నిర్లక్షపు దోరణిలో ఉన్న తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ కు బుద్ధి చెప్పిన ప్రభుత్వం...
posted on Oct 9, 2019 @ 4:14PM
తెలంగాణ రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఆర్టీసీ సమ్మె పైన తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం తాత్కాలిక ఉద్యోగుల నియమించింది. అయితే ప్రభుత్వం నియమించిన అవకాశాన్ని కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించాల్సి వస్తోంది. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సును నడుపుతున్నాడు. ప్రయాణికులు వారించినా తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో వారు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించిన డ్రైవర్ ను తొలగించి వేరే డ్రైవర్ తో బస్సు ను పంపించడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు. లక్సెటిపేట్ నుంచి బస్సు మంచిర్యాల వెళుతుండగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. గతంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గా ఎంతో మంది ప్రాణా లు గాలిలో కలిసిపోయినా సంఘటనలు మనం చూశాం.ఇక పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న రైల్వే స్టేషన్ ల నుంచి ఇళ్లకు చేరలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బస్సు లను ఏర్పాటు చేసినా అవి మెయిన్ రోడ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి సిటీలో బస్సుల తక్కువ గా ఉండటం అవి వస్తాయో రావో అన్నది తెలియక పోవడం తో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు. ప్రభుత్వం ఇంకా ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న వెనక్కు తగ్గబోమని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో బస్సులు దాదాపు డిపోల్ లోనే కనిపిస్తున్నాయి.ఇక ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.