ఇంత ఘోరమా.. డీపీఆర్ ఎలా ఇవ్వాలో తెలియదా? ఏపీ పరువు తీసిన జగన్ సర్కార్
జగన్ సర్కార్ అస్తవ్యస్థ, ఏకపక్ష విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతోంది. ఇప్పటికే ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని అభాసుపాలైంది వైసీపీ ప్రభుత్వం. హైకోర్టు, సుప్రీంకోర్టులు వైసీపీ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలను ఆక్షేపిస్తూ అమలు చేయకుండా నిలిపివేశాయి. కోర్టులు చాలదన్నట్లు ఇప్పుడు కేంద్ర జల సంఘం దగ్గర ఏపీ ప్రతిష్టను మంటగలిపారు జగనన్న అధికారులు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్ సర్కార్ ఇచ్చిన డీపీఆర్ ను తిరిగి పంపించింది కేంద్ర జల సంఘం. ఏపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్ ను ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని జలసంఘం మండిపడింది. డీపీఆర్ ఎలా ఇవ్వాలో కూడా మీ అధికారులకు తెలియదా? అంటూ జగన్ సర్కార్ ను కేంద్ర జల సంఘం చివాట్లు పెట్టింది. 46 పేజీల డీపీఆర్లో కనీస సమాచారాన్ని కూడా దాచి పెట్టారని, హైడ్రాలజీ, ఇంటర్ స్టేట్ అంశాలు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైన్లు, వ్యయ అంచనాలు లేవని అసహనం వ్యక్తం చేసింది. తెలియకపోతే సీడబ్ల్యూసీ వెబ్సైట్లో నమూనాలు ఉంటాయని, వాటి ప్రకారం అయినా ఇవ్వాలని సూచించింది. లాంటి వివరాలు కూడా లేకుండా డీపీఆర్ ఎలా ఇచ్చారంటూ కేంద్ర జల సంఘం సభ్యుడు ముఖర్జీ ఏపీ జల వనరుల శాఖకు లేఖ రాయడం కలకలం రేపుతోంద
రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సంగమేశ్వరం దగ్గర రోజుకు మూడు టీఎంసీను ఎత్తిపోసే ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎలాంటి ప్రణాళికలు లేకుండానే హడావుడిగా పథకాన్ని చేపట్టింది. ప్రాజెక్ట్ రిపోర్టును కూడా సరిగా రూపొందించలేదు. దీంతో జగన్ సర్కార్ తీరుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇరిగేషన్ నిపుణులు కూడా తప్పుపట్టారు. రాయలసీమ ప్రాజెక్టు చేపట్టామని చెప్పుకుని రాజకీయంగా లబ్ది పొందాలని వైసీపీ ప్లాన్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇరిగేషన్ నిపుణులు భయపడినట్లే ఇప్పుడు కేంద్ర జలసంఘం ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ లో కనీస ప్రాథమిక అంశాలు లేవని, దాన్ని ఎలా తయారు చేయాలన్న విషయంపై మార్గదర్శకాలను పాటిస్తూ సరైన డీపీఆర్ తయారు చేసి పంపాలని సూచించింది. ఎఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఈ డీపీఆర్ లో పొందుపర్చిన అంశాలు సరిపోవని పేర్కొంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా సంగమేశ్వరం నుంచి 17.9 కి.మీ దూరం వరకు శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో అప్రోచ్కాలువ తవ్వి పంపుహౌస్ నిర్మించి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి పంపేలా ఇది ఉంది. గతంలో దీని డీపీఆర్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర జలసంఘానికి ఏపీ సర్కారు పంపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను అందులో వివరించింది. దీనిపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయడంతో అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టు కావడంతో డీపీఆర్లు ఇచ్చాకే పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సోమవారం కృష్ణా బోర్డుకు డీపీఆర్ పంపించింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో పాటు నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకోలేం కాబట్టి దీన్ని చేపట్టినట్లు పేర్కొంది.
డీపీఆర్ లో తెలంగాణను తప్పు పట్టింది ఏపీ ప్రభుత్వం. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించింది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా 2015లోనే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టిందని పేర్కొంది. సాగర్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోందని, మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని వివరించింది. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోవడంతో కరువు సీమ రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటుందని డీపీఆర్లో ఏపీ సర్కార్ పేర్కొంది.