కొండా లేఖతో వైకాపా పరువు పాయె

  వైయస్ కుటుంబానికి అత్యంత ఆప్తురాలుగా పేరొందిన కొండా సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో వైకాపా పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమైక్యాంధ్ర కోరుతూ ఆ పార్టీ నేతల రాజీనామాలతో తెలంగాణా ప్రజలలో ఆ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడగా, “జగన్ మోహన్ రెడ్డిలో తండ్రికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదని, యంయల్సీ టికెట్లను రూ 7 కోట్లకు అమ్ముకొని కేవలం లక్ష కోట్లు సంపదనే ధ్యేయంగా అతను పార్టీని ఒక ప్రైవేట్ లిమిటడ్ పార్టీగా జైల్లోంచే నడిపిస్తున్నాడని” సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో ఇరు ప్రాంతలలో ఆపార్టీ పరువు గంగలో కలిసిపోయింది. ఈ ఆరోపణలు వేరేవరయినా చేసి ఉంటే ప్రజలు అంతగా పట్టించుకొనే వారు కారేమో. కానీ, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన సురేఖే ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నపార్టీపై ఈ ఆరోపణలు మరింత తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపనున్నాయి. తెలంగాణాను వ్యతిరేఖించడం వలన ఆగ్రహంతో ఉన్న తెరాసకు, వైకాపాకు బద్ధ శత్రువయిన తేదేపాకు ఇవి ఆయాచిత అస్త్రాలుగా లభించడంతో ఇక ఆ రెండు పార్టీలు వైకాపాపై మరింత చెలరేగిపోవచ్చును. ఈ నెల 31న జరగనున్న మూడవ దశ పంచాయితీ ఎన్నికల మీద ఆమె లేఖ తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక షర్మిల పాదయత్ర త్వరలో ముగియనున్నందున ఆమె గనుక పార్టీ పగ్గాలు చేప్పట్టి పార్టీని మళ్ళీ గాడిలో పెడితే తప్ప పార్టీకి ఇటువంటి కష్టాలు సమస్యలు తప్పకపోవచ్చును. ఈ రోజు కోర్టు జగన్ మోహన్ రెడ్డి రిమాండును వచ్చే నెల 12 వరకు పొడిగించింది. అతనితో బాటు అదే కేసుల్లో అరెస్టయిన విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును కూడా ఆగస్ట్ 12 వరకు పొడిగించింది.

పురంధేశ్వరి, లగడపాటి ఇళ్ళ ముట్టడి

      సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ సోమవారం కేంద్రమంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించింది. వివిధ జిల్లాల్లో ఉన్న కేంద్రమంత్రులు పురంధరీశ్వరి, కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి.. ఎంపీలు సబ్బం హరి, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, కొనకళ్ల నారాయణ, చింతా మోహన్, బొత్స ఝాన్సీ, శివప్రసాద్, రాయపాటి సాంబశివరావుల ఇళ్లను జేఏసీ నాయకులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరంతా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లగడపాటి ఇంటి ముందు ఐకాస నేతలు టెంట్లు వేశారు. ఏపీఎన్జీవోలు లగడపాటి ఇంటిపైకి ఎక్కారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పురంధరీశ్వరి ఇంటి వద్ద కూడా ఆందోళనకర వాతావరణం నెలకొంది.

