bjp leader sujana chowdary comments on polavaram project

పోలవరం పై బీజేపీ నేత సుజనా స్పందన,పోలవరం ఒక కలగానే మిగలనుందా?

  ఏపీ లో నిన్న మొన్నటిదాకా ఉత్కంఠంగా నడచిన అంశం పోలవరం. అసలు పొలవరం ఎప్పటికైనా పూర్తి అవుతుందా లేదా అనే అంశం పై ప్రజలు ఆశలు కూడా వదులుకుంటున్నారు అనడంలొ ఆశ్చర్యం లేదు. ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసి రావటమే కాక  పోలవరం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను కలిసిన రాష్ట్ర నేతలు ప్రాజెక్టుపై చర్చించారు. అంతకుముందు పోలవరం పర్యటన ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు పోలవరంపై నిర్దిష్టంగా బీజేపీ డిమాండ్ ఏంటి అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపించటం లేదు. పోలవరం విషయంలో పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్ చేస్తుండడంతో ఈ వ్యవహారంపై అసలు బీజేపీ ఏం కోరుకుంటోంది అనేది అర్థం కాకుండా తయారైంది. పోలవరంలో అవినీతి జరిగిందని గతం నుంచే బీజేపీ ఆరోపిస్తుంది. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు తీవ్ర స్థాయిలో పోలవరంపై ఆరోపణలు చేశారు. ఇక టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత కూడా బీజేపీ నేతలు అదే స్వరం వినిపించారు. పార్టీ అధ్యక్షుడు కన్నా కూడా పోలవరం పునరావాసంలో అక్రమాలు జరిగాయని ఒకటికి రెండు సార్లు ఆరోపించారు. అయితే ఈ అంశాల పై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ వివరణ ఇచ్చింది. పోలవరం నిర్మాణంలో అక్రమాల అంశాల్ని కేంద్రం పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. పార్లమెంట్ లోనూ, బయట పోలవరం నిర్మాణ విషయంలో అవినీతి జరగలేదని స్వయంగా కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. అయినా ఇప్పుడు కేంద్ర పెద్దలను కలిసినా రాష్ట్ర  బీజేపీ నేతలు మళ్లీ అవినీతిపైనే ఫిర్యాదు చేశారు.అదే సమయంలో రివర్స్ టెండర్ల విషయంలో కూడా బీజేపీ ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. ఇప్పటికే రివర్స్ టెండర్ లకు సంబంధించి కేంద్రం అభ్యంతరం చెప్పింది. అయితే రివర్స్ టెండర్ లలో ఎనిమిది వందల కోట్ల ఆదా చేయవచ్చు అన్ని తీరుగా జగన్ సర్కార్ వెల్లడించింది.  బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి పోలవరం విషయంలో ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో అవినీతి అంటూ విచారణ చేపడితే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో గతాన్ని వదిలేసి ప్రాజెక్టుకు పూర్తిగా ఏం చర్యలు తీసుకోవాలో వాటిపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నాటి ప్రభుత్వం పై ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలతో సుజనా విభేదిస్తున్నారు. అదిలా ఉంటే ఇప్పటికే కేంద్రం నుంచి పోలవరానికి ఆరు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల కావాల్సింది. గత రెండేళ్ల నుంచి మొత్తం పెరుగుతూ వస్తోంది. అయితే డీపీఆర్ 2 కు ఆమోదం వచ్చే వరకు ఈ నిధులు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు అని స్పష్టమవుతోంది. మొత్తంమీద పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ నేతల ఫిర్యాదులు తరువాత అసలు పోలవరానికి సంబంధించి కేంద్ర జల వనరుల శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరింత ఆసక్తికరంగా మారింది.

ap cm ys jagan new strategy on tollywood

జగన్ వ్యూహంలో మెగాస్టార్ చిక్కుకుంటారా? టాలీవుడ్ పై అసలు వైసీపీ వ్యూహామేంటి?

  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరు. గతంలో జగన్-చిరంజీవి మధ్య పొరపచ్చాలున్నప్పటికీ, మెగాస్టార్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారు. అసలు పాలిటిక్స్‌ అనే పదం వినడానికి కూడా చిరంజీవి ఇష్టపడటం లేదని అంటారు. ఇక, రాజకీయంగా పవన్‌తోనూ ఎలాంటి సంబంధం లేదని ఎన్నోసార్లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే, చిరంజీవితో సమావేశానికి జగన్ ఒప్పుకోవడం జరిగిందని, అదేసమయంలో ఇండస్ట్రీ పరిణామాలపై చర్చించారని ప్రభుత్వ, పార్టీ వర్గాలు అంటున్నాయి.  సాధారణంగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, సినిమా పరిశ్రమ పెద్దలు, పాలకులను కలిసి, అభినందించాలనుకుంటారు. కానీ జగన్‌ సీఎం అయి, నాలుగు నెలలు అవుతున్నా, ఇప్పటివరకు, సినిమా పరిశ్రమ పెద్దలు జగన్‌ను కలవడానికి రాలేదన్న విమర్శ ఉంది. అయితే, టాలీవుడ్ పెద్దలు ఇప్పటివరకు, జగన్ను కలవకపోవడానికి కారణం, చంద్రబాబు కనుసన్నల్లోనే ఇండస్ట్రీ నడుస్తోందని వైసీపీ బలమైన అనుమానం. అందుకే ఇండస్ట్రీలో ఒకవర్గం ఆధిపత్యాన్ని తగ్గిస్తే, ఆటోమేటిక్‌గా చంద్రబాబు బలాన్ని కూడా తగ్గించినట్టు అవుతుందని జగన్ భావనగా అర్థమవుతోంది. అయితే, వైసీపీ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన ఆ గ్యాప్‌ను చిరంజీవితో భర్తీ చేయాలని జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు. చిరంజీవి ఇప్పుడు మొత్తం సినిమాలపైనే ఫోకస్‌ పెట్టినా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో రాజకీయ దన్ను అవసరం. అలాగే రాజకీయాల్లో ఉన్న నాయకులకు... సినీ ఇండస్ట్రీ సహకారం, అందులోనూ మెగాస్టార్‌ లాంటి అగ్రతారల సపోర్ట్‌ కూడా అవసరం. అలా ఉభయులకూ ప్రయోజనం కలిగేలా... ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య అగాథాన్ని పూడ్చేలా, ఆ బాధ్యతను మీరే తీసుకోవాలని చిరంజీవిని జగన్‌ కోరినట్టు చెబుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన అంశాలన్నింటిలో, అంటే ప్రత్యేక షోలు, ప్రత్యేక ధరలు, పన్నుల రాయితీలు ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో, ఏదైనాసరే చిరంజీవి సిఫార్సు ద్వారానే అనుమతించే అవకాశముందంటున్నారు. దాంతో తెలుగు సినిమా పరిశ్రమను మెగా ఫ్యామిలీ పూర్తిస్థాయిలో లీడ్ చేయబోతోందనే టాక్ వినబడుతోంది. మరి, చిరును ముందుపెట్టి... టాలీవుడ్ ను తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనే జగన్ వ్యూహం ఫలిస్తుందో లేదో కాలమే తేలుస్తుంది. మొత్తానికి జగన్-చిరు మీటింగ్ తర్వాత టాలీవుడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

CPI Big Shock to TRS over Huzurnagar by Elections

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ చుక్కెదురు...

