cm kcr involved trs senior leader k keshava rao to find solution to tsrtc strike

ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే: అశ్వద్ధామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది, జీతాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులకు మద్దతుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. దీంతో జిల్లాలో పదో రోజు నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని టీ.ఆర్.ఎస్ నేత కేశవరావు కోరారు. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించారని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధి విధానాలు మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని కేశవరావు అన్నారు. కార్మికుల సమ్మె ఉధృతమైన సమయంలో కేకే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావటం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమవడం, తాత్కాలిక సిబ్బంది కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సమయంలో సమ్మె పరిష్కారంపై కేకే ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, పంతొమ్మిదిన బంద్ కు పిలుపునిచ్చాయి. అందుకే కేకే రంగంలోకి దిగి ప్రకటన చేశారా, ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.  మరోవైపు ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందనే వార్తలు గుప్పుమనడం కూడా కలకలం రేపాయి. ఇప్పటికే ఓ టీఆర్ ఎస్ ఎంపీ ఆర్టీసీ కి చెందిన నాలుగెకరాల భూమిని టెండర్ దక్కించుకున్నారంటూ వార్తలు ప్రకంపనలు రేపాయి. మొత్తంగా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తోనే కేకే ప్రకటన చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. పంతొమ్మిదిన బంద్ జరిగే లోపు ఏం జరగబోతోందనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. కేసీఆర్ ఆహ్వానిస్తే చర్చలకు రావటానికి సిద్ధమన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులు గవర్నర్ తమిళ సాయిని కలిశారు. ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు మద్దతు ప్రకటించాయి, కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశాయి. మంత్రులు పువ్వాడ, గంగుల ఎర్రబెల్లి కి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. మహిళా ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కారు. హన్మకొండ డిపో నుంచి ఏకశిల పార్కు వరకు నిరసన ర్యాలీ చేశారు.  

RTC Workers Strike

ఆర్టీసీ సమ్మె పరిష్కారం కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారనుందా?

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి సమ్మె తీవ్రరూపం దాల్చటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. అది సకల జనుల సమ్మె వైపు నిజంగానే వెళితే మొత్తం సమాజాన్ని కుదిపివేసే విషయం అవుతుంది. కేసీఆర్ బహుశా ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టీసీని యాభై శాతం ప్రైవేటీకరిస్తామని ఆయన అంటున్న వైనం రాజకీయంగా ఆయనకు నష్టం చేయొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు కార్మికులను ఉద్దేశించి యాభైవేల మందిని తొలగించేశామని చెప్పిన వైనం ప్రజాస్వామ్యంలో సరైనదేనా అన్న చర్చ జరుగుతోంది. అంతకన్నా సెప్టెంబర్ నెలలో పని చేసిన కాలానికి ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం అమానవీయమని చెప్పక తప్పదు. అంతేకాదు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు తార్నాక ఆసుపత్రిలో చికిత్సలు నిలిపివేయడం అమానుషమని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో ముల్లు తీస్తానని అన్న కేసిఆర్ కేవలం పండుగ అడ్వాన్స్ కోసం గతంలో ఆర్టీసీ కార్మికుల తరపున ధర్నాలు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులతో తగాదా పెట్టుకోవడం అసలు సంఘాలే ఉండరాదు అనే పరిస్థితికి వెళ్ళడం చారిత్రక విషాదమని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కార్మిక సంఘాల జేఏసీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి టీఆర్ఎస్ కు పార్టీ ముఖ్య నేతలకు సన్నిహితుడే, అప్పట్లో హరీశ్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ కు అనుబంధంగా ఆర్టీసీలో కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది వాస్తవం కాదా ఇక్కడ సమస్య ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమా కాదా అన్నది కాదు. ఇక్కడ  ఆర్టీసీ కార్మికులు తప్పు చేశారా లేదా పండుగ ముందు సమ్మెలోకి వెళ్లి ఆర్టీసీకి, ప్రయాణికులకు కష్టనష్టాలూ తెచ్చిపెట్టార లేదా అన్నది కాదు కేవలం కేసీఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న మట వాస్తవమే అయిన దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. కానీ వారిని సరైన తీరులో వ్యవహరించడంలో విఫలం అవ్వడం వల్ల ఈ సమస్య ఇంతదాకా వచ్చిందన్న భావన కలుగుతోంది. పైగా గతంలో తమిళనాడులో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులు లక్షా డెబ్బై వేల మందిని ఒక్క కలం పోటుతో తీసివేస్తున్నట్లు ప్రకటించిన మాదిరే ఇక్కడ కేసీఆర్ కూడా యాభైవేలమంది ఉద్యోగులు తీసేశాననే ఒకసారి సెల్ఫ్ డిఫెన్స్ అయ్యారని మరోసారి అంటున్నారు. జయలలిత ఉద్యమ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఆమె ఎంజిఆర్ వారసురాలిగా సినిమా నటిగా గుర్తింపు పొంది ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రయ్యారు. కానీ కేసీఆర్ ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధనలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని ఆయననే చెప్పుకుంటారు. అనేక రకాల సమ్మెలకు ఆయన అప్పట్లో బాధ్యత వహించారు. సకల జనుల సమ్మె వాటిని ఆయన ప్రోత్సహించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒంటి కాలిపై లేచేవారు. మరి ఇప్పుడు ఈ సమ్మే పై ఆయన వైఖరి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

