Read more!

హిమాచల్‌ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతు?

 

 

 

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన కొంతమంది విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. ఎంతమంది కొట్టుకుపోయారన్నది సమాచారం అందాల్సి వుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న వ్యాస్‌ నది వద్ద 20 మంది విద్యార్థులతో వున్న వ్యాన్ నీళ్ళు లేని నది మధ్యలో వుండగా, డ్యామ్ నుంచి నీరు వదలడంతో ఆ నీటి ప్రవాహంలో వ్యాను కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతోంది. 20 మంది విద్యార్థులూ నీటిలో కొట్టుకుపోయారని తెలుస్తోంది. నీళ్ళు లేని నది మధ్యలో వ్యాన్ ఆపుకుని ఫొటోలు దిగుతూ వుండగా అకస్మాత్తుగా నీటి ప్రవాహం వచ్చినట్టు సమారం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా భావిస్తున్నారు. బాచుపల్లికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు విహార యాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళారు. అనుకోకుండా ఈ సంఘటన సంభవించింది.