  హుజూర్ నగర్  ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.హుజూర్ నగర్ ఎన్నికలు అంటే అందరిలో చర్చనీయంశంగా మారిన విషయం అనే చేప్పుకోవచ్చు. ప్రచారానికి మిగిలింది కేవలం అయిదు రోజులే కారణంగా పార్టీల అభ్యర్ధులు, మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో సాగిన ప్రచారం ఇప్పుడు ఇంకొంచెం జోరందుకుంది. మరోవైపు సరిగ్గా పోలింగ్ కు ఆరు రోజుల ముందు సిపిఐ యూటర్న్ తీసుకుని టీఆర్ఎస్ కు షాకిచ్చింది. సీపీఐ యూటర్న్ వెనుక ఆర్టీసీ సమ్మె సెగ తగిలుంటుందనే భావన అందరిలో నెలకొంది.  సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందని, కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి నిరుద్యోగ యువకులను, ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా  ఘర్షణ వాతావరణం కలిగిస్తున్నదని వెల్లడిస్తున్నారు.ఈ వైఖరిని మార్చుకోమని సీపీఐ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సమ్మె కారణంగా కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతు వారి ప్రాణాలు కోల్పోతున్నారు. మానసిక వేదనతో కొందరు మరణించగా, గుండె పోటుతో ఇంకొందరు మరణిస్తున్నారు. పరిష్కారం బదులు ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు ఇతర పార్టీ నేతలు. ఈ పరిస్థితుల్లో సీపీఐ కార్మికవర్గ పార్టీగా, శ్రామిక వర్గ పార్టీగా స్పందించి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ, టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హుజూర్ నగర్ రోడ్ షో ని నిర్వహించబోతున్నారు. పదిహెడువ తేదీ సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్ళనున్నారు అని సమాచారం. పధ్ధెనిమిది, పంతొమ్మిదివ తేదీల్లో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.  ఎలక్షన్లల్లో విజయం సాధించలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ మొదటి నుంచి ముందుకు సాగే ప్రయత్నాలు చేసింది.దీనికి సీపీఐ మద్దత్తు కూడా తోడవ్వడంతో మంచి జోరు మీద ఉంది కారు పార్టీ. కానీ ఆర్టీసీ సమ్మే సెగ కారణంగా సీపీఐ తమ మద్దత్తును ఉపసంహరించుకుంది.కేవలం ఐదు రోజులు మాత్రమే ప్రచారానికి ఉన్న సందర్భంగా ప్రతి పార్టీ నేతలు వారి గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు . టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి తన గెలుపు కోసం, పార్టీ కోసం ఐదు రోజులు ఎన్నికల ప్రచారంలో దిగి పెద్దెత్తున ఓట్లు పొందాలన్న ఉద్దేశంతో ప్రాచారం కొనసాగిస్తుండగా,  కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. కానీ ఏదేమైనా కూడా ఈ నియోజక వర్గాలలో హోరాహోరిగా  కాంగ్రెసు, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది.మొత్తం మీద ఈ ఐదు రోజుల పాటు ఈ ప్రచారాన్ని ఎలా వినియోగించుకోవాలన్న లక్షంతో అన్ని పార్టీలు బిజీబిజీగా ముందుకు సాగుతున్నాయి.

Megha Gave 100 Crore to Congress

ఐటీ దాడుల్లో బయటపడుతోన్న ‘మేఘా‘ గుట్టు... కాంగ్రెస్ తో 100కోట్ల ఆర్ధిక లావాదేవీలు...!

  ఐటీ దాడుల్లో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గుట్టురట్టు అవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తో మేఘా కంపెనీ నడిపిన రాజకీయ లావాదేవీల డొంక బయటపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టి వేలకోట్ల రూపాయల లబ్ది చేకూర్చిన ఓ ముఖ్యనేతకు అండగా ఢిల్లీ స్థాయిలో మేఘా సంస్థ జరిపిన ఆర్ధిక లావాదేవీల బండారం ఐటీ దాడుల్లో బట్టబయలైంది. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా పార్టీల అధినేతలను కలిసి హడావిడి చేసిన ఓ పార్టీ అధినేతకు మద్దతుగా మేఘా ఈ రాజకీయ లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి అనుకున్న సీట్లు రాక, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటైతే ఉపప్రధాని కావాలని కలలుగన్న తెలంగాణ ముఖ్యనేత కోసం మేఘా కంపెనీ.... హస్తినలో మధ్యవర్తిత్వం నడిపినట్లు ఐటీ రైడ్స్ లో ఆధారాలు దొరికాయట.  దేశవ్యాప్తంగా మేఘా కంపెనీ కార్యాలయాలు, మేఘా ఫ్యామిలీ నివాసాల్లో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు.... దొరికిన ఆధారాల మేరకు.... ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ బేరర్ల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఏఐసీసీ ఫైనాన్షియల్ విభాగంలో పనిచేస్తున్న మాథ్యూస్​వర్గీస్​ఇంటిపై ఐటీ దాడులు చేశారు. ఢిల్లీ, కేరళలోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి... మాథ్యూస్​వర్గీస్​కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశాన్ని మార్చేస్తానంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా పార్టీల అధినేతలను కలిసిన తెలంగాణ ముఖ్యనేతకు మద్దతుగా మేఘా కంపెనీ.... కాంగ్రెస్ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్లు ఐటీ దాడుల్లో తేలిందట. ఏఐసీసీకి మేఘా కంపెనీకి మధ్య జరిగిన 100కోట్ల రూపాయల లావాదేవీపై ఐటీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ys jagan to launch rythu bharosa scheme in nellore

నెల్లూర్ లో రైతు భరోసాను ప్రారంభించనున్న జగన్, అదే జిల్లాలో చంద్రబాబు పర్యటన...

  ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతి పక్షనేత చంద్రబాబు ఈ రోజు నెల్లూరులోనే పర్యటించబోతున్నారు. నిన్ననే నగరానికి వచ్చిన చంద్రబాబు ఈ రోజు కూడా జిల్లా పార్టీ సమీక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. మరికాసేపట్లో నగరానికి రానున్న ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ ఒక్క రోజే సీఎం జగన్మోన్ రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా పర్యటిస్తున్నారు.  తొలి రోజు పర్యటనలో జిల్లా నేతలతో సమావేశమైనటువంటి చంద్రబాబు, రెండో రోజు కూడా ఇవాళ ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల నేతలందరితో కూడా సమావేశం అవుతారు. అలాగే ఎన్నికలైన తర్వాత తొలిసారిగా జిల్లా వచ్చినటువంటి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పది నియోజక వర్గాల్లో కూడా పూర్తిగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఓటమి చెందిన తరువాత పార్టీలో నేతలందరితో కూడా సమీక్ష నిర్వహించారు. అలాగే ఇటీవల టిడిపి నేతలపై దాడులు జరుగుతున్నాయి. దాడుల నుంచి కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ముందుంటానని భరోసా ఇఛ్ఛేటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటనలు చేసినటువంటి చంద్రబాబు నిన్న నెల్లూరు జిల్లాకు వచ్చారు. నిన్న ఐదు నియోజక వర్గాల సమీక్ష నిర్వహించారు. ఇవాళ మిగిలినటువంటి ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలో పాల్గొంటారు.  ఇక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ ఉదయం పదకొండు గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ఇక్కడ్నుంచే ప్రారంభిస్తారు.నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క జిల్లా నుంచి ప్రారంభిస్తూ వస్తున్నటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పన్నెండు వేల ఐదు వందల ఏడాదికి ఇస్తానని ప్రకటించిన అటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భరోసా సాయాన్ని మరొక వేయ్యి రూపాయలు కూడా పెంచింది. పదమూడు వేల ఐదు వందల వరకు కూడా సాయమిస్తానంటూ ప్రకటించినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు జిల్లాలో పర్యటిస్తుండటంతో అధికారులలో కాస్త టెన్షన్ మొదలైనది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల కావచ్చు అలాగే నేతల్లో కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇటు హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన స్వాగత  ఏర్పాటులో అందరూ కూడా బిజిబిజీగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనబడుతుంది.ఇక ఈ సమావేశాలు ఎలా జరగబోతున్నాయో వేచి చూడాలి.  

Nannaya University assistant professor surya Raghavendra suspended

ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ వీసీ...

  నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వ్యవహారంపై విచారణ వేగవంతమైంది, ఏడుగురు సభ్యులతో హైపవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద, ఐద్వా, ప్రొఫెసర్లూ, బోధనేతర సిబ్బందితో కమిటీ ఏర్పాటైంది. నన్నయ్య వర్సిటీలో జరగుతున్న చీకటి వ్యవహారాలపైన కమిటీ దృష్టి సారించనుంది. ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర పై నిన్న సస్పెన్షన్ వేటు పడింది, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎమ్.ఎ ఇంగ్లీష్ విభాగం హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సురేష్ వర్మ సస్పెండ్ చేశారు. లైంగిక ఆరోపణలపై కేసు నమోదైన నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ వీసీ ఉత్తర్వులను జారీ చేశారు. యూనివర్శిటీలో చదివే మహిళా విద్యార్థినిలపై ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని బాధిత విద్యార్థినిలు యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్స్ లో పాస్ కావాలంటే తాను చెప్పిన చోటుకు రావాలని లైంగికంగా వేధించేవాడని బాధిత విద్యార్థినిలు వీసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి చాలా రోజులైనా వీసీ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోక పోవటంతో విసిగిపోయిన బాధిత విద్యార్థినిలు ఏకంగా ముఖ్య మంత్రి జగన్ కే లేఖ రాశారు. బాధిత విద్యార్థినుల లేఖపై స్పందించిన సీఎం జగన్ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ వీసీకి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం ఉత్తర్వుల నేపథ్యంలో వీసీ దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై విద్యార్ధినులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Darmadi Satyam Team Begins Rescue Operation

గోదావరి బోటు ఘటన మరో టైటానిక్ కానుందా?

