దేవాన్ష్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య.. అమరావతిని పాలించాలని
posted on Oct 25, 2015 @ 2:02PM
ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాన మంత్రి మోడి అయిన సెంట్రాఫ్ యాట్రక్షన్ అయ్యారో లేదో కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్యల మనువడు దేవాన్ష్ మాత్రం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రతిఒక్కరూ దేవాన్ష్ ను ముద్దు చేశారు.. ఆఖరికి మోడీ కూడా దేవాన్ష్ ను కొద్దిసేపు ముద్దుచేశారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా దేవాన్ష్ ను ఎత్తుకున్న రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రేవంత్ రెడ్డి దేవాన్ష్ ను ఎత్తుకుని అతని మెడలో అమరావతి కండువ వేయగా.. పక్కనే ఉన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి.. దేవాన్ష్ నాయనమ్మ అమరావతి కండువా వేశావు.. మరి పసుపు కండువా ఎప్పుడు వేస్తావు అని అడుగగా దానికి రేవంత్ రెడ్డి భవిష్యత్ లో అమరావతిని పాలించడానికి ఈ కండువా వేశాను.. పసుపు కండువా తాతగారు వేస్తారు అని అక్కడ ఉన్న వారిని నవ్వించారు. మొత్తానికి నారా దేవాన్ష్ కు ఇప్పటినుండే రాజకీయా ఓనమాలు దిద్దేలా ఉన్నారు.