ఒలింపిక్స్ లో లవ్లీనాకు కాంస్యం.. భారత్ కు మూడో పతకం

టోక్సో ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. ఇప్పటివరకు రెండు పతకాలు రాగా.. అవి రెండు కూడా మహిళా ప్లేయర్లే అందించారు. వెయిట్ లిఫ్టింగులో మీరాబాయ్ చానుకు రజత పతకం రాగా.. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు కాంస్యం వచ్చింది. తాజాగా బాక్సింగులో లవ్లీనా బోర్గోహెయిన్ ఇండియాకు బ్రాంజ్ మెడల్ అందించింది.  ఒలింపిక్స్ లో ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్.. అద్భుతంగా ఆడి  కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64–69 కిలోలు) విభాగంలో బరిలో నిలిచిన ఆమె.. సెమీ ఫైనల్ లో ఓడిపోయింది.   టర్కీకి చెందిన బిజెనెజ్ సర్మినెలి చేతిలో ఓటమిపాలైంది. జడ్జిలంతా ఏకగ్రీవంగా బిజినెజ్ ను విజేతగా ప్రకటించారు. మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థి బిజినెజ్ పంచ్ ల వర్షం కురిపించింది. 5–0తో ముందంజ వేసింది. తర్వాతి రౌండ్ నుంచి బోర్గోహెయిన్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఏకగ్రీవంగా బిజెనెజ్ ను విజేతగా ప్రకటించారు. ఫలితంగా గెలుపోటములతో సంబంధం లేకుండా లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని గెలిచింది.   విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్ కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. కంచు పతకం సాధించిన లవ్లీనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లవ్లీనాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. లవ్లీనా విజయం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు ప్రధాని.  లవ్లీనా బోర్గోహెయిన్ ఒలింపిక్స్ పతకం సాధించడంతో... ఆమె సొంతూకు అసోంలోని ఓ మారుమూల పల్లెలో సంబరాలు జరుగుతున్నాయి. లవ్లీనా పల్లెకు ఇప్పటివరకు కనీసం రోడ్డు కూడా లేదు. కాని రెండు రోజుల క్రితమే అధికారులు యుద్ద ప్రాతిపదికన ఆ గ్రామానికి రోడ్డు నిర్మించారు.

రెచ్చ‌గొట్టిందంటూ ఎమ్మెల్సీ ఫిర్యాదు.. యువ‌తిపై కేసుతో హైడ్రామా..

ఎక్క‌డ‌నైనా ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఫిర్యాదులు చేయ‌డం చూస్తుంటాం. కానీ, అక్క‌డ సంథింగ్ డిఫ‌రెంట్‌. స్వ‌యానా అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అది కూడా ఓ యువ‌తిపై. అందులోనూ సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొట్టిందంటూ కంప్లైంట్‌. పోస్టులు పెట్ట‌డ‌మే నేర‌మ‌న్న‌ట్టు పోలీసులు సైతం వెంట‌నే కేసు క‌ట్టేశారు. మ‌హిళ అని చూడ‌కుండా స్టేష‌న్‌కు త‌ర‌లించారు. రాత్రి స‌మ‌యంలో కూడా సీఐడీ కార్యాల‌యంలోనే ఉంచారు. ఆమె టీడీపీ స‌పోర్ట‌ర్ కావ‌డం వ‌ల్లే ఇలా వేధిస్తున్నారంటూ ప్ర‌తిప‌క్షం భ‌గ్గుమంది. ఇటు ఎమ్మెల్సీ, అటు సీఐడీ తీరుపై మండిప‌డింది. రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టే విధంగా.. ఓ కులాన్ని అవమానించేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విచారణను గుంటూరు సీఐడీ రీజినల్‌ కార్యాలయానికి దర్యాప్తు నిమిత్తం పంపారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్‌ కేసు విచారిస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు బొలినేని జ్యోతిశ్రీని అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ రీజనల్‌ కార్యాలయానికి తరలించారు. ఆమెను విచారించి సాయంత్రానికి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేస్తారని భావించారు. సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవటంతో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని సంజీవ్‌కుమార్‌ను కలిసి వివరాలు అడిగారు. అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు 153ఎ, 120 రెడ్‌విడ్‌ 505(2) సెక్షన్‌ కింద సీఐడీ రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయటంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరుస్తామ‌ని చెప్పారు.  జ్యోతిశ్రీ మాట్లాడుతూ.. గంటలో పంపిస్తామని తీసుకువచ్చి రాత్రి వరకు నిర్బంధించారని తెలిపారు. తాను పార్టీపరంగా పోస్టింగ్స్‌ పెట్టానని, ఎవరినీ కించపరచలేదని, కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళను రాత్రి పూట సీఐడీ కార్యాలయంలో ఉంచడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జగన్ సర్కార్ కు షాక్.. దేవినేని ఉమాకు బెయిల్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది.  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ వచ్చింది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజుల పాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు.ఈ కేసులో బుధవారం ఉదయం ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజక వర్గంలో మైనింగ్ వివాదం రచ్చ రాజేసింది. గత మంగళవారం మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్‌ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఉమ కారుపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపనే అని దేవినేని అరోపించారు.అయితే పోలీసులు మాత్రం దేవినేని  ఉమాపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  అర్ధరాత్రి దేవినేని ఉమాను జి.కొండూరు పోలీసులు అరెస్టు చేశారు.  దేవినేనిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు.అది వీలు కాకపోవడంతో చివరకు కారు అద్దాన్ని తొలగించి.. ఆ తర్వాత కారు డోరు తెరిచారు. అనంతరం ఉమాను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకుని వేకువజామున 1.15 గంటలకు తరలించారు. దేవినేని ఉమా అరెస్ట్, పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించి.. ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. 

పవన్ కు బై బై .. జగన్ కు ఝలక్!  ఏపీలో కమలం కొత్త ప్లాన్? 

దేశంలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. బీజేపీ యేతర పార్టీలన్నీ, ఎవరికీ వారు కమల దళాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా 2024 ఎన్నికల్లో మోడీని గద్దె దించాలని గట్టి పట్టుమీడున్నాయి. బీజేపీ 2024 ఎన్నికల నాటికి దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు తద్వారా ఉత్తరాదిలో సీట్ల పరంగా వచ్చే నష్టాన్ని కొంత వరకైనా తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇంత వరకు, ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ ఎక్కడి కక్కడ. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రంగా ప్రత్యేక వ్యూహాలతో పావులు కదుపుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఇందులో భాగంగానే జరిగిందని అంటున్నారు.  దక్షిణాది వ్యూహంలో భాగంగానే, కమల దళం తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడిఎంకే కూటమి విజయం సాధించలేక పోయినా, బీజేపీ కొంత పట్టును అయితే సాధించగలిగింది. నాలుగు సీట్లు గెలిచింది. అసెంబ్లీలో కాలు పెట్టింది. తమిళనాడులో అంతర్భాగంగా ఉండే పుదుచ్చేరిలో అధికార పీఠాన్ని చేరుకుంది. మరోవంక కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి పార్టీ   అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్. మురుగన్’ కు స్థానం కల్పించింది. ఆయన స్థానంలో, మాజీ ఐపీఎస్ అధికారి, (2011 కర్ణాటక క్యాడర్)  యువకుడు (37 ఏళ్ళు)  అన్నామలైకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అన్నామలై 2019లో ఐపీఎస్ కు రాజీనామా చేసి, పార్టీలో చేరారు. ఆయన సారధ్యంలో పార్టీ ముందుకు సాగుతోంది. ఏఐడిఎంకేతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తోంది. స్టేట్’లో జూనియర్ పార్టనర్ అయినా, ఏఐడిఎంకేకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తోంది. పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారంలోనూ బీజేపీ పెద్దలు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఏఐడిఎంకే కీలక నేతలు మాజీ ముఖ్యమంత్రి  పళని స్వామి, పంన్నీర్ సెల్వం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.అలాగే, బీజేపీ అగ్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేసే అంశంపై మాత్రమే కాకుండా పార్టీ (ఏఐడిఎంకే) అంతర్గత సమస్యలు, ముఖ్యంగా శశికళ సృష్టిస్తున్న అలజడి పై చర్చించారని సమాచారం.   ఇంతవరకు అంతగా పట్టించుకోని తెలుగు రాష్ట్రాలపై  ముఖ్యంగా ఏపీ పై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపధ్యంలో, మూడో ప్రత్యాన్మాయంగా ఎదిగే ప్రయత్నంలో భాగంగా రెండు సంవత్సరాల క్రితమే బీజేపీ, మాజీ మిత్రపక్షం జన సేనను మళ్ళీ దగ్గరకు తీసుకుంది. ఉభయ పార్టీలు కలిసి ఉధ్యమాలు చేయాలని, ప్రాంతీయ పార్టీల పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, జనంలోకి తీసుకు వెళ్ళాలని,2024లో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో జెండాలే కాకుండా అజెండాలు కూడా వేరు కావడంతో గడచిన రెండు సంవత్సరాలలో రెండు పార్టీల ఉమ్మడి పోరాటం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉండిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ  ఉమ్మడి పోరు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.ఈ నేపధ్యంలో, ఇరు పార్టీల మద్య దూరం పెరిగింది. మరో వంక బేజేపీ కేంద్ర నాయకత్వం మారిన పరిస్థితుల్లో, పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి ముందు, పార్టీని పటిష్ట పర్చుకోవాలని, పొత్తుల విషయం ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చని రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ముఖ్యంగా పార్టీ కోర్ ఇష్యూస్ మీద కాన్సంట్రేట్ చేయాలని, ఇందుకు కోసంగా అవసరం అయితే జనసేనతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  జనసేన దూరంగా ఉన్నా, కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు సంబందించిన బీజేపీ ఒంటరిగానే పోరాటం చేసింది.టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర సోమువీర్రాజు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై ఆందోళనలు చేపట్టారు.చివరకు ఈ వివాదాల నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకు  వ్యతిరేకంగా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో  కాషాయ దళంలో జోష్ పెరిగింది. ఈ ఊపులోనే కావచ్చు సోము వీర్రాజు బీజేపీ చేస్తున్న ఆందోళనలకు జనసేన కలిసిరావడం లేదని బహిరంగంగా ఆరోపించారు.  ఆంధ్ర ప్రదేశ్ పై బీజీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది అనేందుకు సంకేతమా అన్నట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. పొత్తుల విషయాన్నిపక్కన పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలన, ముఖ్యంగా అద్వాన్న స్థితికి చేరిన ఆర్థిక పరిస్థితి, దేవాలయాలపై జరుగతున్న దాడులు, క్రైస్తవీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు చేపట్టాలని ఆయన గట్టిగా సూచించారు. ఈ నేపధ్యంలోనే, ఇటీవల కాలంలో బీజేపీ, ఆందోళన బాట పట్టింది. ముందు పార్టీ క్యాడర్’లో ఉత్సాహాన్ని నింపి, క్రియాశీలంగా ఉద్యమాలు నిర్వహిస్తే, ఎన్నికల సమయంలో పొత్తుల పై  నిర్ణయం తీసుకోవచ్చని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఈ వాస్తవాన్ని గ్రహించే, జగన్ ప్రభుత్వం పొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో జాగ్రత్త పడిందని అంటున్నారు. ఏమైనా, ఏపీ బీజేపీలో కొద్దో గొప్పో కదలిక అయితే వచ్చింది, ఎంతవరకు నిలుస్తుందో .. ఏమవుతుందో ముందు ముందు గానీ తేలదని, పరిశీలకులు బావిస్తున్నారు.

జగన్ సర్కార్ వేధింపులు, కక్ష సాధింపులు! ఏపీకి అమ‌ర‌రాజా గుడ్‌బై? 