గోదావరిలో మునిగిన బోట్ ను వెలికితీయడం సాధ్యమేనా అనే అంశం పై ఎప్పటినుంచో ఉత్కంఠం చెలరేగుతోంది.పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తోన్న ధర్మాడి సత్యం బృందం తన లక్ష్యాన్ని చేదిస్తుందా అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితిలా ఉంది. బోట్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ ఒప్పుకొన్న ధర్మాడి సత్యం బృందం తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. కచ్చులూరు సమీపంలో లంగరులు వేసి బోట్ ని గుర్తించిన ధర్మాడి సత్యం టీమ్ దాన్ని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మధ్యలో ఐరన్ రోప్ తెగి పోవడంతో ఆపరేషన్ కి బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో గోదావరిలో వరద ఉధృతి తగ్గక పోవటం వర్షాల బీభత్సం కూడా తోడవటంతో తొలి దశ ప్రయత్నం విఫలమైంది.  అయితే ఇప్పుడు నదిలో వరద కాస్త తగ్గడం వర్షాల కూడా లేకపోవటంతో సత్యం బృందం రెండోసారి ఆపరేషన్ ని మొదలు పెట్టింది. నిన్న సాయంత్రం ధర్మాడి సత్యం బృందం కచ్చులూరుకు చేరుకొంది. సత్యంతో పాటు ఈ బృందంతో ఇరవై ఐదు మంది ఎక్స్ పర్ట్స్, మరో ఇరవై ఐదు మంది మత్స్యకారులు పాల్గొంటున్నారు. అంతేకాదు ఓ భారీ ప్రొక్లైనర్, పంటు, ఓ బోటును కూడా తీసుకువచ్చారు. పంటును తీసుకుని నదిలోకి వెళ్లిన ధర్మాణి సత్యం బృందం ఐరన్ రోప్ లకు లంగర్లను తగిలించి నీళ్లలోకి వదులుతోంది. అయితే రెండోసారి ఆపరేషన్ కూడా మళ్లీ మొదటి నుంచే మొదలు పెట్టాల్సి వచ్చింది. గోదావరిలో నీరు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బోటు యథాస్థానంలోనే ఉందా మరో స్థానానికి కదిలివెళ్లిందా అన్నది తెలియాల్సి ఉంది. దీంతో ముందు సత్యం టీమ్ బోటును కనిపెడితే ఆ తరవాత దాన్ని లాగే ప్రయత్నాలు మొదలవుతాయి. నీళ్ళల్లో మునిగిన బోట్లు వెలికితీయడంలో ధర్మాడి సత్యం టీమ్ ముప్పై ఏళ్ళ అనుభవముంది. బాలాజీ మెరైన్స్ పేరుతో ఇప్పటికే అనేక క్రిటికల్ ఆపరేషన్స్ ను చేపట్టాడు ధర్మాడి సత్యం. గతంలో బలిమెలలో మునిగిన నావను వెలికితీసింది కూడా ధర్మాడి సత్యం బృందమే, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు కచ్చులూరులో మునిగిన బోటును బయటకు లాగేందుకు అంగీకరించారు అధికారులు. అన్నీ కలిసొస్తే ప్రకృతి సహకరిస్తే రెండ్రోజుల్లో ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సెప్టెంబరు 15 వ తేదీన రాయల్ వశిష్ట బోట్ గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో డెబ్బై ఏడు మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రాణాలతో బయటపడ్డది కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే, ఇంకా ఆచూకీ తెలియాల్సి వారి సంఖ్య పద్నాలుగుగా చెబుతున్నారు అధికారులు. ఈ పద్నాలుగు మంది మృతదేహాలు బోటుతో పాటు నీళ్లలోనే ఉంటాయన్నది ఒక అంచనా. ఆపరేషన్ వశిష్ట రెండో భాగం విజయవంతమైతే తప్ప ప్రమాద సమయంలో బోట్ లో ఎంతమంది ఉన్నారన్న లెక్క కూడా తేలే అవకాశం కనిపించట్లేదు. గోదావరిలో నీరు అధికంగా ఉండటం బోటు మునిగిన ప్రాంతాల్లో సుడులు ఎక్కువగా ఉండడం వల్లే మొదటి ప్రయత్నం విఫలమైందని చెబుతోంది ధర్మాడి సత్యం బృందం. ప్రస్తుతం గోదావరిలో నీటి ఉధృతి కాస్త తగ్గిందని పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని అంటోంది. అన్నీ కలిసొస్తే బోటును బయటకు లాగడం సులభమని అంటోంది ధర్మాడి సత్యం బృందం.ఈ రోజు ఐనా బోటు బయటకు లాగడం సాధ్యమా కాదా అన్నది వేచి చూడాలి.  

Terrorists kill truck driver in Kashmir

రగులుతున్న జమ్మూ కశ్మీర్.. మళ్ళీ ఉగ్రవాదుల దాడి

  ఆర్టికల్ 370 రద్దు విషయంలో జమ్మూ కశ్మీర్ లో తీవ్ర పరిస్థితులు నెలకొన్న సమయంలో 144 సెక్షన్ కూడా విధించారు. కశ్మీర్ మొత్తం పోలీసులు ఆద్వర్యంలోనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలో ఒక ట్రక్ డ్రైవర్ ని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. పండ్ల వ్యాపారిపై దాడి చేశారు. షోపియాన్ ఘటనలో ఒక పాకిస్థానీ యువకుడు కూడా పాల్గొన్నట్టు జమ్ము కశ్మీర్ పోలీసులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు మాటువేసిన ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్నారు.  ఆర్టికల్ 370 రద్దు తరవాత రెండున్నర నెలలుగా కశ్మీరు మొత్తం నిఘా నీడలోనే ఉంది. పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. సెల్ ఫోన్ సర్వీసులను పునురుద్ధరించిన రోజే ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. పండ్ల వ్యాపారులను ఎగుమతి దారులను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. షోపియాన్ జిల్లాలో షరీఫ్ ఖాన్ అనే ట్రక్ డ్రైవర్ ను దారుణంగా ఉగ్రవాదులు హత్య చేశారు. జమ్ము కశ్మీర్ లోకి అక్రమంగా చొరబడిన ఇద్దరు పాకిస్తానీ మిలిటెంట్ లు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజస్థాన్ కు చెందిన షరీఫ్ ఖాన్ జమ్ము కశ్మీర్ లో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో పండ్లు ఎగుమతి పుంజుకోవడంతో చాలా మందికి ఉపాధి దొరికింది. దీన్నే అదునుగా తీసుకొని మిలిటెంట్ లు రెచ్చిపోతున్నారు. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో భద్రతను కట్టు దిట్టం చేశాయి. ఉగ్రవాదులతో పాటు చొరబాటుదారుల కదలికలపై నిఘా పెంచాయి. దాడికి పాల్పడిన మిలిటెంట్ లలో పాకిస్థాన్ జాతీయుడు కూడా ఉండటంతో పాక్ కు వ్యతిరేకంగా బలగాలు సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నాయి.

facts about chiranjeevi and ys jagan meeting

జగన్-చిరు భేటీలో సైరాను మించిన డిస్కషన్స్... మెగా ఫ్యామిలీ కేంద్రంగా టాలీవుడ్ పై వైసీపీ వ్యూహం

  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి మీటింగ్ తర్వాత టాలీవుడ్ లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్-చిరు భేటీలో కేవలం సైరా గురించే మాట్లాడుకోలేదని, తాజా రాజకీయ పరిణామాలు, టాలీవుడ్ లో పరిస్థితులపై చర్చ జరిగిందని అంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో ఉందని, అందుకే తాను ముఖ్యమంత్రి అయినా అభినందించడానికి టాలీవుడ్ ప్రముఖులు అభినందించడానికి రాలేదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా, సినీ పరిశ్రమ నుంచి తనను కలిసిన మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ పరిస్థితుల గురించి జగన్ క్షుణ్ణంగా చర్చించారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు టార్గెట్ గా, టాలీవుడ్ లో ఆ సామాజికవర్గ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనకు జగన్ వచ్చారని చెబుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న చంద్రబాబు సామాజికవర్గం ప్రముఖులకు చెక్ పెట్టడమే కాకుండా, ఆ వర్గం డామినేషన్ లేకుండా, వాళ్లను నిమిత్తమాత్రులుగా చేయాలనే వ్యూహాన్ని మెగాస్టార్ చిరంజీవి కేంద్రంగా చేయాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని, సినీ పరిశ్రమను దారిలోకి తెచ్చుకోవాలనేది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. అందుకే, ఇకపై టాలీవుడ్ కి సంబంధించిన ఏ పనైనా చిరంజీవి సిఫార్సుతోనే చేసేలా ప్రభుత్వ వర్గాలకు సంకేతాలు పంపారట. ఓవరాల్ గా తెలుగు ఇండస్ట్రీని జగన్ తరపున మెగా కుటుంబం లీడ్ చేసేలా వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి-మెగాస్టార్ చిరంజీవి సమావేశంలో... సైరాను మించిన డిస్కషన్స్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

HC directs Telangana govt not to demolish secretariat buildings

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు సంచలన నిర్ణయం...