YS Jagan Targets AP TDP New Office

అక్రమ కట్టడాలు అంటూ బాబుపై కక్ష సాధింపు చర్యలతో జగన్....

జగన్ తన పాలన మొదలుపెట్టినప్పటి నుంచే చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు అందరికి తెలిసిన విషయమే.దీని నేపధ్యంలోనే  అక్రమ కట్టడాల కూల్చివేత పై  తగిన చర్యలు తీసుకునే పనిలో పడ్డ జగన్ చంద్రబాబు కట్టడాలు అన్నింటిని కూల్చి వేశారు. ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జాతీయ రహదారి వెంబడి భారీ ఎత్తున నిర్మిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడ పార్టీ ఆఫీసు కోసం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ భూములను కేటాయించారు. నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సీఎం హోదాలో రెండు సార్లు ఆయన ఇక్కడ నిర్మాణాలని కూడా పరిశీలించారు. అయితే వీటిపై లోతైన విచారణ చేపట్టిన జగన్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంబడి టిడిపి కార్యాలయం భవనం నిర్మిస్తారని వైకాపా ఆరోపిస్తోంది. అనుమతులు లేని ఈ భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో పాటు మూడు వందల తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి నిర్మాణాలకు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రాంప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజుల లోపు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో తామే తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Operation Royal Vasista

మరోసారి 'ఆపరేషన్ వశిష్టాను' కొనసాగించటానికి రంగంలోకి దిగనున్న ధర్మాడి సత్యం బృందం...

  గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆపరేషన్ వశిష్టా ఇక ఆగిపోయినట్లేనా అనే అనుమాలు అందరిలో నెలకొన్నాయి. అయితే  మొదటి ప్రయత్నంలో విఫలమైన ధర్మాణి సత్యం బృందం రెండో ప్రయత్నం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బోటును వెలికితీయటం ఎంతవరకు సాధ్యం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.  బోటు మునిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ గల్లంతైన వారి వివరాలు పూర్తిగా తెలియనేలేదు. ప్రాణాలతో బయటపడ్డ ఇరవై ఆరు మంది తప్ప గల్లంతైనవారు ఎంతమంది అన్న లెక్క ఇప్పటికీ తేలని లేదని చెప్పాలి. అధికారులు మాత్రం ఇంకో పధ్నాలుగు మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు.సెప్టెంబర్ 15 వ తేదీ న కచ్చులూరు దగ్గర ఊహించని విధంగా గోదావరిలో మునిగి పోయింది రాయల్ వశిష్ట బోటు. ఇప్పుడది మూడు వందల అడుగులకుపైగా లోతులో ఉంది. దాదాపు నలభై అయిదు టన్నులకు పైగా బరువున్న రాయల్ వశిష్ట బోటును వెలికితీస్తే గానీ అందులో చిక్కుకున్న మృతదేహాల సంఖ్య తేలే పరిస్థితి లేదు. అయితే బోటును వెలికితీయటం ఎలా ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్యగా మారింది.  బోటును బయటకు తీయడం కోసం సాంకేతిక పద్ధతులు అన్నీ అనుసరించారు.బోటు పడనున్న లోతులను కనిపెట్టడం తప్ప దాన్ని బయటకు లాగే మార్గాలేవి దొరక లేదు. దీంతో సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే బోటును బయటకు లాగగలనని ఆలోచన కు వచ్చారు. ఈ విధానంలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న ధర్మాడి సత్యంకు ఈ బాధ్యతలు అప్పగించారు .కాంట్రాక్ట్ తీసుకున్న మరుసటి రోజునే ధర్మాడి సత్యం టీమ్ కచ్చులూరుకు వెళ్ళింది. ఐరన్ రోపులతో, ప్రొక్లెయినర్ లు తీసుకొని లంగర్ లు వేసి బోటు మునిగి ఉన్న ప్లేస్ ను గుర్తించింది. కానీ బయటకు లాగేందుకు చేసిన వారి తొలి ప్రయత్నం విఫలమైంది. ఐరన్ రోప్ తెగి పోవడంతో సత్యం ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఇప్పటికీ సత్యం బృందం బోటును వెలికితీస్తామని నమ్మకం తోనే ఉంది.అయితే ఇటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆపరేషన్ వశిష్టకు పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడడం గోదావరి ల వరద తగ్గడంతో మళ్లీ సత్యం టీం ఆపరేషన్ వశిష్టకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ధర్మాణి సత్యం టీమ్ కచ్చులూరుకు చేరుకోబోతోంది. బోటు తమ లంగర్లలకు చిక్కి బయటకు లాగేందుకు పట్టు దొరికితే రెండురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తోంది ధర్మడి సత్యం టీమ్. సాయంత్రం కచ్చులూరు చేరుకోబోతున్న ధర్మడి సత్యం టీమ్ మళ్లీ  ఆపరేషన్ మొదటి నుంచి మొదలు పెట్టబోతోంది మొదటి ప్రయత్నం కోసం తెచ్చుకున్న సామాగ్రి మొత్తాన్ని మళ్లీ ఇప్పుడు కచ్చులూరుకు తరలించాల్సి ఉంది. గోదావరి సహకరించి వర్షం తగ్గితే ధర్మం సత్యం రెండో ప్రయత్నం మొదలుకానుంది.ఈ సారి ఐనా ఏ అవంతరాలు లేకుండా జరగుతుందో లేదో వేచిచూడాలి.  