కొత్తవి రావు.. పాతవాటిని ఉండనీయరు. వేధిస్తారు.. రాజకీయ కక్ష  సాధింపులకు దిగుతారు. ఇంకేం వేలాది మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇదీ ఆంధ్రప్రదేశ్ లోని జగనన్న పాలనలో నెలకొన్న పరిస్థితి. చంద్రబాబు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు కూడా.. మీకో దండం.. మీ పాలనకో దండం అని చెబుతూ ఏపీకి గుడ్ బై చెప్పేస్తున్నాయి. తాజాగా  రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపులు భరించలేక ‘అమరరాజా’ సంస్థ పొరుగు రాష్ట్రం వైపు చూస్తోందన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా ఈ సంస్థ కార్యకలాపాలకు కేంద్రమైన చిత్తూరు జిల్లాలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది  ఏపీకి బ్రాండ్ ఇమేజ్ గా ఉంది అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌. అది కంపెనీ కాదు.. ఉద్యోగాల గ‌ని. అది సంస్థ కాదు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తి. బ్యాట‌రీ త‌యారీరంగంలో దేశంలోకే నెంబ‌ర్ 2. బిలియ‌న్ డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన సంస్థ‌. ట్యాక్స్‌ రూపంలో దేశ ఖ‌జానాకు 2400 కోట్లు జ‌త చేస్తున్న ఘ‌న‌త‌. ఏపీ ప్ర‌భుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర ప‌న్నులు క‌డుతున్న అక్ష‌య పాత్ర‌. అలాంటి బంగారు బాతులాంటి సంస్థ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు క‌క్ష్య‌క‌ట్టిందంటున్నారు. కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ, 'క‌మ్మ‌' వార‌నే ఏకైక కార‌ణంతో అమ‌ర‌రాజాపై కుట్ర‌లు చేస్తోందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సంస్థ స్థాపించి దాదాపు 4 ద‌శాబ్దాలు అవుతోంది. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం అమ‌ర‌రాజాకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది.  గ‌ల్లా అరుణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నా కుట్ర‌లు ఆప‌లేదు. గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నార‌ని కాబోలు.. కుతంత్రాలు ఆప‌డం లేదు. ఇటీవ‌ల పొల్యూష‌న్ బోర్డు అధికారుల‌ను అమ‌ర‌రాజా క‌ర్మాగారంపైకి పాల‌కులు ఉసిగొల్పారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కంపెనీ వ‌ల్ల కాలుష్యం క‌లుగుతోంద‌ని.. వెంట‌నే మూసేయాలంటూ నోటీసులు ఇచ్చారు. 36 ఏళ్లుగా ఉన్న ఫ్యాక్ట‌రీ విష‌యంలో ఇప్పుడే పొల్యూష‌న్ గుర్తుకొచ్చిందా? అమ‌ర‌రాజా ఏ చిన్నాచిత‌కా బ‌డ్డీ కొట్టో కాదు. అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీ. నిబంధ‌న‌లు, త‌నిఖీలు ప‌క్కాగా ఫాలో కావాల్సిందే. అంత సిల్లిగా ఏమీ న‌డ‌వ‌దు క‌ర్మాగారం. కావాల‌నే, ఇబ్బందులు సృష్టించార‌ని, పొల్యూష‌న్ బోర్డుతో చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇదంతా రాజ‌కీయ ప్రోత్బ‌లంతో జ‌రిగింద‌ని పారిశ్రామిక వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా, స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. అన్నంత ప‌నీ చేసేవారే. కంపెనీని మూసేసేవారే. కానీ, న్యాయం, చ‌ట్టం అంటూ ఉంటాయిగా. స‌ర్కారే సుప్రీంకాదుగా. అందుకే, కోర్టుకెళ్లి మ‌రీ ఆ ఆదేశాల‌ను అడ్డుకుంది యాజ‌మాన్యం. ఇలా ఒక‌టి కాక‌పోతే ఇంకోటి.. ప్ర‌భుత్వం నుంచి వ‌రుస‌గా వ‌స్తున్న ఇబ్బందుల‌తో విసిగిపోయిన యాజ‌మాన్యం.. ఇక ఏపీలో ఉండ‌టేమంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను ఉండ‌నిచ్చేలా లేరంటూ.. పొరుగు రాష్ట్రానికి వ‌ల‌స వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.   అంత పెద్ద కంపెనీ వ‌స్తానంటే.. ఎవ‌రైనా వ‌ద్దంటారా? అందుకే, రెడ్ కార్పెట్ ప‌రిచి మ‌రీ త‌మ రాష్ట్రానికి రమ్మంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. సీఎం స్టాలిన్‌తో అమ‌ర‌రాజా యాజ‌మాన్యం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని.. చెన్నై శివార్ల‌లో స్థ‌లం కూడా కేటాయించిన‌ట్టు.. అక్క‌డ ముమ్మ‌ర ప‌నులు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే అనుకున్న‌ట్టే సాగితే.. మ‌రో 3 నెల‌ల్లోనే దేశ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ అమ‌ర‌రాజా కంపెనీ చిత్తూరు నుంచి త‌మిళ‌నాడుకు త‌ర‌లిపోనుంది. ఇది ఆంధ్రులుగా మ‌నంద‌రికీ అవ‌మాన‌క‌ర విష‌య‌మే.  ఏపీపై అమ‌ర‌రాజాకు ఉన్న అనుబంధం, అభిమానం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లోని  ప్ర‌ధాన కార్యాలయాన్ని తిరుపతికి త‌ర‌లించింది అమరరాజా. ఎందుకంటే, తాము చెల్లించే పన్నులు.. త‌మ సొంత‌ రాష్ట్రానికే దక్కాలనే కార‌ణం. 1985లో గల్లా రామచంద్ర నాయుడు స్థాపించిన అమ‌ర‌రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌.. వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ద‌శ‌బ్దాలుగా దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మై వెలుగుతోంది. వాహన బ్యాటరీలు , బ్యాటరీ ఛార్జర్స్, ఎలక్ట్రానిక్స్ , పారిశ్రామిక బ్యాటరీలు , డిజిటల్ ఇన్వర్టర్స్, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ , ఆహార ఉత్పత్తులు , ట్రిక్కేల్ ఛార్జర్స్, యూపిఎస్, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మెటల్.. ఇలా ప‌లు ప్రొడ‌క్ట్స్ త‌యారు చేస్తోంది. కంపెనీలో దాదాపు 16వేల మంది ప‌ని చేస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంకలనం చేసిన ఆసియా లో "'బెస్ట్ అండర్ ఎ బిలియన్" 2010 జాబితాలో అమర రాజా బ్యాటరీస్ ఒక‌టి. సామాజిక సేవ‌లోనూ అమరరాజా గ్రూప్ త‌న‌వంతు పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ఉపాధి, అభ్యసన-విద్య, సామాజిక పునరావాసం, గ్రామీణ అభ్యున్నతి వంటి రంగాలలో కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.  ఇలా ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఉద్యోగ‌, ఉపాధి, సామాజిక సేవ‌లో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమ‌ర‌రాజా కంపెనీపై కేవ‌లం టీడీపీ, 'క‌మ్మ' అనే కార‌ణాల‌తో కుట్ర‌లు చేస్తూ మ‌నుగ‌డ సాగ‌నివ్వ‌కుండా వేధిస్తూ.. పొల్యూష‌న్‌ను సాకుగా చూసి ఏకంగా ఫ్యాక్ట‌రీనే మూసేయాల‌నే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ ప్ర‌య‌త్నాల‌తో అస‌హ‌నానికి లోనైన అమ‌ర‌రాజా యాజ‌మాన్యం.. త‌న పుట్టింటిని వ‌దిలి వెళ్లేందుకు బాధ‌తో సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు స‌ర్కారు అక్కున చేర్చుకుంటుండ‌టంతో.. అక్క‌డికి త‌ర‌లివెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతోంద‌ని తెలుస్తోంది. ప‌న్నుల రూపంలో ఏటా వెయ్యి కోట్ల‌కు పైగా జ‌మ చేస్తూ.. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీని కాల‌ద‌న్నుకొని.. జ‌గ‌న్ స‌ర్కారు ఏం సాధించిన‌ట్టో? రాజ‌కీయ లాభం కోసం ఇలా రాష్ట్ర‌, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డికే చెల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీవాసులు. 