  తెలంగాణ సచివాలయం కూల్చివేత నిన్న మొన్నటి దాకా పెద్ద చర్చనీయంశంగా మారిన సంగతి అందరికి తెలిసిందే .తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వ నిర్ణయం పై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.కొత్త భవనాల కూల్చి వేయడం ఏంటని ప్రశ్నించింది. ఫైర్ సేప్టీ అధికారుల చేసిన సూచనలు పాటించకుండా మొత్తం భవనాలనే కూల్చివేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవాళ కూడా సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో విచారణ కొనసాగనుంది.   తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి. అన్ని హంగులతో రెండు వేల పదమూడులో నిర్మించిన సచివాలయ బ్లాకును కూల్చివేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హై కోర్టు ప్రశ్నించింది. రెండు వేల పదహారులో ఫైర్ సేఫ్టీ అధికారులు కొన్ని సూచనలు మాత్రమే చేశారని వాటిని కూల్చివేయమని చెప్పలేదని గుర్తు చేసింది. సి, డి ,ఈ బ్లాకుల్లో పెద్దగా లోపాలు లేవని నివేదిక స్పష్టం చేస్తోందని, అలాంటి వాటిని కూల్చి కొత్తగా నిర్మాణాలు చేపడతాం అంటే ఎలా అని ప్రశ్నించింది. పలు జిల్లా కోర్టుల్లో సరైన సౌకర్యాలు లేవని ఫైర్ సేప్టీ ఊసే లేదని న్యాయాధికారులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేసింది. జిల్లాలోని అన్ని కోట్లు కూల్చివేసి అన్ని సౌకర్యాలతో కొత్తవి కట్టాలని అడిగామా అని కోర్టు ప్రశ్నించింది. భవనాలకు తగిన మరమ్మతులు చేయడం ద్వారా తిరిగి వినియోగంలోకి తేవచ్చని సూచించింది.  ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది కోట్ల మంది ప్రజల అవసరాలకు సరిపడా ఉన్న సచివాలయ భవనాలు ఏపీ ఖాళీ చేసిన తరవాత నాలుగు కోట్ల మంది అవసరాలకు సరిపడేలా లేవా అని ప్రశ్నించింది. కావాలంటే నూట ముప్పై ఏళ్ల క్రితం పధ్ధెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించిన జి బ్లాక్ శిథిలావస్థలో ఉండి వినియోగానికి పనికి రాకుండా ఉన్నందున దానిని కూల్చి అక్కడ మరో భవంతి కట్టుకోవచ్చని సూచించింది. కొత్తగా నిర్మించ తల పెట్టిన సచివాలయ టవర్లకు ఎలాంటి డిజైన్లు సిద్ధం చేశారని అదనపు ఏజీని ప్రశ్నించింది. డిజైన్ల రూపకల్పన పనిని రెండు సంస్థలకు అప్పగించామని ఆయన కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను కోర్టు పరిశీలనకు ఇస్తామని చెప్పారు. దీంతో విచారణను హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.   తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు మరి కొన్ని వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనాలను మరో యాభై డెబ్బై సంవత్సరాల పాటు వినియోగించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. సచివాలయ భవనాలను కూల్చివేసి నాలుగు వందల కోట్లతో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని అవి పూర్తి అయ్యేసరికి ఖర్చు వెయ్యి కోట్లకు చేరుకునే అవకాశముందని ఆయన వివరించారు.  మరోవైపు ఇంజనీరింగ్ చీఫ్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కొత్త భవనాల నిర్మాణానికి సిఫార్సు చేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం భవనాలను కూల్చివేయాలన్న మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందా, నివేదిక ఆధారంగా కూల్చి వేయాలని మంత్రి మండలి నిర్ణయించిందా అని హై కోర్టు ప్రశ్నించింది. ఏఏజీ బదులిస్తూ మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడాన్ని ఆక్షేపించింది. అంతకు ముందు ఫైర్ సేప్టీ అధికారులు భవనాలను తనిఖీలు చేసి స్వల్ప మార్పులు సూచించారని ఆ మేరకు మరమ్మత్తులు చేసి అవసరమైన అగ్ని మాపక యంత్రాలు ఏర్పాటు చేసింది.చిన్న చిన్న మార్పులతో సరిపోయే దానికి ఏకంగా భవనం కూల్చివేయడం తగదు అని ప్రభుత్వ అధాయాన్ని వృధా చేయవద్దని హైకోర్ట్ వెల్లడించింది.

central govt gives another shock to ap govt

జగన్ సర్కార్ కు మళ్ళీ కరెంట్ షాక్...

