగలిగింది. దీనికి అదనంగా మరో ఐదేళ్ళలో నలభై ఏడు శాతం పాకిస్థాన్ అప్పుల పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.సౌదీ అరేబియా, చైనా లాంటి దేశాలు పాకిస్థాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ దాయాది దేశ ఆర్థిక వ్యవస్థ గాడి లో పడలేదు. ఈ ఏడాది జూన్ లో ఖతార్ నుంచి పాకిస్థాన్ మూడు ట్రిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజ్ అందుకుంది. గత పదకొండు నెలలు పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చిన గల్ఫ్ దేశాల్లో ఖతార్ నాలుగోది. అంతకుముందు యూఏఈ కూడా రెండు ట్రిలియన్ డాలర్ల మేర సొమ్ములు సమకూర్చింది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థల సంక్షోభాన్ని మంచి గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఆరు బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకుంది. ఇలా పాక్ ప్రధాని పాక్ దేశాన్ని ఇంత అప్పుల పాలు చేయడం చూసి జనాలు నివ్వెరపోతున్నారు.

TS Government to extend school holidays

ఆర్టీసీ సమ్మెతో స్కూల్‌లకు మరో 2 రోజులు సెలవులను పొడిగించే ప్రయత్నంలో ఉన్న టీఎస్ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్తృతం చేస్తోంది. పండగలకు ఊరు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది టీఎస్ ప్రభుత్వం. అవసరమైతే విద్యాసంస్థల బస్సులను ప్రైవేట్ వాహనాలుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అవసరమైతే దసరా సెలవులను రెండ్రోజులు పొడగించాలని కూడా యోచిస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో కోటిన్నర మంది ప్రయాణించే అవకాశముంది కావున తాము ప్రయాణికులు కొరకు  ప్రత్యామ్నాయ  మార్గాలకు నాంది పలుకుతున్నట్లు తెలియజేస్తున్నారు టీఎస్ అధికారులు.  మరోపక్క సమ్మెపై వెనక్కి తగ్గబోమని జేఏసీ తాజా పరిణామాలపై చర్చించేందుకు సోమాజిగుడా ప్రెస్ క్లబ్ లో సమావేశమైంది. రాజకీయ పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు దీనికి హాజరయ్యారు.ఆర్టీసీ సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలిపిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. దసరా సెలవు లను మరో రెండు రోజుల పాటు పొడిగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పండగ అయిపోవడంతో చాలా మంది ప్రయాణికులు తిరిగి సొంతూళ్ల కు పయనమవుతారు. ఈ నేపధ్యంలో బస్సుల కొరత ఉన్నందువలన  అవసరమైతే విద్యా సంస్థ లకు చెందిన బస్సులు ను వినియోగించుకునేందుకు వీలుగా రెండ్రోజుల పాటు సెలవుల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దాదాపు  ఎన్ని బస్సులను సిద్ధం చేయబోతున్నారు మరియు రెండ్రోజుల సెలవలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సుల వాడకం వల్ల ప్రయాణీకుల కష్టాల్లో కొంత మెరకు ఊరట కనిపిస్తుందా అనే అంశం పై పలు అనమానాలు వెల్లడవుతున్నాయి. ప్రభుత్వం ఈ సమ్మే పై చాలా కోపంగా ఉన్నట్లు తెలియజేస్తోంది.ఎట్టి పరిస్థితిలో తాము తమ నిర్ణయాన్ని వెనక్కు తగ్గేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం పై ప్రభుత్వం ఎన్ని  ప్రత్యామ్నాయ మార్గాలని అయిన ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి  సిద్ధంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ సమ్మే పోరులో ఎవరు విజయం చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది.

Cabinet approves Rs 5 lakh package for PoK families who settled outside kashmir

కేంద్రం మరో సంచలన నిర్ణయం!!

  1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పరిహారాన్ని ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద అందజేయనున్నారు. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పీవోకే నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన  5,300 కుటుంబాలకు రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిరాశ్రయులైన కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

Justice Chandrakumar Sensational Comments On CM KCR

కేసీఆర్ ది నోరా? మోరీనా?.. అప్పుడు చెప్పింది గుర్తులేదా!!

  ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ.. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నాడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని చంద్రకుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ది నోరా? మోరీనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవ్లరకు నెలకు 50 వేల రూపాయల జీతం ఇస్తున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ డ్రైవర్ కు, కండక్టర్ కు అంత మొత్తం ఇస్తున్నారో చూపించాలని చంద్రకుమార్ డిమాండ్ చేశారు. టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది కనుక ప్రైవేట్ పరం చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అని చంద్రకుమార్ ప్రశ్నించారు. యూనియన్లు అవసరం లేదనడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్నికలు, సకలజనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఓసారి గుర్తుకుతెచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని, వారి జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సమానం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆరోజున మాట్లాడిన మాటేంటి? ఈరోజున మాట్లాడుతున్న మాటేంటి? అని చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

passengers facing problems with tsrtc strike

నిర్లక్షపు దోరణిలో ఉన్న తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ కు బుద్ధి చెప్పిన ప్రభుత్వం...

  తెలంగాణ రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఆర్టీసీ సమ్మె పైన తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం తాత్కాలిక ఉద్యోగుల నియమించింది. అయితే ప్రభుత్వం నియమించిన అవకాశాన్ని కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించాల్సి వస్తోంది. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సును నడుపుతున్నాడు. ప్రయాణికులు వారించినా తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో వారు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించిన డ్రైవర్ ను తొలగించి వేరే డ్రైవర్ తో బస్సు ను పంపించడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు. లక్సెటిపేట్ నుంచి బస్సు మంచిర్యాల వెళుతుండగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. గతంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గా ఎంతో మంది ప్రాణా లు గాలిలో కలిసిపోయినా సంఘటనలు మనం చూశాం.ఇక పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న రైల్వే స్టేషన్ ల నుంచి ఇళ్లకు చేరలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బస్సు లను ఏర్పాటు చేసినా అవి మెయిన్ రోడ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి సిటీలో బస్సుల తక్కువ గా ఉండటం అవి వస్తాయో రావో అన్నది తెలియక పోవడం తో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు. ప్రభుత్వం ఇంకా ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న వెనక్కు తగ్గబోమని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో బస్సులు దాదాపు డిపోల్ లోనే కనిపిస్తున్నాయి.ఇక ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

బావ, బావమరిది మధ్య ఆధిపత్య పోరు.. జగన్ కు తలనొప్పిగా మారనుందా?

  శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ వరుసకు బావ బావమరుదులు. వీళ్లిద్దరి మధ్య విభేదాలున్నాయి ముఖ్యం గా ఒకరి పై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు పార్టీ లో హాట్ టాపిక్ గా మారాయి.నెల్లూరు జిల్లా వైసీపీ లో ఆధిపత్య పోరు నడుస్తోంది ఇంత కాలం సైలెంట్ గా సాగిపోతున్న ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ముఖ్యంగా ఎంపీడీవో సరళ ఇంటి పై దాడి వివాదం లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్ర చేశారంటూ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ప్రత్యక్ష ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజల్ లోకి తప్పుడు సంకేతా లు వెళ్లేలా ఉన్నాయనే భావనలో ఉన్న జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ లో నెల్లూరు జిల్లా నాయకు ల అంశంపై చర్చించనున్నారు.కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి వ్యవహారం పార్టీ పరువు తీసేలా ఉండటం తో వాటిని సర్దుబాటు చేసేందు కు రంగం లోకి దిగారు. ముఖ్యం గా కీలక నిర్ణయా లు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కోటంరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదం పై ఇద్దరు నేత లతో చర్చించనున్నారు.వారిద్దరి మధ్య ఉన్న విభేదా లు పార్టీ కి జరుగుతున్న నష్టం పై వివరించనున్నారు.  సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే కోటం రెడ్డి విమర్శలు గుప్పించడం వెనుక అసలు కారణాలేంటి. అసలు కాకాణి కోటంరెడ్డి కి మధ్య ఎక్కడ చెడింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.నిజానికి వైసీపీ ఆరంభ సమయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే మేకపాటి కుటుంబం ఇతర పార్టీ నేతలు కాకాణిని ఒప్పించి ఆ పదవి అప్పగించారు అప్పట్లో ఇద్దరి మధ్య భగ్గుమనేలా తయారైంది పరిస్థితి.ఇటీవల నెల్లూరు రూరల్ పరిధి లో కాకాణి స్నేహితుడొకరు హోటల్ ఏర్పాటు చేశారు. కాకాణి దానిని ప్రారంభించారు శ్రీధర్ రెడ్డి ఆ హోటల్ మూత వేయించేవరకూ నిద్రపో లేదన్న వార్తలు వినిపించాయి. దీంతో అప్పటి నుంచి కోటంరెడ్డిపై కాకాణి గుర్రు గా ఉన్నట్టు చెబుతారు పార్టీ లో అంతర్గత విబేధాలు బయటికొచ్చినప్పటికీ పెద్దలకు చెప్పుకొని సరిపెట్టారు.మొన్న శ్రీధర్ రెడ్డి స్నేహితుడు కాకాణి ప్రాతి నిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి లో ఓ భారీ వెంచర్ వేశారు. ఆ వెంచర్ కి నీటి సదుపాయం  ఇవ్వాలనీ ఎంపీడీవో సరళిని కోరారు. ఆమె ఎమ్మెల్యే కాకాణి సంప్రదించమని చెప్పగా దానికి ఆయన వీలుకాదన్నారు.నిజానికి ఈ వెంచర్ పక్కనే గిరిజన కాలనీ ఉంది. అక్కడి వారంతా వైసీపీ వర్గీయులే ప్రస్తుతం ఆ కాలనీకే వాటర్ ఇవ్వడం కష్టం గా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారు. అయితే తమ వెంచర్ కు వెంటనే నీటి సరఫరా ఇవ్వాలని ఎంపీడీవో మీద ఒత్తిడి తీసుకువచ్చినట్టు చెబుతున్నారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగానే తనపైన తన స్నేహితుడు పైన అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులైతే కాకాని డబ్బు లు డిమాండ్ చేశారంటూ బహిరంగంగా వ్యాఖ్య లు చేస్తున్నారు. ఇంటి పై దాడి జరిగిన తరువాత ఎంపీడీవో సరళ నేరుగా పోలీస్ స్టేషన్ కి కాకుండా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికెళ్లారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. కాకాణిపై పరోక్షంగా కోటం రెడ్డి తీవ్ర విమర్శ లు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతల్లో తాను చంద్రబాబు కాళ్లు పట్టుకోలేదు అన్నారు. తనకు చాలా అనుమానా లున్నాయని కోటం రెడ్డి తీవ్ర వ్యాఖ్య లు చేశారు.  అంతేకాదు జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతి నిధులు నేతలు ఎవరి దారి వారిది అన్నట్టు ఉంటున్నారు.ఎవరు ఏ వర్గం అనే లెక్కల్లోనే ఉండిపోయారు అధికారం లోకి వచ్చాక కింగ్స్ కోట్ లోని పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం మానేశారు. ఎవరి కార్యాలయాల్లో వారి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. కాకాణి తన ఇంటి దగ్గరే రాజకీయాల నెరుపుతుంటే కోటం రెడ్డి తన సొంత కార్యాలయంలో రాజకీయాలు చేస్తున్నారు.ఎంపీడీవో సరళ ఇంటి పై దాడి కేసులో తన తప్పు ఉందని తెలిస్తే శాశ్వతంగా బహిష్కరించండి అంటూ జగన్ కు విజ్ఞప్తి చేశారు కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి. తాను ఇంటి పై దాడి చేసినట్టు రుజువు చేస్తే ఎంపీడీవో సరళకు క్షమాపణ చెప్తా నని కూడా కోటం రెడ్డి చెప్పారు. తనను ఇరికించేందుకు కుట్ర పన్నారు అంటూ మండిపడ్డారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ చెప్తూనే తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. మొత్తానికే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఎక్కువ మంది ముఖ్య నేతలు అసహనంగా ఉన్నారు. వరుస సంఘటనల నేపథ్యంలో పార్టీకి తీరని నష్టం కలుగుతుంద ని బహిరంగం గానే వ్యాఖ్య లు చేస్తున్నారు పార్టీ పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. ఈ విషయాల పై పార్టీ పెద్ద లు దృష్టి సారించారు. వర్గపోరుకు మూలాల ను వెతికి అరికట్టే పనిలో పడ్డారు ఈ నేపథ్యం లో ఇవాళ సాయంత్రం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హోరా హోరీగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె...