లక్ష కోట్ల ఆస్తి జగన్ లక్ష్యం: కొండా సురేఖ

  రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్రకు చెందిన వైకాపా శాసనసభ్యుల రాజీనామాలతో ఆ పార్టీలో సంక్షోభం మొదలయింది. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ, మురళి, మహేందర్ రెడ్డి తదితరులు విజయమ్మతో రెండు సార్లు భేటీ అయినప్పటికీ పార్టీ రాష్ట్ర విభజనపట్ల తన ధోరణి మార్చుకొనేందుకు ఇష్టపడక పోవడంతో వారు పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొండా సురేఖ విజయమ్మను, జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ వ్రాసారు.   క్లుప్తంగా లేఖలో సారాంశం: మేము స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే వైకాపాలో చేరిన సంగతి మీకు తెలుసు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ‘మాట తప్పకు, మడమ తిప్పకు,’ అనే సిద్ధాంతం పాటిస్తే, ఇప్పుడు మీరు ఇద్దరూ కూడా తద్విరుద్ధంగా ‘మాట తప్పుతాము, మడమ తిప్పుతాము’ అనే కొత్త సిద్ధాంతం అవలంభిస్తున్నారు. తెలంగాణాపై పార్టీ ఇచ్చిన మాటను మరిచి ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్ర నేతలు రాజీనామాలు చేయడం కేవలం సీమంధ్ర ప్రాంతంలో వీలయినన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికే కదా?   ఇప్పుడు వైకాపా తన పూర్తి నిజస్వరూపాన్నిబయటపెట్టుకొని తమది పక్కా సమక్యవాద పార్టీ అని ఋజువు చేసుకొంది. మీ నిర్ణయం వలన తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడం కోసం రేయింబవళ్ళు కృషిచేసిన మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈవిధంగా చేసి మమ్మల్ని మీరిద్దరూ కూడా చాలా అవమానించారు. కొద్ది నెలల క్రితం జరిగిన యంయల్సీ ఎన్నికలలో సీట్లను రూ.7కోట్లకు అమ్ముకోవడం చూస్తే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం లక్ష కోట్ల రూపాయలు సంపాదించడమేనని స్పష్టం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉంటూనే పార్టీని తప్పుడు మార్గంలో నడిపిస్తూ పార్టీని సర్వ విధాల భ్రష్టు పట్టిస్తున్నారు.”

ముఖ్యమంత్రి కిరణ్ పై మండిపడ్డ సోనియా!

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడినట్లు సమాచారం. రాష్ట్ర విభజన బాధ్యత భారాన్ని తాను మోయలేనని చెప్పినప్పుడు సీఎం కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం వార్ రూమ్ భేటి సంధర్బంగా ఆజాద్ తో కిరణ్ విభజన బాధ్యతను మోయలేనని చెప్పడంతో..ఆయన ఈ విషయాన్ని సోనియా గాంధీతో చెప్పాలని అన్నారు. దాంతో కిరణ్ ఆజాద్ జోక్యంతో సోనియాని కలుసుకున్నారు. తన అభిప్రాయాన్ని చెప్పి, రాజీనామా లేఖను ఇవ్వడంతో కిరణ్ పై సోనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉంటున్నట్లు ఎందుకు వ్యవహరించారని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎందుకు చెప్పారని సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసినట్లు చెబుతున్నారు. ఆతరువాత కిరణ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. ఈ  పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

రేపే తెలంగాణపై ప్రకటన..!!

        తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు.   ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 29న ఏర్పాటవుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 31వ తేదీన ఏర్పాటవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది. సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత సిడబ్ల్యుసి సమావేశం నిర్వహిస్తారని భావించారు. కానీ, అదే రోజు సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తేల్చేయాలని కాంగ్రెసు భావిస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేస్తే అధికారిక ఆమోదం లభించినట్లవుతుంది. ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.

ముందస్తుకు ఈసి ఏర్పాట్లు

      దేశంలో రాజీకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌ సభ ఎన్నికలు కూడా ఉండవొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు..   ఈ నేఫథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌ సభ ఎలక్షన్స్‌ కూడా వస్తే కావాల్సిన వనరులను సమకూర్చుకునేందుకు రెడీ అవుతుంది కేంద్ర ఎన్నికల కమీషన్‌.. రెండు చోట్ల ఒకే సారి ఎలక్షన్లు జరిగితే ఇప్పుడున్న ఇవియం మిషన్లు సరిపోవని భావించిన కమీషన్‌ మరో 2 లక్షల మిషన్లకు ఆర్డర్‌ ఇచ్చింది. డిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, మిజోరంలకు సెప్లెంబర్‌ అక్టోబర్‌ నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది.. ఈలోగా ప్రస్థుతం ఆర్డర్‌ ఇచ్చిన ఇవియంలు అందుబాటులోకి వస్తాయిని భావిస్తుంది ఈసి.