థర్డ్ వేవ్ రమ్మంటే వస్తుంది.. కానీ పొమ్మంటే పోదు

కరోనా ఫస్ట్ వేవ్ చెప్పీ చెప్పకుండా వచ్చింది. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో ఇతర దేశాలతో పోల్చి నప్పుడు మన దేశంలో ముప్పు కొంత తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాల మాట విన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు పాటించారు.  కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి మీడియా ద్వారా మాస్క్ ధరించండి .. భౌతిక దూరం పాటించండి .. చేతులు శుభ్రంగా ఉంచుకోండి .. అని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరం మేరకు  కఠిన చర్యలూ తీసుకున్నారు.  మరోవంక లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకున్నాయి. అలాగే, స్వచ్చంద సంస్థలు, సామాన్య ప్రజలు ఎవరికి వారు చేతనైన మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలా, సామాన్య ప్రజల నుంచి ప్రధాని వరకు అందరూ ఒకటిగా భారతీయులు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేశారు. ఇలా సామదానదండోపాయాలు ఉపయోగించడంతో పాటుగా ఉమ్మడి కృషి ఫలితంగా ఫస్ట్ వేవ్ ముప్పును  కొంతలో కొంత తగ్గించుకోవడంలో మన దేశం కొంత మేరకు అయినా సఫలమైంది. అదే సెకండ్ వేవ్ వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే తెలిసినా, ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. రాజకీయ కార్యకలాపాల్లో, ముఖ్యంగా బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కుంభమేళా ఇతర సామూహిక కార్యక్రమాల విషయంలో కట్టు తప్పడంతో కరోనా సెకండ్ వేవ్ ఒక విధంగా ప్రళయాన్నే సృష్టించింది. అంతా అయి ప్రభుత్వాలు కళ్ళు తెరిచే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయింది. మనదేశంలో 2020 జనవరి 3 వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఆగష్టు 3, 2021 నాటికి ఆ సంఖ్య 31,726,507 చేరింది. ఇంతవరకు 4,25,195 మంది కరోనా బాధితులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది సెకండ్ వేవ్’ లో చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 41.5శాతం మాత్రమే కాగా.. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 54.5శాతానికి పెరిగింది. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ , అత్యవసర మందులు అందక ఎవరూ చనిపోలేదు. కానీ సెకండ్ వేవ్’ లో మరణాల సంఖ్య పెరగడానికి ఆక్సిజన్, మందుల కొరత కూడా ఒక ప్రధాన కారణం అయింది. ఫస్ట్ వేవ్’లో లేని బ్లాక్, ఎల్లో ఫంగస్ వంటి ప్రాణాంతక ఉప విపత్తులు,కొత్త వేరియంట్స్ సెకండ్ వేవ్ లో పుట్టుకొచ్చాయి.  ఇప్పటికే దేశంలో 10 రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతంగానే వుంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ నష్టం కలగచేయడానికి ఇంకా ఎన్ని కారణాలు ఉన్నా, ఉమ్మడి  ‘స్వయంకృత’ అపరాధం అన్నిటినీ మించిన మూల కారణం. అదే ప్రధాన ముద్దాయి. ప్రభుత్వాలు  తిలాపాపం తలాపిడికెడు పంచుకున్నాయి. ప్రభుత్వాలే కాదు మనం అందరం అందుకు బాధ్యులమే ..  తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నట్లుగా మూడోవేవ్‌ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. నిజం,  కరోనా థర్డ్ వేవ్ ఈ ఈనెలలో వస్తుందా, మరో నెల ఆగుతుందా, అసలు రాకుండానే పోతుందా, వచ్చినా పెద్దగా ప్రభావం చూపదా, వంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రజల ప్రవర్తనే సమాధానంగా నిలుస్తుంది. వైరస్‌ వ్యాప్తి తీరు ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పింది అక్షర సత్యం. అయితే సెకండ్ వేవ్’లానే థర్డ్ వేవ్  థర్డ్ వేవ్’ ను కూడానిర్లక్ష్యం చేస్తే, థర్డ్ వేవ్’ మహా ప్రళయంగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. థర్డ్ వేవ్ లో వచ్చేది, ఇప్పటికీ అమెరికా సహా అనేక దేశాల్లో స్థైర్య విహారం చేస్తున్న, డెల్టా వేరియంట్‌ , ఈ వేరియంట్ వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సో .. థర్డ్ వేవ్ రావాలా వద్దా అనేది ... మన చేతుల్లోనే వుంది .. రమ్మంటే వస్తుంది .. కానీ పొమ్మంటే పోదు... పోయేటప్పుడు వట్టి చేతులతో పోదు ... చిక్కిన ప్రాణాలను చిక్కినట్లు ప్రాణాలను మూట కట్టుకుని పట్టుకు  పోతుంది. అందుకే.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వింటున్నారా...   కరోనా ఫస్ట్ వేవ్ చెప్పీ చెప్పకుండా వచ్చింది. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో ఇతర దేశాలతో పోల్చి నప్పుడు మన దేశంలో ముప్పు కొంత తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాల మాట విన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు పాటించారు.  కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి మీడియా ద్వారా మాస్క్ ధరించండి .. భౌతిక దూరం పాటించండి ... చేతులు శుభ్రంగా ఉంచుకోండి .. అని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరం మేరకు  కఠిన చర్యలూ తీసుకున్నారు.  మరోవంక లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకున్నాయి. అలాగే, స్వచ్చంద సంస్థలు, సామాన్య ప్రజలు ఎవరికి వారు చేతనైన మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలా, సామాన్య ప్రజల నుంచి ప్రధాని వరకు అందరూ ఒకటిగా భారతీయులు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేశారు. ఇలా సామదానదండోపాయాలు ఉపయోగించడంతో పాటుగా ఉమ్మడి కృషి ఫలితంగా ఫస్ట్ వేవ్ ముప్పును  కొంతలో కొంత తగ్గించుకోవడంలో మన దేశం కొంత మేరకు అయినా సఫలమైంది. అదే సెకండ్ వేవ్ వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే తెలిసినా, ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. రాజకీయ కార్యకలాపాల్లో, ముఖ్యంగా బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కుంభమేళా ఇతర సామూహిక కార్యక్రమాల విషయంలో కట్టు తప్పడంతో కరోనా సెకండ్ వేవ్ ఒక విధంగా ప్రళయాన్నే సృష్టించింది. అంతా అయి ప్రభుత్వాలు కళ్ళు తెరిచే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయింది. మనదేశంలో 2020 జనవరి 3 వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఆగష్టు 3, 2021 నాటికి ఆ సంఖ్య 31,726,507 చేరింది. ఇంతవరకు 4,25,195 మంది కరోనా బాధితులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది సెకండ్ వేవ్’ లో చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 41.5శాతం మాత్రమే కాగా.. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 54.5శాతానికి పెరిగింది. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ , అత్యవసర మందులు అందక ఎవరూ చనిపోలేదు. కానీ సెకండ్ వేవ్’ లో మరణాల సంఖ్య పెరగడానికి ఆక్సిజన్, మందుల కొరత కూడా ఒక ప్రధాన కారణం అయింది. ఫస్ట్ వేవ్’లో లేని బ్లాక్, ఎల్లో ఫంగస్ వంటి ప్రాణాంతక ఉప విపత్తులు,కొత్త వేరియంట్స్ సెకండ్ వేవ్ లో పుట్టుకొచ్చాయి.  ఇప్పటికే దేశంలో 10 రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతంగానే వుంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ నష్టం కలగచేయడానికి ఇంకా ఎన్ని కారణాలు ఉన్నా, ఉమ్మడి  ‘స్వయంకృత’ అపరాధం అన్నిటినీ మించిన మూల కారణం. అదే ప్రధాన ముద్దాయి. ప్రభుత్వాలు  తిలాపాపం తలాపిడికెడు పంచుకున్నాయి. ప్రభుత్వాలే కాదు మనం అందరం అందుకు బాధ్యులమే ..  తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నట్లుగా మూడోవేవ్‌ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. నిజం,  కరోనా థర్డ్ వేవ్ ఈ ఈనెలలో వస్తుందా, మరో నెల ఆగుతుందా, అసలు రాకుండానే పోతుందా, వచ్చినా పెద్దగా ప్రభావం చూపదా, వంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రజల ప్రవర్తనే సమాధానంగా నిలుస్తుంది. వైరస్‌ వ్యాప్తి తీరు ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పింది అక్షర సత్యం. అయితే సెకండ్ వేవ్’లానే థర్డ్ వేవ్  థర్డ్ వేవ్’ ను కూడానిర్లక్ష్యం చేస్తే, థర్డ్ వేవ్’ మహా ప్రళయంగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. థర్డ్ వేవ్ లో వచ్చేది, ఇప్పటికీ అమెరికా సహా అనేక దేశాల్లో స్థైర్య విహారం చేస్తున్న, డెల్టా వేరియంట్‌ , ఈ వేరియంట్ వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సో .. థర్డ్ వేవ్ రావాలా వద్దా అనేది ... మన చేతుల్లోనే వుంది .. రమ్మంటే వస్తుంది .. కానీ పొమ్మంటే పోదు... పోయేటప్పుడు వట్టి చేతులతో పోదు ... చిక్కిన ప్రాణాలను చిక్కినట్లు ప్రాణాలను మూట కట్టుకుని పట్టుకు  పోతుంది. అందుకే.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వింటున్నారా...

ఉదయం అవార్డ్.. సాయంత్రం సస్పెండ్! రాసలీలల ఎస్ఐ కథ పెద్దదే? 