చరిత్రాత్మకమైన సమ్మె ఐదో తేదీన ప్రారంభమైంది.ఎటు చూసినా ఈ సమ్మే పైనే చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు సీరియస్ గానే ఉంది. మరో మాటలో చెప్పాలంటే ఉక్కుపాదం మోపుతోంది. సమ్మె మొదలుపెట్టినరోజే సాయంత్రం ఆరు గంటల వరకు డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం ఆ తర్వాత పన్నెండు వందల మంది కార్మికు లు మిగిలారు అని తేల్చింది. తాజా గా సమ్మె చేస్తున్నా ఉద్యోగు లకు వర్తిం చే ఈఎస్ ఐ సౌకర్యాన్ని కూడా రద్దు చేసింది సర్కార్. సికింద్రాబాద్ లోని తార్నాక లో ఆర్టీసీ సిబ్బంది వైద్య ఆరోగ్య పరీక్షకు ఈఎస్ఐ సేవలందించే కార్యాలయం ఉంది. సమ్మె చేస్తున్న సిబ్బందికే సౌకర్యాలూ ఇవ్వవలసిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు రావడంతో  నిరాకరణ చెబుతున్నారు ఈఎస్ఐ సిబ్బంది.సమ్మెను ఉధృతం చేస్తోంది ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న నాయకులు ఇక ప్రజల్లోకి వెళతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదని అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లోని కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఎంత మొండి గా ముందు కు వెళితే తాము అంతే మొండి గా ముందు కు వెళతామని చెబుతున్నారు. దీంతో సమ్మె ఇటు వైపు వెళుతుందో అని టెన్షన్ నెలకొంది. ఇటు ప్రభుత్వం మాత్రం మొన్నటి నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల కార్యాచరణ ఏంటి సర్కారు తరవాతే నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అన్ని సంఘాల మద్దతును కూడగట్టిన కార్మిక సంఘాలు. ఇటు అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడా కోరాయి. ఈ నేపధ్యం లో ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విపక్షాల తో భేటీని కూడా ఏర్పాటు చేశారు.ఈ భేటీకి హాజరైన పక్షాలన్నీ ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతును ప్రకటించాయి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లు న్యాయబద్ధమైనవని చెబుతున్నారు. విపక్షాల నేతలు సిపిఐ సిపిఎంతో పాటు బీజేపీ, టిడిపి కూడా ఆర్టీసీకి మద్దతును ప్రకటించాయి.ఈ సమ్మె గతంలో బహుశా  గుర్తున్నంత వరకూ ఇంత జయప్రదంగా నూటికి నూరు శాతం కార్మికు లు కూడా సమ్మె లో పాల్గొన్నటువంటి మొదటి సందర్భం చెప్పి తెలియజేశారు.అశ్వత్థామ గారు ఒకసారి పత్రికల్లో సవాల్ చేసినట్టు గా హాజరయ్యారు హాజరయ్యారు అంటున్నారు హాజరైన వాళ్ల పేరు ఒక్క పేరు బయట పడింది ఇలా జయప్రదం గా సాగుతున్నట్టు వంటి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సమ్మే తెలంగాణ కమిటీ సంపూర్ణంగా సమర్పిస్తున్నందు మీరు చివరంటా పోరాడి విజయం సాధిం చేదాకా మీకు తోడుందామని భుజం భుజం కలిపి మీ కార్యాచరణ లో పాల్గొంటామని తెలిజేస్తున్నారు.మొత్తానికి ఈ సమ్మే ప్రభావం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

నిజంగానే ఆడవారికి మంచి రోజులు రాబోతున్నాయా?