ఆ సంతకాలు నిజమైనవే

      నరేంద్రమోడి వీసా వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. గుజరాత్‌ అల్లర్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మోడికి అమెరికా వీసా ఇవ్వొదంటూ పలువురు పార్లమెంట్‌ సభ్యులతో పాటు, రాజ్యసభ సభ్యులు ఒబామకు లేఖరాశారన్న వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా సిపిఎం పార్టీకి చెందిన సీతారాం ఏచూరి, సిపిఐ ఎంపి అచ్యులన్‌, డిఎంకె ఎంపి రామలింగంలు ఆ లేఖలో ఉన్నవి తమ సంతకాలు కాదని. ఫోర్జరీ సంతకాలని ప్రకటించారు.   అయితే ఆ లేఖలను పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు అందులోని సంతాకాలు,చేతిరాత అసలైదని అని ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి వివాదం మొదలైంది. ఇన్నాళ్లు అవి మా సంతాకాలు కాదంటూ చెపుతూ వచ్చిన ఎంపిలు ఫోరెన్సిక్‌ నివేదికతో ఖంగుతున్నారు.. అయితే ఈ విషయం పై మోడి స్పందించక పోవడం విశేషం.

31న యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్‌

      తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. ఈ నెల 31న యుపిఎ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమవేశంలో భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అభిప్రాయాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునేందుకు  రెడీ అవుతుంది. ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.

అంగీకరించే ప్రసక్తే లేదు : ములాయం

      తెలంగాణ పై కాంగ్రెస్‌ తేల్చేస్తుంది అన్న ఊహాగానాల మధ్య ములాయం మరో బాంబు పేల్చారు..తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరూకమని చెపుతూనే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ని అభినందించారు. చిన్నరాష్ట్రాల వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుందన్నారు.   అసలు కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మొగ్గు చూపుతుందో అర్ధంకావటం లేదని.. తెలంగాణ ఏర్పాటు జరిగితే మరిన్ని రాష్ట్రాల్లో అలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నారు.. ఇప్పటికే తెలంగాణ నేపధ్యంలో గుర్ఖాలాండ్‌లో కూడా మరోసారి ఉద్యమాలు ఊపందుకున్నాయి.. ఇలాంటి పరిణామాలే మరిన్నిజరుగుతాయని ములాయం అభిప్రాయపడ్డారు.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, బీహార్‌ నుంచి జార్ఖండ్‌ను వేరుపడగా ఇప్పుడు ఆ రాష్ట్రల ప్రగతి కుంటుపడిందని, కాబట్టి అక్కడి పరిస్ధితులను సమీక్షించుకొని రాష్ట్ర ఏర్పాటులో ముందడుగు వేయాలని కోరారు.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించమన్న ములాయం పార్లమెంట్‌లో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామన్నారు.

