చంద్రబాబు కేబినెట్.. కులాల కూర్పు!
సమాజంలో కుల వ్యవస్థ వుండకూడదని అందరూ అంటారు. కానీ కులం అనేది లేకుండా సమాజంలో ఏపనీ జరగదు. అది సామాన్యుల నుంచి మంత్రుల వరకూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో కులాల కూర్పు ఎలా వుందో చూద్దాం. చంద్రబాబు ప్రకటించిన తొలివిడతల మంత్రివర్గం ప్రకారం చంద్రబాబుతో సహా ఐదుగురు కమ్మ, ఇద్దరు రెడ్డి, ఆరుగురు బిసి, నలుగురు కాపు, ఇద్దరు ఎస్.సి, ఒక వైశ్య వున్నారు. వీరిలో కమ్మ కులానికి చెందిన పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ వున్నారు. రెడ్డి వర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డి, కాపు నుంచి నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, నారాయణ వున్నారు. బిసి వర్గం నుంచి అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు (కొప్పుల వెలమ), మృణాళిని (తూర్పుకాపు), యనమల రామకృష్ణుడు (యాదవ), కె.ఇ.కృష్ణమూర్తి (గౌడ), కొల్లు రవీంద్ర (మత్సకార) ఉన్నారు. వైశ్య సమాజికవర్గం నుంచి సిద్ధా రాఘవరావు ఉండగా, ఎస్.సి. వర్గం నుంచి పీతల సుజాత, రావెళ్ల కిషోర్ వున్నారు. ముస్లిం ల నుంచి టిడిపి కి ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల ఆ వర్గానికి అవకాశం దక్కలేదు. అయితే గిరిజనులు ఉన్నా, ఇవ్వలేదు. ఆసక్తికరంగా తెలంగాణ మంత్రివర్గంలో కూడా గిరిజనుడికి అవకాశం రాలేదు. గిరిజనవర్గానికి కూడా అవకాశం దక్కలేదు. అయితే చంద్రబాబు కేబినెట్ కులాల విషయంలో సమతుల్యంగానే వుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.