హోరా హోరీగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె...

చరిత్రాత్మకమైన సమ్మె ఐదో తేదీన ప్రారంభమైంది.ఎటు చూసినా ఈ సమ్మే పైనే చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు సీరియస్ గానే ఉంది. మరో మాటలో చెప్పాలంటే ఉక్కుపాదం మోపుతోంది. సమ్మె మొదలుపెట్టినరోజే సాయంత్రం ఆరు గంటల వరకు డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం ఆ తర్వాత పన్నెండు వందల మంది కార్మికు లు మిగిలారు అని తేల్చింది. తాజా గా సమ్మె చేస్తున్నా ఉద్యోగు లకు వర్తిం చే ఈఎస్ ఐ సౌకర్యాన్ని కూడా రద్దు చేసింది సర్కార్. సికింద్రాబాద్ లోని తార్నాక లో ఆర్టీసీ సిబ్బంది వైద్య ఆరోగ్య పరీక్షకు ఈఎస్ఐ సేవలందించే కార్యాలయం ఉంది. సమ్మె చేస్తున్న సిబ్బందికే సౌకర్యాలూ ఇవ్వవలసిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు రావడంతో  నిరాకరణ చెబుతున్నారు ఈఎస్ఐ సిబ్బంది.సమ్మెను ఉధృతం చేస్తోంది ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న నాయకులు ఇక ప్రజల్లోకి వెళతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదని అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లోని కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఎంత మొండి గా ముందు కు వెళితే తాము అంతే మొండి గా ముందు కు వెళతామని చెబుతున్నారు. దీంతో సమ్మె ఇటు వైపు వెళుతుందో అని టెన్షన్ నెలకొంది. ఇటు ప్రభుత్వం మాత్రం మొన్నటి నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల కార్యాచరణ ఏంటి సర్కారు తరవాతే నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే అన్ని సంఘాల మద్దతును కూడగట్టిన కార్మిక సంఘాలు. ఇటు అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడా కోరాయి. ఈ నేపధ్యం లో ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విపక్షాల తో భేటీని కూడా ఏర్పాటు చేశారు.ఈ భేటీకి హాజరైన పక్షాలన్నీ ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతును ప్రకటించాయి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లు న్యాయబద్ధమైనవని చెబుతున్నారు. విపక్షాల నేతలు సిపిఐ సిపిఎంతో పాటు బీజేపీ, టిడిపి కూడా ఆర్టీసీకి మద్దతును ప్రకటించాయి.ఈ సమ్మె గతంలో బహుశా  గుర్తున్నంత వరకూ ఇంత జయప్రదంగా నూటికి నూరు శాతం కార్మికు లు కూడా సమ్మె లో పాల్గొన్నటువంటి మొదటి సందర్భం చెప్పి తెలియజేశారు.అశ్వత్థామ గారు ఒకసారి పత్రికల్లో సవాల్ చేసినట్టు గా హాజరయ్యారు హాజరయ్యారు అంటున్నారు హాజరైన వాళ్ల పేరు ఒక్క పేరు బయట పడింది ఇలా జయప్రదం గా సాగుతున్నట్టు వంటి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సమ్మే తెలంగాణ కమిటీ సంపూర్ణంగా సమర్పిస్తున్నందు మీరు చివరంటా పోరాడి విజయం సాధిం చేదాకా మీకు తోడుందామని భుజం భుజం కలిపి మీ కార్యాచరణ లో పాల్గొంటామని తెలిజేస్తున్నారు.మొత్తానికి ఈ సమ్మే ప్రభావం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Teluguone gnews banner