స‌మైఖ్యం కోసం డిఐజీ రాజీనామ‌

  ఇన్నాళ్లు తెలంగాణ కోరుతూ నాయ‌కులు ఉద్యోగులు త్యాగాలు చేశారు ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర తెలంగాణ‌కు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు త్యాగాలు చేయ‌డం సీమాంద్ర ప్రజ‌ల వంతు అయింది.. గతంలో ఓ మ‌హిళ డిఎస్పీ రాజీనామ చేయ‌టం అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించింది.. ఇప్పుడు మ‌రోసారి అంలాటి రాజీనామనే తెర మీద‌కు వ‌చ్చింది.రాష్ట్ర విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ డిఐజి ఇక్బాల్ రాజీనామ చేశారు. తెలంగాణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ను విభ‌జించే ప్రయ‌త్నం కేంద్రం చేస్తుండ‌టంతో అందుకు నిర‌స‌న‌గా ఇక్బాల్ రాజీనామ చేశారు. సిన్సియ‌నర్ ఆఫీస‌ర్‌గా మంచి పేరున్న ఇక్బాల్‌కు ఇంకా 5 సంవ‌త్సరాల‌కు పైగా ప‌ద‌వీ కాలం మిగిలే ఉంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ఇక్బాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవ‌టం అంద‌రిని ఆశ్చర్యానికి గురిచేసింది.

కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాజీనామా..?

  తెలంగాణ అంశం పై కేంద్ర ఏదో ఒక‌టి తేల్చేయ‌డానికి రెడీ అవుతుంటే అందుకు ప్రతిగా స‌మైఖ్యవాదులు కూడా త‌మ ద‌గ్గర ఉన్న ఆఖ‌రి అస్త్రల‌ను సిద్దం చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా విభ‌జ‌న త‌ధ్యం అయిన ప‌క్షంలో రాజీనామాకు సిద్దప‌డిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.. ఒక వ‌ర్గం మీడియా అయితే ఇప్పటికే కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న రాజీనామాను స‌మ‌ర్పించార‌ని కూడా చెపుతుంది.. దిగ్విజ‌య్‌సింగ్, గులాం న‌బి ఆజాద్ ల‌తో జ‌రిగిన భేటిలో త‌న నిర్ణయాన్ని క‌రాఖండిగా చెప్పారు.  విభ‌జ‌న అనివార్యం అయితే త‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటా అని కూడా చెప్పిన‌ట్టుగా స‌మాచారం. త‌రువాత సోనియాతో జ‌రిగిన భేటిలో కూడా ఇదే విష‌యం చెప్పిన కిర‌ణ్‌.. త‌న రాజీనామాను కూడా అందించిన‌ట్టుగా చెపుతున్నారు.. దీని తోడు కిర‌ణ్‌కుమార్ రెడ్డి శ‌నివారం స‌చివాల‌యానిక రాక‌పోవ‌డం, అన్ని అధికారిక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకోవ‌టంతో ఈ వాద‌న‌లుకు మ‌రింత బ‌లం చేకూరుతుంది.. కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రాన్ని విభ‌జిస్తే కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.

అది ఆజాద్ జాదూనే..!

  కేంద్ర తెలంగాణ విష‌యంలో స్పష్టమైన వైఖ‌రితో ఉంది అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు సీమాంద్ర నాయ‌కుల నుంచి కొత్త వాద‌న వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న పరిణామాల‌న్నింటి వెనుక కేంద్రలోని ముఖ్య నాయకుడు ఆజాద్ హ‌స్తం ఉన్నట్టుగా ఆరోపిస్తున్నారు ప‌లువురు నేత‌లు.. గ‌తంలో ఆంద్రప్రదేశ్ ఇంచార్జ్‌గా వ్యవ‌హారించిన స‌మ‌యంలో కూడా ప‌లు వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ‌తో పాటు రాష్ట్రంలో విద్వేశాల‌ను రెచ్చగొట్టిన ఆజాద్ మ‌రోసారి తెరవెనుక త‌తంగా న‌డిపిస్తున్నార‌న్న వాద‌న ఉంది.. ఆజాద్ వ‌ల్లే అస‌లు ఎవ‌రు కోర‌ని రాయ‌ల్ తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చింది అంటున్నారు. ప్రత్యేఖ తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఎం ఐ ఎం పార్టీ అస్తిత్వంమే ప్రశ్నార్ధకం అవుతుంది అందుకే తొలినుంచి ఆ పార్టీ విభ‌జ‌న‌ను వెతిరేఖిస్తూ వ‌స్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ దూరంగా ఉన్న ఎం ఐ ఎం పార్టీ ఆజాద్ తోక‌లిసి ఈ నాట‌కం ఆడిస్తున్నట్టుగా చెపుతున్నారు.. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఉన్న ముస్లింల‌తో క‌లిపితే కొత్త గా ఏర్పడే రాష్ట్రంలో ముస్లిం శాతం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఆజాద్ ఈ ప్రతిపాతద‌న తెచ్చిన‌ట్టుగా చెపుతున్నారు..