AP Minister Kanna Babu Press Meet on Rythu Bharosa Scheme

రైతు భరోసా ఇకపై రూ.13,500... రేపటి నుంచి అమలు

  రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతు భరోసా గడువు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఆయన నెల రోజుల పాటు ఈ పథకానికి గడువు పెంచారని తెలిపారు. అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా ప్రక్రియ ప్రారంభమవుతుంది అని నవంబరు పదిహేను వరకు అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడి సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారుల జాబితాలన్నీ విలేజ్ సెక్రటేరియట్ లో అదే విధంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఎండీఓ ఆఫీసు లో, కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పకుండా నోటీసు బోర్డుల్లో పెట్టాలని సీఎం గారు ఆదేశించారని అన్నారు. ఇప్పటి వరకు విలేజ్ సెక్రటేరియట్ లో గత రెండు రోజులు నుంచి జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు అని తెలిపారు. గత ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది రైతు కుటుంబాల జాబితాని పిఎం కిసాన్ పథకానికి సమర్పించినట్టుగా లెక్కలున్నాయన్నారు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ సరిచూసినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా మూడున్నర లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందటానికి నిబంధల ప్రకారం అనర్హులుగా తేలుతోందని వివరించారు. అర్హత ఉండి ఆరు లక్షల మంది ఈ పథకాల్లో ప్రయోజనం పొందలేకపోయారని కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం తేలిందన్నారు. కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సవరించి ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూడటం మీ బాధ్యత అని సీఎం గారు ఆదేశించారని తెలిపారు. గతంలో ఇచ్చిన దానికన్న మిన్నగా ఈ పథకం అమలు చేయమని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు మూడు లక్షల మంది కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన కౌలు రైతులు ఈ పథకాల్లో లబ్ధి పొందబోతున్నారు అని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ రైతు భరోసా అక్టోబర్ లో ప్రారంభమౌతుంది కనుక కౌలురైతులు ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోలేకపోవటం, సీ.సీ.ఆర్.సి కార్డ్సు పొందలేకపోవడం వంటి ఇబ్బందులుంటే వాటిని నవంబర్ పదిహేను వరకు మరల దరఖాస్తు చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.

