బావ, బావమరిది మధ్య ఆధిపత్య పోరు.. జగన్ కు తలనొప్పిగా మారనుందా?

 

శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ వరుసకు బావ బావమరుదులు. వీళ్లిద్దరి మధ్య విభేదాలున్నాయి ముఖ్యం గా ఒకరి పై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు పార్టీ లో హాట్ టాపిక్ గా మారాయి.నెల్లూరు జిల్లా వైసీపీ లో ఆధిపత్య పోరు నడుస్తోంది ఇంత కాలం సైలెంట్ గా సాగిపోతున్న ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ముఖ్యంగా ఎంపీడీవో సరళ ఇంటి పై దాడి వివాదం లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్ర చేశారంటూ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ప్రత్యక్ష ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజల్ లోకి తప్పుడు సంకేతా లు వెళ్లేలా ఉన్నాయనే భావనలో ఉన్న జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ లో నెల్లూరు జిల్లా నాయకు ల అంశంపై చర్చించనున్నారు.కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి వ్యవహారం పార్టీ పరువు తీసేలా ఉండటం తో వాటిని సర్దుబాటు చేసేందు కు రంగం లోకి దిగారు. ముఖ్యం గా కీలక నిర్ణయా లు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కోటంరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదం పై ఇద్దరు నేత లతో చర్చించనున్నారు.వారిద్దరి మధ్య ఉన్న విభేదా లు పార్టీ కి జరుగుతున్న నష్టం పై వివరించనున్నారు. 

సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే కోటం రెడ్డి విమర్శలు గుప్పించడం వెనుక అసలు కారణాలేంటి. అసలు కాకాణి కోటంరెడ్డి కి మధ్య ఎక్కడ చెడింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.నిజానికి వైసీపీ ఆరంభ సమయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే మేకపాటి కుటుంబం ఇతర పార్టీ నేతలు కాకాణిని ఒప్పించి ఆ పదవి అప్పగించారు అప్పట్లో ఇద్దరి మధ్య భగ్గుమనేలా తయారైంది పరిస్థితి.ఇటీవల నెల్లూరు రూరల్ పరిధి లో కాకాణి స్నేహితుడొకరు హోటల్ ఏర్పాటు చేశారు. కాకాణి దానిని ప్రారంభించారు శ్రీధర్ రెడ్డి ఆ హోటల్ మూత వేయించేవరకూ నిద్రపో లేదన్న వార్తలు వినిపించాయి. దీంతో అప్పటి నుంచి కోటంరెడ్డిపై కాకాణి గుర్రు గా ఉన్నట్టు చెబుతారు పార్టీ లో అంతర్గత విబేధాలు బయటికొచ్చినప్పటికీ పెద్దలకు చెప్పుకొని సరిపెట్టారు.మొన్న శ్రీధర్ రెడ్డి స్నేహితుడు కాకాణి ప్రాతి నిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి లో ఓ భారీ వెంచర్ వేశారు. ఆ వెంచర్ కి నీటి సదుపాయం  ఇవ్వాలనీ ఎంపీడీవో సరళిని కోరారు. ఆమె ఎమ్మెల్యే కాకాణి సంప్రదించమని చెప్పగా దానికి ఆయన వీలుకాదన్నారు.నిజానికి ఈ వెంచర్ పక్కనే గిరిజన కాలనీ ఉంది. అక్కడి వారంతా వైసీపీ వర్గీయులే ప్రస్తుతం ఆ కాలనీకే వాటర్ ఇవ్వడం కష్టం గా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారు. అయితే తమ వెంచర్ కు వెంటనే నీటి సరఫరా ఇవ్వాలని ఎంపీడీవో మీద ఒత్తిడి తీసుకువచ్చినట్టు చెబుతున్నారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగానే తనపైన తన స్నేహితుడు పైన అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులైతే కాకాని డబ్బు లు డిమాండ్ చేశారంటూ బహిరంగంగా వ్యాఖ్య లు చేస్తున్నారు. ఇంటి పై దాడి జరిగిన తరువాత ఎంపీడీవో సరళ నేరుగా పోలీస్ స్టేషన్ కి కాకుండా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికెళ్లారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. కాకాణిపై పరోక్షంగా కోటం రెడ్డి తీవ్ర విమర్శ లు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతల్లో తాను చంద్రబాబు కాళ్లు పట్టుకోలేదు అన్నారు. తనకు చాలా అనుమానా లున్నాయని కోటం రెడ్డి తీవ్ర వ్యాఖ్య లు చేశారు. 

అంతేకాదు జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతి నిధులు నేతలు ఎవరి దారి వారిది అన్నట్టు ఉంటున్నారు.ఎవరు ఏ వర్గం అనే లెక్కల్లోనే ఉండిపోయారు అధికారం లోకి వచ్చాక కింగ్స్ కోట్ లోని పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం మానేశారు. ఎవరి కార్యాలయాల్లో వారి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. కాకాణి తన ఇంటి దగ్గరే రాజకీయాల నెరుపుతుంటే కోటం రెడ్డి తన సొంత కార్యాలయంలో రాజకీయాలు చేస్తున్నారు.ఎంపీడీవో సరళ ఇంటి పై దాడి కేసులో తన తప్పు ఉందని తెలిస్తే శాశ్వతంగా బహిష్కరించండి అంటూ జగన్ కు విజ్ఞప్తి చేశారు కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి. తాను ఇంటి పై దాడి చేసినట్టు రుజువు చేస్తే ఎంపీడీవో సరళకు క్షమాపణ చెప్తా నని కూడా కోటం రెడ్డి చెప్పారు. తనను ఇరికించేందుకు కుట్ర పన్నారు అంటూ మండిపడ్డారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ చెప్తూనే తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. మొత్తానికే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఎక్కువ మంది ముఖ్య నేతలు అసహనంగా ఉన్నారు. వరుస సంఘటనల నేపథ్యంలో పార్టీకి తీరని నష్టం కలుగుతుంద ని బహిరంగం గానే వ్యాఖ్య లు చేస్తున్నారు పార్టీ పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. ఈ విషయాల పై పార్టీ పెద్ద లు దృష్టి సారించారు. వర్గపోరుకు మూలాల ను వెతికి అరికట్టే పనిలో పడ్డారు ఈ నేపథ్యం లో ఇవాళ సాయంత్రం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.