బోన‌మెత్తిన భాగ్యన‌గ‌రం

  సికింద్రాబాద్ బోనాల సంద‌ర్భంగా భాగ్యన‌గ‌రం కొత్త శోభ సంత‌రించుకుంది.. ఆషాడం జాత‌ర‌గా పేరొందిన ఉజ్జయినీ మ‌హంకాళి అమ్మవారి భోనాలు ఆదివారం ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు మహా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. తెలంగాణాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజు భ‌క్తులు అమ్మవారికి భోనాల‌తో పాటుర సాక స‌మ‌ర్పిస్తారు.. రెండో రోజ‌యిన సోమ‌వారంనాడు రంగం నిర్వహిస్తారు.. అవివాహిత మ‌హిళ చెప్పే భ‌విష్యవాణి విన‌టానికి ఎంతో ప్రత్యేక‌త ఉంది. రంగంలో భాగంగా దేశ ప‌రిస్థితులు, వ‌ర్షాలు ఇలా అనేక విష‌యాల‌ను అమ్మవారే చెపుతార‌ని న‌మ్ముతారు భ‌క్తులు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు సికింద్రాబాద్‌లోని 40 దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరుతున్నాయి.ఈ రోజు ఉద‌యం నుంచి సికింద్రాబాద్ అమ్మవారి ఆళ‌యానికి విఐపిల తాకిడి కూడా బాగా ఉంది.. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌, రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైకాప అధ్యక్షులరాలు విజ‌య‌మ్మ, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇంకా చాలా మంది నాయ‌కులు నాయ‌కులు అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.

ఇక వైకాపా తెలంగాణాలో బోర్డు తిప్పేసినట్లే

  ఎట్టకేలకు వైకాపా తెలంగాణాలో బోర్డు తిప్పేసేందుకు సిద్దపడినట్లే ఉంది. ఈ రోజు వైకాపా నేతలు కొండా సురేఖ, మహేందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర విభజనపై పార్టీ అభిప్రాయం తెలుసుకొనేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో చివరిసారిగా సమావేశమయ్యారు. వారు అమెను “పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని” మీడియా ముందు ప్రకటన చేయాలని పట్టుబట్టగా, పార్టీకి చెందిన కొందరు నేతలు వారిని రాష్ట్ర విభజనవల్ల కలిగే నష్టాలను వివరించి ఒప్పించే ప్రయత్నం చేసారు. కానీ విజయమ్మ మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయాడానికి అంగీకరించక పోవడంతో సురేఖ తదితరులు సమావేశం నుండి ఆగ్రహంతో బయటకి వచ్చేసారు.   ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తెలంగాణపై ఇచ్చిన వివరణతో తాము సంతృప్తి చెందలేదని, తెలంగాణాకు అడ్డుపడే పార్టీలో ఆత్మవంచన చేసుకొంటూ తాము కొనసాగలేమని అందువల్ల రేపు తెలంగాణకి చెందిన పార్టీ నేతలందరూ సమావేశమయ్యి చర్చించిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆమె తెలిపారు. పార్టీ వారిని వదులుకోవడానికే సిద్దపడింది కానీ, ప్రకటన చేసేందుకు మాత్రం అంగీకరించకపోవడం గమనిస్తే, పార్టీ ఇక తెలంగాణాలో బోర్డు తిప్పేసేందుకు సిద్దపడుతునట్లు అర్ధం అవుతోంది. రేపు కొండా సురేఖ తదితరులు పార్టీకి రాజినామాలు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ తంతు మొదలయినట్లు భావించవచ్చును.