lawyers protest in kurnool district

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న లాయర్లు

  ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా కొన్ని విషయాలు తేల్చడంలో మాత్రం జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.రాయలసీమలో హైకోర్టు ఉద్యమం మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏకంగా జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు.విధులకు వెళ్లకుండా కోర్టు గేటుకు తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాయర్ లను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.నెల రోజుల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదంటూ భగ్గుమన్నారు న్యాయవాదులు.  కర్నూలులో హైకోర్టును  ఏర్పాటు చేయాలంటూ గత ముప్పై మూడు రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కోర్టులు పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజూ కూడా లాయర్ లందరూ కూడా విధులకు హాజరు కానీ సంధర్బాలు లేవు. ఈ రోజునుంచి ఏకంగా స్టాఫ్ కానీ జిల్లా జడ్జిలు కానీ ఎవ్వరూ కూడా కోర్టుకు హాజరు కాకుండా ఏకంగా కోర్టులకు తాళాలు వేశారు. ఉద్యమం మరింత ఉధృతం అవుతున్న సంధర్బంలో కచ్చితంగా హై కోర్టుని ఏర్పాటు చేయలనే డిమాండ్ మరింత ఊపందుకుంటోంది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలసిందేనని డిమాండ్ ఉధృతం అవుతుంది.దీనిపై జగన్ సర్కార్ వీలైనంత త్వరగా స్పందిస్తే మంచిదని డిమాండ్ చేస్తున్నారు న్యాయమూర్తులు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోందో వేచి చూడాలి. 

PM Modi to inaugurate Kartarpur corridor on Nov 8

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం.. పాల్గొనబోతున్న మోడీ, మన్మోహన్!!

  కర్తార్ పూర్ కారిడార్ సిద్ధమైంది. సిక్కుల మత గురువు ఐదు వందల యాభైవ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించబోతున్నారు. నవంబరు ఎనిమిదిన భారత భూభాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తే మరుసటి రోజు పాకిస్థాన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.ప్రధాని నరేంద్ర మోడీ కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ ఎనిమిదిన ప్రారంభించబోతున్నారు. డేరా బాబా నానక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించి 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి ఇది.గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మోడీని కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు .రాష్ట్రపతి రామనాథ్ గోవింద్, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్ పూర్ కారిడార్ గుడ్డ పాకిస్తాన్ లోని గురునానక్ గురుద్వారాకు చేరుకుంటారు,కాగా పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ తొమ్మిదిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించబోతున్నారు. సిక్కు గురువు డేరా బాబా గురునానక్ దేవ్ 1469 నవంబర్ ఇరవై తొమ్మిదిన పంజాబ్ లో జన్మించి 1539 సెప్టెంబరు ఇరవై రెండున మరణించారు.ఆయన పుట్టిన, మరణించిన స్థలాలూ రెండు ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉన్నాయి. ఆయన చివరి రోజుల్ని కర్తార్ పూర్ లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు పధ్ధెనిమిది ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. దీంతో దాన్ని అత్యంత పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు. అటువంటి ఆ రెండు ప్రదేశాలైన డేరా బాబా నాన్నక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన రహదారి గురునానక్ దేవ్ జయంతి రోజు ప్రారంభం కానుంది.తర్వాతి రోజే పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించబోతున్నారు మన్మోహన్,ఈ కారిడార్ గుడ్డ భారత్ కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కు వెళ్ళి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైనా గురుద్వారా సాహిబ్ ను దర్శించుకోనున్నారు.ఇందు కోసం ఎలాంటి వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది.మరోవైపు భారతదేశం నుంచి కర్తార్ పూర్ వెళ్లే తొలి భక్తబృందాల్లో పాల్గొనాలనీ కెప్టెన్ అమరిందర్ సింగ్ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం పంపించారు.దీంతో పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ల నున్న తొలి సిక్కుల వృద్ధుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉండబోతున్నారని సమాచారం. 

OU Students JAC Supports RTC Workers Strike

రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న ఆర్టీసీ సమ్మె.. మినిస్టర్ క్వార్టర్స్ కు ముప్పు!

  ఆర్టీసీ సమ్మే మొదలై ఇప్పటికి పది రోజులు కావొస్తున్నా రోజురోజుకు ఉత్కంఠంగా కొనసాగుతున్న అంశంగా మారింది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించేందుకు వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి నివాళులు అర్పించారు విద్యార్ధులు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన వ్యక్తం చేయగా తరవాత మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి ర్యాలీగా బయలుదేరారు. ఉస్మానియా గేట్ దాటక ముందే వారిని పోలీసులు అడ్డుకొని  అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని వ్యాన్ లలో ఎక్కించారు పోలీసు అధికారులు.  తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం అనేది వీలైనంత త్వరగా జరిగితేనే అందరికి మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యనిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి లాంటి వ్యక్తులు సురేందర్ గౌడ్ లాంటి వ్యక్తులు చనిపోవడంతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ  వాళ్ల ఆత్మశాంతి చేకూర్చే విధంగా  నివాళులర్పించారు. ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా విద్యార్థిలు ,ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉంటున్న నేపధ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించినట్లు ప్రకటించారు, కావున  విద్యాసంస్థలను తక్షణమే కేసీఆర్ గారు సెలవులనూ విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పదోవ  రోజుకు చేరింది. దాదాపు ఆరుగురు ఏడుగురు పేద కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు పిట్టల్లా రాలిపోతున్నారు. పొడిగించిన వారంరోజులు విద్యాసంస్థల సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలని, కాలేజీలు స్కూళ్లను వెంటనే తెరిపించి పిల్లల చదువును కూడా ముందుకు తీసుకుపోవాలని ఆర్టీసీ సమ్మేలోని నేతలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఒక పరిష్కారం చూడాలని లేదంటే పరిస్థితులు ఇంకా ఉధృక్తం అవుతాయని వెల్లడించారు. 