తెలంగాణలో సంచలనం రేపిన , పోలీసు శాఖలో ప్రకంపనలు స్పష్టించిన మహిళా దళిత ట్రైనీపై లైగింక వేధింపుల కేసులో ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని  సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ వేటు పడింది. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని.. మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు.  మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అర్ధరాత్రి అత్యాచారం చేశారని దళిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయడం సంచలం రేపింది. సోమవారం రాత్రి తనను అడవిలోకి తీసుకువెళ్లి బలత్కారం చేసినట్లు కుటుంబసభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు ఆరోపించింది.  తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు రోధించారు. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని ఉత్తమ పనితీరుకు గాను అవార్డు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఉదయమే జిల్లా ఎస్పీకి అతనికి అవార్డు అందించారు.

కేసీఆర్ చెబితేనే సంజయ్ పాదయాత్ర ఆగిందా? 

తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. హుజురాబాద్ కేంద్రంగానే రాజకీయాలు సాగుతుండగా.. ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో కొంత వేడి తగ్గింది. ఆగస్టు9 నుంచి పాదయాత్రకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అనూహ్యంగా వాయిదా పడింది. సంజయ్ యాత్ర ఆగస్టు చివరి వారంలో ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. దానిపై  క్లారిటీ లేదు. అసలు బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందా లేదా అన్నదానిపైనా స్పష్టత రావడం లేదు.  బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాల వల్లే సంజయ్ యాత్రకు హైకమాండ్ బ్రేకులు వేసిందనే ప్రచారం జరుగుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం వల్లే ఆగిపోయిందని చెబుతున్నారు. ఈటల విషయంలో సంజయ్ వ్యవహారశైలి సరిగా లేదనే ఫిర్యాదులు హస్తినకు వెళ్లాయని అంటున్నారు. బీజేపీ వర్గాలు మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను వాయిదా వేశామని చెప్పారు.  తాజాగా బండి సంజయ్ పాదయాత్ర ఆగిపోవడంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ టచ్ లో ఉన్నారని చెప్పారు. అందుకే ప్రధాని మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై  కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాట్లాడటంలేదని తప్పుబట్టారు.  కేసీఆర్‌ ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు.  కేసీఆర్ ఒత్తిడివల్లే పాదయాత్రను బీజేపీ నేత బండి సంజయ్ వాయిదా వేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు మోడీకి కేసీఆర్ లొంగిపోయారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ లక్ష్యంగానే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

రాజకీయాలు అందరు ఆడే ఆట కాదు.. ఎన్టీఅర్, ఎమ్జీఆర్ వంటి కారణజన్ములు కొందరే! 

ఒక అమితా బచ్చన్, ఒక టెండూల్కర్, ఒక ఎన్టీఆర్, ఒక ఎమ్జీఆర్, ఒక చిరంజీవి, ఒక హేమమాలిని, ఒక జయప్రద, జయసుధ, ఒక బాలయ్య బాబు... ఒక కీర్తి ఆజాద్, ఒక బాబుల్ సుప్రియో... ఇంకా ఇలాంటి ఇంకెందరో, ఈ అందరి మధ్య ఒక పోలిక ఉంది. వీరంతా సెలేబ్రిటీలు. క్రికెట్, సినిమా రంగాలలో పేరున్న హీరోలు. అయితే అందులో విశషం ఏముంది? అనిపించవచ్చును. కానీ ఈ అందరి మధ్య మరో ముఖ్య పోలిక కూడా వుంది. వీరంతా రాజకీయాలలో కూడా వేలు పెట్టారు. కొందరు సీరియస్ గా సిన్సియర్ గా రాజకీయాలు చేశారు. రాజకీయాలలో నిలతొక్కుకున్నారు, రాణించారు.  మన నందమూరి తారక రామ రావు (ఎన్టీఅర్) అయితే రాజకీయలలోనూ చరిత్ర సృష్టించారు. పార్టీ (టీడీపీ) పెట్టిన 11 నెలలకే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అలాగే మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి ఇలా సినీ రాజకీయ నాయకులు అటూ ఇటూ రెండువైపులా రాణించారు. ఇప్పటికి కూడా ఇతర రంగాల్లో రాణించిన సెలేబ్రిటీలు  రాజకీయ రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడులో కమల్ హసన్, ఏపీలో పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మధ్యనే మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దు, పంజాబ్  ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ని స్టంపౌట్ చేసి ఆ రాష్ట్ర  పీసీసీ చీఫ్ గా సెలెక్ట్ అయ్యారు.  ఇక  బాబుల్ సుప్రియో, బెంగాలీ గాయకుడు. పశ్చిమ బెంగాల్లో మంచి గుర్తింపున్న సింగర్. సినిమా గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటుగా హిందీ తదితర భాషల్లో కూడా కొన్నిపాటలు పాడారు. బాబుల్ సుప్రియో  సినిమా పాటలు, సంగీతం విషయాన్ని పక్కనే పెడితే.. ఆయన 2010లో రాజకీయ అరంగేట్రం చేశారు. బీజేపీలో చేరారు. సెలబ్రిటీ కావడంతో చకచక పైమెట్టు ఎక్కుతూ, 2014లో అసన్సోల్ లోక్  సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.  అంతే కాదు, ఫస్ట్ టైమ్ ఎంపీ అయినా, మోడీ మొదటి మంత్రి వర్గంలో సెలబ్రిటీ కోటాలో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019లో రెండవ సారి అదే స్థానం నుంచి గెలిచారు. మోడీ సెకండ్ కాబినెట్’లోనూ మంత్రి పదవి దక్కింది.  అయితే ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ సందర్భంగా ప్రదాని ఉద్వాసన పలికిన 12 మంత్రులలో సుప్రియో కూడా ఒకరు. ఇక అక్కడి నుంచి అయనలో రాజకీయ వైరాగ్యం మొదలైంది. మూడు నాలుగు రోజుల క్రితం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. అంతే కాదు ‘రాజకీయాలకు ఒక నమస్కారం’  అంటూ పాలిటిక్స్ కు గుడ్ బై  చెపుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంకొక పార్టీలో చేరే ఆలోచన గానీ, ఇంకొకటి గానీ లేవని, ఢిల్లీలో బంగాళా, సెక్యూరిటీ సరండర్ చేస్తున్నానని నిజాయతీని  ప్రదర్శించే ప్రయత్నం చేసారు. నిజమే కామోసు అనుకునే వారు అనుకున్నారు. కానీ, ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుదు జేపీ నడ్డను కలిసిన తర్వాత ఆయన స్వరం మారింది. రాజకీయాలకు దూరంగా ఉంటా  కానీ ... ఎంపీగా కొనసాగుతా అని కొత్త రాగం ఎత్తుకున్నారు.   బాబుల్ సుప్రియో డ్రామా చేస్తున్నారని, కొద్దిగా బెట్టు చేస్తేనో, బెదిరిస్తేనో మంత్రి పదవి మళ్ళీ వస్తుందని ఆశించారని తృణమూల్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అటు నుంచి రియాక్షన్ ఇంకోలా ఉండడంతో, టోన్ మార్చి కొత్త పల్లవి ఎత్తుకున్నారని  విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే సినిమా, క్రీడా రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కొందరు, రాజకీయ రంగంలో వేలు పెట్టి, చివరకు ఇలా బాబుల్ సుప్రియోలా. అవకాశం ఉన్నంత వరకు పదవులు అనుభవించి, అవి చేజారి పోగానే, పక్కకు తప్పుకోవడం చాలా మంది విషయంలో ఒక దురాచారంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, చిరంజీవి ఇదే కోవకు వస్తారు. ఆయన సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రంలో  మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. అనుభవించవలసినవి అన్నీ అనుభవించారు. చివరకు 2019 లో కాంగ్రెస్ ఓడిపోయినా తర్వాత కూడా రాజ్య సభ పదవీ కాలం ముగిసే వరకు ఆ హోదాను అనుభవించారు.  కట్ చేస్తే  ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి దూరం జరుగుతూ ... సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చారు. అమ్మడు కుమ్ముడు మూడ్ లోకి వచ్చేశారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి కొత్త ప్రయత్నాల్లో ఉన్నారు. జగన్ రెడ్డితో దోస్తీ చేసి, రాజ్య సభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందరూ కాక పోయినా, కొందరు సెలబ్రిటీలు రాజకీయాలకు పనికిరారు. క్రికెట్ మైదానంలో సిక్సర్ల మీద సిక్సర్లు, శతకాల మీద సెంచరీలు కొట్టిన టెండూల్కర్, రాజ్య సభలో డక్ అవుట్ అయ్యారు. ఆయన ఆరేళ్లలో సభకు హాజరైంది అతి తక్కువ. ఇక సభలో ప్రజాసమస్యలు ప్రస్తావించింది అయితే మరీ తక్కువ. అలాగే ఇంకా చాలామంది. సో .. మెరిసేదంతా బంగారం కాదు ... రాజకీయాలు   అందరూ ఆడే అట కాదు .. అందరూ చేయగల నటనా కాదు.  ఎన్టీఅర్, ఎమ్జీఆర్ వంటి కారణజన్ములు కొందరే ఉంటారు.

