జయలలిత పై నగ్మా కామెంట్స్.. మహిళల్నివిధవల్ని చేస్తున్నారు

 


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై నగ్మా ఘాటైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు సినిమాల్లో నటించిన అందాల తార నగ్మా చాలా కాలం తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది. అయితే ఇప్పుడు నగ్మా జయలలిత పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళలకు చీరలు పంచిపెడుతూనే.. మధ్యం విక్రయాలు పెంచి అదే మహిళల్ని విధవల్ని చేస్తున్నారని జయలలితపై నగ్మా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. అంతేకాదు తనకు జయలలితపై ఎనలేని గౌరవం ఉందంటూనే ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సుపరిపాలన అంటే ముందువెనుక ఆలోచించకుండా వరాలు ఇవ్వడం కాదని.. ప్రజల కష్టనష్టాలు తీర్చడమేనని సూచించింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఖుష్బూతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తానని తెలిపింది. మరి నగ్మా చేసిన వ్యాఖ్యలకు జయలలిత ఎలా కౌంటర్ ఇస్తుందో.

Teluguone gnews banner