Section 144 imposed in Ayodhya till December 10

అయోధ్యలో 144 సెక్షన్ అమలు...

  అయోధ్యలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి, అయోధ్య పట్టణంతో పాటు మొత్తం జిల్లాలో 144 సెక్షన్ విధించారు. త్వరలో రామ మందిరం బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సెక్షన్ 144 విధిస్తున్నట్టు సమాచారం. ఆ ఆదేశాలు డిసెంబర్ పది వరకు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. అయోధ్య కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆగస్టు ఆరు నుంచి జరుగుతున్న విచారణ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటోంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూడా అయోధ్యపై సుప్రీం లో వాడీవేడిగా వాదనలు జరిపాయి. వివాదాస్పద స్థలంలో ఆలయం లేదని ముస్లిం సంఘాల తరపున వాదించిన లాయర్ రాజీవ్ ధావన్ మరోసారి వెల్లడించారు. కూలగొట్టిన స్థలం లోనే మసీదును నిర్మించాలని కోరారు, హిందూ సంస్థలు బలవంతంగా ఆ స్థలాన్ని ఆక్రమించాయని ఆరోపించాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి ఇరవై ఏడు ఏళ్లు గడుస్తోంది, రామజన్మభూమి రామ మందిరం బాబ్రీ మసీదు చుట్టే వివాదం తిరుగుతోంది. బాబ్రీ మసీద్ రామమందిర భూ వివాదంపై ఇరువర్గాలూ ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. గతేడాది సుప్రీం కూడా కేసును పక్కన పెట్టి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది. రెండు వర్గాలతో కోర్టు వెలుపల చర్చలు జరిపింది, కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు లోనే దీనిని తేల్చాలని నిర్ణయించింది. ప్రతి రోజూ ఈ కేసులో వాదనలు విని ఈ నెల పదిహేడులో పునః విచారణ ముగిస్తామని తెలిపింది. విచారణ పూర్తయిన నాలుగు వారాల్లో తీర్పును వెల్లడిస్తామని కూడా చెప్పడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు అయోధ్య కమిషనర్ ను విశ్వ హిందూ పరిషత్ నేతలు కలిశారు. దీపావళి నాడు అయోధ్యలో రామ మందిరం దగ్గర దివ్వెలను వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.  

police attack on devotees at arasavalli suryanarayana temple

భక్తులపై దౌర్జన్యం చేసిన పోలీసులు...

  శ్రీకాకుళం జిల్లాకు దైవ దర్శనం కోసం వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంత మంది భక్తులు ఆరోపిస్తున్నారు. హోటల్లో బస చేసిన తమపై దౌర్జన్యం చేశారంటున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు, తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి అరసవెల్లి సూర్య నారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను దర్శించుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని నాగావళి హోటల్ లో దిగారు. రాత్రి పది గంటల తర్వాత భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న తమ కారు దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జనరల్ చెకింగ్ లో భాగంగా సీఐ శంకర్ తో పాటు ఆరుగురు పోలీసులు హోటల్ దగ్గరకొచ్చారు. రిసెప్షన్ లో హోటల్ లో బస చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే సీఐ శంకర్ బయటకొచ్చిన తమపై దౌర్జన్యం చేశారని భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి ఆరోపిస్తున్నారు. ఏ తప్పు చేయక పోయినా సిఐ తమపై అనవసరంగా దౌర్జన్యం చేశారని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తమ దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, ఐడీ కార్డులు కూడా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని పోలీసులు తీసుకెళ్తున్నారని అడ్డుకుంటే మహిళలు అని కూడా చూడకుండా పరుగులు పెట్టించారని భాస్కర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి, భాస్కర్ రెడ్డి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఉంటే ప్రశ్నించామే తప్ప వారిపై దౌర్జన్యం చేయలేదని పోలీసులంటున్నారు.  