గ‌జ‌ప‌తిరాజుకి బిగ్‌ రిలీఫ్‌.. కుట్ర‌దారుల‌కు మ‌రో షాక్‌..

ఎంత‌గా బంధించాల‌ని చూశారో.. అంత‌గా బంధ‌నాలు తెంచుకుంటున్నారు. కుట్ర‌ల‌తో ఎన్ని కేసులు పెట్టినా.. వాట‌న్నిటినీ హైకోర్టులో ఎదుర్కొంటున్నారు. అక్ర‌మ జీవోతో మాన్సాస్ ట్ర‌స్ట్ నుంచి అశోకుడిని సాగ‌నంపామ‌ని రెండేళ్ల పాటు పండ‌గ చేసుకున్నారు. కానీ, కోర్టు తీర్పుతో రాజు గారు మ‌ళ్లీ మాన్సాస్ సింహాస‌నం అధిష్టించ‌డంతో పాల‌కులు ఖంగు తిన్నారు. ఆ క‌ళ్ల‌మంట‌తోనే కాబోలు.. ప్ర‌తీదానికి కొర్రీలు పెడుతూ గ‌జ‌ప‌తిరాజు ముంద‌రి కాళ్ల‌కు బంధం వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మాన్సాస్ ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన జీతాల‌ను ఆపేశారు. బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అందుకు, మాన్సాస్ ఈవోను పావుగా వాడుకున్నార‌నే ఆరోప‌ణ‌ ఉంది.  జీతాలు వెంట‌నే ఇవ్వాలంటూ మాన్సాస్ ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగ‌డం.. ఆ అంశాన్ని సైతం అశోక్‌పై రివేంజ్‌కు వాడుకోవ‌డం వారికే చెల్లింది. అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్రోద్భలంతోనే ఉద్యోగులు గొడ‌వ చేశారంటూ ఏకంగా ఛైర్మ‌న్‌పైనే కేసు క‌ట్టి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. ఈ కేసుపైనా హైకోర్టును ఆశ్ర‌యించారు అశోక్‌. కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్‌ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.   మాన్సాస్‌ ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈక్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి..  కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. తాజా హైకోర్టు తీర్పుతో రాజుకు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టైంది.   

విజయసాయికి ర‌ఘురామ షాక్‌.. బెయిల్‌ రద్దుకు కోర్టులో పిటిషన్‌

ర‌ఘురామ‌ అన్నంత ప‌నీ చేశారు. ఏ1తో పాటు ఏ2 సంగ‌తీ తేలుస్తానంటూ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అన్న‌ట్టుగానే.. విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఆగ‌స్టు 25న జ‌గ‌న్ కేసులో తుది తీర్పు రాబోతోంది. బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయి జైలుకు వెళితే.. ఆ స్థానంలో తాను అధికారం చెలాయించొచ్చ‌ని క‌ల‌లు కంటున్న నెంబ‌ర్ 2కి.. అదే ర‌ఘురామ ఝ‌ల‌క్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ర‌ఘురామ‌ను త‌ట్టుకోవ‌డం సీఎం జ‌గ‌న్ వ‌ల్లే కావ‌డం లేదు.. ఇక త‌న‌వ‌ల్ల ఏం అవుతుంద‌ని తెగ ఇదైపోతున్నార‌ట విజ‌య‌సాయిరెడ్డి. జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును కోరారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో ప్ర‌స్తావించారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. జగన్‌ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.   విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆయన్ను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణే కాకుండా న్యాయవ్యవస్థ పట్ల ఆయన దృక్పథాన్ని తేటతెల్లం చేస్తోందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.  

కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. బీజేపీ సెలబ్రేషన్స్.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. అది మరెక్కడో కాదు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు  శివప్రసాద్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు జిల్లా కలెక్టర్. తన ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. సీఎం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కలెక్టర్ షాక్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సెగ రాజేసిన టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వైసీపీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి షాకిస్తూ..  టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు జిల్లా కలెక్టర్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఆదేశాలకు ఖచ్చితంగా పాటించాలని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు.  ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై కొన్ని రోజులుగా వివాదం సాగుతోంది. విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ కూడా చేశారు. అయితే టిప్పు విగ్రహంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్యనేతలు ప్రొద్దుటూరుకు వచ్చి ఆందోళన చేశారు. విగ్రహం ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసిన చోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధర్నా నిర్వహించారు. బీజేపీ తీవ్ర అభ్యంతరం చెబుతున్నా వెనక్కి తగ్గలేదు ఎమ్మెల్యే రాచమల్లు. టిప్పు సుల్తాన్ విగ్రహంపై బీజేపీ కావాలనే రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. విగ్రహం  ఏర్పాటు చేసి తీరుతానని చెప్పారు. ఎవరూ అడ్డుకుంటారో చూస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే గట్టి పట్టుదలగా ఉన్నప్పటికి.. విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి నిరాకరించడం సంచలనంగా మారింది.  కడప జిల్లా కలెక్టర్ ఆదేశాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంతోషం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను ఛేదించామని చెప్పారు. బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు తెలిపారు, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారన్నారు. ఇది, హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని సోము వీర్రాజు తెలిపారు. దేశంలో నివసించే ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని పాటించాలన్నారు. కాదని రాచమల్లు రాజ్యంగం పాటిస్తామంటే.. ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయని ఎద్దేవా చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే మీద, ఇతరుల మీద పోలీసులు కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.  

స్నేహం బెడిసికొట్టి 'దాదాగిరీ' దాకా ఎందుకొచ్చింది?