  హైదరాబాద్ కు ఐటీ కంపెనీల అభివృద్ధి వేగవంతమవుతోంది. పరుషులకు ధీటుగా మహిళలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల అంటేనే ఇరవై నాలుగు గంటల డ్యూటీ. మహిళలకూ మినహాయింపు ఉండదు. దీంతో నైట్ షిప్టు డ్యూటీ లు చేసే మహిళల సంఖ్య పెరిగింది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు అయింది. దీంతో పరిస్థితు లు పూర్తి గా మారిపోయాయి. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన భద్రత చర్యల తో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఎప్పుడైనా ఉద్యోగాని కి వెళ్లి రాగలుగుతున్నారు మహిళా ఉద్యోగులు. సైబరాబాద్ తొలినాళ్ల లో మహిళల భద్రతకు సవాల్ గా ఉండేది. ఐటీ కారిడార్ లో వందల సంఖ్య లో ఐటీ కంపెనీలు రావడం లక్షలాది మంది మహిళలు ఉద్యోగాల్లో చేరడం అందుకు కారణం.రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న దాడులు లైంగిక వేధింపులతో పోలీసు లు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈవ్ టీజింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు భరోసా కేంద్రాల షీటీమ్స్ బృందాలను రంగంలోకి దింపారు.ఫలితంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ లో క్రమం గా మహిళల కు భద్రత పెరిగింది. షీటీమ్స్ బృందాలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పనిచేయటంతో పాటు వాట్సప్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపడుతున్నారు. ఐటీ కారిడార్ లో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భరోసా సెంటర్ లను ఏర్పాటు చేశారు. మహిళలకు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు డాక్యుమెంట్ లతో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగినీలు ప్రయాణించి ఆటో క్యాబ్ లకు సంబంధించి పూర్తి స్థాయి నిఘా ఉండేలా క్యూ ఆర్ కోడ్ ను రూపొందించారు.సైబరాబాద్ పోలీసులు చేపట్టిన చర్యల తో మహిళలపై నమోదయ్యే కేసు లు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయని సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు.  మహిళలకు సంబంధించిన నష్టాలు ఏమున్నాయి వాళ్ల కి సపోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి ఎన్జీవోస్ ఎవరున్నారు మరియు ఎవరైనా మహిళ  బాధతో వస్తే ఆమెకు ఏ రకంగా చేయూత నివ్వాలి ఏ రకంగా సానుభూతి చూపించాలి అన్న అంశాల మీద కూడా వాళ్లక ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లు అక్కడ ఐటి ఇండస్ట్రీలో ఎవరైనా మహిళ ఏదైనా బాధతో వాళ్ల దగ్గర వస్తే వాళ్లకు ఎటువంటి సహాయం ఇవ్వాలి షీటీమ్స్ కావాలంటే షీటీమ్స్ నంబర్స్ అట్లాగే భరోసా సెంటర్ నంబర్స్ ఇచ్చి ఎన్ని రకాలు గా ఆమెకే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నదాని మీద వాళ్ల ని ట్రెయిన్ చేసి వాళ్లకే చేయూత కోసం వాళ్ళకు భరోసాను ఇవ్వడంను ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనసూయ తెలియజేశారు.అసలు మహిళలను తప్పుడు ఆలోచనతో చూడాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తున్నారని మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించడంపై సైబరాబాద్ పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ కారిడార్ లో ఉచితంగా షీ షటిల్స్ మినీ బస్సులను మహిళల కోసం ఏర్పాటు చేశారు. యువతులపై జరుగుతున్న సంఘటనల నేపథ్యం లో వారికి మెరుగైన భద్రత సౌలభ్యమైన ప్రయాణం అందించాలని సైబరాబాద్ పోలీసు లు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు తమ తమ మహిళా ఉద్యోగు లకు రవాణా సౌకర్యా లు కల్పించాలని జీవో నెంబర్ యాభై ఒకటి ను తీసుకొచ్చారు. దీంతో సైబరాబాద్ పరిధి లోని అన్ని కంపెనీలూ మాల్స్, మల్టీప్లెక్స్ లు, మహిళా ఉద్యోగు లకు వారి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ట్రాన్స్ పోర్టేషన్ ఫెసిలిటీస్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి షీ షటిల్ బస్ సర్వీస్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు నాలుగు బస్సు లు ఐటి కారిడార్ ఏరియా లో తిరుగుతున్నాయి అందులో ఏ మహిళా ఉద్యోగి అయినాగానీ ఐటీఐ కాకపోవచ్చు అక్కడ ఇతర రంగాల్లో పని చేస్తున్న మహిళలు ఎవరైనా గాని ఏ మహిళైనా గానే హాప్ ఆన్ హాప్ ఆఫ్ అన్నమాట ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు ఆ రకంగా షీ షటిల్ బస్ నడుస్తున్నాయి. ఒక ఐటీ కారిడార్ లోని కాదు సైబరాబాద్ పరిధిలోనూ పోకిరీలు, ఆకతాయిల ఆట కట్టించడంతో పాటు మోసగాళ్లు భార్యలను వేధిస్తున్న ప్రబుద్ధుల నయవంచన కు గురి చేస్తున్న కేటుగాళ్ల ను హెచ్చరిస్తూ బాధిత మహిళల కు రక్షణ కల్పిస్తున్నామని ప్రత్యేక భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మహిళల ను వేధిస్తున్న వారి ఆట కట్టించడం తో పాటు బాధిత మహిళల కు లైంగిక దాడుల కు గురైన చిన్నారులకు కుటుంబ సభ్యుల వేధింపులకు గురైన బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించి మానసిక దృఢత్వాన్ని కల్పించి సమస్య లను ఎదుర్కొనే ధైర్యాన్ని అందించే విధంగా భరోసా కేంద్రాన్ని తీర్చిదిద్దామని అంటున్నారు. మహిళల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసు లు తీసుకుంటున్న భద్రతా చర్యల తో నేరాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని పదేపదే నేరాలు చేసే వారి డేటాను తీసుకొని వారి పై నిరంతరం నిఘా పెడుతున్నారు అధికారులు.నిజంగానే ఈ చర్యలన్ని సక్రమంగా జరుగుతుంటే ఆడవాళ్ళ విషయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండగలగటమే కాగా  నేరాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించడంలో ఎటువంటి సందేహంలేదు.