పంచాయితీ రెండో తీర్పూ అదే

  రెండో దశ పంచాయితీ ఎలక్షన్స్ లోనూ తొలి దశ ఫలితాలే రిపీట్ అయ్యాయి.. ప్రదాన పోటి అంత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి పార్టీల మధ్యే సాగింది.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో అయినా పరువు నిలబెట్టుకుంటే.. టిఆర్ ఎస్ మాత్రం పూర్తిగా చతికిల పడింది.. ఒక్క కరీంనగర్ జిల్లాలో తప్ప మిగతా అన్ని చోట్ల టిఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయింది. తెలంగాణ తో పాటు అన్నిప్రాంతాల్లోనూ టిడిపి హావా కొనసాగగా, కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి దశతోపోలిస్తే రెండో దశలో బాగానే పుంజుకున్నటుగా కనిపిస్తుంది. వైయస్ ఆర్ కాంగ్రెస్, టిఆర్ ఎస్ పార్టీలు మాత్రం మొదటి దశ కన్నా ఈ దశలో మరింత వెనకపడ్డాయి.. టిఆర్ఎస్ పార్టీ కేవలం కరీంనగర్ జిల్లాలో తప్ప మరెక్కడ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న 1903 అభ్యర్ధులు గెలుపొందగా, టిడిపి మద్దతిస్తున్న 1809, వైకాపా పార్టీ తరుపున 1065, టిఆర్ పార్టీ నుంచి 545 మంది అభ్యర్ధులు గెలుపొందారు..

కాంగ్రెస్‌కు తేల్చే స‌త్తా ఉందా..?

  తెలంగాణ విష‌యంపై గత వారం రోజులుగా చ‌ర్చలు జ‌రుపుతున్న కాంగ్రెస్ చివ‌ర‌కు మ‌రోసారి రాష్ట్రనాయ‌క‌త్వాన్ని ఉసూరు మ‌నిపించింది. అంతా అయిపోయింది ఇక నిర్ణయ‌మే మిగిలింది అన్న నేత‌లు ఆ నిర్ణయాన్నే ఎప్పుడు చెపుతారు అన్న విష‌యం మాత్రం తేల్చటం లేదు.  అస‌లు నిజంగా కాంగ్రెస్‌కు తెలంగాణ పై తేల్చే స‌త్తా ఉందా అన్న విష‌యం కూడా ఇప్పుడు అనుమానం క‌లుగుతుంది.. మిగ‌తా అన్ని పార్టీల అభిప్రాయాలు తాము చెప్పిన డేట్ లోపు చెప్పాల‌న్న కాంగ్రెస్ అధిష్టానం.. త‌మ పార్టీ అభిప్రాయం చెప్పడానికి మాత్రం మీన‌ మేషాలు లెక్కపెడుతుంది.. ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయింద‌ని ప్రక‌టించిన కోర్‌క‌మిటీ, నిర్ణయాన్ని మాత్రం ఎందుకు వాయిదా వేసింది అన్న విష‌యం ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. అస‌లు స‌మ‌స్య అంతా హైద‌రాబాదే అంటున్న అదిష్టానంకు ఆ స‌మ‌స్యను ప‌రిష్కరించే స‌త్తా ఉందా..? స‌మ‌స్యను ప‌రరిష్కరించే దిశ‌గా కాంగ్రెస్ చేస్తున్న ప్రయ‌త్నాలు ఏంటి..? అధిష్టానం నిర్ణయం వ్యతిరేకంగా తీసుకున్న ప‌క్షంలో పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామ‌న్న కాంగ్రెస్ నేత‌ల తీరుపై అధినాయ‌కత్వం స్పందిచ‌క‌పోవ‌డం వెనుక మ‌త‌ల‌బేంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వేధిస్తున్నాయి.. దీంతో అస‌లు కాంగ్రెస్‌కు ఈ స‌మ‌స్యను తేల్చే ఆలోచ‌న ఉందా లేదా అన్న అనుమానం కూడా క‌లుగుతుందంటున్నారు విశ్లేష‌కులు.. గ‌త‌ంలో ఒక‌సారి ఇలాగే అర్ధ రాత్రి ప్రక‌ట‌న చేసిన కాంగ్రెస్కు మ‌రోసారి అలాంటి ప‌రిస్థితులు ఎదురైతే ఎదుర్కొనే స‌త్తా ఉందా అన్నది కూడా అనుమాన‌మే.. ఇలాంటి ఎన్నో విష‌యాల‌ను బేరిజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై తేల్చడం క‌న్నా నాన్చడ‌మే బెట‌ర్ అన్న ఆలోచ‌న‌లో ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తుంది..