హాలియా సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు యథాలాపంగా మాట్లాడినవేనా? లేక అంతరార్థం వేరే ఉందా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా నడుస్తోంది. కృష్ణా నది మీద అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని, అందువల్ల తెలంగాణకు మళ్లీ నీళ్ల గోస తప్పదని కేసీఆర్ పాత రికార్డును బయటికి లాగుతుండడం కొందరిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను రేకెత్తిస్తోంది. కేసీఆర్ మాటలను తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మేధావులను ఆలోచనలో పడేస్తోంది. అదే సమయంలో కేంద్రం ఎజెండాలో ఉన్న నదుల అనుసంధానం అనే భవిష్యత్ ప్రణాళికకు కూడా గండి కొట్టడం ఖాయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ఆంధ్రా-తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరిసిన స్నేహం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. వాస్తవానికి వారి స్నేహబంధం కావాల్సింది ఇప్పుడే అయినా.. ఇప్పుడలాంటి ఛాయలేవీ కనిపించడం లేదన్న బెంగ జలరంగ నిపుణుల్లో కనిపిస్తోంది. రాయలసీమకు నీళ్లిచ్చి రతనాలసీమగా చేస్తానన్న కేసీఆర్.. అందుకు బాటలువేసే కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీకి తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో అధికారులను ఎందుకు హాజరు కానివ్వలేదన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుచూపు లేని వైఖరి కూడా అత్యంత నష్టదాయకంగా భావిస్తున్నారు. భౌగోళికంగా ఎగువనున్న తెలంగాణకు సహజంగానే గోదావరి అయినా, కృష్ణా  నీటిని అయినా వాడుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. ఆ అవకాశాలనే ఇప్పుడు తెలంగాణ ఉపయోగించుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కేసీఆర్ అందించిన స్నేహ హస్తాన్ని జగన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడమే సమస్య పీటముడి పడటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కేంద్రం జోక్యంతో ప్రమేయం లేకుండా రెండు రాష్ట్రాలూ (మహారాష్ట్రతో కలిపి 3) కలిసి సెటిల్ చేసుకుందామంటూ కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను జగన్ వాడుకోలేక.. తాను చిక్కుకున్న వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటానికే కేంద్రం ముందు మోకరిల్లారని, అందుకే జగన్ లేఖ రాసిందే తడవు కేఆర్ఎంబీ మీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ దాని నిర్వహణ, నియంత్రణ, కాపలా వంటి కీలకమైన అన్ని అంశాలను కేంద్రం లాక్కుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి అవలంబించేది కాదన్న వాదనలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.  కృష్ణా నది నీటి విషయంలో జగన్ అనుసరించబోయే వైఖరిని పసిగట్టిన కేసీఆర్ తనకు నమ్మకస్తుడైన ఓ మంత్రి సూచనను వెంటనే ఇంప్లిమెంట్ చేశారని, అందువల్లే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిసినా ఇటీవల జలవిద్యుత్ చేపట్టారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.  అయితే కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో తెలంగాణ సర్కారు పవర్ జనరేషన్ నిలిపివేసినా.. రెండు నదుల సమన్వయ కమిటీ భేటీకి సహకరించడం లేదని వారంటున్నారు. వచ్చే అక్టోబర్ లో గెజిట్ నోటిఫికేషన్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చి కృష్ణా-గోదావరి నదుల సమస్త వ్యవహారాలు నేరుగా కేంద్రం అజమాయిషీలోకి వెళ్తాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని భావిస్తున్న కేసీఆర్.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ తో రగిలిపోతున్నారు. అందుకే ఎప్పుడూ లేంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ నీటివాటా కావాలని, నది పరీవాహ ప్రాంతాన్ని అనుసరించి వాటాలు తేల్చాలని.. ఇలా కొత్తకొత్త మెలికలు పెడుతున్నారు. ఈ వైఖరితో రెండు రాష్ట్రాల మధ్య రానున్న రోజుల్లో సయోధ్య కష్టమేనంటున్నారు జలరంగ నిపుణులు. అయితే ఈ విషయం కేంద్రం కోర్టులో పడటానికి జగనే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కేంద్రం ఈ రెండు రాష్ట్రాల నీటివాటాలను ఎలా భాగిస్తుందో చూడాలి.

హుజురాబాద్ పై రేవంత్ మాస్టర్ ప్లాన్.. వర్కింగ్ ప్రెసిడెంట్లకు రూట్ మ్యాప్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు స్పీడ్ పెంచిన కమలనాధులకు ధీటుగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ కమిటి కూర్పుపైనా ఫోకస్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను మరింత యాక్టివ్ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. కాంగ్రెస్‌లోని అనుబంధ సంఘాలను కలుపుతూ ఐదుగురికి బాధ్యతలను టీపీసీసీ అప్పగించింది. మహేశ్ గౌడ్‌కు పార్టీ ఆర్గనైజేషన్‌తో పాటు చేవేళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగించారు. మాజీమంత్రి, సీనియర్ నాయకురాలు గీతారెడ్డికి సికింద్రాబాద్, నల్లగొండ, హైదరాబాద్ స్థానాల బాధ్యతతోపాటు ఎన్ఎస్‌యూఐ బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు అదిలాబాద్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, సోషల్ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గాల బాధ్యతలతో పాటు మహిళా కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలోని నాయకులకు పని విభజన చేయాలని పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి భావించారు. ఇదే విషయాన్ని నేతలకు వివరించారు. ఇందుకు నేతలు కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. రాబోయే రోజుల్లో మరికొందరు కీలక నేతలకు కూడా పలు బాధ్యతలు అప్పగించి.. అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేేయడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తోంది.  మరోవైపు హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపైనా టీపీసీసీ గురి పెట్టింది. ఇప్పటికే హుజురాబాద్ కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కమిటిని నియమించారు. బుధవారం హుజురాబాద్ పై గాంధీభవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు. అభ్యర్థి ఎంపికతో పాటు ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కారెక్కారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇంచార్జ్ లేరు. ఈ విషయంలోనూ బుధవారం భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 

శ్మ‌శానంలో రే-ప్‌.. బాలిక మ‌-ర్డ‌ర్‌.. న‌లుగురి అరెస్ట్‌..

కామా*థులు బ‌రితెగించారు. 9 ఏళ్ల బాలిక‌పై దారుణానికి తెగబ‌డ్డారు. అది శ్మ‌శాన‌మ‌నే విష‌యం కూడా మ‌రిచారు. ప్లేస్ ఏదైనా పైశాచిక‌త్వంను వీడ‌లేదు. కాటికాప‌రితో పాటు మ‌రికొంద‌రు ఆ చిన్నారిని చెరిచారు. ఆ త‌ర్వాత అతిదారుణంగా చంపేశారు. ఖాకీల నుంచి త‌ప్పించుకునేందుకు హ‌డావుడిగా ఆ శ్మ‌శానంలోనే ద‌హ‌నం చేసేశారు. దేశ రాజ‌ధానిలో జ‌రిగిన ఈ ఘోరం క‌ల‌క‌లం రేపుతోంది. తండ్రి ఫిర్యాదుతో న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.      ఢిల్లీలోని పాత నంగల్‌ గ్రామంలో జ‌రిగిందీ అమానుషం. బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటోంది. శ్మ‌శానానికి వ‌చ్చే వారి సౌక‌ర్యార్థం అక్క‌డో వాట‌ర్‌కూల‌ర్ ఉంది. అక్క‌డి నీటికోసం శ్మ‌శానానికి వెళ్లింది ఆ చిన్నారి. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి ద‌గ్గ‌ర‌కు వచ్చి క‌రెంట్ షాక్‌తో బాలిక మరణించినట్లు చెప్పాడు. పాపం.. నిజ‌మేన‌నుకొంది ఆ త‌ల్లి. పోలీసులకు విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని ఆమెను న‌మ్మించి.. బలవంతంగా అప్ప‌టిక‌ప్పుడు మృతదేహాన్ని దహనం చేయించాడు కాటికాప‌రి. ఇక త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్యా రాద‌నుకున్నారు ఆ దుర్మార్గులు. ఆ త‌ర్వాత ఇంటికొచ్చిన తండ్రికి విష‌యం తెలిసి షాక్‌కు గురయ్యాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫోన్ చేశాడు. పోలీసులు వ‌చ్చే స‌రికి శ్మ‌శానంలో కాలిపోయిన బాలిక కాళ్లు మాత్రమే మిగిలాయి. బాలికపై అత్యా-చారం జరిగిందా లేదా అనేది తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. కాటికాప‌రితో స‌హా మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.    