  జగన్ సర్కార్ మొదలైన ఇన్ని రోజుల్లో ఏపీకి ప్రభుత్వానికి మళ్ళీ కరెంట్ షాక్ తగిలింది. సౌర పవన కంపెనీలకు కూడా ఎల్వోసీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రెండురోజుల్లో జారీ చేయకపోతే జాతీయ ఎక్సేంజ్ ల్లో కరెంటు కొనుగోలును నిషేధిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే నిధులు లేక అల్లాడుతున్న ఏపీ సర్కారుకు కేంద్రం తాజా ఆదేశం కొత్త తలనొప్పి గా మారింది.  ఏపీ విద్యుత్ సంస్థలపై మరో పిడుగు పడింది. సౌర, పవన విద్యుత్ కంపెనీల కూడా ముందస్తు చెల్లింపు లకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ వోసీలు ఇవ్వాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. రెండ్రోజుల్లో వీటిని జారీ చేసి తమకు సమాచారం అందజేయాలని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. లేని పక్షంలో జాతీయ విద్యుత్ ఎక్సేంజ్ నుంచి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని అందులో హెచ్చరించింది. ఇటీవలే ఒకసారి ఎక్సేంజ్ లో కొనుగోలుపై నిషేధం విధించింది దీంతో వారం పాటు రాష్ట్రాన్ని కరెంటు కోతలు అల్లాడించాయి. దీంతో కేంద్రం తాజా ఆదేశాలు విద్యుత్ శాఖ వర్గాలను మళ్లీ గడగడలాడిస్తున్నాయి.  విద్యుత్ సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒక వారం లేదా నెలకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలి. నలభై ఐదు రోజుల్లో వీటిని ఆ కంపెనీలు నగదుగా మార్చు కుంటాయి. ఈ ఆదేశాలు తప్పని సరి కావడంతో ముందుగా కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి సంబంధించిన విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోసీల ఇవ్వడం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారుగా ఐదు వందల యాభై కోట్ల వ్యయమవుతుంది. అయితే ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఎల్వోసీల ఇవ్వకపోవడంతో వాటిలో ఒక ప్రైవేటు ధర్మల్ విద్యుత్ కంపెనీ రాష్ట్రంపై కేంద్రాని కి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో విద్యుత్తు ఎక్సేంజ్ లో రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. దానితో ఆ కంపెనీ కూడా ఎల్వోసీ జారీ మొదలు పెట్టారు. సౌర, పవన కంపెనీ లకు మాత్రం ఇంత వరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వలేదు. దీని పైనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పవర్ సిస్టం కార్పొరేషన్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రానికి పంపింది.  సౌర, పవన విద్యుత్ కంపెనీలకు ముందస్తు ఎల్వోసీల ఇవ్వాలంటే సరాసరిన నెలకు ఐదు వందల యాభై కోట్లు కావాలని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఎన్టీపీసీ సంస్థలకు జారీచేయటానికే ప్రస్తుతం నెలకు ఐదు వందల యాభై కోట్లు ఖర్చవుతుంది. విద్యుత్ సంస్థల వద్ద దీనికి నిధుల లభ్యత లేకపోవడంతో ప్రభుత్వం నేరుగా సర్దుబాటు చేస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇంత పెద్దమొత్తం ఇవ్వాల్సి రావడం అధికార వర్గాలను బెంబేలెత్తిస్తోంది.  తాజా పరిస్థితిని విద్యుత్ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆర్ధికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ఏం చేయాలో నిర్ణయించాలని ఆయన సూచించినట్టు సమాచారం. సౌర, పవన విద్యుత్ పీపీఏలపై రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన వివాదమే దేశవ్యాప్తంగా ఈ ఆదేశాల జారీకి కారణమైందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాలూ ఇటువంటి ప్రయత్నాల మొదలుపెట్టవచ్చు అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయటానికి కేంద్రం ఇటువంటి కఠిన వైఖరి అవలంబిస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో ఈ వివాదం తలెత్తకపోతే కేంద్రం కఠినంగా ఉండేది కాదనిపిస్తోంది అని నిపుణుల అభిప్రాయం. ఇక జగన్ సర్కార్ ఈ అంశం పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

pressure on kcr with rtc workers suicide

ఒకవైపు బీజేపీ... మరోవైపు ఆత్మహత్యలు... తీవ్ర ఒత్తిడిలో కేసీఆర్...

  ఒకవైపు ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతుండటం... మరోవైపు కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగడం... ఇంకోవైపు విపక్షాల విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక, తెలంగాణలో పాగా వేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలని చూస్తుండటంతో... టీఆర్‌ఎస్‌ సర్కారు అప్రమత్తమైంది. బీజేపీకి, కేంద్రానికి ఏ చిన్న అవకాశం ‎ఇవ్వకూడదని భావిస్తోన్న కేసీఆర్‌... ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె ఇలాగే కొనసాగితే... ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం తప్పదని గుర్తించిన సీఎం కేసీఆర్... ఎట్టకేలకు ఒక మెట్టుదిగి... మరో అడుగు ముందుకేశారు. ఆర్టీసీ కార్మికులతో అసలు చర్చలే లేవని, వాళ్లసలు ఉద్యోగులే కాదంటూ ప్రకటించిన కేసీఆరే... చివరికి పరిస్థితి చేయి దాటుతుండటంతో రాజ్యసభ ఎంపీ కేకేను రంగంలోకి దింపారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం కేకేను హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రప్పించారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కేకే.... చర్చలకు సిద్ధంకావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైరైన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... ఎవరు పిలిచినా చర్చలు వస్తామని తెలిపారు. కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటేనే చర్చలు వస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ బెదిరింపులు, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే... ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసుల దమనకాండపై గవర్నర్‌కు చేశామని తెలిపారు. అయితే, ఒకవైపు హుజూర్ నగర్ ఉపఎన్నిక... మరోవైపు ఛాన్స్ కోసం కాచుకుని కూర్చున్న బీజేపీ... ఇంకోవైపు కార్మికుల ఆత్మహత్యలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న కేసీఆర్... ఏదిఏమైనాసరే రెండు రోజుల్లో సమ్మెను విరమింపజేయాలన్న లక్ష్యంతో సానుకూల ధోరణితో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేకే మధ్యవర్తిత్వం విజయవంతమవుతుందో లేదో చూడాలి.

ministers unhappy with cm kcr

కేసీఆర్ తీరుపై ఆ ఇద్దరు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారా? అందుకే నోరు విప్పడం లేదా?

  ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతోపాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దాంతో కేసీఆర్ సర్కారుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వ్యవహరిస్తోంది. అయితే, కార్మికుల ఆవేదనతోపాటు విపక్షాల ఆరోపణలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రభుత్వం కూడా కౌంటర్ మొదలుపెట్టింది. మంత్రులు సైతం ఆర్టీసీ నేతలు, విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఎదురుదాడి చేస్తున్నారు. కార్మికుల జోలికి పోకుండా... సంఘాల నేతలు, విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే, మంత్రులందరూ నోరు విప్పుతున్నా... ఇద్దరు ముగ్గురు మాత్రం మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ కార్మిక నేతలు, విపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో... కౌంటర్ ఇవ్వాలంటూ ఇద్దరు ముగ్గురు మంత్రులు మిగిలిన మంత్రులందరికీ ప్రగతిభవన్ నుంచి ఫోన్లు వెళ్లాయట. ఏం మాట్లాడాలో డైరెక్షన్ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారట. అయితే, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటం... పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కావడంతో... ఆయన్ను నోరు విప్పొద్దని పార్టీ పెద్దలు వారించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి... కాంగ్రెస్‌ నుంచి రావడంతో సమ్మెపై మాట్లాడితే విమర్శలు వస్తాయని వద్దన్నట్లు తెలిసింది. దాదాపు ఇలాంటి కారణంతోనే మంత్రి మల్లారెడ్డిని కూడా వద్దని చెప్పారట. వీళ్లు కాకుండా, మిగతా మంత్రుల్లో పలువురు మీడియా ముందుకొచ్చి రెండ్రోజులుగా ఆర్టీసీ సమ్మెపై, విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, మంత్రులందరూ స్పందిస్తున్నా, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు, ఈటల రాజేందర్ నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. హరీష్‌... యూనియన్ ఆవిర్భావం నుంచి గౌరవ అధ్యక్షులుగా ఉండటంతో... ఆయన స్పందించాలని ఆర్టీసీ కార్మికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే, హరీష్‌, ఈటల... ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ఈ ఇద్దరు మంత్రులూ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

ysr rythu bharosa scheme name changed

రైతు భరోసా పథకం పేరు మార్పు... బీజేపీ హెచ్చరికలతో జగన్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా పథకం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించగా... మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు... రైతు భరోసా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా చెక్కులను సీఎం జగన్ స్వయంగా అన్నదాతలకు అందజేశారు. అయితే, రైతు భరోసా పథకం ప్రారంభానికి ముందే, రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి... ప్రతి ఏటా రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని 12వేల 500 నుంచి 13వేల 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రైతు సంఘాల కోరిక మేరకు, రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని... ఏడాదిలో మూడు విడతులుగా అందజేయనున్నారు. మేలో 7వేల 500... రబీలో 4వేలు... సంక్రాంతికి 2వేలు... అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును మార్చారు. రైతు భరోసా కింద ఇస్తోన్న పెట్టుబడి సాయంలో 6వేల రూపాయలను కేంద్రమే ఇస్తుండటంతో... ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజనగా నామకరణం చేశారు. బీజేపీ నుంచి విమర్శలు రాకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

K Keshava Rao letter creates panic on TSRTC strike

కేకే లేఖపై అనుమానాలు... కార్మికులు ఒప్పుకుంటారా? లేక ప్రభుత్వం దిగొస్తుందా?

  కె.కేశవరావు... ఉరఫ్‌ కేకే... టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కి వ్యూహకర్తగా పేరు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా చెప్పుకుంటారు. పాలకులకు, నాయకులకు సమన్వయకర్తగా అనుకుంటారు. అంతేకాదు పార్టీ సమావేశాలైనా... ప్రభుత్వ మీటింగులైనా... కేసీఆర్‌ పక్కన కేకే ఉండాల్సిందే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేకేకు అంతటి విలువ ఇస్తారు కేసీఆర్. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ ఎంపీగా కేకే మాటను సీఎం కేసీఆర్‌ ఎంతో గౌరవిస్తారు. కేకేను అంతే అభిమానిస్తారు కూడా. అంతేకాదు కేకే మాటను అంత తేలిగ్గా తీసేసే పరిస్థితే లేదు. అలాంటి కేకే... అటు కార్మికులను, ఇటు పాలకులను ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే, కార్మికుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా బాధించాయన్న కేకే... పరిస్థితి మరింత చేయి దాటకముందే సమ్మె విరమించాలని, అలాగే చర్చలకు సిద్ధంగా కావాలని కోరారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన తమ అజెండాలో ఎక్కడా లేదన్న కేకే... ప్రభుత్వరంగ సంస్థల విలీనమంటే విధివిధానాలు మార్చుకోవాలని కోరడమేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రే తేల్చిచెప్పిన తర్వాత సమ్మె కొనసాగింపు ఎవరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. అదే సమయంలో ఆర్టీసీ విలీనం మినహా మిగత డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు కేకే. ఆర్టీసీ కార్మికుల సమస్యలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ...గతంలో గొప్పగా పరిష్కరించిందన్నారు. ఎక్కడా లేనివిధంగా 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌... కార్మికులకు ఇచ్చిన వరాలంటూ ప్రశంసలు కురిపించారు. అయితే, కేకే మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తున్నామంటూనే... కేకే లేఖ, మంత్రుల కామెంట్లపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నారు. పెద్ద మనిషి తరహాలో కేకే చర్చలకు ఆహ్వానించడం మంచి పరిణామమే అయినా... విలీనంపై పక్కా హామీ ఇస్తేనే ముందుకొస్తామని కుండబద్దలు కొట్టారు. మరి, కేకే మధ్యవర్తిత్వంతో సమ్మె విరమించేందుకు కార్మికులు ఒప్పుకుంటారో లేక ప్రభుత్వమే మరో మెట్టుదిగి విలీనానికి ఒప్పుకుంటుందో చూడాలి.  

అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం... అంతలోనే భారత్ పై సంచలన వ్యాఖ్యలు

  అత్యున్నత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యారు. ప్రవాస భారతీయ ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీకి ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. అభిజిత్‌తోపాటు అతని భార్య ఎస్తర్ డఫ్లో కూడా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం కృషిచేసినందుకు అభిజిత్‌ బెనర్జీకి, అతని భార్య ఎస్తర్ డఫ్లోకి నోబెల్ పురస్కారం దక్కింది. అయితే, ఆర్ధికశాస్త్రంలో మొత్తం ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించడంతో... మరో ఆర్ధికవేత్త మైఖేల్ క్రెఫర్‌తో కలిసి నోబెల్ పురస్కారాన్ని పంచుకోనున్నారు. ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతున్న అభిజిత్‌ బెనర్జీ... పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జన్మించారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని ఎంఐటీలో ఎకనమిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, పేదరిక నిర్మూలన కోసం కృషిచేస్తున్నారు. అయితే, నోబెల్ పురస్కారం దక్కించుకున్న అభిజిత్ బెనర్జీ భారత ఆర్ధిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ అస్ధిరంగా ఉందని, ప్రస్తుత వృద్ధిరేటును చూసిన తర్వాత, దాని పునరుజ్జీవనం గురించి కచ్చితంగా చెప్పలేమంటూ కీలక కామెంట్స్ చేశారు.

ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే: అశ్వద్ధామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది, జీతాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులకు మద్దతుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. దీంతో జిల్లాలో పదో రోజు నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని టీ.ఆర్.ఎస్ నేత కేశవరావు కోరారు. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించారని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధి విధానాలు మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని కేశవరావు అన్నారు. కార్మికుల సమ్మె ఉధృతమైన సమయంలో కేకే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావటం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమవడం, తాత్కాలిక సిబ్బంది కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సమయంలో సమ్మె పరిష్కారంపై కేకే ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, పంతొమ్మిదిన బంద్ కు పిలుపునిచ్చాయి. అందుకే కేకే రంగంలోకి దిగి ప్రకటన చేశారా, ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.  మరోవైపు ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందనే వార్తలు గుప్పుమనడం కూడా కలకలం రేపాయి. ఇప్పటికే ఓ టీఆర్ ఎస్ ఎంపీ ఆర్టీసీ కి చెందిన నాలుగెకరాల భూమిని టెండర్ దక్కించుకున్నారంటూ వార్తలు ప్రకంపనలు రేపాయి. మొత్తంగా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తోనే కేకే ప్రకటన చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. పంతొమ్మిదిన బంద్ జరిగే లోపు ఏం జరగబోతోందనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. కేసీఆర్ ఆహ్వానిస్తే చర్చలకు రావటానికి సిద్ధమన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులు గవర్నర్ తమిళ సాయిని కలిశారు. ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు మద్దతు ప్రకటించాయి, కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశాయి. మంత్రులు పువ్వాడ, గంగుల ఎర్రబెల్లి కి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. మహిళా ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కారు. హన్మకొండ డిపో నుంచి ఏకశిల పార్కు వరకు నిరసన ర్యాలీ చేశారు.  

ఆర్టీసీ సమ్మె పరిష్కారం కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారనుందా?

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి సమ్మె తీవ్రరూపం దాల్చటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. అది సకల జనుల సమ్మె వైపు నిజంగానే వెళితే మొత్తం సమాజాన్ని కుదిపివేసే విషయం అవుతుంది. కేసీఆర్ బహుశా ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టీసీని యాభై శాతం ప్రైవేటీకరిస్తామని ఆయన అంటున్న వైనం రాజకీయంగా ఆయనకు నష్టం చేయొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు కార్మికులను ఉద్దేశించి యాభైవేల మందిని తొలగించేశామని చెప్పిన వైనం ప్రజాస్వామ్యంలో సరైనదేనా అన్న చర్చ జరుగుతోంది. అంతకన్నా సెప్టెంబర్ నెలలో పని చేసిన కాలానికి ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం అమానవీయమని చెప్పక తప్పదు. అంతేకాదు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు తార్నాక ఆసుపత్రిలో చికిత్సలు నిలిపివేయడం అమానుషమని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో ముల్లు తీస్తానని అన్న కేసిఆర్ కేవలం పండుగ అడ్వాన్స్ కోసం గతంలో ఆర్టీసీ కార్మికుల తరపున ధర్నాలు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులతో తగాదా పెట్టుకోవడం అసలు సంఘాలే ఉండరాదు అనే పరిస్థితికి వెళ్ళడం చారిత్రక విషాదమని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కార్మిక సంఘాల జేఏసీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి టీఆర్ఎస్ కు పార్టీ ముఖ్య నేతలకు సన్నిహితుడే, అప్పట్లో హరీశ్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ కు అనుబంధంగా ఆర్టీసీలో కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది వాస్తవం కాదా ఇక్కడ సమస్య ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమా కాదా అన్నది కాదు. ఇక్కడ  ఆర్టీసీ కార్మికులు తప్పు చేశారా లేదా పండుగ ముందు సమ్మెలోకి వెళ్లి ఆర్టీసీకి, ప్రయాణికులకు కష్టనష్టాలూ తెచ్చిపెట్టార లేదా అన్నది కాదు కేవలం కేసీఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న మట వాస్తవమే అయిన దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. కానీ వారిని సరైన తీరులో వ్యవహరించడంలో విఫలం అవ్వడం వల్ల ఈ సమస్య ఇంతదాకా వచ్చిందన్న భావన కలుగుతోంది. పైగా గతంలో తమిళనాడులో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులు లక్షా డెబ్బై వేల మందిని ఒక్క కలం పోటుతో తీసివేస్తున్నట్లు ప్రకటించిన మాదిరే ఇక్కడ కేసీఆర్ కూడా యాభైవేలమంది ఉద్యోగులు తీసేశాననే ఒకసారి సెల్ఫ్ డిఫెన్స్ అయ్యారని మరోసారి అంటున్నారు. జయలలిత ఉద్యమ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఆమె ఎంజిఆర్ వారసురాలిగా సినిమా నటిగా గుర్తింపు పొంది ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రయ్యారు. కానీ కేసీఆర్ ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధనలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని ఆయననే చెప్పుకుంటారు. అనేక రకాల సమ్మెలకు ఆయన అప్పట్లో బాధ్యత వహించారు. సకల జనుల సమ్మె వాటిని ఆయన ప్రోత్సహించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒంటి కాలిపై లేచేవారు. మరి ఇప్పుడు ఈ సమ్మే పై ఆయన వైఖరి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అక్రమ కట్టడాలు అంటూ బాబుపై కక్ష సాధింపు చర్యలతో జగన్....

జగన్ తన పాలన మొదలుపెట్టినప్పటి నుంచే చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు అందరికి తెలిసిన విషయమే.దీని నేపధ్యంలోనే  అక్రమ కట్టడాల కూల్చివేత పై  తగిన చర్యలు తీసుకునే పనిలో పడ్డ జగన్ చంద్రబాబు కట్టడాలు అన్నింటిని కూల్చి వేశారు. ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జాతీయ రహదారి వెంబడి భారీ ఎత్తున నిర్మిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడ పార్టీ ఆఫీసు కోసం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ భూములను కేటాయించారు. నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సీఎం హోదాలో రెండు సార్లు ఆయన ఇక్కడ నిర్మాణాలని కూడా పరిశీలించారు. అయితే వీటిపై లోతైన విచారణ చేపట్టిన జగన్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంబడి టిడిపి కార్యాలయం భవనం నిర్మిస్తారని వైకాపా ఆరోపిస్తోంది. అనుమతులు లేని ఈ భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో పాటు మూడు వందల తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి నిర్మాణాలకు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రాంప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజుల లోపు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో తామే తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.