Sourav Ganguly files nomination set to be elected unopposed as BCCI president

బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...

  బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖరారైంది. ఈరోజు అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ ల తుది గడువు కావడంతో గంగూలి ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్లేనని భావిస్తున్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఇప్పటి వరకూ గంగూలీ తప్ప ఎవరూ నామినేషన్ వేయలేదు, దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. బీసీసీఐ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు నిన్న ముంబైలో సమావేశమయ్యారు. కీలక పదవుల్లో ఎవరు ఉండాలనే దానిపై వారి మధ్య చర్చ జోరుగా సాగింది. ముఖ్యంగా సౌరవ్ గంగూలీ, బ్రిజేష్ పటేల్ ల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా నడిచింది. మొదట శ్రీనివాసన్ సన్నిహితుడు బ్రిజేష్ పటేల్ అధ్యక్ష రేసులో ముందు నిలిచాడు. గంగూలీకి ఐపీఎల్ ఛైర్మెన్ పదవి ఇవ్వాలని భావించారు, అందుకు గంగూలీ తిరస్కరించినట్లు సమాచారం. అధ్యక్షుడిగా బ్రిజేష్ అభ్యర్థిత్వాన్ని ఎక్కువ రాష్ట్ర సంఘాలు కూడా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చివరకు గంగూలీకి బోర్డు అధ్యక్ష పదవి కట్టబెట్టి బ్రిజేష్ కు ఐపిఎల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని సభ్యులు నిర్ణయానికి వచ్చారు. అయితే బ్రిజేష్ మాత్రం అందుకు అంగీకరించలేదు, ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ గడువు ఉంది. ప్రస్తుతం గంగూలి నామినేషన్ తప్ప మరెవరూ వేయలేదు. వేసినట్లయితే అక్టోబర్ ఇరవై మూడున బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి. ఇక హోంమంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా కార్యదర్శిగా పోటీ లో ఉన్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ కోశాధికారిగా ఎన్నికవడం కూడా ఖరారైనట్లే. నలభై ఏడేళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బిసిసిఐ అధ్యక్షుడైతే తప్పని సరి విరామ నిబంధనల వల్ల ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ లో అతడు పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. అధ్యక్షుడిగా తన తొలి బాధ్యత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను అభివృద్ధి చేయడమే అన్నారు సౌరవ్ గంగూలీ. మూడేళ్ళుగా సీఓఏ లాంటి అభివృద్ధి చేయలేదని, తన హయాంలో రాష్ట్ర సంఘాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి కళంకం వచ్చేలా గతంలో కొందరు ప్రవర్తించారని అలాంటి చెడ్డ పేరును నిర్మూలించడమే తన లక్ష్యమన్నారు గంగూలి.

reason behind chiranjeevi and ys jagan meeting

అందుకోసమే జగన్ ను చిరంజీవి కలిసారా?

  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.

bus accidents happen in telangana because of temporary drivers

ప్రమాదకరంగా మారిన ఆర్టీసి తాత్కాలిక డ్రైవర్లు...

  తెలంగాణాలోని ఆర్టీసి కార్మికుల సమ్మె నేపథ్యంలో సర్కార్ నియమించిన తాత్కాలిక డ్రైవర్ లు ప్రమాదకరంగా మారారు. అనుభవం లేని వారు స్టీరింగ్ లు పట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా కూకట్ పల్లి లో హైదరాబాద్ టూ డిపోకి చెందిన రసూల్ అనే డ్రైవర్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో షాక్ కి గురైన ప్రయాణికులు తాత్కాలిక డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడు అంటూ తాత్కాలిక డ్రైవర్ పై దాడికి దిగారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరబాదు టు డిపోకు చెందిన బస్సు దిల్ సుఖ్ నగర్ నుంచి బయల్దేరి పరిగి వెళుతోంది. అయితే వై జంక్షన్ దగ్గరకు రాగానే బస్సు ముందున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించాడని బస్సు లో ఉన్న ప్రయాణికులు చెబుతుంటే రసూల్ మాత్రం తాను మద్యం తాగలేదని వాదిస్తున్నాడు.  ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా హాలియాలో ఆర్టీసీ బస్సు ప్రయాణికుడి కాలు మీద నుంచి వెళ్ళింది. దీంతో ప్రయాణికుడి పాదం మొత్తం నుజ్జునుజ్జైంది, అతనిని నల్గొండ ఆస్పత్రికి తరలించారు. నల్గొండ చైతన్య పురి కాలనీ కి చెందిన చంద్ర కాంత్ హాలియాకు వెళ్లాడు, బస్టాండ్ లో బస్ దిగుతుండగా డ్రైవర్ ఆపకుండా ముందుకు తీసుకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో బస్సు టైర్ చంద్ర కాంత్ పాదం మీద కెక్కింది. దీంతో చంద్ర కాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చంద్ర కాంత్ ను ఆస్పత్రికి తరలించారు, ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ కి ఏమాత్రం అనుభవం లేదని బస్సు దిగుతున్న సమయంలో ఆపకుండా ముందుకు తీసుకు వెళ్ళాడంటున్నారు. డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