కోడెల శివరాం స్టేట్మెంట్ కోసం గుంటూరుకి బంజారాహిల్స్ పోలీస్ బృందం!!

  గత కొన్ని రోజుల కిత్రం టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.ఆయన కుమారుడే కోడెలను హత్య చేశాడు అని వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. ఇలాంటి ఆరోపణలు కూడా ఎదురైయ్యాయి. దీని విచారణనిమిత్తం బంజారా హిల్స్ పోలీసులు వారి కుటుంబ సభ్యులను కూడా విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ మిస్సింగ్ పట్ల కూడా చాలా అనుమానాలు వెలిగులోకి వచ్చాయి. కోడేలను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది ఆ ఫర్నీచర్ కేసు.ఇందులో తన కొడుకు,కూతురకు కూడా భాగం ఉందని కేసులు ఆరోపించారు.ఇందు భాగంగా ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ మిస్సింగ్ కేసులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ కృష్ణ మంగళగిరి కోర్టు కు హాజరయ్యారు. అయితే ఇదే సమయంలో కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు లు విచారించారు. ఈ విచారణ కు కుమారుడు శివరామ్ హాజరుకాలేకపోయారు. మంగళగిరి కోర్టు కు హాజరు కావాల్సి ఉండడం తో ఆయన తన తండ్రి ఆత్మహత్య కేసు విచారణ కు రాలేకపోయారు. ఇపుడు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చెయ్యటానికి బంజారాహిల్స్ పోలీసులు గుంటూరు వెళ్లడానికి సిద్ధమయ్యారు.ఒక పక్క మంగళ గిరి కోర్ట్ కేసులో హాజరు అయ్యి బెయిల్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మరో పక్క తండ్రి ఆత్మహత్య కేసు లో విచారణకు హాజరు కావడం వీలు కాకపోవడంతో ఆఖరికి పోలీసులే తనున్న గ్రామానికి వెళ్లాలని నిర్ణయించారు. దీని బట్టి బంజారహిల్స్ పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా ముగిస్తారని అంతేకాక ఈ కోడెల కేసు పై వారు చాలా నిఖచ్చిగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది.ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.