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు? ఎప్పుడంటే.. 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ప్రచారం 2014 నుంచి సాగుతోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. అది 225కు పెరగనుంది. తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో సీరియస్ గానే కేంద్ర సర్కార్ తో చర్చలు జరిపారని అంటారు. కాని అది మాత్రం సాధ్యం కాలేదు.  జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం సిద్దమవుతుందనే సమాచారం రావడంతో.. కశ్మీర్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే చర్చ కొన్ని రోజుల నుంచి మళ్లీ జోరుగా సాగుతోంది. అయితే అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర సర్కార్ తాజాగా మరోసారి స్పష్టత ఇచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. ‘ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై రాజకీయ పార్టీలు చాలా ఆశలుపెట్టుకున్నాయి. అయితే కేంద్రం తాజా స్పందనతో వారి ఆశలు ఇప్పట్లో తీరవని అర్ధమైంది. అంతేకాదు 2026 తర్వాతే పెరుగుతాయని కేంద్రం చెబుతున్నా.. ఇంకా ఎక్కువ సమయమే పట్టనుంది. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ సీట్ల పునర్విభజన ఉంటుంది. ఈ లెక్కన 2026 తర్వాత 2031లో జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ తర్వాతే పునర్విభజన ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఈ లెక్కన 2034 ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సీట్లు అందుబాటులోకి వస్తాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అంటే కొత్త నియోజకవర్గాలు ఏర్పడాలంటే ఇంకో 13 ఏండ్ల పాటు ఆగాల్సిందే..

దళిత ట్రైనీ మ‌హిళా SIపై లైంగిక దాడి?  తెలంగాణలో దారుణం..

దళిత బంధు పథకం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేస్తున్నారు. దళితల దశ మార్చుతానని చెబుతున్నారు. సీఎం ప్రకటనలు అలా ఉండగానే దళితులపై తెలంగాణ రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు ఏకంగా దళిత ఎస్ఐకి రక్షణ లేకుండా పోయిన ఘటన వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తనపై అత్యాచరం జరిగిందంటూ ఓ దళిత ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.  వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలోని ఓ స్టేష‌న్‌లో సోమ‌వారం రాత్రి ఈ దారుణం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి.. అదే స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దళిత యువతిపై లైగింక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమ‌వారం రాత్రి ఆక‌స్మిక త‌నిఖీ పేరుతో మ‌హిళా ట్రెయినీ ఎస్ఐని ఒంట‌రిగా వాహ‌నంలో తీసుకెళ్లిన ఎస్‌హెచ్‌వో ఆమెపై విచ‌క్షణ ర‌హితంగా లైంగిక దాడికి య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగోలా అధికారి చెర నుంచి త‌ప్పించుకున్న మ‌హిళా అధికారి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌ త‌రుణ్ జోషికి ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే బాధిత యువతి రాత పూర్వకంగా కాకుండా ఓరాల్‌గా సీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌త కొద్దిరోజులుగా ట్రెయినీ ఎస్ఐని వాట్సాప్‌, ఫోన్ కాల్ ద్వారా కూడా వేధించాడ‌ని, తాజాగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.  వ‌రంగ‌ల్ సీపీ ప‌రిధిలో పోస్టింగ్ తీసుకున్న స‌ద‌రు మ‌హిళా అధికారిని.. ఎస్‌హెచ్‌వోలున్న స్టేష‌న్‌లో నెల రోజులు ప్రొహిబిష‌న్ పీరియ‌డ్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని క‌మిష‌నరేట్ ప‌రిధిలో లేని స్టేష‌న్‌లో ప్రొహిబిష‌న్ ఎస్ఐగా ఆమె కొన‌సాగుతున్నారు. ఈ క్రమంలోనే అధికారిణిపై క‌న్నేసిన ఎస్‌హెచ్‌వో సోమ‌వారం రాత్రి లైంగిక దాడికి య‌త్నించిన‌ట్లుగా తెలుస్తోంది. 

పార్ల‌మెంట్‌కి సైకిల్‌పై పీసీసీ చీఫ్‌.. ఢిల్లీలో రే..వంతు...

రేవంత్‌రెడ్డి. జెడ్పీటీసీ నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడి వ‌ర‌కూ ఎదిగిన నాయ‌కుడు. సోకాల్డ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కంటే సంథింగ్ డిఫ‌రెంట్‌. అందుకే, అన‌తికాలంలోనే టీపీసీసీ చీఫ్ కాగ‌లిగారు. కాలం క‌లిసొస్తే.. ఆయ‌నే కాబోయే సీఎం అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా రాణిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఆయ‌న‌కిక తిరుగులేదు. కేసీఆర్‌పై తిర‌గ‌బ‌డే బ‌ల‌మైన నాయ‌కుడు. కాంగ్రెస్‌లో చేరి త‌క్కువ కాల‌మే అయినా.. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను తీవ్రంగా ప్ర‌శ్నిస్తున్నారు కాబ‌ట్టే ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఏరికోరి మ‌రీ వ‌రించిందంటారు. ప్ర‌జ‌ల వాయిస్‌ను గ‌ట్టిగా వినిపిస్తూ.. స‌ర్కారును దుయ్య‌బ‌డుతూ.. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ ఆధ్య‌ర్యంలో ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో కాంగ్రెస్‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ పిలుపిస్తే.. దుమ్ముదుమార‌మే. ధ‌ర్నా చేప‌డితే జ‌న‌జాత‌రే. ఉద్య‌మిస్తే.. ఉత్పాత‌మే. తాజాగా, ఎంపీ రేవంత్‌రెడ్డి ఢిల్లీలో త‌ఢాకా చూపిస్తున్నారు. దేశంలో పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా.. రాహుల్‌గాంధీ నేతృత్వంలో విప‌క్షాలు సైకిల్ ర్యాలీ చేప‌ట్టాయి. రాహుల్ మ‌నిషిగా.. బాస్ ఇచ్చిన టాస్క్‌ను ప‌క్కాగా అమ‌లు చేశారు రేవంత్‌రెడ్డి. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర 834 దాటేసిందంటూ.. అచ్చేదిన్ అంటే ఇదేనా? అంటూ ప్లకార్డు ప్ర‌ద‌ర్శిస్తూ.. సైకిల్ తొక్కుకుంటూ పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి. టీపీసీసీ చీఫ్ సైకిల్ తొక్కుతూ నిర‌స‌న తెలిపిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. త‌మ నాయ‌కుడు సైకిల్ తొక్కే ఫోటోల‌తో రేవంత్ ఫ్యాన్స్, కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు మీద పోస్టులు పెడుతున్నారు. రేవంత్‌రెడ్డి క్రేజ్ మామూలుగా లేదుగా...