CPI to rethink support to TRS in Huzurnagar

అయోమయంలో సీపీఐ పార్టీ నేతలు!!

  హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అంశంపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ప్రారంభం కావడం కంటే ముందే హుజూర్ నగర్ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. సీపీఐ మద్దతు ప్రకటించిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. అన్ని విపక్షాలు కలిసి ఆర్టీసీ జేఏసీకి మద్దతు నిచ్చాయి. కానీ ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీపీఐ సందిగ్ధంలో పడింది. హుజూర్ నగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సిపిఐ ఇప్పుడు ముందుకా వెనక్కా అని ఆలోచనలో పడింది. ఇప్పటికే పునరాలోచిస్తామని ప్రకటించిన సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.. ఇవాళ రాష్ట్ర పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే గనక మద్దతు ఉపసంహరించుకోవాల్సి వస్తుందని కమిటీ నేతలందరూ ఉత్తర్వులు జారీ చేశారు.మొన్న జరిగినటువంటి ఒక అఖిల పక్ష సమావేశంలో ఆర్టీసీ జెఏసి నాయకులంతా కూడా ఆర్టీసి కార్మికులు చేసినటువుంటి సమ్మెకు సంఘీభావంగా ఇతర విపక్ష పార్టీలు అన్నింటినీ కూడగట్టుకొని సమ్మెకు దిగుతున్నటువంటి తరుణంలో సిపిఐ పార్టీ వైఖరి కూడా చెప్పాలని చెప్పి వాళ్లంతా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసింది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

fire accident at eastern masala factory

ఈస్టర్న్ మసాలా దినుసుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం...

వంటలు ఘుమఘుమల అంటే ముందుగా మనకు గుర్తోచ్చేది మసాలా దినుసులు. అలంటి ఒక ప్రముఖ మసాలా దినుసుల కంపెనీ కు నిప్పు రాజేసుకుంది. భారత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని తేనీ జిల్లా కొడంగల్ పటిలోని ఓ మసాలా దినుసుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా మొదలైన పొగలు, కొద్ది సేపట్లోనే దావానలంలా వ్యాపించాయి. ఈస్టరన్ కంపెనీకి చెందిన మసాలా మేకింగ్ ఫ్యాక్టరీగా అధికారులు తెలియజేశారు.  ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఐదు ఫైరింజన్ లతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ లేరని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది దాదాపు రెండు కోట్ల రూపాయల మసాలా దినుసులు కాలి బూడదైనట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.  అగ్నిప్రమాదంలో చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి.అగ్నిప్రమాదం సంభంవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఏ కార్మికులు లేకపోవడం పై తీవ్ర అనుమానాలు వెల్లడవుతున్నాయి. అసలు అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు ఏమై ఉండవచ్చని పోలీసులు విచారించాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఆ లేక ఇతర్త్న కారణాలా లేక యాజమాన్యం చర్యలా అనే అనుమానాలు దర్యాప్తు లో తేలాల్సిన అంశాలు. మొత్తానికి ఫ్యాక్టరీ సిబ్బందికి భారీ నష్టాన్ని తెచ్చి పెట్టినా ప్రాణ హాని ఏమి జరగక పోవడంతో ఊపిరి పీల్చున్నారు యజమానులు. ఇక ఈ దర్యప్తును పోలీసులు వీలైనంత త్వరలో విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు బాధితులు.  

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఇండిపెండంట్లతో వచ్చిన చిక్కు...