వ్రతం చెడినా ఫలితం దక్కించుకోలేని వైకాపా

  రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్, తెదేపాల ప్రభంజనమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు రాష్ట్రం మొత్తంలో వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్ధులు మొత్తం 735 స్థానాలు దక్కించుకోగా, తెదేపా బలపరిచిన అభ్యర్ధులు 660 స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది.   ఇక తెలంగాణాపై వెనకడుగు వేసిన వైకాపాకి ఊహించినట్లుగానే తెలంగాణాలో భంగపాటు తప్పలేదు. అక్కడ ఆ పార్టీకి అన్ని జిల్లాలలో కలిపి కేవలం 35 స్థానాలు మాత్రమే దక్కాయి. వ్రతం చెడినా ఫలితం దక్కనట్లుగా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొన్నందుకు, కనీసం సీమంధ్రలో కూడా ఆ పార్టీ ఊహించినట్లు ఏమీ అద్భుతాలు జరుగలేదు. అక్కడ కూడా ఆ పార్టీ మూడవ స్థానికే పరిమితమయింది. సీమంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్ధులు 462 సీట్లు దక్కించుకోగా, తెదేపా 496 , వైకాపా 344 సీట్లు దక్కించుకోవడం గమనిస్తే వైకాపా సమైక్య వ్యూహం బెడిసి కొట్టినట్లు అర్ధం అవుతోంది. అయినప్పటికీ, యధావిధిగా తమ పార్టీ ఈసారి కూడా మిగిలిన అన్నిపార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించినట్లు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రకటించుకొంది.   వైకాపా తన సమైక్య ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వనందున బహుశః ఈ రోజు లేదా రేపుఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ “తెలంగాణాపై తమ పార్టీ ఆనాడు ప్లీనరీలోఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని, సీమంధ్ర శాసనసభ్యుల రాజీనామాలు వారి వ్యక్తిగతమని, అవి పార్టీ అభిప్రాయం కాదని” మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయవచ్చును. తద్వారా కనీసం మూడవ దశ పంచాయితీ ఎన్నికలలోనయినా పార్టీ పరిస్థితి మెరుగుపరచుకొనే ప్రయత్నం చేయవచ్చును.   ఇక, తెరాస పరిస్థితి కూడా వైకాపాకు ఏమాత్రం భిన్నంగా లేదు. కాంగ్రెస్ విసిరిన పాచికలకి ఆ పార్టీ ఈ ఎన్నికలలో చిత్తయిపోయినట్లు అర్ధం అవుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 275 సీట్లు దక్కించుకొని మొదటి స్థానంలో, తెదేపా 164 సీట్లతో రెండవ స్థానంలో నిలవగా, తెరాస కేవలం 132 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమయిపోయింది. కానీ, ఆ పార్టీ కూడా తన స్వంత మీడియా లో మిగిలిన పార్టీల కంటే అత్యధిక స్థానాలు గెలుచుకొన్నట్లు ప్రకటించుకొంది.