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలలో ఇప్పుడు ఓ భయం పట్టుకొంది, ఇరవై నాలుగు మంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్ బ్యాంక్ దెబ్బతీస్తారో అని ప్రధాన పార్టీలు ఆంధోళన  చెందుతున్నాయి. వీరి వల్ల ఎవరికి నష్టం కలుగుతోందని లెక్కల వేసే పనిలో పడ్డాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది. నామినేషన్ ల తిరస్కరణ, ఉపసంహరణ తర్వాత ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఇరవై నాలుగు మంది ఇండిపెండెట్లు, ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తమ తమ ఓటు బ్యాంకులను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి, హుజూర్ నగర్ లో మొదటి సారి పాగా వేయాలనే లక్ష్యంతో అధికార టీ.ఆర్.ఎస్ పనిచేస్తుంది. విపక్ష కాంగ్రెస్ మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. బీజేపీ సరి కొత్త ఎత్తుగడతో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపింది. గత ఎనికల్లో కాంగ్రెస్ తో జత కట్టిన టిడిపి ఈసారి ఒంటరిగా బరిలోకి దిగింది. ఉప ఎన్నిక బరిలో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులుంటే వీరిలో ఇరవై నాలుగు మంది ఇండిపెండెంట్ లు ఎవరి ఓటు బాంకును చీలుస్తారో అనే భయం ప్రధాన పార్టీలకు పట్టుకుంది. ఇండిపెండెట్ల వల్ల కలిగే నష్టం తమపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది అని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఏ అభ్యర్థి వల్ల తమకు ఎక్కువ నష్టం జరుగుతుందో అని కాంగ్రెస్ టీ.ఆర్.ఎస్ లెక్కలతో విశ్లేషణ మొదలుపెట్టాయి. తమకు నష్టం కలిగించే స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించే పని జోరుగా చేపట్టాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులతో తమకేం నష్టం లేదని టి.ఆర్.ఎస్ అంటోంది. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఇండిపెండెంట్ల ప్రభావం అధికార పార్టీ పైనే ఉంటుందనేది కాంగ్రెస్ నేతల విశ్లేషణ. ఎవరెన్ని లెక్కలేసుకున్న ఇండిపెండెంట్లు మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నారు.

టీఆర్ఎస్ ఎంపీ నిర్వాకం.. ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం

  న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు.  హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.

కారు ప్రమాదంలో నలుగురు హాకీ ప్లేయర్లు మృతి...

  మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. హైవే నెంబర్ అరవై తొమ్మిది లో వేగంగా వెళుతున్న క్రమం లో వారు ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్టుగా సమాచారం, వారిలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ దగ్గర జరిగింది. అయితే వీరంతా హాకీ క్రీడాకారులని సమాచారం, వీరంతా ఈ రోజు జరిగే ధ్యాన్ చంద్ ట్రోఫీ లో పాల్గొనాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో వారు స్టేడియానికి చేరతారనగా ఈ ప్రమాదం జరిగింది, చనిపోయిన వారంతా జాతీయ స్థాయి ప్లేయర్లు అని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మృతుల వారి కుటుంబాలకు సమాచారమిచ్చామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతివేగం వల్ల కారు అదుపు తప్పడంతో పల్టీలు కొట్టి రోడ్ పక్కకు వెళ్ళి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్లేయర్లు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా జాతీయ స్థాయి క్రీడాకారులు కావడంతో అంతా విషాద చాయలు అములుకున్నాయి. జాతీయ స్థాయి క్రీడాకారులను కోల్పోవడంతో భారతదేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సంఘటన తెలుసుకున్న మృతుల తల్లి తండ్రులు తీవ్ర అవేదనకు గురి అవుతున్నారు. క్రీడా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రేపే రైతు భరోసా... 5వేల 510 కోట్లు విడుదల... 3 విడతలుగా మార్చే ఆలోచన.!

  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రైతు భరోసా పథకం రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానుంది. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధాని మోడీని... జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించినప్పటికీ, పీఎంవో నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే... రేపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులో ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు స్వయంగా రైతు భరోసా చెక్కులు అందజేస్తారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం డబ్బులు జమ చేయడం కోసం 5వేల 500కోట్ల రూపాయలను ఆర్ధికశాఖ విడుదల చేసింది.  రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అగ్రికల్చర్ మిషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాలతో చర్చించారు. అయితే, వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని, దాంతో ఖరీఫ్ స్థాయిలో సాగు లేదని, ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు ... సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును ఒకేసారి ఇచ్చే బదులు... రెండు మూడు విడతలుగా ఇస్తే బాగుంటుందని, మే నెలలో ఒకసారి, కోత సమయంలో మరోసారి, అలాగే రబీ అవసరాల కోసం ఇంకోసారి ఇవ్వాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది.